కళ్ల నిండా కని‘పింఛెను’ సంతోషం
జులై 1.. సోమవారం.. రాష్ట్ర చరిత్రలో ఇదో ప్రత్యేకరోజు.. ప్రతి ఇంటా సంతోషరేఖలను తెచ్చినరోజు.. ఎక్కడా శషభిషఈనాడు, రాజమహేంద్రవరంలు లేవు..మాట ఇచ్చి దాటవేయడాలు లేవు
ఊరూరా పండగలా ఎన్టీఆర్ భరోసా లబ్ధి పంపిణీ
వాలంటీర్లు లేకున్నా రాత్రి 10 గంటలకే 95.24 శాతం పూర్తి
జులై 1.. సోమవారం.. రాష్ట్ర చరిత్రలో ఇదో ప్రత్యేకరోజు.. ప్రతి ఇంటా సంతోషరేఖలను తెచ్చినరోజు.. ఎక్కడా శషభిషఈనాడు, రాజమహేంద్రవరంలు లేవు..మాట ఇచ్చి దాటవేయడాలు లేవు.. ప్రతి పింఛను లబ్ధిదారు ఇంటి వాకిళ్లు సూర్యుడు ఉదయించకముందే తెరుచుకున్నాయి. ఎన్టీఆర్ భరోసా పింఛను రూ.7 వేల చొప్పున అందించడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు.. ఒంటరి మహిళలు.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలా అందరికీ మేలు చేసేలా కూటమి ప్రభుత్వం అందించిన కానుకతో పల్లెలు, పట్టణాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి తమ హర్షాన్ని వ్యక్తంచేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం 5 గంటల నుంచే ప్రజాప్రతినిధులు, అధికారులు.. తెదేపా, జనసేన, భాజపా నాయకులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛను అందించే ప్రక్రియ ఆరంభించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేసి చూపించారు.. గొల్లప్రోలులో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్, రామచంద్రపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని పింఛన్లు అందించారు.నియోజకవర్గాల్లో శాసనసభ్యులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు.
పిల్లలకు కొత్త బట్టలు కొంటాను
సీతానగరం: పోలియోతో రెండుకాళ్లు చచ్చుబడిపోయిన సీతానగరానికి చెందిన దాస్యం పోశయ్యకు పింఛనే ఆధారం. భార్య, ఇద్దరు పిల్లలతో గుడిసెలో ఉంటున్నాడు. పెంచిన పింఛను రూ.6వేలు ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ చాలీచాలని మందులు కొనుక్కుంటూ పిల్లలకు కనీసం జతబట్టలు కూడా తీసుకోలేని స్థితిలో ఈ డబ్బుతో వాటిని నెరవేర్చుకుంటామని పోశయ్య చెప్పారు.
టి.నగర్: పింఛన్ల పెంపుతో జిల్లా డెఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చిత్రాలకు పుష్కర ఘాట్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద పాలాభిషేకం చేశారు.
ఊరూరా పండగే..
మండపేట, జగ్గంపేట, కొత్తపేట, పి.గన్నవరం, గోపాలపురం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, రాజానగరం, అనపర్తి, పెద్దాపురం, ప్రత్తిపాడు, అమలాపురం, రాజోలు ఇతర నియోజకవర్గాల్లో ముగ్గురు అగ్రనేతల చిత్రపటాలకు లబ్ధిదారులు క్షీరాభిషేకం చేసి తమ కృతజ్ఞతను తెలిపారు. తాళ్లరేవులో పలుచోట్ల లబ్ధిదారులకు అల్పాహారం పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్ రాగంపేటలో రూ.7వేల పింఛను సొమ్ముతోపాటు కిలో చొప్పున మిఠాయి ప్యాకెట్లు అందించారు.
రికార్డు స్థాయిలో అందజేత
గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లతో అయిదురోజులపాటు పింఛన్లు పంపిణీ చేయిస్తే మొదటి రోజు 85 నుంచి 90 శాతంలోపే జరిగేది. కూటమి ప్రభుత్వం వాలంటీర్ల ప్రమేయం లేకుండా ప్రక్రియ చేపట్టింది. సోమవారం రాత్రి 10 గంటల కల్లా ఉమ్మడి జిల్లాలో 95.24 శాతం పంపిణీ పూర్తిచేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు, ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు మినహా అందరికీ తొలి రోజే అందించేలా తూర్పు, కాకినాడ, కోనసీమ కలెక్టర్లు ప్రశాంతి, షాన్ మోహన్, హిమాన్షుశుక్లా కార్యాచరణ సిద్ధం చేశారు. కొన్ని చోట్ల సర్వర్ మొరాయించడంతో సుమారు గంటపాటు నిలిచింది. తరువాత సజావుగా సాగింది. కోనసీమ జిల్లాలో పింఛన్ల పంపిణీకి 3,897 మంది సచివాలయాల సిబ్బంది, ఇతర శాఖల వారు 350 మందిని నియమించారు.
గోపవరంలో పింఛన్ అందిస్తున్న మంత్రి దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే శేషారావు
బాబు మాట.. బంగారు మూట
కడియం: చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామ పరిధిలోని చైతన్యనగర్ లెప్రసీనగర్ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రూ.7 వేల పింఛను అందుకున్న వెంటనే చంద్రబాబు చిత్రపటాన్ని ముద్దాడుతున్న వృద్ధురాలు.
రూ.7 వేలు చేతిలో పెట్టేసరికి కన్నీళ్లొచ్చాయి
వి.ఎల్.పురం: నా పేరు గజరపు లక్ష్మి. నా భర్త చనిపోయి 25 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు నాకు 65 ఏళ్లు. సొంత ఇల్లు కూడా లేదు. ప్రస్తుతం ఒక ఇంట్లో పనిచేస్తున్నా. ఆసరాగా ఉండే కుమారుడు లివర్ సంబంధ వ్యాధి బారినపడ్డాడు. నెలకు రూ.3 వేల వరకు మందుల ఖర్చవుతుంది. నాకొచ్చే డబ్బులు సరిపోక అప్పు చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు పింఛను డబ్బులు రూ.7 వేలు ఇచ్చేసరికి ఆనందంతో కన్నీళ్లొచ్చాయి. ప్రతి నెలా రూ.4 వేల చొప్పున వస్తాయని చెప్పడంతో చాలా సంతోషపడ్డా.
మాకు మరింత భరోసా..
వృద్ధాప్యం బారిన పడిన మాలాంటి వారికి కూటమి ప్రభుత్వం మరింత భరోసాగా మారనుంది. అద్దె ఇంట్లో ఉంటున్న నాకు ఈనెల రూ.7 వేలు ఇచ్చారు. వచ్చే నెల నుంచి రూ.4 వేల చొప్పున ఇవ్వడం సంతోషకరం.
- చొప్పగట్ల సావిత్రమ్మ, కొవ్వూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా విజయం మీకే అంకితం
[ 04-07-2024]
నన్ను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా.. నేను కోరుకోని ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని ఇచ్చారు. ఆ విజయాన్ని మీకే అంకితం చేస్తున్నా..రాజ్యాంగ పదవులను గౌరవిస్తా.. ఆఖరి శ్వాస వరకు మీకు రుణపడి ఉంటాను. -
బుజ్జి వచ్చింది..
[ 04-07-2024]
ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ చిత్రంలో సందడిచేసిన ‘బుజ్జి’ వాహనమిది. దాదాపు ఆరుటన్నుల బరువు ఉండే ఈ మూడు చక్రాల భారీ కారు తయారీకి సుమారు రూ.7 కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది. -
గుట్టుగా.. గుత్తగా
[ 04-07-2024]
ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడంలేదు. కొద్దిరోజుల్లో కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తున్న తరుణంలో.. సందట్లో సడేమియాగా నిల్వ కేంద్రాల్లో ఉంచిన ఇసుక గుట్టలను ఓ వైపు కొందరు కరిగించేస్తున్నారు. -
కష్టకాలంలో అండగా నిలిచిన వారికి వందనం
[ 04-07-2024]
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆ సమయంలో మా కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు వందనం అంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
మోరంపూడి పైవంతెన పనుల వేగవంతానికి ఆదేశాలు
[ 04-07-2024]
మోరంపూడి పైవంతెన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. -
వైద్యవిద్యను వదిలేశారు..
[ 04-07-2024]
పతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ వైద్యకళాశాల కేటాయించి 150 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చామని.. బోధనాసుపత్రులుగా మార్చి రోగులకు ఎంతో మేలు చేశామని గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతూ ఏర్పాటు చేసిన వైద్యకళాశాలలు ఆరంభశూరత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయి -
మగువా.. అందుకో రుణం
[ 04-07-2024]
అధికారం చేపట్టింది మొదలు అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా స్వయం సహాయక సంఘాలకు అండగా నిలిచేందుకు, మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. -
మెట్టలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు
[ 04-07-2024]
ఉమ్మడి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలకు పైబడి సాగునీరుతో పాటు ఉత్తరాంధ్రకు తాగునీరు అందించే లక్ష్యంతో గోదావరి ఎడమగట్టున ఉన్న ఎత్తిపోతల పథకాలను ప్రారంభించామని జలవనరులశాఖమంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
సదరం నమోదుకు వేళాయె..
[ 04-07-2024]
ఉమ్మడి జిల్లాలో మొత్తం 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదరం శిబిరాలు నిర్వహిస్తారు. గతంలో మంగళ, శుక్రవారాలు ఉంటే ప్రస్తుతం వాటిని సోమ, గురువారాలు నిర్వహిస్తున్నారు. -
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు జవసత్వాలు
[ 04-07-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో యువత ఉద్యోగాల సాధనపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల సంఖ్య తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. -
వైకాపా నాయకుడిపై బిగుస్తున్న ఉచ్చు..?
[ 04-07-2024]
అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం, తెదేపా నాయకులపై బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో కాకినాడలోని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుపై ఉచ్చు బిగిస్తోంది. -
బదిలీల్లో అంతా అధర్మమే
[ 04-07-2024]
ధర్మాన్ని కాపాడాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖలో గత అయిదేళ్లు అధర్మం తాండవించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 24,350 ఎగువన నిఫ్టీ
-
మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు.. డ్రగ్ రాకెట్ణు ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు
-
వరంగల్ నిట్ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వంచకుడు అంజాద్పై కేసు.. పెళ్లి చేసుకుంటానని బలవంతాన తీసుకెళ్లినట్లు తేజస్విని స్టేట్మెంట్