భూహక్కు పత్రాల ఉపసంహరణకు రంగం సిద్ధం
వైకాపా ప్రభుత్వ హయాంలో శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం కింద చేపట్టిన భూ రీసర్వేపై జిల్లాలో అనేక ఆందోళనలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. సర్వేలో లోపాలున్నాయని, రీ సర్వేతో తమ భూమి తగ్గిపోయిందని అనేకమంది రైతులు, భూ యాజమానులు గగ్గోలు పెట్టినా వైకాపా పాలకులు పట్టించుకోలేదు.
త్వరలో కొత్త పట్టాదారు పాసు పుస్తకాల జారీ
న్యూస్టుడే, వి.ఎల్.పురం (రాజమహేంద్రవరం)
గత ప్రభుత్వంలో జగన్ బొమ్మతో భూహక్కు పత్రం
వైకాపా ప్రభుత్వ హయాంలో శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం కింద చేపట్టిన భూ రీసర్వేపై జిల్లాలో అనేక ఆందోళనలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. సర్వేలో లోపాలున్నాయని, రీ సర్వేతో తమ భూమి తగ్గిపోయిందని అనేకమంది రైతులు, భూ యాజమానులు గగ్గోలు పెట్టినా వైకాపా పాలకులు పట్టించుకోలేదు. భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి రీ సర్వే చేపట్టినట్లు చెప్పుకొచ్చినా.. సరిహద్దు తగాదాలు రెట్టింపయ్యాయి. జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులున్నాయంటూ పలువురు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. భూహక్కు పత్రంపై యాజమాని ఫొటో కంటే పెద్దగా జగన్ చిత్రం ఉండటంపైనా వ్యతిరేకత వ్యక్తమయింది. ఇప్పుడు జగన్ ఫొటోను తొలగించి గతంలో మాదిరిగానే రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు త్వరలోనే కొత్త పాసుపుస్తకాలు జారీ కానున్నాయి.
- జిల్లాలో 272 రెవెన్యూ గ్రామాలకు గాను మూడు విడతల్లో 189 గ్రామాల్లో రీసర్వే చేపట్టగా ఇంకా 83 గ్రామాల్లో అసలు ప్రారంభమే కాలేదు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సార్వత్రిక ఎన్నికల కోడ్కు ముందు వరకు 86,799 భూహక్కు పత్రాలు జారీ చేశారు.
- మొదటి విడతలో రాజమహేంద్రవరం, కొవ్వూరు రెవెన్యూ డివిజన్లలోని కలిపి 45 గ్రామాల్లోని 64,438.83 ఎకరాల్లో రీసర్వే చేసి గతేడాది జులైలో 32,498 భూ యాజమానులకు హక్కు పత్రాలు ఇచ్చారు.
- రెండో విడతలో 54 గ్రామాల్లో 84,088.22 ఎకరాల్లో రీసర్వే చేసి గతేడాది నవంబరు నాటికి 39,546 భూహక్కు పత్రాలు జారీ చేశారు.
- మూడో విడతలో 90 గ్రామాల్లో 1,18,885.39 ఎకరాల్లో రీసర్వే పూర్తయినట్లు చెబుతున్నప్పటికీ 24 గ్రామాలకు సంబంధించి మాత్రమే 17,231 భూహక్కు పత్రాలు ముద్రితమయ్యాయి. వాటిలో ఈ ఏడాది మార్చి 14 వరకు 14,755 పత్రాలు మాత్రం సంబంధిత యజమానులకు జారీ చేశారు. మిగతా 2,476 పత్రాలకు జారీకి సంబంధించి ఈకేవైసీ పూర్తికాకపోవడం.. తర్వాత ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వాటిని నిలిపేశారు. ఇప్పటివరకు జారీ చేసిన భూహక్కు పత్రాలను కూడా వెనక్కి తీసుకోనున్నారు.
లోపాలతో గగ్గోలు
భూ రీసర్వేలో లోపాల కారణంగా రైతులు, భూ యాజమానులు గగ్గోలు పెడుతున్నారు. కొన్నిచోట్ల భూ యాజమానులకు సమాచారం ఇవ్వకుండా, మరికొన్నిచోట్ల క్షేత్రస్థాయికి సర్వేయర్లు వెళ్లకుండా హద్దులు నిర్ణయించేసి ఆన్లైన్ చేసేశారనే ఆరోపణలు వచ్చాయి. రీసర్వే తర్వాత భూ విస్తీర్ణంలో తేడాలు.. భూ హక్కు పత్రాల్లో తప్పులు దొర్లడంతో కొందరు సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, తహసీల్దారు, మండల సర్వేయర్లు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సర్వేలో తమ భూమి తగ్గిపోయిందంటూ అనేకమంది గత ప్రభుత్వంలో నిర్వహించిన స్పందన కార్యక్రమాల్లోనూ ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. సెంటు నుంచి 50 సెంట్లు ఆపైనే భూమి తగ్గడంపై పక్క పొలందారుడితో సరిహద్దు వివాదాలపై కొందరు ఫిర్యాదులు చేశారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో కొంతమంది రైతులకు 1బీ, అడంగళ్ పత్రాలకు ఆన్లైన్లో రావడం లేదని, బ్యాంకు రుణాలకు ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు చెబుతున్నారు. రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల జారీతోపాటు సర్వే లోపాలు.. సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెలీపోర్టు.. ఇన్నాళ్లకు మళ్లీ కదలిక
[ 05-07-2024]
కాకినాడ సముద్రతీరంలో స్మార్ట్ సిటీ నిధులు సుమారు రూ.3.5 కోట్లతో గతంలో నిర్మించిన హెలీపోర్టుకు కదలిక రానుంది. -
వినాయకా.. నువ్వే దిక్కు!
[ 05-07-2024]
కాకినాడలోని శ్రీవినాయక ఈస్ట్ చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎస్ఎస్డ బ్ల్యూఏఎంవై- 23 గ్రూప్ నంబర్తో రూ.5 లక్షలు చిట్ కట్టాము. 2023 జులైౖతో కాలగడువు పూర్తయింది. -
మేం వింటాం.. నిధులూ ఇస్తాం
[ 05-07-2024]
గత అయిదేళ్లలో సాగునీటి పారుదల వ్యవస్థను వైకాపా సర్కారు పూర్తిగా విస్మరించింది. గోదావరి వరదల నుంచి రక్షణకు అవసరమైన పనులనూ పక్కనబెట్టింది. -
నిత్య స్మరణీయుడు.. అల్లూరి: మంత్రి దుర్గేష్
[ 05-07-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: స్వాతంత్య్రం నా జన్మ హక్కు అంటూ పోరాటం సాగించిన అల్లూరి సీతారామరాజు నిత్య స్మరణీయుడని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. -
సొమ్ము ఉన్నట్టా.. లేనట్టా..?
[ 05-07-2024]
గత వైకాపా సర్కారు పుణ్యామా అని వ్యవస్థలన్నీ తలకిందులయ్యాయి. కొన్ని నిర్వీర్యంగా మారాయి. దీనికి తోడు ప్రజల అవసరాలు తీర్చాల్సిన పన్నులు పక్కదారి పట్టాయి. -
పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం: గోరంట్ల
[ 05-07-2024]
కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజమహేంద్రవరం గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. -
తీపి బతుకుల్లో చేదు నిజాలు
[ 05-07-2024]
మామిడితాండ్ర.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ఠక్కున నోరూరుతుంది.. అంతలా జనంతో అనుబంధం పెనవేసుకుంది ఈ పదార్థం.. -
పేద విద్యార్థులపై కపట ప్రేమ
[ 05-07-2024]
విద్యాహక్కు చట్టం మేరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం మంది పేద విద్యార్థులను ఉచితంగా చదివించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా. -
పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారు
[ 05-07-2024]
ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వ పెద్దలు ఏటీఎంలా వాడుకున్నారని మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ దుయ్యబట్టారు. -
పోర్టులో అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలి
[ 05-07-2024]
కాకినాడ పోర్టులో గత అయిదేళ్లలో భారీ కుంభకోణం జరిగిందని.. పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడమే గాక అనేక అక్రమాలకు పాల్పడ్డారని కాకినాడ నగర తెదేపా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఆరోపించారు. -
వైకాపా నాయకులకు స్థలాలు రాసిచ్చేశారు..!
[ 05-07-2024]
కాకినాడ నగర నియోజకవర్గంలో గత వైకాపా పాలనలో ప్రభుత్వ, మున్సిపల్, పోరంబోకు స్థలాలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాసిచ్చేశారు. పొజిషన్ పట్టాలు సృష్టించి, రెవెన్యూ అధికారుల ఆమోదముద్ర వేసి అప్పనంగా కట్టబెట్టేశారు. -
వైకాపా పాలనలో.. రైతన్న నిరాశపాలు..
[ 05-07-2024]
వ్యవసాయం-పశుపోషణ రైతులకు రెండు కళ్లు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నదాతలకు కాడే కాదు పాడి కూడా భారమైంది. ప్రకృతి ఆటుపోట్లు మరింత కుంగదీస్తున్నాయి. -
మాత్రల పొడితో నకిలీ ఔషధాలు
[ 05-07-2024]
పొడిచేసిన మాత్రలతో జ్వరం, తలనొప్పికి ఉపయోగించే, ప్రజారోగ్యానికి హాని కలిగించే ఔషధాలు తయారుచేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మేడ్చల్ ఎస్వోటీ, పేట్బషీరాబాద్ పోలీసులు, ఔషధ నియంత్రణాధికారులు చేధించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రజా వేదిక శిథిలాలు అక్కడే
-
భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
-
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!