టీచ్ టూల్తో బోధనలో నైపుణ్యం
ఉపాధ్యాయుల బోధన పద్ధతిని ఒక నమూనాలో మదింపు చేసేందుకు టీచ్ టూల్ని ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు చెప్పారు.
సూచనలిస్తున్న డీఎస్ఈఓ కె.వాసుదేవరావు, డీవైఈఓ నారాయణ తదితరులు
శ్యామలాసెంటర్(రాజమహేంద్రవరం): ఉపాధ్యాయుల బోధన పద్ధతిని ఒక నమూనాలో మదింపు చేసేందుకు టీచ్ టూల్ని ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు చెప్పారు. డీఎంహెచ్ పాఠశాలలో ఉపాధ్యాయులకు పది రోజులపాటు నిర్వహించే టీచ్ టూల్ శిక్షణ తరగతులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఉపాధ్యాయులకు మెరుగైన పద్ధతులు అందించేందుకు, బోధన మెరుగుపరచుకోవటం, ప్రస్తుతం బోధన పద్ధతులను కొలమానం చేయటం వంటి లక్ష్యాలతో టీచ్ అనే సాధనం అభివృద్ధి చేశారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లాలో 8 మండలాలకు చెందిన 104 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొనగా విషయ నిపుణులుగా ఎన్.శ్రీనివాస్, టి.ప్రవీణ్, శిరీష, రేఖ, స్వప్న, శ్రీనివాస్లు వ్యవహరించారు.
బోధనలో మెలకువలు నేర్చుకోవాలి: టీచ్ టూల్ శిక్షణ తరగతులను జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్.సుభాషిణి మంగళవారం సందర్శించారు. విద్యలో ఉత్తమ ప్రమాణాలు సాధించాలంటే బోధనలో మెలకువలు నేర్చుకోవాలని, మారుతున్న విధానాలకు అనుగుణంగా బోధన నైపుణ్యాన్ని మెరుగు పరచుకోవాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెలీపోర్టు.. ఇన్నాళ్లకు మళ్లీ కదలిక
[ 05-07-2024]
కాకినాడ సముద్రతీరంలో స్మార్ట్ సిటీ నిధులు సుమారు రూ.3.5 కోట్లతో గతంలో నిర్మించిన హెలీపోర్టుకు కదలిక రానుంది. -
వినాయకా.. నువ్వే దిక్కు!
[ 05-07-2024]
కాకినాడలోని శ్రీవినాయక ఈస్ట్ చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎస్ఎస్డ బ్ల్యూఏఎంవై- 23 గ్రూప్ నంబర్తో రూ.5 లక్షలు చిట్ కట్టాము. 2023 జులైౖతో కాలగడువు పూర్తయింది. -
మేం వింటాం.. నిధులూ ఇస్తాం
[ 05-07-2024]
గత అయిదేళ్లలో సాగునీటి పారుదల వ్యవస్థను వైకాపా సర్కారు పూర్తిగా విస్మరించింది. గోదావరి వరదల నుంచి రక్షణకు అవసరమైన పనులనూ పక్కనబెట్టింది. -
నిత్య స్మరణీయుడు.. అల్లూరి: మంత్రి దుర్గేష్
[ 05-07-2024]
రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్టుడే: స్వాతంత్య్రం నా జన్మ హక్కు అంటూ పోరాటం సాగించిన అల్లూరి సీతారామరాజు నిత్య స్మరణీయుడని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. -
సొమ్ము ఉన్నట్టా.. లేనట్టా..?
[ 05-07-2024]
గత వైకాపా సర్కారు పుణ్యామా అని వ్యవస్థలన్నీ తలకిందులయ్యాయి. కొన్ని నిర్వీర్యంగా మారాయి. దీనికి తోడు ప్రజల అవసరాలు తీర్చాల్సిన పన్నులు పక్కదారి పట్టాయి. -
పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం: గోరంట్ల
[ 05-07-2024]
కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజమహేంద్రవరం గ్రామీణం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. -
తీపి బతుకుల్లో చేదు నిజాలు
[ 05-07-2024]
మామిడితాండ్ర.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ఠక్కున నోరూరుతుంది.. అంతలా జనంతో అనుబంధం పెనవేసుకుంది ఈ పదార్థం.. -
పేద విద్యార్థులపై కపట ప్రేమ
[ 05-07-2024]
విద్యాహక్కు చట్టం మేరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం మంది పేద విద్యార్థులను ఉచితంగా చదివించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా. -
పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారు
[ 05-07-2024]
ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వ పెద్దలు ఏటీఎంలా వాడుకున్నారని మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ దుయ్యబట్టారు. -
పోర్టులో అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలి
[ 05-07-2024]
కాకినాడ పోర్టులో గత అయిదేళ్లలో భారీ కుంభకోణం జరిగిందని.. పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడమే గాక అనేక అక్రమాలకు పాల్పడ్డారని కాకినాడ నగర తెదేపా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఆరోపించారు. -
వైకాపా నాయకులకు స్థలాలు రాసిచ్చేశారు..!
[ 05-07-2024]
కాకినాడ నగర నియోజకవర్గంలో గత వైకాపా పాలనలో ప్రభుత్వ, మున్సిపల్, పోరంబోకు స్థలాలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాసిచ్చేశారు. పొజిషన్ పట్టాలు సృష్టించి, రెవెన్యూ అధికారుల ఆమోదముద్ర వేసి అప్పనంగా కట్టబెట్టేశారు. -
వైకాపా పాలనలో.. రైతన్న నిరాశపాలు..
[ 05-07-2024]
వ్యవసాయం-పశుపోషణ రైతులకు రెండు కళ్లు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నదాతలకు కాడే కాదు పాడి కూడా భారమైంది. ప్రకృతి ఆటుపోట్లు మరింత కుంగదీస్తున్నాయి. -
మాత్రల పొడితో నకిలీ ఔషధాలు
[ 05-07-2024]
పొడిచేసిన మాత్రలతో జ్వరం, తలనొప్పికి ఉపయోగించే, ప్రజారోగ్యానికి హాని కలిగించే ఔషధాలు తయారుచేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మేడ్చల్ ఎస్వోటీ, పేట్బషీరాబాద్ పోలీసులు, ఔషధ నియంత్రణాధికారులు చేధించారు.