నిధులు రావాల.. బాగుపడాల
వైకాపా ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని విస్మరించడంతో అవి ఏటేటా క్షీణదశకు చేరుకుని అత్యంత దారుణంగా తయారయ్యాయి. గుంతలుపడి వర్షపునీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అలాంటి రహదారులకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలంటే సుమారు రూ.400 కోట్ల నిధులు కావాలి.
జిల్లాలో గుంతలుపడిన ర.భ.శాఖ రహదారులు 248 కిలోమీటర్లు
మరమ్మతులకు రూ.14.99 కోట్లు అవసరం
అధ్వానంగా పోతవరం గణేష్నగర్-కె.ఏనుగుపల్లి ర.భ.శాఖ రహదారి
పి.గన్నవరం, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని విస్మరించడంతో అవి ఏటేటా క్షీణదశకు చేరుకుని అత్యంత దారుణంగా తయారయ్యాయి. గుంతలుపడి వర్షపునీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అలాంటి రహదారులకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలంటే సుమారు రూ.400 కోట్ల నిధులు కావాలి. ఇంత మొత్తం ఇప్పటికిప్పుడు మంజూరు కావడం అంత సులువైన పనికాదు. ఈ నేపథ]్యంలో ర.భ.శాఖకు చెందిన ఇంజినీరింగ్ అధికారులు ఆయా రహదారులకు ప్రత్యేక మరమ్మతులు చేయాలని, అందుకోసం రూ.14.99 కోట్ల నిధులు అవసరం అవుతాయని తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. జిల్లాలో 48 కిలోమీటర్ల మేర 12 రాష్ట్ర రహదారులు, 200 కిలోమీటర్ల మేర 70 మేజర్ జిల్లా రోడ్లకు తక్షణం ప్రత్యేక మరమ్మతులు చేస్తే ప్రజలకు ప్రస్తుత కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుందని గుర్తించి ప్రతిపాదించారు.
టెండర్లు పిలిచినా...
ఇక టెండర్లు ఖరారై పనులు మొదలుపెట్టని రహదారులు మరికొన్ని ఉన్నాయి. పి.గన్నవరం నియోజకవర్గంలో రూ.36కోట్ల విలువైన ప్యాకేజీతో ర.భ.శాఖకు చెందిన వివిధ రహదారులు అభివృద్ధి చేసేందుకు ఆరునెలల క్రితమే టెండరు ఖరారైంది. దీంట్లో అంబాజీపేట-గన్నవరం స్టేట్ హైవే ఒకటి. ఇది అత్యంత దారుణంగా తయారైంది. వర్షాలకు మడుగును తలపిస్తోంది. ఈ పనిని ఇటీవల ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పి.గన్నవరంలో ప్రారంభించారు. బోడపాటివారిపాలెం నుంచి అంబటివారిపాలెం, గంగలకుర్రు, ముక్కామల తదితరప్రాంతాల్లో మరికొన్ని రహదారులు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. ప్రధానంగా వైకాపా ప్రభుత్వంలో చేసిన పనులకు కోట్లాది రూపాయిల బిల్లులు చెల్లించని కారణంగా ఈ పనులు చేసేందుకు గుత్తేదారుడు ముందుకు రావడంలేదని తెలిసింది.
అంబాజీపేట-గన్నవరం ర.భ.శాఖ రహదారి
రాష్ట్ర రహదారుల్లో కొన్ని...
కాట్రేనికోన-చల్లపల్లి(10 కిలోమీటర్లు), రాజవరం-పొదలాడ రోడ్డు గోపాలపురం నుంచి రాజవరం (7కిలోమీటర్లు), ద్వారపూడి-యానాం రోడ్డు మండపేట నుంచి రామచంద్రపురం (3.50కిలోమీటర్లు), రామచంద్రపురం- పెనుగుదురు (3 కిలోమీటర్లు), సోమేశ్వరం-రాజానగరం(4.50కిలోమీటర్లు) ఇలా వివిధ రహదారులు దెబ్బతిన్నాయి.
మేజర్ జిల్లా రహదారుల్లో కొన్ని... పామర్రు-ఉంట్రుమిల్లి (10కిలోమీటర్లు), యర్రపోతవరం-కె.ఎన్.ఎఫ్.రోడ్డు (5.70 కిలోమీటర్లు), గూడపల్లి-కేశనపల్లి (6కిలోమీటర్లు), రాజోలు-పొన్నమండ (6 కిలోమీటర్లు), సఖినేటిపల్లి-అంతర్వేది (6 కిలోమీటర్లు), పోతవరం గణేష్నగర్-కె.ఏనుగుపల్లి (4.42కిలోమీటర్లు) ఇలాంటి రహదారులు 70 వరకు గుంతలుపడి అధ్వానంగా మారాయి.
ప్రత్యేకంగా పనులకు ప్రతిపాదించాం
వివిధ రహదారులకు ప్రత్యేక మరమ్మతులు చేసేవిధంగా పనులు ప్రతిపాదించాం. రూ.15 కోట్ల నిధులు కావాలి. టెండరు ఖరారైన రూ.36 కోట్ల ప్యాకేజీలో అంబాజీపేట-గన్నవరం రహదారి పనులను ముందుగా పి.గన్నవరం నుంచి స్థానిక పోలీసుస్టేషన్వరకు సిమెంట్ రహదారిగా అభివృద్ధిచేస్తాం. ఈ పనులు త్వరలో మొదలుపెడతాం.
జి.రాజేంద్ర, డీఈఈ, ర.భ.శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెలీపోర్టు.. ఇన్నాళ్లకు మళ్లీ కదలిక
[ 05-07-2024]
కాకినాడ సముద్రతీరంలో స్మార్ట్ సిటీ నిధులు సుమారు రూ.3.5 కోట్లతో గతంలో నిర్మించిన హెలీపోర్టుకు కదలిక రానుంది. -
వినాయకా.. నువ్వే దిక్కు!
[ 05-07-2024]
కాకినాడలోని శ్రీవినాయక ఈస్ట్ చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎస్ఎస్డ బ్ల్యూఏఎంవై- 23 గ్రూప్ నంబర్తో రూ.5 లక్షలు చిట్ కట్టాము. 2023 జులైౖతో కాలగడువు పూర్తయింది. -
మేం వింటాం.. నిధులూ ఇస్తాం
[ 05-07-2024]
గత అయిదేళ్లలో సాగునీటి పారుదల వ్యవస్థను వైకాపా సర్కారు పూర్తిగా విస్మరించింది. గోదావరి వరదల నుంచి రక్షణకు అవసరమైన పనులనూ పక్కనబెట్టింది. -
నిత్య స్మరణీయుడు.. అల్లూరి: మంత్రి దుర్గేష్
[ 05-07-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: స్వాతంత్య్రం నా జన్మ హక్కు అంటూ పోరాటం సాగించిన అల్లూరి సీతారామరాజు నిత్య స్మరణీయుడని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. -
సొమ్ము ఉన్నట్టా.. లేనట్టా..?
[ 05-07-2024]
గత వైకాపా సర్కారు పుణ్యామా అని వ్యవస్థలన్నీ తలకిందులయ్యాయి. కొన్ని నిర్వీర్యంగా మారాయి. దీనికి తోడు ప్రజల అవసరాలు తీర్చాల్సిన పన్నులు పక్కదారి పట్టాయి. -
పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం: గోరంట్ల
[ 05-07-2024]
కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజమహేంద్రవరం గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. -
తీపి బతుకుల్లో చేదు నిజాలు
[ 05-07-2024]
మామిడితాండ్ర.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ఠక్కున నోరూరుతుంది.. అంతలా జనంతో అనుబంధం పెనవేసుకుంది ఈ పదార్థం.. -
పేద విద్యార్థులపై కపట ప్రేమ
[ 05-07-2024]
విద్యాహక్కు చట్టం మేరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం మంది పేద విద్యార్థులను ఉచితంగా చదివించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా. -
పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారు
[ 05-07-2024]
ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వ పెద్దలు ఏటీఎంలా వాడుకున్నారని మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ దుయ్యబట్టారు. -
పోర్టులో అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలి
[ 05-07-2024]
కాకినాడ పోర్టులో గత అయిదేళ్లలో భారీ కుంభకోణం జరిగిందని.. పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడమే గాక అనేక అక్రమాలకు పాల్పడ్డారని కాకినాడ నగర తెదేపా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఆరోపించారు. -
వైకాపా నాయకులకు స్థలాలు రాసిచ్చేశారు..!
[ 05-07-2024]
కాకినాడ నగర నియోజకవర్గంలో గత వైకాపా పాలనలో ప్రభుత్వ, మున్సిపల్, పోరంబోకు స్థలాలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాసిచ్చేశారు. పొజిషన్ పట్టాలు సృష్టించి, రెవెన్యూ అధికారుల ఆమోదముద్ర వేసి అప్పనంగా కట్టబెట్టేశారు. -
వైకాపా పాలనలో.. రైతన్న నిరాశపాలు..
[ 05-07-2024]
వ్యవసాయం-పశుపోషణ రైతులకు రెండు కళ్లు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నదాతలకు కాడే కాదు పాడి కూడా భారమైంది. ప్రకృతి ఆటుపోట్లు మరింత కుంగదీస్తున్నాయి. -
మాత్రల పొడితో నకిలీ ఔషధాలు
[ 05-07-2024]
పొడిచేసిన మాత్రలతో జ్వరం, తలనొప్పికి ఉపయోగించే, ప్రజారోగ్యానికి హాని కలిగించే ఔషధాలు తయారుచేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మేడ్చల్ ఎస్వోటీ, పేట్బషీరాబాద్ పోలీసులు, ఔషధ నియంత్రణాధికారులు చేధించారు.