మెట్ట రైతుకు గోదావరి జలాలు
గత వైకాపా ప్రభుత్వంలో వదిలేసిన ఎత్తిపోతల పథకాల పనులను కూటమి ప్రభుత్వం రాగానే యుద్ధప్రాతిపదికన చేయించి జులై మొదటి వారంలోనే సాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది.
నేడు మంత్రి నిమ్మల చేతుల మీదుగా ప్రారంభం
పుష్కర ఎత్తిపోతల వద్దకు చేరిన గోదావరి నీటి ప్రవాహం
సీతానగరం, న్యూస్టుడే: గత వైకాపా ప్రభుత్వంలో వదిలేసిన ఎత్తిపోతల పథకాల పనులను కూటమి ప్రభుత్వం రాగానే యుద్ధప్రాతిపదికన చేయించి జులై మొదటి వారంలోనే సాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం వద్ద గోదావరి ఎడమ గట్టున పుష్కర-1, 2 ఎత్తిపోతల పథకాల పరిధిలో మోటార్ల మరమ్మతులు, లీకేజీలు, ఇతరత్రా పనులకు సుమారుగా రూ.12 కోట్లకు పైబడి గుత్తేదారులకు వైకాపాలో బకాయిలు పెట్టారు. ఈ ఖరీఫ్ సీజన్ వచ్చేసరికి ఈ ఏడాది మార్చిలోనే అవసరమైన పనులు చేపట్టాల్సి ఉన్నా గుత్తేదారుడు చేతులెత్తేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జలవనరుల శాఖకు చెందిన ఎత్తిపోతల ప్రాజెక్టులపై దృష్టిసారించారు. గతేడాది అక్టోబరు 18న ప్రాజెక్టు పరిశీలనకు విచ్చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పుష్కర ఎత్తిపోతల పథకాల అధ్వాన పరిస్థితిపై మెట్ట రైతులు వివరించారు. జులై మొదటి వారానికల్లా తూర్పు, కాకినాడ జిల్లాల్లోని 18 మండలాల్లోని ఆయకట్టుకు సాగునీరు సవ్యంగా వెళ్లేలా అత్యవసర పనులు చేయించాలనే సీఎం, జలవనరులశాఖ మంత్రి ఆదేశాలతో మొత్తం 8 మోటార్లకు గాను 6 మోటార్లను సిద్ధం చేసినట్లు జలవనరులశాఖ డీఈ సీహెచ్ కోటేశ్వరరావు మంగళవారం రాత్రి పుష్కర ప్రాజెక్టు వద్ద ‘న్యూస్టుడే’కు తెలిపారు. ఒక్కో మోటారు నుంచి 175 క్యూసెక్కుల చొప్పున తొలుత మూడు మోటార్లు ఆన్చేస్తామన్నారు. కొన్నిచోట్ల ఇంకా లీకేజీల పనులు చేయాల్సి ఉండటంతో వాటి పనులు పూర్తిస్థాయిలో చేయించి ఆరు మోటార్లు ద్వారా నీరు పెంచుతామన్నారు. మెట్ట ప్రాంతంలో గతేడాది 1.27 లక్షల ఎకకరాలకు మాత్రమే సాగునీరు సరఫరా అయిందని, ఈ ఏడాది 1.42 లక్షల ఎకరాలకు అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ ఏడాది ఆరు మోటార్ల ద్వారా 1,050 క్యూసెక్కులు సరఫరా చేయడంలో ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. రెండేళ్ల క్రితం మరమ్మతులకు ఇచ్చిన మోటార్లు కాకినాడలో ఉన్నాయని, అవసరమైన బిల్లులు చెల్లించి వాటిని తీసుకొచ్చి పూర్తిస్థాయిలో 1400 క్యూసెక్కులు పంపించేలా కార్యాచరణ ఉందన్నారు. తొర్రిగెడ్డ ఎత్తిపోతల పథకం కాలువ పూడికతీత పనులు రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తన సొంతనిధులు వెచ్చించి చేయించారు. దీనివల్ల కోరుకొండ, సీతానగరం మండలాల్లోని 16,500 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు చేరుతోంది.
పది రోజుల ముందుగానే..
పుష్కర, తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకాల నుంచి బుధవారం జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా సాగునీరు విడుదల చేసేలా ఏర్పాట్లు చేసినట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా వదిలేసిన ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతంగా చేయించడమే కాకుండా ఈ ఏడాది పది రోజులు ముందుగానే మెట్టకు సాగునీరు ఇవ్వగలుగుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెలీపోర్టు.. ఇన్నాళ్లకు మళ్లీ కదలిక
[ 05-07-2024]
కాకినాడ సముద్రతీరంలో స్మార్ట్ సిటీ నిధులు సుమారు రూ.3.5 కోట్లతో గతంలో నిర్మించిన హెలీపోర్టుకు కదలిక రానుంది. -
వినాయకా.. నువ్వే దిక్కు!
[ 05-07-2024]
కాకినాడలోని శ్రీవినాయక ఈస్ట్ చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎస్ఎస్డ బ్ల్యూఏఎంవై- 23 గ్రూప్ నంబర్తో రూ.5 లక్షలు చిట్ కట్టాము. 2023 జులైౖతో కాలగడువు పూర్తయింది. -
మేం వింటాం.. నిధులూ ఇస్తాం
[ 05-07-2024]
గత అయిదేళ్లలో సాగునీటి పారుదల వ్యవస్థను వైకాపా సర్కారు పూర్తిగా విస్మరించింది. గోదావరి వరదల నుంచి రక్షణకు అవసరమైన పనులనూ పక్కనబెట్టింది. -
నిత్య స్మరణీయుడు.. అల్లూరి: మంత్రి దుర్గేష్
[ 05-07-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: స్వాతంత్య్రం నా జన్మ హక్కు అంటూ పోరాటం సాగించిన అల్లూరి సీతారామరాజు నిత్య స్మరణీయుడని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. -
సొమ్ము ఉన్నట్టా.. లేనట్టా..?
[ 05-07-2024]
గత వైకాపా సర్కారు పుణ్యామా అని వ్యవస్థలన్నీ తలకిందులయ్యాయి. కొన్ని నిర్వీర్యంగా మారాయి. దీనికి తోడు ప్రజల అవసరాలు తీర్చాల్సిన పన్నులు పక్కదారి పట్టాయి. -
పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం: గోరంట్ల
[ 05-07-2024]
కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజమహేంద్రవరం గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. -
తీపి బతుకుల్లో చేదు నిజాలు
[ 05-07-2024]
మామిడితాండ్ర.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ఠక్కున నోరూరుతుంది.. అంతలా జనంతో అనుబంధం పెనవేసుకుంది ఈ పదార్థం.. -
పేద విద్యార్థులపై కపట ప్రేమ
[ 05-07-2024]
విద్యాహక్కు చట్టం మేరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం మంది పేద విద్యార్థులను ఉచితంగా చదివించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా. -
పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారు
[ 05-07-2024]
ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వ పెద్దలు ఏటీఎంలా వాడుకున్నారని మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ దుయ్యబట్టారు. -
పోర్టులో అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలి
[ 05-07-2024]
కాకినాడ పోర్టులో గత అయిదేళ్లలో భారీ కుంభకోణం జరిగిందని.. పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడమే గాక అనేక అక్రమాలకు పాల్పడ్డారని కాకినాడ నగర తెదేపా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఆరోపించారు. -
వైకాపా నాయకులకు స్థలాలు రాసిచ్చేశారు..!
[ 05-07-2024]
కాకినాడ నగర నియోజకవర్గంలో గత వైకాపా పాలనలో ప్రభుత్వ, మున్సిపల్, పోరంబోకు స్థలాలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాసిచ్చేశారు. పొజిషన్ పట్టాలు సృష్టించి, రెవెన్యూ అధికారుల ఆమోదముద్ర వేసి అప్పనంగా కట్టబెట్టేశారు. -
వైకాపా పాలనలో.. రైతన్న నిరాశపాలు..
[ 05-07-2024]
వ్యవసాయం-పశుపోషణ రైతులకు రెండు కళ్లు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నదాతలకు కాడే కాదు పాడి కూడా భారమైంది. ప్రకృతి ఆటుపోట్లు మరింత కుంగదీస్తున్నాయి. -
మాత్రల పొడితో నకిలీ ఔషధాలు
[ 05-07-2024]
పొడిచేసిన మాత్రలతో జ్వరం, తలనొప్పికి ఉపయోగించే, ప్రజారోగ్యానికి హాని కలిగించే ఔషధాలు తయారుచేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మేడ్చల్ ఎస్వోటీ, పేట్బషీరాబాద్ పోలీసులు, ఔషధ నియంత్రణాధికారులు చేధించారు.