ఊరూరా పండగలా ఎన్టీఆర్ భరోసా లబ్ధి పంపిణీ
జులై 1.. సోమవారం.. రాష్ట్ర చరిత్రలో ఇదో ప్రత్యేకరోజు.. ప్రతి ఇంటా సంతోషరేఖలను తెచ్చినరోజు.. ఎక్కడా శషభిషలు లేవు..మాట ఇచ్చి దాటవేయడాలు లేవు.. ప్రతి పింఛను లబ్ధిదారు ఇంటి వాకిళ్లు సూర్యుడు ఉదయించకముందే తెరుచుకున్నాయి
వాలంటీర్లు లేకున్నా రాత్రి 10 గంటలకే 95.24 శాతం పూర్తి
ఈనాడు, రాజమహేంద్రవరం: జులై 1.. సోమవారం.. రాష్ట్ర చరిత్రలో ఇదో ప్రత్యేకరోజు.. ప్రతి ఇంటా సంతోషరేఖలను తెచ్చినరోజు.. ఎక్కడా శషభిషలు లేవు..మాట ఇచ్చి దాటవేయడాలు లేవు.. ప్రతి పింఛను లబ్ధిదారు ఇంటి వాకిళ్లు సూర్యుడు ఉదయించకముందే తెరుచుకున్నాయి. ఎన్టీఆర్ భరోసా పింఛను రూ.7 వేల చొప్పున అందించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. వృద్ధులు, దివ్యాంగులు వితంతువులు.. ఒంటరి మహిళలు.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలా అందరికీ మేలు చేసేలా కూటమి ప్రభుత్వం అందించిన కానుకతో పల్లెలు, పట్టణాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి తమ హర్షాన్ని వ్యక్తంచేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం 5 గంటల నుంచే ప్రజాప్రతినిధులు, అధికారులు.. తెదేపా, జనసేన, భాజపా నాయకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛను అందించే ప్రక్రియ ఆరంభించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేసి చూపించారు.. గొల్లప్రోలులో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్, రామచంద్రపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని పింఛన్లు అందించారు.నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు.
కె.గంగవరం మండలం దంగేరులో పింఛను అందజేసేందుకు డోలు సన్నాయి మేళాలతో వెళ్తున్న ప్రజాప్రతినిధులు
ఊరూరా పండగే..
మండపేట, జగ్గంపేట, కొత్తపేట, పి.గన్నవరం, గోపాలపురం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, రాజానగరం, అనపర్తి, పెద్దాపురం, ప్రత్తిపాడు, అమలాపురం, రాజోలు ఇతర నియోజకవర్గాల్లో ముగ్గురు అగ్రనేతల చిత్రపటాలకు లబ్ధిదారులు క్షీరాభిషేకం చేసి తమ కృతజ్ఞతను తెలిపారు. తాళ్లరేవులో పలుచోట్ల లబ్ధిదారులకు అల్పాహారం పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్ రాగంపేటలో రూ.7వేల పింఛను సొమ్ముతోపాటు కిలో చొప్పున మిఠాయి ప్యాకెట్లు అందించారు.
గండేపల్లి: జడ్.రాగంపేటలో పింఛను సొమ్ము రూ. ఏడు వేలతో పాటు కిలో స్వీటు బాక్స్ను అందజేస్తున్న తెదేపా నాయకులు
రికార్డు స్థాయిలో అందజేత
గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లతో అయిదురోజులపాటు పింఛన్లు పంపిణీ చేయిస్తే మొదటి రోజు 85 నుంచి 90 శాతంలోపే జరిగేది. కూటమి ప్రభుత్వం వాలంటీర్ల ప్రమేయం లేకుండా ప్రక్రియ చేపట్టింది. సోమవారం రాత్రి 10 గంటల కల్లా ఉమ్మడి జిల్లాలో 95.24 శాతం పంపిణీ పూర్తిచేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు, ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు మినహా అందరికీ తొలి రోజే అందించేలా తూర్పు, కాకినాడ, కోనసీమ కలెక్టర్లు ప్రశాంతి, షాన్ మోహన్, హిమాన్షుశుక్లా కార్యాచరణ సిద్ధం చేశారు. కొన్ని చోట్ల సర్వర్ మొరాయించడంతో సుమారు గంటపాటు నిలిచింది. తరువాత సజావుగా సాగింది. కాకినాడ నగరంలో రాత్రి 7.50 గంటల వరకు 96.29 శాతం పింఛన్లు అందించి జిల్లాలో ప్రథమంగా నిలిచారు.
ఆత్మాభిమానంతో గడిపేలా
ప్రత్తిపాడు: సంపాదించలేని స్థితిలో ఆత్మాభిమానంతో బతికేలా పింఛను ధైర్యాన్నిస్తోంది. ఈ వయసులోనూ ఇంత కన్నా ప్రభుత్వం నుంచి ఏం మంచి కోరుకుంటాం. రూ.7వేలు పింఛనుగా అందుకోవడం, ప్రతి నెలా రూ.4వేలు చేతికి రావడం శేషజీవితాన్ని ఆనందంగా గడపడానికి సరిపోతుంది.
పిఠాపురం: పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చక్రి అనే బాలుడిని చూపిస్తూ.. ఇలాంటి రెండు తరాలకు అండగా ఉంటామని చెబుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్,
ఇన్నాళ్లకు గౌరవం దక్కింది
వైకాపా తరఫున సర్పంచిగా గెలిచినా ఏనాడూ తగిన గౌరవం దక్కలేదు. ఏ పని ఉన్నా వాలంటీర్ల ద్వారా చేయడంతో మాకు గుర్తింపు లభించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా పింఛన్ల పంపిణీ సర్పంచి చేతుల మీదుగా చేపట్టడం సంతోషంగా ఉంది.
- గవర భవానీ, కొత్తపల్లి సర్పంచి
కుమార్తెను మళ్లీ పాఠశాలకు పంపిస్తా..
మసీదుసెంటర్: నా భర్త కూలి పనులు చేసుకుంటా కుటుంబాన్ని పోషించేవారు. ఆయన మృతి చెందడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఏడాది కాలంగా ఆర్థిక పరిస్థితి సరిగా లేక కుమార్తెను చదువు మాన్పించేశా. ఈ నెల రూ.7వేలు పింఛను ఇవ్వడం ఆనందంగా ఉంది. బిడ్డ చదువు నిమిత్తం ఖర్చు పెడతా. మళ్లీ పాఠశాలకు పంపిస్తా.
-కె.భవాని, వలందపేట, జగన్నాథపురం(కాకినాడ)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
[ 03-07-2024]
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
పథకాలపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
[ 03-07-2024]
మండలంలోని శెట్టిపేటలో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల అమలుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివెయ్యాలని ధర్నా చేపట్టారు. -
పంచాయతీల్లో గ్రామసభలు
[ 03-07-2024]
కొయ్యలగూడెం మండలంలోని పలు పంచాయతీల్లో బుధవారం గ్రామసభలను నిర్వహించారు. -
ఇదేం వి‘చిత్రం’.. నవ్విపోరా జనం..!
[ 03-07-2024]
రాష్ట్రంలో ఎన్టీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. నేటికీ గత వైకాపా ప్రభుత్వ లోగోలు, చిత్రాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. అమలాపురంలోని ప్రాంతీయ ఆసుపత్రి భవనానికి గతంలో వేసిన మాజీ సీఎంలు వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డి చిత్రాలతో ఉండే నవరత్నాలు లోగోలు మంగళవారం దర్శనమిచ్చాయి. -
ద్వారంపూడి మార్కు అరాచకం
[ 03-07-2024]
వైకాపా పాలనలో గత అయిదేళ్ల కాలంలో కాకినాడ నగరంలో ప్రభుత్వానివే కాదు ప్రైవేట్ ఆస్తులకూ రక్షణ లేకుండా పోయింది. నేతల అండ చూసుకొని కబ్జాదారులు రెచ్చిపోయారు. తమ పూర్వీకుల సొత్తు మాదిరి మున్సిపల్ స్థలాలను అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అన్నివేళలా ఈ పప్పులు ఉడకవు. ప్రభుత్వం మారింది. -
పల్లె గడపకు స్వచ్ఛ జలాలు
[ 03-07-2024]
కాకినాడ కలెక్టరేట్లో మంగళవారం నాలుగు గంటలపాటు కీలక శాఖలతో ఉపముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ, శాస్త్ర- సాంకేతిక, జిల్లా పరిషత్తు తదితర అంశాలపై సమీక్షించి బడ్జెట్ కేటాయింపులు.. చేపట్టిన, చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. -
మెట్ట రైతుకు గోదావరి జలాలు
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో వదిలేసిన ఎత్తిపోతల పథకాల పనులను కూటమి ప్రభుత్వం రాగానే యుద్ధప్రాతిపదికన చేయించి జులై మొదటి వారంలోనే సాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. -
భూహక్కు పత్రాల ఉపసంహరణకు రంగం సిద్ధం
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం కింద చేపట్టిన భూ రీసర్వేపై జిల్లాలో అనేక ఆందోళనలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. సర్వేలో లోపాలున్నాయని, రీ సర్వేతో తమ భూమి తగ్గిపోయిందని అనేకమంది రైతులు, భూ యాజమానులు గగ్గోలు పెట్టినా వైకాపా పాలకులు పట్టించుకోలేదు. -
సహకార సంఘాల ప్రక్షాళన షురూ..!
[ 03-07-2024]
సహకార సంఘాల్లో ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా మొదటి దశ కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటివరకు వైకాపా ప్రభుత్వ హయాంలో పాలన సాగించిన త్రిసభ్య కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో పర్సన్ ఇన్ఛార్జి వ్యవస్థను కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. -
నిధులు రావాల.. బాగుపడాల
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని విస్మరించడంతో అవి ఏటేటా క్షీణదశకు చేరుకుని అత్యంత దారుణంగా తయారయ్యాయి. గుంతలుపడి వర్షపునీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అలాంటి రహదారులకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలంటే సుమారు రూ.400 కోట్ల నిధులు కావాలి. -
వైకాపాకు కోటలు.. విద్యార్థుల ఆశలకు బీటలు..
[ 03-07-2024]
గడిచిన అయిదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవ, విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసి.. సొంత కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టింది. -
వీడని కోత.. తప్పని వెత..!
[ 03-07-2024]
కాకినాడ జిల్లాలోనే యు.కొత్తపల్లికి ప్రత్యేక స్థానం ఉంది.. ఇక్కడి ఉప్పాడ చీరలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండటమే కారణం. అలాంటి ఈ మండలంలో రెండు కీలక సమస్యలు మత్స్యకారులను వేధిస్తున్నాయి.. అందులో సముద్ర కోత తీరని వ్యథగా మారగా, ఫిషింగ్ హార్బర్ పనుల అసంపూర్తి గంగపుత్రులను మరింత ఇబ్బంది పెడుతోంది. -
నాణ్యతకు తిలోదకాలు
[ 03-07-2024]
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది జేఎన్టీయూకేలో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరు. నాణ్యత పాటిస్తూ దాని గురించి కాబోయే ఇంజినీర్లకు వివరించాల్సిన అధికారులే నాణ్యతకు తిలోదకాలిస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారు. -
టీచ్ టూల్తో బోధనలో నైపుణ్యం
[ 03-07-2024]
ఉపాధ్యాయుల బోధన పద్ధతిని ఒక నమూనాలో మదింపు చేసేందుకు టీచ్ టూల్ని ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు చెప్పారు. -
భవనం ఖాళీ చేయించారు.. న్యాయం చేయండి
[ 03-07-2024]
కాకినాడ నగరంలోని సత్యప్రసన్ననగర్ భాస్కర్ ఎస్టేట్స్ బాధితులు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. తామెంతో కష్టపడి బిల్డర్ ద్వారా బహుళ అంతస్తు భవనాన్ని నిర్మించుకున్నామని, అది కుంగిపోయిందనే నెపంతో అయిదేళ్ల కింద ఖాళీ చేయించారని వాపోయారు. -
అయిదేళ్లు నిద్రపోయారు.. గుంతల రోడ్లు మిగిల్చారు..
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయాలు నిర్మించుకొనేందుకు పెట్టిన శ్రద్ధ రహదారుల మరమ్మతులకు పెట్టకపోవడంతో ప్రస్తుతం రహదారులు రూపురేఖలు కోల్పాయాయి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అవినీతిపై పోరు.. దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం: మోదీ
-
టీపీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా
-
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
-
అలా కూర్చొని.. ఇలా రికార్డులు నెలకొల్పి: ప్రభాస్పై నాగ్ అశ్విన్ పోస్ట్
-
భారత ఆటగాళ్లతో ఓపెన్ బస్ పరేడ్.. ఎక్కడంటే?
-
అసెంబ్లీ గేటు కూడా తాకలేవంటే.. పిఠాపురం ప్రజలు డిప్యూటీ సీఎంను చేశారు: పవన్