ఆనందంగా గడపాలని.. అంతలోనే అనంతలోకాలకు
సెలవురోజు కావడంతో మనుమడితో ఆనందంగా గడపాలని ఆ తాతయ్య అనుకున్నారు. ఇంకొన్ని నిమిషాల్లో ఇంటికి వెళ్లిపోతామనగా ఊహించని ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు.
లారీ ఢీకొని తాతా, మనుమడు దుర్మరణం
వీర్రాజు, ధనుష్ చంద్ర (పాత చిత్రాలు)
కొవ్వూరు పట్టణం: సెలవురోజు కావడంతో మనుమడితో ఆనందంగా గడపాలని ఆ తాతయ్య అనుకున్నారు. ఇంకొన్ని నిమిషాల్లో ఇంటికి వెళ్లిపోతామనగా ఊహించని ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం కొవ్వూరు ఒకటో వార్డు రాజీవ్కాలనీకి చెందిన మాసా వీర్రాజు(55)కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు సునందను కుమారదేవానికి చెందిన సుబ్రహ్మణ్యంతో వివాహమైంది. వారి కొడుకు ధనుష్ చంద్ర(12) ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఎప్పుడు సెలవులు వచ్చినా ధనుష్ను కొవ్వూరు తీసుకురావడం వీర్రాజుకు అలవాటు. అలాగే ఆదివారం ఉదయం ఆయన కుమారదేవం వెళ్లి, ఇద్దరూ కలిసి తిరుగు ప్రయాణమయ్యారు. ఆరికిరేవుల -కొవ్వూరు మధ్య పాశాలమ్మ గుడి దగ్గర ఎదురుగా వచ్చిన లారీ వీరి వాహనాన్ని ఢీకొంది. తాతా, మనుమడు తలలకు తీవ్ర గాయాలై మృతిచెందారు. పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు అక్కడకు చేరుకుని మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ధనుష్ తండ్రి సుబ్రహ్మణ్యం ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. కూలి పనులు చేసుకుని జీవించే వీర్రాజు భార్య నాగమణి ఏడాది క్రితం పాము కాటేయడంతో మృతి చెందారు.
దిల్లీ పోలీసులమన్నారు.. రూ.లక్షలు దోచుకున్నారు..
రాజమహేంద్రవరం నేరవార్తలు: మనీ లాండరింగ్ కేసులో మీ పేరు ఉందని దిల్లీ పోలీసుల పేరుతో వచ్చిన ఫోన్కాల్కు స్పందించిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.2.35 లక్షలు దోచుకున్న ఘటన రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వీరయ్యగౌడ్ తెలిపిన వివరాల మేరకు.. మున్సిపల్ కాలనీలో నివాసముంటున్న వ్యాపారి ఎన్.మతూషల ఫామ్రాజ్కు గత నెల 17న ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్కాల్ వచ్చింది. ‘‘దేశంలోనే అతిపెద్ద ఇల్లీగల్ నగదు లావాదేవీ జరిగింది.. అందులో మీ పేరు, ఆధార్ నంబరుతో ఉన్న ఓ బ్యాంకు ఖాతాలో రూ.3 కోట్లు ఉన్నాయి.. దానికి సంబంధించి దిల్లీ పోలీసులు మీకు ఫోన్ చేసి మాట్లాడతారు..’ అని భయభ్రాంతులకు గురిచేశాడు. అనంతరం పది నిమిషాల వ్యవధిలోనే ఫామ్రాజ్ వాట్సాప్కు ఓ వీడియో కాల్ వచ్చింది. అవతల పోలీసు దుస్తులతో ఉన్న వ్యక్తి తాను దిల్లీ ఐపీఎస్ అధికారినని పరిచయం చేసుకున్నాడు. మనీ లాండరింగ్ కేసులో దిల్లీ సీబీఐ పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేసి దిల్లీ తీసుకువెళ్తారని బెదిరించడం మొదలుపెట్టాడు. విచారణకు సహకరిస్తే అరెస్టు నుంచి తప్పించుకునే అవకాశం కల్పిస్తానని నమ్మబలికాడు. ముందుగా బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఆయన భార్య, కుటుంబీకుల బ్యాంకు ఖాతా, ఐఎఫ్సీ కోడ్తో సహా పూర్తి వివారాలు తీసుకున్నాడు. అనంతరం కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు పంపాలని సూచించాడు. బెదిరిపోయిన రాజ్ ఆ నగదు ఆన్లైన్లో జమచేశారు. మరో రెండు దఫాలుగా ఫోన్చేసి మరో రూ.1.85 లక్షలు వరకు జమ చేయించుకుని ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు 1930 సైబర్క్రైమ్ నంబరుకు గత నెలలో ఫిర్యాదు చేశారు. సైబర్క్రైమ్ వర్గాల సమాచారంతో ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదేం వి‘చిత్రం’.. నవ్విపోరా జనం..!
[ 03-07-2024]
రాష్ట్రంలో ఎన్టీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. నేటికీ గత వైకాపా ప్రభుత్వ లోగోలు, చిత్రాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. అమలాపురంలోని ప్రాంతీయ ఆసుపత్రి భవనానికి గతంలో వేసిన మాజీ సీఎంలు వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డి చిత్రాలతో ఉండే నవరత్నాలు లోగోలు మంగళవారం దర్శనమిచ్చాయి. -
ద్వారంపూడి మార్కు అరాచకం
[ 03-07-2024]
వైకాపా పాలనలో గత అయిదేళ్ల కాలంలో కాకినాడ నగరంలో ప్రభుత్వానివే కాదు ప్రైవేట్ ఆస్తులకూ రక్షణ లేకుండా పోయింది. నేతల అండ చూసుకొని కబ్జాదారులు రెచ్చిపోయారు. తమ పూర్వీకుల సొత్తు మాదిరి మున్సిపల్ స్థలాలను అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అన్నివేళలా ఈ పప్పులు ఉడకవు. ప్రభుత్వం మారింది. -
పల్లె గడపకు స్వచ్ఛ జలాలు
[ 03-07-2024]
కాకినాడ కలెక్టరేట్లో మంగళవారం నాలుగు గంటలపాటు కీలక శాఖలతో ఉపముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ, శాస్త్ర- సాంకేతిక, జిల్లా పరిషత్తు తదితర అంశాలపై సమీక్షించి బడ్జెట్ కేటాయింపులు.. చేపట్టిన, చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. -
మెట్ట రైతుకు గోదావరి జలాలు
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో వదిలేసిన ఎత్తిపోతల పథకాల పనులను కూటమి ప్రభుత్వం రాగానే యుద్ధప్రాతిపదికన చేయించి జులై మొదటి వారంలోనే సాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. -
భూహక్కు పత్రాల ఉపసంహరణకు రంగం సిద్ధం
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం కింద చేపట్టిన భూ రీసర్వేపై జిల్లాలో అనేక ఆందోళనలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. సర్వేలో లోపాలున్నాయని, రీ సర్వేతో తమ భూమి తగ్గిపోయిందని అనేకమంది రైతులు, భూ యాజమానులు గగ్గోలు పెట్టినా వైకాపా పాలకులు పట్టించుకోలేదు. -
సహకార సంఘాల ప్రక్షాళన షురూ..!
[ 03-07-2024]
సహకార సంఘాల్లో ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా మొదటి దశ కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటివరకు వైకాపా ప్రభుత్వ హయాంలో పాలన సాగించిన త్రిసభ్య కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో పర్సన్ ఇన్ఛార్జి వ్యవస్థను కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. -
నిధులు రావాల.. బాగుపడాల
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని విస్మరించడంతో అవి ఏటేటా క్షీణదశకు చేరుకుని అత్యంత దారుణంగా తయారయ్యాయి. గుంతలుపడి వర్షపునీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అలాంటి రహదారులకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలంటే సుమారు రూ.400 కోట్ల నిధులు కావాలి. -
వైకాపాకు కోటలు.. విద్యార్థుల ఆశలకు బీటలు..
[ 03-07-2024]
గడిచిన అయిదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవ, విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసి.. సొంత కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టింది. -
వీడని కోత.. తప్పని వెత..!
[ 03-07-2024]
కాకినాడ జిల్లాలోనే యు.కొత్తపల్లికి ప్రత్యేక స్థానం ఉంది.. ఇక్కడి ఉప్పాడ చీరలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండటమే కారణం. అలాంటి ఈ మండలంలో రెండు కీలక సమస్యలు మత్స్యకారులను వేధిస్తున్నాయి.. అందులో సముద్ర కోత తీరని వ్యథగా మారగా, ఫిషింగ్ హార్బర్ పనుల అసంపూర్తి గంగపుత్రులను మరింత ఇబ్బంది పెడుతోంది. -
నాణ్యతకు తిలోదకాలు
[ 03-07-2024]
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది జేఎన్టీయూకేలో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరు. నాణ్యత పాటిస్తూ దాని గురించి కాబోయే ఇంజినీర్లకు వివరించాల్సిన అధికారులే నాణ్యతకు తిలోదకాలిస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారు. -
టీచ్ టూల్తో బోధనలో నైపుణ్యం
[ 03-07-2024]
ఉపాధ్యాయుల బోధన పద్ధతిని ఒక నమూనాలో మదింపు చేసేందుకు టీచ్ టూల్ని ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు చెప్పారు. -
భవనం ఖాళీ చేయించారు.. న్యాయం చేయండి
[ 03-07-2024]
కాకినాడ నగరంలోని సత్యప్రసన్ననగర్ భాస్కర్ ఎస్టేట్స్ బాధితులు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. తామెంతో కష్టపడి బిల్డర్ ద్వారా బహుళ అంతస్తు భవనాన్ని నిర్మించుకున్నామని, అది కుంగిపోయిందనే నెపంతో అయిదేళ్ల కింద ఖాళీ చేయించారని వాపోయారు. -
అయిదేళ్లు నిద్రపోయారు.. గుంతల రోడ్లు మిగిల్చారు..
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయాలు నిర్మించుకొనేందుకు పెట్టిన శ్రద్ధ రహదారుల మరమ్మతులకు పెట్టకపోవడంతో ప్రస్తుతం రహదారులు రూపురేఖలు కోల్పాయాయి..