వైద్యులు అంకితభావంతో సేవలందించాలి
వైద్యులు అంకితభావంతో సేవలందించాలని ప్రముఖ అంకాలజిస్ట్ పద్మశ్రీ డా.నోరి దత్తాత్రేయుడు అన్నారు
పద్మశ్రీ డా.నోరి దత్తాత్రేయుడు
వైద్యసిబ్బందిని సత్కరిస్తున్న డా.నోరి, తదితరులు
రాజానగరం, రాజమహేంద్రవరం వైద్యం, న్యూస్టుడే: వైద్యులు అంకితభావంతో సేవలందించాలని ప్రముఖ అంకాలజిస్ట్ పద్మశ్రీ డా.నోరి దత్తాత్రేయుడు అన్నారు. రాజానగరం సమీపంలోని జీఎస్ఎల్ వైద్యకళాశాల, జనరల్ ఆసుపత్రిలో డాక్టర్స్ డే సందర్భంగా సోమవారం నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆయన యువ వైద్యులు, వైద్య విద్యార్థులకు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. జీఎస్ఎల్ వైద్యకళాశాల, జనరల్ ఆసుపత్రి నెలకొల్పి 20 ఏళ్లు అయిన సందర్భంగా అప్పటినుంచి సంస్థలో పనిచేస్తున్న డాక్టర్లు, ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది వంద మందిని దుశ్శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. అంతర్జాతీయ ఫుడ్ సర్వీసుల సంస్థ సొడెక్సో ‘జీఎస్ఎల్ అమ్మ భోజన’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. రోగులకు శుచిగా, రుచిగా రూ.10కే అందజేస్తున్నామని, దీనికయ్యే ఖర్చులో కొంతభాగం రాయితీ రూపంలో భరిస్తున్నట్లు విద్యాసంస్థల ఛైర్మన్ డా.గన్ని భాస్కరరావు వివరించారు. ఆసుపత్రి, కళాశాలలో అన్ని విభాగాలను డా.నోరి సందర్శించారు. అంతకుముందు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొగ తాగడం, పొగాకు నమలడం మానేయడం, ముందస్తు వైద్యపరీక్షల ద్వారా క్యాన్సర్ను 98 శాతం నివారించుకోవచ్చని పేర్కొన్నారు. కొందరు పొగాకు నమలడం, పొగతాగడం వంటివి గత కొన్నేళ్లుగా చేస్తున్నామని, ఇప్పటికిప్పుడు మానేస్తే ప్రయోజనం ఉండదని భావిస్తున్నారని, అది వాస్తవం కాదన్నారు. ఆ దురలవాట్లను మానేస్తే శరీరంలో క్యాన్సర్ కారకాల పెరుగుదల నిలిచిపోతుందన్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉంటే కుటుంబ సభ్యులు ముందస్తుగా వైద్యపరీక్షలు చేయించుకోవాలన్నారు. ఒకచోట పరీక్ష చేయించుకున్నాక దానిని నిర్ధారిం
చుకోవడానికి రెండో అభిప్రాయం తీసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్, సర్జికల్ అంకాలజిస్ట్ డా.తరుణ్ గోగినేని, రేడియేషన్ అంకాలజిస్ట్ డా.పీబీ ఆనందరావు, జీఎస్ఎల్ ఆసుపత్రుల మెడికల్ సూపరింటెండెంట్లు
డా.వేణుగోపాల్, బ్రిగేడియర్ డా.టీవీఎస్పీ మూర్తి, ప్రిన్సిపల్ మేజర్ జనరల్ డా.వి.గురునాథ్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తెదేపా నాయకుడు
గన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అవగాహన పెంచుకుంటే క్యాన్సర్ నిర్మూలన సాధ్యం
ప్రజలు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుని వ్యాధిపై అవగాహన పెంచుకుంటేనే క్యాన్సర్ నిర్మూలన సాధ్యమవుతుందని డాక్టర్ దత్తాత్రేయుడు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జీఎస్ఎల్ క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించి కొత్తగా ఏర్పాటు చేసిన మూడు క్యాన్సర్ చికిత్స యూనిట్లను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో అత్యున్నత పరికరాలు, నైపుణ్యం కలిగిన ఆసుపత్రి ఇది అని కొనియాడారు. గ్రామీణ ప్రాంతంలో అత్యంత ఆధునిక వైద్యచికిత్స పరికరాలను ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన డా.గన్ని భాస్కరరావును ఆయన అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా విజయం మీకే అంకితం
[ 04-07-2024]
నన్ను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా.. నేను కోరుకోని ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని ఇచ్చారు. ఆ విజయాన్ని మీకే అంకితం చేస్తున్నా..రాజ్యాంగ పదవులను గౌరవిస్తా.. ఆఖరి శ్వాస వరకు మీకు రుణపడి ఉంటాను. -
బుజ్జి వచ్చింది..
[ 04-07-2024]
ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ చిత్రంలో సందడిచేసిన ‘బుజ్జి’ వాహనమిది. దాదాపు ఆరుటన్నుల బరువు ఉండే ఈ మూడు చక్రాల భారీ కారు తయారీకి సుమారు రూ.7 కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది. -
గుట్టుగా.. గుత్తగా
[ 04-07-2024]
ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడంలేదు. కొద్దిరోజుల్లో కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తున్న తరుణంలో.. సందట్లో సడేమియాగా నిల్వ కేంద్రాల్లో ఉంచిన ఇసుక గుట్టలను ఓ వైపు కొందరు కరిగించేస్తున్నారు. -
కష్టకాలంలో అండగా నిలిచిన వారికి వందనం
[ 04-07-2024]
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆ సమయంలో మా కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు వందనం అంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
మోరంపూడి పైవంతెన పనుల వేగవంతానికి ఆదేశాలు
[ 04-07-2024]
మోరంపూడి పైవంతెన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. -
వైద్యవిద్యను వదిలేశారు..
[ 04-07-2024]
పతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ వైద్యకళాశాల కేటాయించి 150 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చామని.. బోధనాసుపత్రులుగా మార్చి రోగులకు ఎంతో మేలు చేశామని గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతూ ఏర్పాటు చేసిన వైద్యకళాశాలలు ఆరంభశూరత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయి -
మగువా.. అందుకో రుణం
[ 04-07-2024]
అధికారం చేపట్టింది మొదలు అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా స్వయం సహాయక సంఘాలకు అండగా నిలిచేందుకు, మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. -
మెట్టలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు
[ 04-07-2024]
ఉమ్మడి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలకు పైబడి సాగునీరుతో పాటు ఉత్తరాంధ్రకు తాగునీరు అందించే లక్ష్యంతో గోదావరి ఎడమగట్టున ఉన్న ఎత్తిపోతల పథకాలను ప్రారంభించామని జలవనరులశాఖమంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. -
సదరం నమోదుకు వేళాయె..
[ 04-07-2024]
ఉమ్మడి జిల్లాలో మొత్తం 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదరం శిబిరాలు నిర్వహిస్తారు. గతంలో మంగళ, శుక్రవారాలు ఉంటే ప్రస్తుతం వాటిని సోమ, గురువారాలు నిర్వహిస్తున్నారు. -
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు జవసత్వాలు
[ 04-07-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో యువత ఉద్యోగాల సాధనపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల సంఖ్య తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. -
వైకాపా నాయకుడిపై బిగుస్తున్న ఉచ్చు..?
[ 04-07-2024]
అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం, తెదేపా నాయకులపై బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో కాకినాడలోని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుపై ఉచ్చు బిగిస్తోంది. -
బదిలీల్లో అంతా అధర్మమే
[ 04-07-2024]
ధర్మాన్ని కాపాడాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖలో గత అయిదేళ్లు అధర్మం తాండవించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్
-
వివేకా హత్య కేసులో కీలక సాక్షి రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం
-
కన్నబిడ్డ కసిరింది.. కన్నపేగు కుమిలింది
-
ఆరు నెలల చిన్నారి చికిత్సకు.. ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు
-
క్షమించండి.. నెలలో తిరిగిస్తా.. ఉత్తరం రాసి చోరీకి పాల్పడ్డ దొంగ
-
తూర్పుగోదావరి జిల్లాలో ప్రాణం నిలిపిన పింఛను!