వైకాపా పాలనలో బౌద్ధారామాలకు కొరవడిన రక్షణ
రాష్ట్రంలోని అన్ని బౌద్ధ ఆరామాలను పరిరక్షించుకుందామని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా (బీఎస్ఐ) ఏపీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు వై.హరిబాబు అన్నారు.
సంఘీభావం తెలుపుతున్న దళిత సంఘాల ప్రతినిధులు
కాకినాడ నగరం, న్యూస్టుడే: రాష్ట్రంలోని అన్ని బౌద్ధ ఆరామాలను పరిరక్షించుకుందామని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా (బీఎస్ఐ) ఏపీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు వై.హరిబాబు అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం కాకినాడ వచ్చారు. స్థానికంగా నిర్వహించిన సమావేశానికి టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సబ్బతి ఫణేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్నిచోట్ల బౌద్ధ ఆరామాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అందుకు జిల్లాలోని కొడవలి బౌద్ధ ఆరామమే నిదర్శనమన్నారు. రక్షించుకోవటంతో పాటు బౌద్ధాన్ని ఏపీలో వ్యాపింప చేయడానికి బీఎస్ఐ కృషి చేస్తోందన్నారు. దీనికోసం జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఫణేశ్వరరావు మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చాకే కొడవలి బౌద్ధారామానికి రక్షణ కొరవడిందని ఆరోపించారు. అప్పటి పాలకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్కడి కొండను కొల్లగొట్టారన్నారు. బీఎస్ఐ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు కాశి రాంబోధి, ప్రధాన కార్యదర్శి ములపర్తి సత్యనారాయణ, ప్రతినిధులు జల్లి రంగారావు, వై.వెంకట్రాజు, జంగా రాజేంద్రకుమార్, ఎస్.బాలకృష్ణ, జానపాటి నానిబాబు, సుబ్బరాజు, బూసి నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా విజయం మీకే అంకితం
[ 04-07-2024]
నన్ను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా.. నేను కోరుకోని ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని ఇచ్చారు. ఆ విజయాన్ని మీకే అంకితం చేస్తున్నా..రాజ్యాంగ పదవులను గౌరవిస్తా.. ఆఖరి శ్వాస వరకు మీకు రుణపడి ఉంటాను. -
బుజ్జి వచ్చింది..
[ 04-07-2024]
ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ చిత్రంలో సందడిచేసిన ‘బుజ్జి’ వాహనమిది. దాదాపు ఆరుటన్నుల బరువు ఉండే ఈ మూడు చక్రాల భారీ కారు తయారీకి సుమారు రూ.7 కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది. -
గుట్టుగా.. గుత్తగా
[ 04-07-2024]
ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడంలేదు. కొద్దిరోజుల్లో కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తున్న తరుణంలో.. సందట్లో సడేమియాగా నిల్వ కేంద్రాల్లో ఉంచిన ఇసుక గుట్టలను ఓ వైపు కొందరు కరిగించేస్తున్నారు. -
కష్టకాలంలో అండగా నిలిచిన వారికి వందనం
[ 04-07-2024]
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆ సమయంలో మా కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు వందనం అంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
మోరంపూడి పైవంతెన పనుల వేగవంతానికి ఆదేశాలు
[ 04-07-2024]
మోరంపూడి పైవంతెన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. -
వైద్యవిద్యను వదిలేశారు..
[ 04-07-2024]
పతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ వైద్యకళాశాల కేటాయించి 150 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చామని.. బోధనాసుపత్రులుగా మార్చి రోగులకు ఎంతో మేలు చేశామని గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతూ ఏర్పాటు చేసిన వైద్యకళాశాలలు ఆరంభశూరత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయి -
మగువా.. అందుకో రుణం
[ 04-07-2024]
అధికారం చేపట్టింది మొదలు అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా స్వయం సహాయక సంఘాలకు అండగా నిలిచేందుకు, మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. -
మెట్టలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు
[ 04-07-2024]
ఉమ్మడి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలకు పైబడి సాగునీరుతో పాటు ఉత్తరాంధ్రకు తాగునీరు అందించే లక్ష్యంతో గోదావరి ఎడమగట్టున ఉన్న ఎత్తిపోతల పథకాలను ప్రారంభించామని జలవనరులశాఖమంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
సదరం నమోదుకు వేళాయె..
[ 04-07-2024]
ఉమ్మడి జిల్లాలో మొత్తం 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదరం శిబిరాలు నిర్వహిస్తారు. గతంలో మంగళ, శుక్రవారాలు ఉంటే ప్రస్తుతం వాటిని సోమ, గురువారాలు నిర్వహిస్తున్నారు. -
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు జవసత్వాలు
[ 04-07-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో యువత ఉద్యోగాల సాధనపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల సంఖ్య తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. -
వైకాపా నాయకుడిపై బిగుస్తున్న ఉచ్చు..?
[ 04-07-2024]
అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం, తెదేపా నాయకులపై బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో కాకినాడలోని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుపై ఉచ్చు బిగిస్తోంది. -
బదిలీల్లో అంతా అధర్మమే
[ 04-07-2024]
ధర్మాన్ని కాపాడాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖలో గత అయిదేళ్లు అధర్మం తాండవించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ