logo

జీఎస్‌ఎల్‌కు ప్రముఖ వైద్యులు దత్తాత్రేయుడు రాక నేడు

జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాల, జనరల్‌ ఆస్పత్రి 20వ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లాకు చెందిన, న్యూయార్క్‌ నివాసి, సుప్రసిద్ధ రేడియేషన్‌ అంకాలజిస్ట్‌ డా.నోరి దత్తాత్రేయుడు ప్రత్యేక అతిథిగా వస్తున్నారని వైద్య విద్యా సంస్థల చైర్మన్‌ డా.గన్ని భాస్కరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 01 Jul 2024 04:32 IST

రాజానగరం: జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాల, జనరల్‌ ఆస్పత్రి 20వ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లాకు చెందిన, న్యూయార్క్‌ నివాసి, సుప్రసిద్ధ రేడియేషన్‌ అంకాలజిస్ట్‌ డా.నోరి దత్తాత్రేయుడు ప్రత్యేక అతిథిగా వస్తున్నారని వైద్య విద్యా సంస్థల చైర్మన్‌ డా.గన్ని భాస్కరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం రాజమహేంద్రవరంలోని తమ క్యాన్సర్‌ ఆసుపత్రిలో ఓ యూనిట్‌ను ప్రారంభిస్తారన్నారు. రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలోని అన్ని విభాగాలను సందర్శిస్తారన్నారు. ఈ సందర్భంగా జీఎస్‌ఎల్‌ అమ్మ భోజనం పథకాన్ని ప్రారంభిస్తారని వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు