పవన్ కల్యాణ్ అనే నేను..
‘‘పవన్కల్యాణ్ అనే నేను.. అని ప్రమాణం చేస్తున్నప్పుడు అన్నయ్య చిరంజీవి తప్ప.. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరూ చూడలేకపోయారు. ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు’’ అని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ గుర్తుచేశారు.
పిఠాపురం అభివృద్ధికి తుదిశ్వాస వరకు పనిచేస్తా..
మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్
పవన్ కల్యాణ్ అనే నేను.. పిఠాపురం అభివృద్ధికి, అభ్యున్నతికి, ఆఖరి శ్వాస వరకు పనిచేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
- పిఠాపురం నియోజకవర్గ జనసేన సమావేశంలో పవన్కల్యాణ్ ప్రతిజ్ఞ
ఈనాడు, కాకినాడ, న్యూస్టుడే, గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి: ‘‘పవన్కల్యాణ్ అనే నేను.. అని ప్రమాణం చేస్తున్నప్పుడు అన్నయ్య చిరంజీవి తప్ప.. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరూ చూడలేకపోయారు. ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు’’ అని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ గుర్తుచేశారు. పిఠాపురం వేదికగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడంతో సభ దద్దరిల్లింది. గొల్లప్రోలులో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తొలిరోజు పర్యటనలో భాగంగా నియోజకవర్గ పార్టీ నాయకులు, వీర మహిళలు, వీర సైనికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బలమైన సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పిఠాపురం ప్రజలు చిరస్మరణీయమైన గొప్ప విజయం అందించారన్నారు. అన్ని బాలారిష్టాలు దాటుకుని జనసేన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు. సెంచరీ కొడితే ఎవరైనా మాట్లాడాలి, కానీ మనం 21 కొడితే అందరూ మాట్లాడుతున్నారని పవన్కల్యాణ్ అన్నారు. మనది 100 పర్సంట్ స్ట్రైక్రేట్ పార్టీ.. ఇది కార్యకర్తల విజయమని అన్నారు.
నేను మొండివాడిని..పవన్ కల్యాణ్ కార్యకర్తల సమావేశంలో ఓ వ్యక్తి ప్రసంగానికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడంతో అసహనం వ్యక్తం చేశారు. మీరు మీడియానా అని ప్రశ్నించారు. సమాధానం రాకపోవడంతో ఇది సభ సంస్కారం కాదు, ఆవేశం దేనికని వారించారు. పవన్కల్యాణ్ అనగానే అందరికీ చులకన అయిపోయింది. వీళ్లకు జగన్లాంటి నాయకుడే రైట్్. ఇంటర్వ్యూలు ఇవ్వడు. మాట్లాడితే కొడతాడు. బెదిరిస్తాడు. వాళ్లదగ్గర భయంగా, చేతులు కట్టుకుని ఉంటారు. మనం ప్రేమగా ఉంటామని చులకన అని వ్యాఖ్యానించారు. తాను గుండెల్లో పెట్టుకుని మర్యాద ఇస్తానన్నారు. భయాలు లేవని, మొండివాడినని, పట్టుబడితే వదలనని గుర్తుపెట్టుకోవాలన్నారు. పద్ధతిగా ఉండాలని, ప్రొటోకాల్ నియమాలు పాటించాలన్నారు. వ్యవస్థను నడపాల్సిన వ్యక్తిగా గట్టిగా ఉండక తప్పదన్నారు. పదే..పదే.. అసౌకర్యానికి గురి చేయడంతో ఉంటే ఉండండి, లేకపోతే వెళ్లిపోండి అన్నారు. సదరు వ్యక్తి మీడియా కాదని గుర్తించి పోలీసులు బయటకు తీసుకెళ్లారు.
ఫ్యాన్లు పక్కన పెట్టేశాం..
కార్యకర్తల సమావేశంలో ఉక్కపోతగా ఉండటంపై పవన్ మాట్లాడుతూ ఫ్యాన్లు తీసేశాం, ఏసీలే ఉన్నాయ్.. అనగానే సభలో నవ్వులు విరిశాయి. నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. ఈ ప్రాంతం రూపు మారితే ఉపాధి, ఉద్యోగాలకు కొదవ లేదన్నారు. పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున తనను ఊరేగించండి అన్నారు.
మీ కష్టం చూసి కన్నీళ్లొచ్చాయి..
తనను, జనసేనను గెలిపించడానికి మీరు పడ్డ కష్టం చూస్తే కన్నీళ్లు వచ్చాయని పవన్కల్యాణ్ అన్నారు. ఆస్ట్రేలియా, ఇతర దేశాల నుంచి సొంత ఖర్చులతో వచ్చి తిరిగారన్నారు. మీ ప్రేమకు ఎన్నిసార్లు శిరసు వంచి నమస్కరించినా సరిపోదని ఉద్వేగానికి గురయ్యారు. మీరు పార్టీకే కాదు, 5కోట్ల మంది ప్రజలకు ధైర్యాన్నిచ్చారన్నారు. ఇంత చేసిన మీకోసం ఎంతైనా కష్టపడతానని భరోసా ఇచ్చారు. తెలంగాణ వాళ్లు కూడా నన్ను రమ్మంటున్నారని పవన్ అన్నారు. వెళ్లొద్దని.. కార్యకర్తలు నినాదాలు చేశారు. అక్కున చేర్చుకున్న పిఠాపురాన్ని వదిలి వెళ్తానా? అని అన్నారు. జనసేన జాతీయ అధికార ప్రతినిధి అజయ్కుమార్, నియోజకవర్గ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదేం వి‘చిత్రం’.. నవ్విపోరా జనం..!
[ 03-07-2024]
రాష్ట్రంలో ఎన్టీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. నేటికీ గత వైకాపా ప్రభుత్వ లోగోలు, చిత్రాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. అమలాపురంలోని ప్రాంతీయ ఆసుపత్రి భవనానికి గతంలో వేసిన మాజీ సీఎంలు వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డి చిత్రాలతో ఉండే నవరత్నాలు లోగోలు మంగళవారం దర్శనమిచ్చాయి. -
ద్వారంపూడి మార్కు అరాచకం
[ 03-07-2024]
వైకాపా పాలనలో గత అయిదేళ్ల కాలంలో కాకినాడ నగరంలో ప్రభుత్వానివే కాదు ప్రైవేట్ ఆస్తులకూ రక్షణ లేకుండా పోయింది. నేతల అండ చూసుకొని కబ్జాదారులు రెచ్చిపోయారు. తమ పూర్వీకుల సొత్తు మాదిరి మున్సిపల్ స్థలాలను అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అన్నివేళలా ఈ పప్పులు ఉడకవు. ప్రభుత్వం మారింది. -
పల్లె గడపకు స్వచ్ఛ జలాలు
[ 03-07-2024]
కాకినాడ కలెక్టరేట్లో మంగళవారం నాలుగు గంటలపాటు కీలక శాఖలతో ఉపముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ, శాస్త్ర- సాంకేతిక, జిల్లా పరిషత్తు తదితర అంశాలపై సమీక్షించి బడ్జెట్ కేటాయింపులు.. చేపట్టిన, చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. -
మెట్ట రైతుకు గోదావరి జలాలు
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో వదిలేసిన ఎత్తిపోతల పథకాల పనులను కూటమి ప్రభుత్వం రాగానే యుద్ధప్రాతిపదికన చేయించి జులై మొదటి వారంలోనే సాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. -
భూహక్కు పత్రాల ఉపసంహరణకు రంగం సిద్ధం
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం కింద చేపట్టిన భూ రీసర్వేపై జిల్లాలో అనేక ఆందోళనలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. సర్వేలో లోపాలున్నాయని, రీ సర్వేతో తమ భూమి తగ్గిపోయిందని అనేకమంది రైతులు, భూ యాజమానులు గగ్గోలు పెట్టినా వైకాపా పాలకులు పట్టించుకోలేదు. -
సహకార సంఘాల ప్రక్షాళన షురూ..!
[ 03-07-2024]
సహకార సంఘాల్లో ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా మొదటి దశ కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటివరకు వైకాపా ప్రభుత్వ హయాంలో పాలన సాగించిన త్రిసభ్య కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో పర్సన్ ఇన్ఛార్జి వ్యవస్థను కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. -
నిధులు రావాల.. బాగుపడాల
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని విస్మరించడంతో అవి ఏటేటా క్షీణదశకు చేరుకుని అత్యంత దారుణంగా తయారయ్యాయి. గుంతలుపడి వర్షపునీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అలాంటి రహదారులకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలంటే సుమారు రూ.400 కోట్ల నిధులు కావాలి. -
వైకాపాకు కోటలు.. విద్యార్థుల ఆశలకు బీటలు..
[ 03-07-2024]
గడిచిన అయిదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవ, విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసి.. సొంత కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టింది. -
వీడని కోత.. తప్పని వెత..!
[ 03-07-2024]
కాకినాడ జిల్లాలోనే యు.కొత్తపల్లికి ప్రత్యేక స్థానం ఉంది.. ఇక్కడి ఉప్పాడ చీరలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండటమే కారణం. అలాంటి ఈ మండలంలో రెండు కీలక సమస్యలు మత్స్యకారులను వేధిస్తున్నాయి.. అందులో సముద్ర కోత తీరని వ్యథగా మారగా, ఫిషింగ్ హార్బర్ పనుల అసంపూర్తి గంగపుత్రులను మరింత ఇబ్బంది పెడుతోంది. -
నాణ్యతకు తిలోదకాలు
[ 03-07-2024]
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది జేఎన్టీయూకేలో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరు. నాణ్యత పాటిస్తూ దాని గురించి కాబోయే ఇంజినీర్లకు వివరించాల్సిన అధికారులే నాణ్యతకు తిలోదకాలిస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారు. -
టీచ్ టూల్తో బోధనలో నైపుణ్యం
[ 03-07-2024]
ఉపాధ్యాయుల బోధన పద్ధతిని ఒక నమూనాలో మదింపు చేసేందుకు టీచ్ టూల్ని ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు చెప్పారు. -
భవనం ఖాళీ చేయించారు.. న్యాయం చేయండి
[ 03-07-2024]
కాకినాడ నగరంలోని సత్యప్రసన్ననగర్ భాస్కర్ ఎస్టేట్స్ బాధితులు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. తామెంతో కష్టపడి బిల్డర్ ద్వారా బహుళ అంతస్తు భవనాన్ని నిర్మించుకున్నామని, అది కుంగిపోయిందనే నెపంతో అయిదేళ్ల కింద ఖాళీ చేయించారని వాపోయారు. -
అయిదేళ్లు నిద్రపోయారు.. గుంతల రోడ్లు మిగిల్చారు..
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయాలు నిర్మించుకొనేందుకు పెట్టిన శ్రద్ధ రహదారుల మరమ్మతులకు పెట్టకపోవడంతో ప్రస్తుతం రహదారులు రూపురేఖలు కోల్పాయాయి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి భర్తను అంతమొందించిన భార్య
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!
-
రక్తంతో రాసిన కథ ‘మీర్జాపూర్’.. మూడో సీజన్ వస్తోంది!
-
అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
-
సెన్సెక్స్ @ 80,000.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ