విన్నవించినా వైకాపా సర్కారు పట్టించుకోలేదు..
వైకాపా ప్రభుత్వ హయాంలో పలుమార్లు తిరిగినా సమస్యలు పరిష్కారం కాలేదంటూ పలువురు అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు
ఫిర్యాదుదారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న ఎస్పీ జగదీష్
రాజమహేంద్రవరం కలెక్టరేట్: వైకాపా ప్రభుత్వ హయాంలో పలుమార్లు తిరిగినా సమస్యలు పరిష్కారం కాలేదంటూ పలువురు అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి జనం తరలివచ్చారు. తమ సమస్యలపై అధికారులకు మొర వినిపించారు. మొత్తం 80 అర్జీలు రాగా వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.ప్రశాంతి చెప్పారు. పరిష్కారం చూపే విషయంలో సంబంధిత అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని, నిర్లక్ష్యం చేయవద్దని ఆదేశించారు.
న్యాయం చేయాలంటూ లస్కర్ వేడుకోలు: నీటి పారుదల శాఖలో ఎనిమిదేళ్లపాటు పొరుగు సేవల విధానంలో లస్కర్గా పనిచేసిన తనను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని, ఆ పోస్టును వేరొకరికి అమ్ముకుని తనకు ఉపాధి దూరం చేశారని చిట్టాల శేషునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై గతంలో స్పందనలో, ఈ ఏడాది జనవరి 8న భీమవరం వచ్చిన అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డికి వినతిపత్రాలు అందించినా ఫలితంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు మరోమారు ఫిర్యాదు చేసేందుకు కుటుంబసభ్యులతో కలిసి కలెక్టరేట్కు వచ్చారు. చాలా మంది నాన్లోకల్గా పనిచేస్తున్నప్పటికీ తనను మాత్రమే తొలగించారని, ప్రతినెలా రూ.55 వేలు పింఛను తీసుకునే విశ్రాంత ఉద్యోగికి ఆ పోస్టును అమ్ముకున్నారని ఆరోపించారు. పది నెలల వేతనం బకాయి సైతం తనకు చెల్లించలేదన్నారు.
మరణానంతరం 1.20 ఎకరాల భూమి తనకు చెందేలా భర్త వీలునామా రాశారని, దీనికి పట్టాదారు పాసుపుస్తకం కోసం అనేకసార్లు తిరిగినా అధికారులు పట్టించుకోలేదని రంగంపేట మండలం ఈలకొలనుకు చెందిన మంగయ్యమ్మ అనే వృద్ధురాలు అర్జీ అందించారు. నీ సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, కూలిపని చేసుకుని జీవనం సాగించే తాము అద్దె కట్టుకోలేని స్థితిలో ఉన్నామని ధవళేశ్వరానికి చెందిన సత్య అనే మహిళ చెప్పారు. గత ప్రభుత్వంలో అనేకసార్లు అధికారులను కోరినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వినతులు వెంటనే పరిష్కరించాలి: ఎస్పీ
దానవాయిపేట(రాజమహేంద్రవరం): పబ్లిక్ గ్రీవెన్స్లో వచ్చే ప్రతి సమస్య వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ పి.జగదీష్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛాంబర్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇరవై అర్జీలు అందగా.. సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయా స్టేషన్ల సీఐలను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అనిల్కుమార్, డీఎస్పీలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా విజయం మీకే అంకితం
[ 04-07-2024]
నన్ను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా.. నేను కోరుకోని ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని ఇచ్చారు. ఆ విజయాన్ని మీకే అంకితం చేస్తున్నా..రాజ్యాంగ పదవులను గౌరవిస్తా.. ఆఖరి శ్వాస వరకు మీకు రుణపడి ఉంటాను. -
బుజ్జి వచ్చింది..
[ 04-07-2024]
ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ చిత్రంలో సందడిచేసిన ‘బుజ్జి’ వాహనమిది. దాదాపు ఆరుటన్నుల బరువు ఉండే ఈ మూడు చక్రాల భారీ కారు తయారీకి సుమారు రూ.7 కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది. -
గుట్టుగా.. గుత్తగా
[ 04-07-2024]
ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడంలేదు. కొద్దిరోజుల్లో కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తున్న తరుణంలో.. సందట్లో సడేమియాగా నిల్వ కేంద్రాల్లో ఉంచిన ఇసుక గుట్టలను ఓ వైపు కొందరు కరిగించేస్తున్నారు. -
కష్టకాలంలో అండగా నిలిచిన వారికి వందనం
[ 04-07-2024]
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆ సమయంలో మా కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు వందనం అంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
మోరంపూడి పైవంతెన పనుల వేగవంతానికి ఆదేశాలు
[ 04-07-2024]
మోరంపూడి పైవంతెన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. -
వైద్యవిద్యను వదిలేశారు..
[ 04-07-2024]
పతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ వైద్యకళాశాల కేటాయించి 150 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చామని.. బోధనాసుపత్రులుగా మార్చి రోగులకు ఎంతో మేలు చేశామని గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతూ ఏర్పాటు చేసిన వైద్యకళాశాలలు ఆరంభశూరత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయి -
మగువా.. అందుకో రుణం
[ 04-07-2024]
అధికారం చేపట్టింది మొదలు అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా స్వయం సహాయక సంఘాలకు అండగా నిలిచేందుకు, మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. -
మెట్టలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు
[ 04-07-2024]
ఉమ్మడి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలకు పైబడి సాగునీరుతో పాటు ఉత్తరాంధ్రకు తాగునీరు అందించే లక్ష్యంతో గోదావరి ఎడమగట్టున ఉన్న ఎత్తిపోతల పథకాలను ప్రారంభించామని జలవనరులశాఖమంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
సదరం నమోదుకు వేళాయె..
[ 04-07-2024]
ఉమ్మడి జిల్లాలో మొత్తం 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదరం శిబిరాలు నిర్వహిస్తారు. గతంలో మంగళ, శుక్రవారాలు ఉంటే ప్రస్తుతం వాటిని సోమ, గురువారాలు నిర్వహిస్తున్నారు. -
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు జవసత్వాలు
[ 04-07-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో యువత ఉద్యోగాల సాధనపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల సంఖ్య తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. -
వైకాపా నాయకుడిపై బిగుస్తున్న ఉచ్చు..?
[ 04-07-2024]
అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం, తెదేపా నాయకులపై బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో కాకినాడలోని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుపై ఉచ్చు బిగిస్తోంది. -
బదిలీల్లో అంతా అధర్మమే
[ 04-07-2024]
ధర్మాన్ని కాపాడాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖలో గత అయిదేళ్లు అధర్మం తాండవించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ
-
కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి ఫొటోలు