పల్లె మురవాలి.. ప్రగతి విరియాలి
పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ విజయాన్ని అందుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ- పర్యావరణం, శాస్త్ర-సాంకేతిక శాఖల మంత్రి హోదాలో జిల్లాకు వస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రిపై జిల్లావాసుల కోటి ఆశలు
బాధ్యతలు చేపట్టాక తొలిసారి జనసేనాని రాక నేడు
జగనన్న కాలనీ కోసం దుమ్ములపేట శివారులో మడ అడవులను ధ్వంసం చేసిన ప్రాంతం
పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ విజయాన్ని అందుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ- పర్యావరణం, శాస్త్ర-సాంకేతిక శాఖల మంత్రి హోదాలో జిల్లాకు వస్తున్నారు. ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాలో పలు సభల్లో స్థానిక సమస్యలపై గళమెత్తిన జనసేనాని అధికారంలోకి రాగానే పరిష్కారం చూపుతామని ప్రజల్లో భరోసా నింపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి జిల్లాకు పవన్కల్యాణ్ వస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం కాకినాడ జిల్లాకు రానున్నారు. పర్యవేక్షిస్తున్న శాఖల్లోని సమస్యలతోపాటు ఉమ్మడి జిల్లాలో అయిదేళ్ల వైకాపా పాలనలో గాడితప్పిన పరిస్థితులూ చక్కదిద్దాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
హరిత వనాలకు ఊపిరినివ్వాలి
అయిదేళ్ల వైకాపా పాలనలో వనాల విధ్వంసం, పర్యావరణ విఘాతం ఇష్టారీతిన సాగింది.
- కాకినాడ శివారు దుమ్ములపేటలో 90 ఎకరాల విస్తీర్ణంలో మడ అడవులు ఉంటే.. 58 ఎకరాల్లో నరికేసి.. ఈ ప్రాంతాన్ని లేఔట్గా మార్చేశారు.
- అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం, కాట్రేనికోన మండలాల్లోని వందల ఎకరాల చిత్తడి నేలల్లోని మడ వనాలు ధ్వంసం చేసి కొందరు ఆక్వా సాగు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ మండలంలో రక్షిత అటవీప్రాంతం లేదంటూ దాటేస్తున్నారే తప్ప పచ్చదనాన్ని కాపాడే చొరవ చూపడంలేదు.
- తాళ్లరేవు మండలంలోని కోరింగ అభయారణ్యం విభిన్న జీవరాశులకు ఆవాసం. ఇక్కడ సారా తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. వనాలు ధ్వంసం చేసి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుస్తున్నా చర్యలు లేవు.
చుట్టూ నీరే.. తాగాలంటే బేజారే..
అందుబాటులో గోదావరి ఉన్నా నేటికీ పూర్తిస్థాయి నీరు అందని పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో పంచాయతీల్లో 2,277 ఆవాస ప్రాంతాలుంటే.. అందులో 1,454 ఆవాసాలకు మాత్రమే రక్షిత మంచి నీటి అందుతోంది. మిగిలినచోట్ల ఇతర పథకాల్లో నీటిని అందిస్తున్నారు. ఇంటింటికీ స్వచ్ఛమైన నీరు అందించే లక్ష్యం నిధుల లేమితో నెరవేరడంలేదు. ్య జల్జీవన్ మిషన్ ప్రాజెక్టును రూ.1,203 కోట్లతో ఏర్పాటు చేయాలన్న లక్ష్యం సాకారం కాలేదు. గుత్తేదారులు చేసిన పనులకు రూ.83 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ్య తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.4,500 కోట్లతో ప్రతిపాదించిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును.. వైకాపా ప్రభుత్వం వచ్చాక రూ.1,650 కోట్లకు కుదించింది. అయినా ఇది పట్టాలెక్కలేదు. 20.81 లక్షల మందికి స్వచ్ఛ జలాలు అందించే ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది. మేఘ ఇంజినీరింగ్ సంస్థ 2025 జూన్ 25 నాటికి పనులు పూర్తిచేయాల్సి ఉన్నా ఇంకా మొదలు కాకపోవడం ప్రశ్నార్థకంగా మారింది.
దారులు ధ్వంసం చేసి పడేశారు..
వైకాపా పాలనలో గ్రామీణ రహదారులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఎక్కడికక్కడ గుంతలు పడి ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయినా పరిస్థితి చక్కదిద్దే చొరవ మాత్రం చూపలేదు. తాత్కాలిక, శాశ్వత మరమ్మతులకు పంపిన ప్రతిపాదనలకు గత ప్రభుత్వంలో మోక్షం దక్కలేదు. గనుల అక్రమ తవ్వకాలు, తరలింపు క్రమంలో భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు నాశనమైనా పట్టించుకోలేదు.
పి.గన్నవరం మండలం ముంగండ నుంచి ఇసుకపూడి వెళ్లే మార్గం సగానికిపైగా దెబ్బతిన్నా చర్యల్లేవు. మానేపల్లి ఏటిగట్టు నుంచి శివాయిలంక రోడ్డు, పప్పులవారిపాలెం నుంచి కుందాలపల్లి మీదుగా వెళ్లే దారులు దెబ్బతిన్నా చక్కదిద్దే చర్యలు లేవు.
ప్రోత్సహిస్తే.. శాస్త్ర- సాంకేతిక ఫలాలు
అంబాజీపేటలో 1955లో కొబ్బరి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ప్రస్తుతం 22 రకాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. కొబ్బరికి ఊతమిచ్చి.. సస్యరక్షణ, నాణ్యత, దిగుబడి, ఆదాయం పెంపు తదితర అంశాలపై దృష్టిపెడితే.. 60 వేల మంది రైతులకు, లక్ష మంది కార్మికులకు ఊతమిచ్చినట్లవుతుంది. ్య కాకినాడలోని జగన్నాథపురంలో రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (ఎస్ఐఎఫ్టీ) ఉంది. ఇక్కడ పీసీఆర్, మైక్రో బయాలజీ, హిస్టోపెథాలజీ, నీరు- మట్టి పరీక్షలు, ఫీడ్ ఎనాలసిస్ తదితర ల్యాబ్ల సామర్థ్యం పెంచుతూ ప్రోత్సహించాల్సి ఉంది.
ఈనాడు, కాకినాడ
పల్లె పల్లెలో సమస్యల సిత్రాలే..
పల్లెకు అయిదేళ్లూ ప్రభుత్వ ప్రోత్సాహమే లేదు. ఊతమివ్వాల్సిందిపోయి పంచాయతీ గల్లాపెట్టె సైతం వైకాపా సర్కారు ఖాళీచేసిన పరిస్థితి. ్య తెదేపా ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన సంపద సృష్టికేంద్రాలు వైకాపా అధికారంలోకి వచ్చాక మూలనపడ్డాయి. కాకినాడ జిల్లాలో 277, తూగో జిల్లాలో 257, కోనసీమ జిల్లాలో 256 కేంద్రాలు నిర్మించారు. వీటిని వినియోగించకుండా.. గ్రామాల్లో రోడ్ల పక్కనే చెత్త కుప్పలుగా పోస్తున్నారు. దీంతో వ్యాధులు ప్రబలుతున్నాయి.
కాకినాడ గ్రామీణ మండలం పండూరు వద్ద చెత్త నుంచి సంపద కేంద్రం వద్ద ఇలా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వారంపూడి మార్కు అరాచకం
[ 03-07-2024]
వైకాపా పాలనలో గత అయిదేళ్ల కాలంలో కాకినాడ నగరంలో ప్రభుత్వానివే కాదు ప్రైవేట్ ఆస్తులకూ రక్షణ లేకుండా పోయింది. నేతల అండ చూసుకొని కబ్జాదారులు రెచ్చిపోయారు. తమ పూర్వీకుల సొత్తు మాదిరి మున్సిపల్ స్థలాలను అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అన్నివేళలా ఈ పప్పులు ఉడకవు. ప్రభుత్వం మారింది. -
పల్లె గడపకు స్వచ్ఛ జలాలు
[ 03-07-2024]
కాకినాడ కలెక్టరేట్లో మంగళవారం నాలుగు గంటలపాటు కీలక శాఖలతో ఉపముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ, శాస్త్ర- సాంకేతిక, జిల్లా పరిషత్తు తదితర అంశాలపై సమీక్షించి బడ్జెట్ కేటాయింపులు.. చేపట్టిన, చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. -
మెట్ట రైతుకు గోదావరి జలాలు
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో వదిలేసిన ఎత్తిపోతల పథకాల పనులను కూటమి ప్రభుత్వం రాగానే యుద్ధప్రాతిపదికన చేయించి జులై మొదటి వారంలోనే సాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. -
భూహక్కు పత్రాల ఉపసంహరణకు రంగం సిద్ధం
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం కింద చేపట్టిన భూ రీసర్వేపై జిల్లాలో అనేక ఆందోళనలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. సర్వేలో లోపాలున్నాయని, రీ సర్వేతో తమ భూమి తగ్గిపోయిందని అనేకమంది రైతులు, భూ యాజమానులు గగ్గోలు పెట్టినా వైకాపా పాలకులు పట్టించుకోలేదు. -
సహకార సంఘాల ప్రక్షాళన షురూ..!
[ 03-07-2024]
సహకార సంఘాల్లో ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా మొదటి దశ కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటివరకు వైకాపా ప్రభుత్వ హయాంలో పాలన సాగించిన త్రిసభ్య కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో పర్సన్ ఇన్ఛార్జి వ్యవస్థను కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. -
నిధులు రావాల.. బాగుపడాల
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని విస్మరించడంతో అవి ఏటేటా క్షీణదశకు చేరుకుని అత్యంత దారుణంగా తయారయ్యాయి. గుంతలుపడి వర్షపునీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అలాంటి రహదారులకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలంటే సుమారు రూ.400 కోట్ల నిధులు కావాలి. -
వైకాపాకు కోటలు.. విద్యార్థుల ఆశలకు బీటలు..
[ 03-07-2024]
గడిచిన అయిదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవ, విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసి.. సొంత కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టింది. -
వీడని కోత.. తప్పని వెత..!
[ 03-07-2024]
కాకినాడ జిల్లాలోనే యు.కొత్తపల్లికి ప్రత్యేక స్థానం ఉంది.. ఇక్కడి ఉప్పాడ చీరలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండటమే కారణం. అలాంటి ఈ మండలంలో రెండు కీలక సమస్యలు మత్స్యకారులను వేధిస్తున్నాయి.. అందులో సముద్ర కోత తీరని వ్యథగా మారగా, ఫిషింగ్ హార్బర్ పనుల అసంపూర్తి గంగపుత్రులను మరింత ఇబ్బంది పెడుతోంది. -
నాణ్యతకు తిలోదకాలు
[ 03-07-2024]
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది జేఎన్టీయూకేలో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరు. నాణ్యత పాటిస్తూ దాని గురించి కాబోయే ఇంజినీర్లకు వివరించాల్సిన అధికారులే నాణ్యతకు తిలోదకాలిస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారు. -
టీచ్ టూల్తో బోధనలో నైపుణ్యం
[ 03-07-2024]
ఉపాధ్యాయుల బోధన పద్ధతిని ఒక నమూనాలో మదింపు చేసేందుకు టీచ్ టూల్ని ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు చెప్పారు. -
భవనం ఖాళీ చేయించారు.. న్యాయం చేయండి
[ 03-07-2024]
కాకినాడ నగరంలోని సత్యప్రసన్ననగర్ భాస్కర్ ఎస్టేట్స్ బాధితులు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. తామెంతో కష్టపడి బిల్డర్ ద్వారా బహుళ అంతస్తు భవనాన్ని నిర్మించుకున్నామని, అది కుంగిపోయిందనే నెపంతో అయిదేళ్ల కింద ఖాళీ చేయించారని వాపోయారు. -
అయిదేళ్లు నిద్రపోయారు.. గుంతల రోడ్లు మిగిల్చారు..
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయాలు నిర్మించుకొనేందుకు పెట్టిన శ్రద్ధ రహదారుల మరమ్మతులకు పెట్టకపోవడంతో ప్రస్తుతం రహదారులు రూపురేఖలు కోల్పాయాయి.. -
ఇదేం వి‘చిత్రం’.. నవ్విపోరా జనం..!
[ 03-07-2024]
రాష్ట్రంలో ఎన్టీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. నేటికీ గత వైకాపా ప్రభుత్వ లోగోలు, చిత్రాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. అమలాపురంలోని ప్రాంతీయ ఆసుపత్రి భవనానికి గతంలో వేసిన మాజీ సీఎంలు వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డి చిత్రాలతో ఉండే నవరత్నాలు లోగోలు మంగళవారం దర్శనమిచ్చాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి
-
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!