వైకాపాకు కోటలు.. విద్యార్థుల ఆశలకు బీటలు..
గడిచిన అయిదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవ, విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసి.. సొంత కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టింది.
అంబేడ్కర్ స్టడీ సర్కిల్ భవనంపై అయిదేళ్ల నిర్లక్ష్యం
న్యూస్టుడే, అమలాపురం గ్రామీణం
భవనం చుట్టూ పిచ్చి మొక్కలు, పాదులు
గడిచిన అయిదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవ, విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసి.. సొంత కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణానికి సమీపంలోని జనుపల్లెలో వైకాపా కార్యాలయానికి స్థలం కేటాయించుకున్నారు తప్ప.. ఇదే గ్రామానికి దగ్గర్లోని నల్లమిల్లిలో ఉన్న అంబేడ్కర్ స్టడీ సర్కిల్ భవనాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు మాత్రం యత్నించలేదు. దీంతో గత తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన స్టడీ సర్కిల్ భవనం పాడైపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ భవనాన్ని అందుబాటులోకి తీసుకొస్తారనే ఆశలు యువతలో నెలకొన్నాయి.
2018లో ప్రారంభించినా..!
అమలాపురం మండలం నల్లమిల్లిలో తెదేపా ప్రభుత్వం 2018లో రూ.కోటితో నిర్మించిన స్టడీ సర్కిల్ భవనాన్ని అప్పటి ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. నాటి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఈ భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కొన్ని సౌకర్యాలు కల్పించాలనే కారణాలతో స్టడీ సర్కిల్ భవనం అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం వచ్చినా భవనం గురించి కనీసం పట్టించుకోలేదు. దీంతో దానిచుట్టూ మొక్కలు పెరిగిపోవడంతోపాటు భవనంలోకి ప్రవేశించేందుకు ఏర్పాటు చేసిన ర్యాంపు పగిలిపోయి కనిపిస్తోంది.
యువతకు ఊతమియ్యాలి..
జిల్లాలోని ఇతర ప్రాంతాల వారితోపాటు అమలాపురం గ్రామీణం, పట్టణం, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల పరిధిలోని సుమారు 50 వేలమంది యువతకు ఇక్కడి అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ఉపయోగపడుతుందని గత తెదేపా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆ తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లుచల్లింది. దీంతో స్టడీ సర్కిల్ ద్వారా యువతకు నైపుణ్యం, ఉద్యోగ అవకాశాలు అందకుండానే మూలకుచేరింది. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఆనందరావు ఎన్నిక కావడంతో ప్రత్యేకంగా దృష్టిసారించి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు తెలిపాం..
నల్లమిల్లిలోని అంబేడ్కర్ స్టడీ సర్కిల్ సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేశాం. వారి నుంచి ఆదేశాలొస్తే తదుపరి చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో స్టడీ సర్కిల్ ఉంది. దానిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
జ్యోతిలక్ష్మీదేవి, సాంఘిక సంక్షేమశాఖ జిల్లా అధికారిణి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెలీపోర్టు.. ఇన్నాళ్లకు మళ్లీ కదలిక
[ 05-07-2024]
కాకినాడ సముద్రతీరంలో స్మార్ట్ సిటీ నిధులు సుమారు రూ.3.5 కోట్లతో గతంలో నిర్మించిన హెలీపోర్టుకు కదలిక రానుంది. -
వినాయకా.. నువ్వే దిక్కు!
[ 05-07-2024]
కాకినాడలోని శ్రీవినాయక ఈస్ట్ చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎస్ఎస్డ బ్ల్యూఏఎంవై- 23 గ్రూప్ నంబర్తో రూ.5 లక్షలు చిట్ కట్టాము. 2023 జులైౖతో కాలగడువు పూర్తయింది. -
మేం వింటాం.. నిధులూ ఇస్తాం
[ 05-07-2024]
గత అయిదేళ్లలో సాగునీటి పారుదల వ్యవస్థను వైకాపా సర్కారు పూర్తిగా విస్మరించింది. గోదావరి వరదల నుంచి రక్షణకు అవసరమైన పనులనూ పక్కనబెట్టింది. -
నిత్య స్మరణీయుడు.. అల్లూరి: మంత్రి దుర్గేష్
[ 05-07-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: స్వాతంత్య్రం నా జన్మ హక్కు అంటూ పోరాటం సాగించిన అల్లూరి సీతారామరాజు నిత్య స్మరణీయుడని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. -
సొమ్ము ఉన్నట్టా.. లేనట్టా..?
[ 05-07-2024]
గత వైకాపా సర్కారు పుణ్యామా అని వ్యవస్థలన్నీ తలకిందులయ్యాయి. కొన్ని నిర్వీర్యంగా మారాయి. దీనికి తోడు ప్రజల అవసరాలు తీర్చాల్సిన పన్నులు పక్కదారి పట్టాయి. -
పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం: గోరంట్ల
[ 05-07-2024]
కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజమహేంద్రవరం గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. -
తీపి బతుకుల్లో చేదు నిజాలు
[ 05-07-2024]
మామిడితాండ్ర.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ఠక్కున నోరూరుతుంది.. అంతలా జనంతో అనుబంధం పెనవేసుకుంది ఈ పదార్థం.. -
పేద విద్యార్థులపై కపట ప్రేమ
[ 05-07-2024]
విద్యాహక్కు చట్టం మేరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం మంది పేద విద్యార్థులను ఉచితంగా చదివించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా. -
పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారు
[ 05-07-2024]
ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వ పెద్దలు ఏటీఎంలా వాడుకున్నారని మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ దుయ్యబట్టారు. -
పోర్టులో అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలి
[ 05-07-2024]
కాకినాడ పోర్టులో గత అయిదేళ్లలో భారీ కుంభకోణం జరిగిందని.. పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడమే గాక అనేక అక్రమాలకు పాల్పడ్డారని కాకినాడ నగర తెదేపా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఆరోపించారు. -
వైకాపా నాయకులకు స్థలాలు రాసిచ్చేశారు..!
[ 05-07-2024]
కాకినాడ నగర నియోజకవర్గంలో గత వైకాపా పాలనలో ప్రభుత్వ, మున్సిపల్, పోరంబోకు స్థలాలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాసిచ్చేశారు. పొజిషన్ పట్టాలు సృష్టించి, రెవెన్యూ అధికారుల ఆమోదముద్ర వేసి అప్పనంగా కట్టబెట్టేశారు. -
వైకాపా పాలనలో.. రైతన్న నిరాశపాలు..
[ 05-07-2024]
వ్యవసాయం-పశుపోషణ రైతులకు రెండు కళ్లు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నదాతలకు కాడే కాదు పాడి కూడా భారమైంది. ప్రకృతి ఆటుపోట్లు మరింత కుంగదీస్తున్నాయి. -
మాత్రల పొడితో నకిలీ ఔషధాలు
[ 05-07-2024]
పొడిచేసిన మాత్రలతో జ్వరం, తలనొప్పికి ఉపయోగించే, ప్రజారోగ్యానికి హాని కలిగించే ఔషధాలు తయారుచేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మేడ్చల్ ఎస్వోటీ, పేట్బషీరాబాద్ పోలీసులు, ఔషధ నియంత్రణాధికారులు చేధించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,200
-
చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో వైకాపా నేత ఈశ్వరప్రసాద్ అరెస్టు
-
‘భారతీయుడు2’ సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఎంతంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ.. రూ.60వేల కోట్లతో ఏర్పాటు