అడుగులు పడేనా?
టీ-20 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ విజయపతాకం ఎగురవేసింది. 2007 సుదీర్ఘ పోరాటం అనంతరం మళ్లీ 2024లో సత్తాచాటింది. యువ, సీనియర్ల కలయికతో ప్రపంచ కప్ పోటీల్లో అడుగుపెట్టిన భారత్ సెమీఫైనల్ (ఇంగ్లాండ్), ఫైనల్స్ (దక్షిణాఫ్రికా)లో చిరకాల ప్రత్యర్థులను మట్టి కరిపించింది.
జిల్లాలో క్రీడామండలి ఏర్పాటు ఎప్పుడు
వర్ధమాన క్రీడాకారుల ఎదురుచూపులు
క్రికెట్ ఆడుతున్న బాలలు
న్యూస్టుడే, శ్యామలాసెంటర్ : టీ-20 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ విజయపతాకం ఎగురవేసింది. 2007 సుదీర్ఘ పోరాటం అనంతరం మళ్లీ 2024లో సత్తాచాటింది. యువ, సీనియర్ల కలయికతో ప్రపంచ కప్ పోటీల్లో అడుగుపెట్టిన భారత్ సెమీఫైనల్ (ఇంగ్లాండ్), ఫైనల్స్ (దక్షిణాఫ్రికా)లో చిరకాల ప్రత్యర్థులను మట్టి కరిపించింది. ఈ విజయం నుంచి స్ఫూర్తి పొందుతున్న నేటి యువత తమ కల సాకారం చేసుకునేందుకు మైదానంలో కష్టపడు తున్నారు. జిల్లాలో అటువంటి సౌకర్యాలు లేక ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లి సాధన చేయాల్సి వస్తోంది. నూతన జిల్లాలుగా రూపాంతరం చెందిన తర్వాత అటువంటి క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేయాలని వర్ధమాన క్రీడా కారులు కోరుకుంటున్నారు.
తూర్పులో వెతుకులాట
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ను ఎక్కువగా ఆదరించే దేశాల్లో భారత్ మొదటి వరుసలో ఉంటుంది. గల్లీ నుంచి దిల్లీవరకు ప్రతిఒక్కరు ఆడుతుంటారు. రాష్ట్రంలో జిల్లా క్రికెట్ సంఘాల ఆధ్వర్యంలో క్రికెట్ను అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ మాత్రం శూన్యం. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలతో జిల్లా క్రికెట్ సంఘం ఒప్పందం చేసుకొని అక్కడి క్రీడా మైదానంలో క్రికెట్ను అభివృధ్ధి చేశారు. పచ్చని మైదానంతో పాటు ఆరు నెట్లు ఏర్పాటు చేశారు. కోనసీమ జిల్లా అంబాజీపేట ప్రభుత్వ పాఠశాలలో క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేశారు. దీంతో అక్కడి నుంచి క్రీడాకారులు రాష్ట్రసాయి, విజ్జీ ట్రోఫీ, రంజీ మ్యాచ్ల వరకు వెళుతున్నారు. బండారు అయ్యప్ప వంటి క్రీడాకారులు ఐపీఎల్ వరకు వెళ్లగలుగుతున్నారు. తూర్పులోనూ క్రికెట్ సంఘం స్థల సేకరణకు వెతుకులాట ప్రారంభించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీనికి కారణం ఆ సంఘ సభ్యులు లేకపోవడమే. మరోవైపు వర్గవిభేదాల కారణంగా అడుగులు పడలేదు.
గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం
మాజీ ఎంపీ మార్గని భరత్ పదేపదే రాజమహేంద్రవరంలో క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చి కనీసం స్థల సేకరణ కూడా చేయలేకపోయారు. నాగులచెరువు స్టేడియాన్ని క్రికెట్ స్టేడియంగా మారుస్తానని చెప్పినప్పటికీ ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. ఆర్ట్స్ కళాశాలలో నిర్మిస్తానని మరోసారి చెప్పగా అక్కడి విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించి ర్యాలీలు చేపట్టారు. దీంతో ఎంపీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కనీసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ సంఘ సహకారంతో స్థల సేకరణ చేసి ఇచ్చినా క్రికెట్ స్టేడియం నిర్మాణం జరిగేదని క్రీడాకారులు అంటున్నారు.
ముగ్గురు కోచ్లతో మమ
జిల్లాలో ఇప్పటివరకు జిల్లా క్రీడామండలి ఏర్పాటు కాలేదు. కేవలం ముగ్గురు కోచ్ల నియామకం చేసి చేతులు దులిపేసుకుంది. కోచ్లకు ఒక గదిని మాత్రమే కేటాయించి వదిలేశారు. క్రీడామండలి ఏర్పాటు చేయాలంటే కనీసం 20 నుంచి 30 ఎకరాల స్థలం కావాలి. అక్కడ అథ్లెటిక్ ట్రాక్తో పాటు మూడు ఇండోర్ స్టేడియాలు, స్విమ్మింగ్ పూల్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, బాస్కెట్బాల్, వాలీబాల్, వెయిట్లిఫ్టింగ్ వంటి క్రీడలకు కోర్టుల నిర్మాణం జరగాలి. ఒక్కో క్రీడకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో 20 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇప్పటివరకు గుర్తించలేదు. దీంతో జిల్లాలో క్రీడాభివృద్ధికి భీజాలు పడటం లేదు.
స్థలం కోసం నిరీక్షణ
జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి సంఘం కట్టుబడి ఉంది. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మైదానాలు ఏర్పాటు చేసినట్లే రాజమహేంద్రవరంలో కూడా ఏర్పాటుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కనీసం 5 ఎకరాల స్థలం లభ్యమైతే రాష్ట్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ను అభివృద్ధి చేస్తాం.
కె.సత్యనారాయణ, ఉమ్మడి జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి
ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు
జిల్లాలో క్రీడామండలి ఏర్పాటుకు గతంలో కలెక్టరు, జేసీ దృష్టికి తీసుకువెళ్లాం. స్థల సేకరణ జరగాల్సి ఉంది. రాజమహేంద్రవరం గ్రామీణంలో ఐదెకరాల స్థలాన్ని గుర్తించాం. అక్కడ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి నాయకులు, అధికారులు చొరవ చూపిస్తే స్టేడియం నిర్మాణం వేగంగా జరిగే అవకాశం ఉంది.
డి.శేషగిరి, జిల్లా ముఖ్య క్రీడా శిక్షకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వారంపూడి మార్కు అరాచకం
[ 03-07-2024]
వైకాపా పాలనలో గత అయిదేళ్ల కాలంలో కాకినాడ నగరంలో ప్రభుత్వానివే కాదు ప్రైవేట్ ఆస్తులకూ రక్షణ లేకుండా పోయింది. నేతల అండ చూసుకొని కబ్జాదారులు రెచ్చిపోయారు. తమ పూర్వీకుల సొత్తు మాదిరి మున్సిపల్ స్థలాలను అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అన్నివేళలా ఈ పప్పులు ఉడకవు. ప్రభుత్వం మారింది. -
పల్లె గడపకు స్వచ్ఛ జలాలు
[ 03-07-2024]
కాకినాడ కలెక్టరేట్లో మంగళవారం నాలుగు గంటలపాటు కీలక శాఖలతో ఉపముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ, శాస్త్ర- సాంకేతిక, జిల్లా పరిషత్తు తదితర అంశాలపై సమీక్షించి బడ్జెట్ కేటాయింపులు.. చేపట్టిన, చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. -
మెట్ట రైతుకు గోదావరి జలాలు
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో వదిలేసిన ఎత్తిపోతల పథకాల పనులను కూటమి ప్రభుత్వం రాగానే యుద్ధప్రాతిపదికన చేయించి జులై మొదటి వారంలోనే సాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. -
భూహక్కు పత్రాల ఉపసంహరణకు రంగం సిద్ధం
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం కింద చేపట్టిన భూ రీసర్వేపై జిల్లాలో అనేక ఆందోళనలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. సర్వేలో లోపాలున్నాయని, రీ సర్వేతో తమ భూమి తగ్గిపోయిందని అనేకమంది రైతులు, భూ యాజమానులు గగ్గోలు పెట్టినా వైకాపా పాలకులు పట్టించుకోలేదు. -
సహకార సంఘాల ప్రక్షాళన షురూ..!
[ 03-07-2024]
సహకార సంఘాల్లో ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా మొదటి దశ కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటివరకు వైకాపా ప్రభుత్వ హయాంలో పాలన సాగించిన త్రిసభ్య కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో పర్సన్ ఇన్ఛార్జి వ్యవస్థను కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. -
నిధులు రావాల.. బాగుపడాల
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని విస్మరించడంతో అవి ఏటేటా క్షీణదశకు చేరుకుని అత్యంత దారుణంగా తయారయ్యాయి. గుంతలుపడి వర్షపునీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అలాంటి రహదారులకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలంటే సుమారు రూ.400 కోట్ల నిధులు కావాలి. -
వైకాపాకు కోటలు.. విద్యార్థుల ఆశలకు బీటలు..
[ 03-07-2024]
గడిచిన అయిదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవ, విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసి.. సొంత కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టింది. -
వీడని కోత.. తప్పని వెత..!
[ 03-07-2024]
కాకినాడ జిల్లాలోనే యు.కొత్తపల్లికి ప్రత్యేక స్థానం ఉంది.. ఇక్కడి ఉప్పాడ చీరలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండటమే కారణం. అలాంటి ఈ మండలంలో రెండు కీలక సమస్యలు మత్స్యకారులను వేధిస్తున్నాయి.. అందులో సముద్ర కోత తీరని వ్యథగా మారగా, ఫిషింగ్ హార్బర్ పనుల అసంపూర్తి గంగపుత్రులను మరింత ఇబ్బంది పెడుతోంది. -
నాణ్యతకు తిలోదకాలు
[ 03-07-2024]
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది జేఎన్టీయూకేలో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరు. నాణ్యత పాటిస్తూ దాని గురించి కాబోయే ఇంజినీర్లకు వివరించాల్సిన అధికారులే నాణ్యతకు తిలోదకాలిస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారు. -
టీచ్ టూల్తో బోధనలో నైపుణ్యం
[ 03-07-2024]
ఉపాధ్యాయుల బోధన పద్ధతిని ఒక నమూనాలో మదింపు చేసేందుకు టీచ్ టూల్ని ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు చెప్పారు. -
భవనం ఖాళీ చేయించారు.. న్యాయం చేయండి
[ 03-07-2024]
కాకినాడ నగరంలోని సత్యప్రసన్ననగర్ భాస్కర్ ఎస్టేట్స్ బాధితులు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. తామెంతో కష్టపడి బిల్డర్ ద్వారా బహుళ అంతస్తు భవనాన్ని నిర్మించుకున్నామని, అది కుంగిపోయిందనే నెపంతో అయిదేళ్ల కింద ఖాళీ చేయించారని వాపోయారు. -
అయిదేళ్లు నిద్రపోయారు.. గుంతల రోడ్లు మిగిల్చారు..
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయాలు నిర్మించుకొనేందుకు పెట్టిన శ్రద్ధ రహదారుల మరమ్మతులకు పెట్టకపోవడంతో ప్రస్తుతం రహదారులు రూపురేఖలు కోల్పాయాయి.. -
ఇదేం వి‘చిత్రం’.. నవ్విపోరా జనం..!
[ 03-07-2024]
రాష్ట్రంలో ఎన్టీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. నేటికీ గత వైకాపా ప్రభుత్వ లోగోలు, చిత్రాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. అమలాపురంలోని ప్రాంతీయ ఆసుపత్రి భవనానికి గతంలో వేసిన మాజీ సీఎంలు వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డి చిత్రాలతో ఉండే నవరత్నాలు లోగోలు మంగళవారం దర్శనమిచ్చాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి
-
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!