పల్లె గడపకు స్వచ్ఛ జలాలు
కాకినాడ కలెక్టరేట్లో మంగళవారం నాలుగు గంటలపాటు కీలక శాఖలతో ఉపముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ, శాస్త్ర- సాంకేతిక, జిల్లా పరిషత్తు తదితర అంశాలపై సమీక్షించి బడ్జెట్ కేటాయింపులు.. చేపట్టిన, చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు.
ప్రతి సమస్యకూ దశలవారీ పరిష్కారం చూపుతాం
పర్యాటక సీమగా హోప్ ఐలాండ్
కీలక శాఖల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్
ఈనాడు, కాకినాడ
సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, వేదికపై ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రూ,
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ
‘‘మా దగ్గర అల్లావుద్దీన్ అద్భుతదీపం లేదు.. ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం దొరకదు.. నిధులన్నీ గత ప్రభుత్వం ఖాళీ చేసింది.. రాష్ట్రాన్ని అప్పుల్లోకి తీసుకెళ్లింది.. మా ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై అవగాహన ఉంది.. దశలవారీగా అన్నింటికీ పరిష్కారం చూపుతాం’’
పవన్కల్యాణ్
- పంచాయతీలకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వమంటే.. ఒక్క రోజులోనే 12వేల సలహాలు వచ్చాయి.
- గతంలో పారిశుద్ధ్య పనుల నిధులు సైతం నిర్మాణ పనులకు మళ్లించడంతో అతిసారం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.
- పంచాయతీల నుంచి సంపాదించిన డబ్బు తిరిగి వాటికి ఇవ్వకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
- ఉప్పాడ తీరంలో కోత సమస్య తీవ్రంగా ఉంది. రాబోయే 10, 20 ఏళ్లలో ఎంత ప్రాంతం పోతుందన్న దానిపై అధ్యయనం చేస్తాం..
పవన్కల్యాణ్
కాకినాడ కలెక్టరేట్లో మంగళవారం నాలుగు గంటలపాటు కీలక శాఖలతో ఉపముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ, శాస్త్ర- సాంకేతిక, జిల్లా పరిషత్తు తదితర అంశాలపై సమీక్షించి బడ్జెట్ కేటాయింపులు.. చేపట్టిన, చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు.
అదే మా లక్ష్యం
- జల్జీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితి నెలకొందని పవన్కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రతి గ్రామానికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోనే 40 పంచాయతీల్లో నిధుల్లేక సక్రమంగా తాగునీరు అందడంలేదన్నారు.
- ఆర్డబ్ల్యూఎస్ సమీక్షలో సీపీడబ్ల్యూ పథకాల నిర్వహణకు ఏడాదికి రూ.16.83 కోట్లు అవసరమని ఎస్ఈ సత్యనారాయణ తెలిపారు. జల్జీవన్ మిషన్కింద 81 శాతం పనులు పూర్తిచేశామన్నారు. భూసేకరణ పూర్తికాక వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ముందుకు సాగడంలేదన్నారు.
- ఉమ్మడి జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులను జడ్పీ సీఈవో శ్రీరామచంద్రమూర్తి వివరించారు. జడ్పీ పరిధిలో 191 పనులకు రూ.91.77 కోట్లు..మండల పరిషత్తుల్లో 31 పనుల పూర్తికి రూ.85.45 కోట్లు అవసరమని తెలపగా మంత్రి స్పందించి జరిగిన పనులపై నివేదిక కోరారు.
- పంచాయతీల సాధారణ నిధులు సిబ్బంది జీతాలకే చాలడంలేదని జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య తెలిపారు.
- కోనసీమ కొబ్బరికి ఊతమిస్తామని మంత్రి అన్నారు.
సమీక్షలో పాల్గొన్న జిల్లా ఉన్నతాధికారులు
ఎకో టూరిజంగా మార్చుతాం..
హోప్ ఐలాండ్ను ఎకో టూరిజంగా మార్చుతామని పవన్ తెలిపారు. కాకినాడ స్మార్ట్సిటీ సుందరీకణకు నిధులు, ప్రత్యేక ప్రాజెక్టులపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీ ఉదయ్శ్రీనివాస్కు సూచించారు. ఎంపీ మాట్లాడుతూ ప్రసాద్ స్కీం కింద పర్యాటక ప్రాజెక్టు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్అండ్ టెక్నాలజీ ఏర్పాటుచేయాలని ప్రధానిని కోరామన్నారు. అడవుల అభివృద్ధికి రూ.9.92 కోట్లు కేటాయించారని డీఎఫ్వో భరణి తెలిపారు.
ప్రమాదాలకు ఆస్కారం లేకుండా..
వనరులు పుష్కలంగా ఉన్న తూర్పులో గెయిల్, ఓఎన్జీసీ, రిలయన్స్ తదితర ఆయిల్, గ్యాస్ సంస్థలు ఉన్నాయని, ఇక్కడ ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందని పవన్కల్యాణ్ అన్నారు. దేశానికి కావాల్సిన గ్యాస్ వెలికి తీత అవసరం.. స్థానికంగా భద్రత చర్యలూ ముఖ్యమే అన్నారు. ఎమ్మెల్యేలు వనమాడి, నానాజీ, చినరాజప్ప, నెహ్రూ, సత్యప్రభ, జడ్పీ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెలీపోర్టు.. ఇన్నాళ్లకు మళ్లీ కదలిక
[ 05-07-2024]
కాకినాడ సముద్రతీరంలో స్మార్ట్ సిటీ నిధులు సుమారు రూ.3.5 కోట్లతో గతంలో నిర్మించిన హెలీపోర్టుకు కదలిక రానుంది. -
వినాయకా.. నువ్వే దిక్కు!
[ 05-07-2024]
కాకినాడలోని శ్రీవినాయక ఈస్ట్ చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎస్ఎస్డ బ్ల్యూఏఎంవై- 23 గ్రూప్ నంబర్తో రూ.5 లక్షలు చిట్ కట్టాము. 2023 జులైౖతో కాలగడువు పూర్తయింది. -
మేం వింటాం.. నిధులూ ఇస్తాం
[ 05-07-2024]
గత అయిదేళ్లలో సాగునీటి పారుదల వ్యవస్థను వైకాపా సర్కారు పూర్తిగా విస్మరించింది. గోదావరి వరదల నుంచి రక్షణకు అవసరమైన పనులనూ పక్కనబెట్టింది. -
నిత్య స్మరణీయుడు.. అల్లూరి: మంత్రి దుర్గేష్
[ 05-07-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: స్వాతంత్య్రం నా జన్మ హక్కు అంటూ పోరాటం సాగించిన అల్లూరి సీతారామరాజు నిత్య స్మరణీయుడని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. -
సొమ్ము ఉన్నట్టా.. లేనట్టా..?
[ 05-07-2024]
గత వైకాపా సర్కారు పుణ్యామా అని వ్యవస్థలన్నీ తలకిందులయ్యాయి. కొన్ని నిర్వీర్యంగా మారాయి. దీనికి తోడు ప్రజల అవసరాలు తీర్చాల్సిన పన్నులు పక్కదారి పట్టాయి. -
పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం: గోరంట్ల
[ 05-07-2024]
కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజమహేంద్రవరం గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. -
తీపి బతుకుల్లో చేదు నిజాలు
[ 05-07-2024]
మామిడితాండ్ర.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ఠక్కున నోరూరుతుంది.. అంతలా జనంతో అనుబంధం పెనవేసుకుంది ఈ పదార్థం.. -
పేద విద్యార్థులపై కపట ప్రేమ
[ 05-07-2024]
విద్యాహక్కు చట్టం మేరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం మంది పేద విద్యార్థులను ఉచితంగా చదివించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా. -
పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారు
[ 05-07-2024]
ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వ పెద్దలు ఏటీఎంలా వాడుకున్నారని మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ దుయ్యబట్టారు. -
పోర్టులో అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలి
[ 05-07-2024]
కాకినాడ పోర్టులో గత అయిదేళ్లలో భారీ కుంభకోణం జరిగిందని.. పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడమే గాక అనేక అక్రమాలకు పాల్పడ్డారని కాకినాడ నగర తెదేపా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఆరోపించారు. -
వైకాపా నాయకులకు స్థలాలు రాసిచ్చేశారు..!
[ 05-07-2024]
కాకినాడ నగర నియోజకవర్గంలో గత వైకాపా పాలనలో ప్రభుత్వ, మున్సిపల్, పోరంబోకు స్థలాలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాసిచ్చేశారు. పొజిషన్ పట్టాలు సృష్టించి, రెవెన్యూ అధికారుల ఆమోదముద్ర వేసి అప్పనంగా కట్టబెట్టేశారు. -
వైకాపా పాలనలో.. రైతన్న నిరాశపాలు..
[ 05-07-2024]
వ్యవసాయం-పశుపోషణ రైతులకు రెండు కళ్లు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నదాతలకు కాడే కాదు పాడి కూడా భారమైంది. ప్రకృతి ఆటుపోట్లు మరింత కుంగదీస్తున్నాయి. -
మాత్రల పొడితో నకిలీ ఔషధాలు
[ 05-07-2024]
పొడిచేసిన మాత్రలతో జ్వరం, తలనొప్పికి ఉపయోగించే, ప్రజారోగ్యానికి హాని కలిగించే ఔషధాలు తయారుచేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మేడ్చల్ ఎస్వోటీ, పేట్బషీరాబాద్ పోలీసులు, ఔషధ నియంత్రణాధికారులు చేధించారు.