సహకార సంఘాల ప్రక్షాళన షురూ..!
సహకార సంఘాల్లో ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా మొదటి దశ కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటివరకు వైకాపా ప్రభుత్వ హయాంలో పాలన సాగించిన త్రిసభ్య కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో పర్సన్ ఇన్ఛార్జి వ్యవస్థను కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది.
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్
కాకినాడ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కార్యాలయం
సహకార సంఘాల్లో ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా మొదటి దశ కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటివరకు వైకాపా ప్రభుత్వ హయాంలో పాలన సాగించిన త్రిసభ్య కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో పర్సన్ ఇన్ఛార్జి వ్యవస్థను కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. వీరి కాలపరిమితి ఆరు నెలలుగా నిర్ణయించారు. దీంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్), డీపీఎంఎస్, డీసీసీడీలు అధికారులు నియంత్రణలోకి వెళ్లనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
డీసీసీబీ, డీసీఎంఎస్ పీఐగా కాకినాడ జేసీ..
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లకు కాకినాడ జిల్లా సంయుక్త కలెక్టర్ రామసుందర్రెడ్డి పర్సన్ ఇన్ఛార్జిగా నియమించారు. గతంలో తెదేపా ప్రభుత్వంలో డీసీసీబీకి కలెక్టర్ పీఐగా వ్యవహరించే వారు. ఈ సారి ఆ బాధ్యతలను జేసీలకు అప్పగించారు. ఆయన ఈ బాధ్యతలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. సహకార శాఖలో పనిచేసే సహాయ రిజిస్ట్రార్, సీనియర్, జూనియర్ ఇన్స్పెక్టర్లను సొసైటీల పీఐలుగా నియమించారు. వీరంతా గత నెల 29న వారికి కేటాయించిన పీఏసీఎస్లలో ఛార్జి తీసుకున్నారు.
అయిదేళ్లు వైకాపా కార్యాలయాలుగా..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 303 పీఏసీఎస్లున్నాయి. గతంలో తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉండగానే వీటికి ఎన్నికలు నిర్వహించారు. అప్పటి పాలకవర్గాల కాలపరిమితి 2018లోనే ముగిసింది. పాత పాలక వర్గాలనే కొనసాగించారు. 2019లో రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ నాయకులు, కార్యకర్తలకు వీటిలో నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు త్రిసభ్య కమిటీలను తెరపైకి తీసుకువచ్చింది. డీసీఎంస్, డీసీసీబీలకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీలు ఏర్పాటయ్యాయి. దీంతో సహకారశాఖ ఆధ్వర్యంలో ఉన్న సొసైటీలు వైకాపా పార్టీ కార్యాలయాలుగా మార్చి వేశారు.
సేవలు శూన్యం
రైతులకు పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించేందుకు వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఏర్పాటయ్యాయి. వైకాపా పాలనలో ఇవి అంకారప్రాయంగా మిగిలిపోయాయి. కనీసం వీటినుంచి రైతులకు సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు కూడా పూర్తి స్థాయిలో అందలేదు. గతంలో వీటికి అధ్యక్షులుగా గ్రామంలో ఉన్న రైతులే ఉండేవారు. వైకాపా వ్యవసాయేతర వ్యక్తులను వీటికి ఛైర్మన్లుగా నియమించింది. వారికి వ్యవసాయంపై కనీస అవగాహన లేకపోవడంతో వచ్చి ఛైర్మన్ కుర్చీలో కూర్చుని వెళ్లిపోయేవారు. జిల్లాలో పలు సహకార సంఘాల్లో అవకతవకలు కూడా చోటుచేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సహకారశాఖ ఆధ్వర్యంలో ఉన్న సొసైటీలు పూర్వ వైభవాన్ని సంతరించుకోనున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటికి త్వరలోనే ఎన్నికల జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెలీపోర్టు.. ఇన్నాళ్లకు మళ్లీ కదలిక
[ 05-07-2024]
కాకినాడ సముద్రతీరంలో స్మార్ట్ సిటీ నిధులు సుమారు రూ.3.5 కోట్లతో గతంలో నిర్మించిన హెలీపోర్టుకు కదలిక రానుంది. -
వినాయకా.. నువ్వే దిక్కు!
[ 05-07-2024]
కాకినాడలోని శ్రీవినాయక ఈస్ట్ చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎస్ఎస్డ బ్ల్యూఏఎంవై- 23 గ్రూప్ నంబర్తో రూ.5 లక్షలు చిట్ కట్టాము. 2023 జులైౖతో కాలగడువు పూర్తయింది. -
మేం వింటాం.. నిధులూ ఇస్తాం
[ 05-07-2024]
గత అయిదేళ్లలో సాగునీటి పారుదల వ్యవస్థను వైకాపా సర్కారు పూర్తిగా విస్మరించింది. గోదావరి వరదల నుంచి రక్షణకు అవసరమైన పనులనూ పక్కనబెట్టింది. -
నిత్య స్మరణీయుడు.. అల్లూరి: మంత్రి దుర్గేష్
[ 05-07-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: స్వాతంత్య్రం నా జన్మ హక్కు అంటూ పోరాటం సాగించిన అల్లూరి సీతారామరాజు నిత్య స్మరణీయుడని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. -
సొమ్ము ఉన్నట్టా.. లేనట్టా..?
[ 05-07-2024]
గత వైకాపా సర్కారు పుణ్యామా అని వ్యవస్థలన్నీ తలకిందులయ్యాయి. కొన్ని నిర్వీర్యంగా మారాయి. దీనికి తోడు ప్రజల అవసరాలు తీర్చాల్సిన పన్నులు పక్కదారి పట్టాయి. -
పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం: గోరంట్ల
[ 05-07-2024]
కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజమహేంద్రవరం గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. -
తీపి బతుకుల్లో చేదు నిజాలు
[ 05-07-2024]
మామిడితాండ్ర.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ఠక్కున నోరూరుతుంది.. అంతలా జనంతో అనుబంధం పెనవేసుకుంది ఈ పదార్థం.. -
పేద విద్యార్థులపై కపట ప్రేమ
[ 05-07-2024]
విద్యాహక్కు చట్టం మేరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం మంది పేద విద్యార్థులను ఉచితంగా చదివించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా. -
పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారు
[ 05-07-2024]
ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వ పెద్దలు ఏటీఎంలా వాడుకున్నారని మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ దుయ్యబట్టారు. -
పోర్టులో అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలి
[ 05-07-2024]
కాకినాడ పోర్టులో గత అయిదేళ్లలో భారీ కుంభకోణం జరిగిందని.. పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడమే గాక అనేక అక్రమాలకు పాల్పడ్డారని కాకినాడ నగర తెదేపా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఆరోపించారు. -
వైకాపా నాయకులకు స్థలాలు రాసిచ్చేశారు..!
[ 05-07-2024]
కాకినాడ నగర నియోజకవర్గంలో గత వైకాపా పాలనలో ప్రభుత్వ, మున్సిపల్, పోరంబోకు స్థలాలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాసిచ్చేశారు. పొజిషన్ పట్టాలు సృష్టించి, రెవెన్యూ అధికారుల ఆమోదముద్ర వేసి అప్పనంగా కట్టబెట్టేశారు. -
వైకాపా పాలనలో.. రైతన్న నిరాశపాలు..
[ 05-07-2024]
వ్యవసాయం-పశుపోషణ రైతులకు రెండు కళ్లు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నదాతలకు కాడే కాదు పాడి కూడా భారమైంది. ప్రకృతి ఆటుపోట్లు మరింత కుంగదీస్తున్నాయి. -
మాత్రల పొడితో నకిలీ ఔషధాలు
[ 05-07-2024]
పొడిచేసిన మాత్రలతో జ్వరం, తలనొప్పికి ఉపయోగించే, ప్రజారోగ్యానికి హాని కలిగించే ఔషధాలు తయారుచేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మేడ్చల్ ఎస్వోటీ, పేట్బషీరాబాద్ పోలీసులు, ఔషధ నియంత్రణాధికారులు చేధించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్పై స్పందించిన నాగ్ అశ్విన్
-
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు భంగపాటు.. అధికారం దిశగా లేబర్ పార్టీ
-
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
-
వైకాపా విధేయుల్లో వణుకు.. అంటకాగిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఆరా
-
అనుమతి లేకున్నా ఉన్నట్లు చూపి ప్లాట్ల విక్రయం.. కాకాణి సొంతూరిలో భారీ మోసం
-
హైదరాబాద్ ఇళ్ల అమ్మకాల్లో 21% వృద్ధి