శాయశక్తులా శ్రమిస్తా.. సమస్యలు పరిష్కరిస్తా
‘‘పిఠాపురం నియోజకవర్గ పెద్దలకు.. ప్రజలకు.. రాష్ట్ర ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు.. ఫలితాలు వచ్చాక ఇదే నా మొదటి పర్యటన.. ఎన్నికలయ్యాక ఇప్పటివరకు నియోజకవర్గానికి ఎందుకు రాలేదని కొందరు అంటున్నారు.
అభివృద్ధి చేసి చూపించాకే ఎమ్మెల్యేగా ప్రకటించుకుంటా
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్
‘‘పిఠాపురం నియోజకవర్గ పెద్దలకు.. ప్రజలకు.. రాష్ట్ర ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు.. ఫలితాలు వచ్చాక ఇదే నా మొదటి పర్యటన.. ఎన్నికలయ్యాక ఇప్పటివరకు నియోజకవర్గానికి ఎందుకు రాలేదని కొందరు అంటున్నారు. గెలిచాక ఊరేగింపులు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. పనిలోకి వెళ్లాలనుకున్నాను. నేను తీసుకున్నవి చాలా కీలక శాఖలు.వాటన్నింటిపై అవగాహనకు చాలా సమయం పడుతుంది. పాలనలో సవాళ్లు తెలుసుకోవడానికి సమయం తీసుకున్నా.. పింఛన్ల పంపిణీ ద్వారా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఇప్పుడు వచ్చాను.. రాష్ట్రం మొత్తం మనవైపు చూడాలి.. దేశంలోకెల్లా ఉత్తమ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతా’’‘‘ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి అవ్వాలని ఆశపడలేదు. కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిని అవ్వాలనుకున్నాను. ప్రతి ఓటు సరైన వ్యక్తికి వేశాం.. సరైన కూటమికి వేశామని అనుకునేలా మా పాలన ఉంటుంది’’
-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్కల్యాణ్
ఈనాడు, కాకినాడ - న్యూస్టుడే, గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి: కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని సత్యకృష్ణ కన్వెన్షన్ హాలులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పాల్గొన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపేవరకు తన శాయశక్తులా శ్రమిస్తానని అన్నారు. బాధ్యత తీసుకున్నాక డబ్బులు సంపాదించుకోవాలనో.. కొత్తపేరు రావాలనో ఆలోచన తనకు లేదన్నారు. ప్రజల్లో నటుడిగా సుస్థిర స్థానం ఉందని, డబ్బుకు కొదవలేదన్నారు. రాజకీయాలకు డబ్బుతో ఏనాడూ ముడిపెట్టలేదని పేర్కొన్నారు.
జ్యోతిప్రజ్వలన చేస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్.. చిత్రంలో మాజీ ఎమ్మెల్యే వర్మ
అందరూ ఇటువైపు చూసేలా..
పిఠాపురం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. ‘కనీస రక్షిత మంచినీరు ఇవ్వడం నా బాధ్యత.. ఉపాధి అవకాశాలు తేవాలి. అర్హులకు పింఛన్లు ఇప్పించాలి. ఇదే నా మొదటి ప్రయత్నం. వ్యవసాయ సమస్యలు, కాలువల పూడికలు.. పారిశుద్ధ్యం మెరుగుపై దృష్టిసారిస్తా.’ అన్నారు.
మీ బిడ్డల భవిష్యత్తు కోసం..
అయిదో తరగతి చదువుతున్న నక్కా చక్రి అనే బాలుడిని పవన్ వేదికపైకి పిలిచారు. ఇలాంటి బిడ్డల భవిష్యత్తు కోసం తాగడానికి మంచినీరు, మంచి చదువు చెప్పించగలిగితే మనం విజయం సాధించినట్లేనన్నారు. నా బిడ్దల కోసం ఎంత తపన పడతానో నాకు తెలీదు గానీ అందరూ నా బిడ్డలే. మాట ఇస్తున్నా.. రెండు తరాలకోసం పనిచేస్తానని అన్నారు.
పింఛను అందించి దివ్యాంగురాలిని పలకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఈ సంక్షేమం ఆగదు..
కూటమి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వైకాపా ప్రజల్ని భయపెట్టిందని.. ఇవేవీ ఆగవని పవన్ స్పష్టంచేశారు. పిఠాపురం నియోజకవర్గంలో పింఛను లబ్ధిదారులు 40,765 మంది ఉంటే.. రూ.27.34 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. వృద్ధాప్య పింఛన్లు 20,396, వితంతు 9,970.. దివ్యాంగులు 4,819.. మత్స్యకారులు 1,498.. చేనేత 997.. కల్లుగీత కార్మికులు 619.. డప్పు కళాకారులు 230..ఇలా ఉన్నారని తెలిపారు. కల్లుగీత కార్మికులు 70వేల మంది ఉంటే 612 పింఛన్లు మాత్రమే ఇచ్చేవారని సంఘ ప్రతినిధి గోవిందరావు చెప్పడంతో అర్హులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి రెండువారాలకోసారి పిఠాపురం వచ్చి వినతులు స్వీకరిస్తానని కలెక్టర్ చెప్పారని, ఏమైనా సమస్యలు ఉంటే ఇవ్వాలని సూచించారు. కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ, కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ సతీష్కుమార్, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు, భాజపా ఇన్ఛార్జి కృష్ణంరాజు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా విజయం మీకే అంకితం
[ 04-07-2024]
నన్ను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా.. నేను కోరుకోని ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని ఇచ్చారు. ఆ విజయాన్ని మీకే అంకితం చేస్తున్నా..రాజ్యాంగ పదవులను గౌరవిస్తా.. ఆఖరి శ్వాస వరకు మీకు రుణపడి ఉంటాను. -
బుజ్జి వచ్చింది..
[ 04-07-2024]
ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ చిత్రంలో సందడిచేసిన ‘బుజ్జి’ వాహనమిది. దాదాపు ఆరుటన్నుల బరువు ఉండే ఈ మూడు చక్రాల భారీ కారు తయారీకి సుమారు రూ.7 కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది. -
గుట్టుగా.. గుత్తగా
[ 04-07-2024]
ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడంలేదు. కొద్దిరోజుల్లో కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తున్న తరుణంలో.. సందట్లో సడేమియాగా నిల్వ కేంద్రాల్లో ఉంచిన ఇసుక గుట్టలను ఓ వైపు కొందరు కరిగించేస్తున్నారు. -
కష్టకాలంలో అండగా నిలిచిన వారికి వందనం
[ 04-07-2024]
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆ సమయంలో మా కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు వందనం అంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
మోరంపూడి పైవంతెన పనుల వేగవంతానికి ఆదేశాలు
[ 04-07-2024]
మోరంపూడి పైవంతెన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. -
వైద్యవిద్యను వదిలేశారు..
[ 04-07-2024]
పతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ వైద్యకళాశాల కేటాయించి 150 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చామని.. బోధనాసుపత్రులుగా మార్చి రోగులకు ఎంతో మేలు చేశామని గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతూ ఏర్పాటు చేసిన వైద్యకళాశాలలు ఆరంభశూరత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయి -
మగువా.. అందుకో రుణం
[ 04-07-2024]
అధికారం చేపట్టింది మొదలు అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా స్వయం సహాయక సంఘాలకు అండగా నిలిచేందుకు, మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. -
మెట్టలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు
[ 04-07-2024]
ఉమ్మడి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలకు పైబడి సాగునీరుతో పాటు ఉత్తరాంధ్రకు తాగునీరు అందించే లక్ష్యంతో గోదావరి ఎడమగట్టున ఉన్న ఎత్తిపోతల పథకాలను ప్రారంభించామని జలవనరులశాఖమంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
సదరం నమోదుకు వేళాయె..
[ 04-07-2024]
ఉమ్మడి జిల్లాలో మొత్తం 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదరం శిబిరాలు నిర్వహిస్తారు. గతంలో మంగళ, శుక్రవారాలు ఉంటే ప్రస్తుతం వాటిని సోమ, గురువారాలు నిర్వహిస్తున్నారు. -
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు జవసత్వాలు
[ 04-07-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో యువత ఉద్యోగాల సాధనపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల సంఖ్య తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. -
వైకాపా నాయకుడిపై బిగుస్తున్న ఉచ్చు..?
[ 04-07-2024]
అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం, తెదేపా నాయకులపై బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో కాకినాడలోని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుపై ఉచ్చు బిగిస్తోంది. -
బదిలీల్లో అంతా అధర్మమే
[ 04-07-2024]
ధర్మాన్ని కాపాడాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖలో గత అయిదేళ్లు అధర్మం తాండవించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ