వీడని కోత.. తప్పని వెత..!
కాకినాడ జిల్లాలోనే యు.కొత్తపల్లికి ప్రత్యేక స్థానం ఉంది.. ఇక్కడి ఉప్పాడ చీరలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండటమే కారణం. అలాంటి ఈ మండలంలో రెండు కీలక సమస్యలు మత్స్యకారులను వేధిస్తున్నాయి.. అందులో సముద్ర కోత తీరని వ్యథగా మారగా, ఫిషింగ్ హార్బర్ పనుల అసంపూర్తి గంగపుత్రులను మరింత ఇబ్బంది పెడుతోంది.
యు.కొత్తపల్లిలో కీలక సమస్యలు
నేడు ఉపముఖ్యమంత్రి రాకతో మత్స్యకారుల్లో ఆశలు
న్యూస్టుడే, కొత్తపల్లి
ఉప్పాడలో తీర ప్రాంతం ఇలా...
కాకినాడ జిల్లాలోనే యు.కొత్తపల్లికి ప్రత్యేక స్థానం ఉంది.. ఇక్కడి ఉప్పాడ చీరలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండటమే కారణం. అలాంటి ఈ మండలంలో రెండు కీలక సమస్యలు మత్స్యకారులను వేధిస్తున్నాయి.. అందులో సముద్ర కోత తీరని వ్యథగా మారగా, ఫిషింగ్ హార్బర్ పనుల అసంపూర్తి గంగపుత్రులను మరింత ఇబ్బంది పెడుతోంది. జనసేన అధినేత పవన్కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి, ఉప ముఖ్యమంత్రిగానూ బాధ్యతలు స్వీకరించగా.. ఆ హోదాలో తొలిసారి తీరప్రాంత గ్రామాలకు వస్తుండటంతో తమ సమస్యలు పరిష్కారమవుతాయని మత్స్యకారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
సమస్యకు పరిష్కారం దక్కేనా?
మండలంలో సుబ్బంపేట నుంచి అమినాబాదు వరకు ఉన్న ఆరు గ్రామాలు కెరటాల కోతతో అల్లాడుతున్నాయి. వందలాది గృహాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. వీటి పరిధిలోని 16 వేల మంది జీవనం ప్రశ్నార్థకమవుతోంది. 16 ఏళ్ల క్రితం ఈ సమస్య మొదలవగా, అప్పటికే సుమారు 300 గృహాలు సముద్రపు నీట మునిగాయి. రక్షణ కోసం 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.12 కోట్ల నిధులతో ఆరు గ్రామాలకు జియోట్యూబ్ ఏర్పాటు చేయగా.. అయిదేళ్ల పాటు సత్ఫలితాలనిచ్చింది. అనంతరం ట్యూబ్ ధ్వంసమవడం, మరమ్మతుల్లేకపోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. గడిచిన మూడేళ్లల్లో సుమారు 200 గృహాలు కోతతో నేలకూలాయి. మరో 50 గృహాలు నేలకూలడానికి సిద్ధంగా ఉన్నాయి. నిపుణుల పరిశీలన, రక్షణ నిర్మాణాలు చేపడితేనే ఇక్కడ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
మధ్య దశలోనే నిలిచిపోయిన హార్బర్ నిర్మాణం
హార్బర్ సాకారం ఎప్పుడు
ఉప్పాడ చేపలరేవులో హార్బర్ నిర్మాణం మత్స్యకారుల కల. ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నా అది అసంపూర్తి పనుల్లోనే దర్శనమిస్తోంది. గతంలో తెదేపా ప్రభుత్వంలో హార్బర్ మంజూరు కాగా.. వైకాపా అధికారంలోకి వచ్చాక రూ.422 కోట్ల నిధులతో 2020 డిసెంబర్లో అప్పటి సీఎం జగన్ చేతుల మీదుగా వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో అందుబాటులోకి తెస్తామని చెప్పి, పనులు ప్రారంభించిన మూడు నెలలకే నిలిపేశారు. ఏడాది తరవాత మరోసారి పనులు మొదలై సుమారు రూ.180 కోట్ల మేర జరిగినా.. బిల్లుల మంజూరులో జాప్యంతో మరోమారు ఆగిపోయాయి. రూ.60 కోట్ల బిల్లు మంజూరైనా పనుల్లో వేగం కరవైంది. ఈ నాలుగేళ్లలో కేవలం 50 శాతం కూడా పూర్తికాలేదు. సముద్రంలోకి రాళ్లగట్టు వేయగా, భవనాల నిర్మాణం మధ్యలోనే ఆగింది. రోడ్లు, మౌలిక వసతుల కల్పన జరగాల్సి ఉంది. ఇదిలాఉంటే, ఉప్పాడ తీరంలో వరుస బోటు ప్రమాదాలు వణికిస్తున్నాయి. ఏడాది కాలంలో ఎనిమిది జరగ్గా.. అవగాహన లేకుండా సముద్రంలోకి వేసిన రాళ్లగట్టు కారణమన్నది మత్స్యకారుల మాట. మొత్తంగా ఈ రెండు సమస్యలు ఇబ్బంది పెడుతుండగా.. పవన్కల్యాణ్ పర్యటనతో పరిష్కారంపై ఆశలు నెలకొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెలీపోర్టు.. ఇన్నాళ్లకు మళ్లీ కదలిక
[ 05-07-2024]
కాకినాడ సముద్రతీరంలో స్మార్ట్ సిటీ నిధులు సుమారు రూ.3.5 కోట్లతో గతంలో నిర్మించిన హెలీపోర్టుకు కదలిక రానుంది. -
వినాయకా.. నువ్వే దిక్కు!
[ 05-07-2024]
కాకినాడలోని శ్రీవినాయక ఈస్ట్ చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎస్ఎస్డ బ్ల్యూఏఎంవై- 23 గ్రూప్ నంబర్తో రూ.5 లక్షలు చిట్ కట్టాము. 2023 జులైౖతో కాలగడువు పూర్తయింది. -
మేం వింటాం.. నిధులూ ఇస్తాం
[ 05-07-2024]
గత అయిదేళ్లలో సాగునీటి పారుదల వ్యవస్థను వైకాపా సర్కారు పూర్తిగా విస్మరించింది. గోదావరి వరదల నుంచి రక్షణకు అవసరమైన పనులనూ పక్కనబెట్టింది. -
నిత్య స్మరణీయుడు.. అల్లూరి: మంత్రి దుర్గేష్
[ 05-07-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: స్వాతంత్య్రం నా జన్మ హక్కు అంటూ పోరాటం సాగించిన అల్లూరి సీతారామరాజు నిత్య స్మరణీయుడని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. -
సొమ్ము ఉన్నట్టా.. లేనట్టా..?
[ 05-07-2024]
గత వైకాపా సర్కారు పుణ్యామా అని వ్యవస్థలన్నీ తలకిందులయ్యాయి. కొన్ని నిర్వీర్యంగా మారాయి. దీనికి తోడు ప్రజల అవసరాలు తీర్చాల్సిన పన్నులు పక్కదారి పట్టాయి. -
పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం: గోరంట్ల
[ 05-07-2024]
కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజమహేంద్రవరం గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. -
తీపి బతుకుల్లో చేదు నిజాలు
[ 05-07-2024]
మామిడితాండ్ర.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ఠక్కున నోరూరుతుంది.. అంతలా జనంతో అనుబంధం పెనవేసుకుంది ఈ పదార్థం.. -
పేద విద్యార్థులపై కపట ప్రేమ
[ 05-07-2024]
విద్యాహక్కు చట్టం మేరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం మంది పేద విద్యార్థులను ఉచితంగా చదివించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా. -
పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారు
[ 05-07-2024]
ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వ పెద్దలు ఏటీఎంలా వాడుకున్నారని మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ దుయ్యబట్టారు. -
పోర్టులో అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలి
[ 05-07-2024]
కాకినాడ పోర్టులో గత అయిదేళ్లలో భారీ కుంభకోణం జరిగిందని.. పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడమే గాక అనేక అక్రమాలకు పాల్పడ్డారని కాకినాడ నగర తెదేపా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఆరోపించారు. -
వైకాపా నాయకులకు స్థలాలు రాసిచ్చేశారు..!
[ 05-07-2024]
కాకినాడ నగర నియోజకవర్గంలో గత వైకాపా పాలనలో ప్రభుత్వ, మున్సిపల్, పోరంబోకు స్థలాలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాసిచ్చేశారు. పొజిషన్ పట్టాలు సృష్టించి, రెవెన్యూ అధికారుల ఆమోదముద్ర వేసి అప్పనంగా కట్టబెట్టేశారు. -
వైకాపా పాలనలో.. రైతన్న నిరాశపాలు..
[ 05-07-2024]
వ్యవసాయం-పశుపోషణ రైతులకు రెండు కళ్లు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నదాతలకు కాడే కాదు పాడి కూడా భారమైంది. ప్రకృతి ఆటుపోట్లు మరింత కుంగదీస్తున్నాయి. -
మాత్రల పొడితో నకిలీ ఔషధాలు
[ 05-07-2024]
పొడిచేసిన మాత్రలతో జ్వరం, తలనొప్పికి ఉపయోగించే, ప్రజారోగ్యానికి హాని కలిగించే ఔషధాలు తయారుచేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మేడ్చల్ ఎస్వోటీ, పేట్బషీరాబాద్ పోలీసులు, ఔషధ నియంత్రణాధికారులు చేధించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
-
పెద్ద అంబర్పేట సమీపంలో పోలీసుల కాల్పులు
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
-
క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,200
-
చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో వైకాపా నేత ఈశ్వరప్రసాద్ అరెస్టు