పవన్ రాకకు భారీ ఏర్పాట్లు
పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ జిల్లాలో మూడు రోజులు పర్యటించానున్నారు. ఇందులో భాగంగా సోమవారం పిఠాపురం రానున్నారు.
ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న డీఎస్పీ హనుమంతరావు
పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి: పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ జిల్లాలో మూడు రోజులు పర్యటించానున్నారు. ఇందులో భాగంగా సోమవారం పిఠాపురం రానున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు ఒక డీఎస్పీ, 8 మంది సీఐలు, 20మంది ఎస్సైలు, 200మంది సిబ్బంది, 8 రోప్ పార్టీలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. పవన్ కల్యాణ్ నివాసం వద్ద అర్జీలు స్వీకరణ ప్రత్యేక హెల్ప్ డెస్క్లు సిద్ధం చేశారు. పవన్ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తొలిసారి పిఠాపురం విచ్చేస్తున్న సందర్భంగా అభిమానులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
షెడ్యూల్లో స్వల్ప మార్పు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా పర్యటన షెడ్యూల్ల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 7.20 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయంలో దిగి, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో 9 గంటలకు గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలులో ఆయన నివాసానికి చేరుకుంటారు. 9.45 గంటలకు అక్కడ నుంచి గొల్లప్రోలులోని సత్యకృష్ణ ఫంక్షన్ హాల్కు వెళ్లి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకూ అక్కడే ఉంటారు. ఒంటి గంటకు తిరిగి చేబ్రోలులోని ఆయన నివాసానికి వెళ్తారు.
పింఛన్ల పంపిణీ వద్ద పటిష్ఠ బందోబస్తు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమవారం పింఛన్ల పంపిణీ చేసే సత్యకృష్ణ ఫ£ంక్షన్ హాలు వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. జనసేన జాతీయ అధికార ప్రతినిధి అజయ్ కుమార్తో కలిసి గొల్లప్రోలులోని ఆ కల్యాణ మండపం వద్ద ఏర్పాట్లను ఆదివారం పర్యవేక్షించారు. చేబ్రోలులోని పవన్ నివాసం వద్ద కూడా చెక్పోస్టు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనుమతి లేనిదే ఎవరినీ లోనికి పంపించేది లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
యు.కొత్తపల్లిలో కలెక్టర్ పర్యటన
ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్కల్యాణ్ పర్యటన నేపథ్యంలో ఆదివారం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి యు.కొత్తపల్లి మండలంలో పర్యటించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఉప్పాడ తీరానికి చేరుకున్న ఆయన ఆయా ప్రాంతాల్లో కోతకు గురైన ప్రదేశాలను పరిశీలించారు. స్థానిక మత్స్యకారులతో మాట్లాడి కోత ప్రభావం, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హార్బర్ నిర్మాణ పనులను పరిశీలించి స్థితిగతులను తెలుసుకున్నారు. బోటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. పిఠాపురం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. ఉప ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సభా వేదిక వద్ద ఎటువంటి తోపులాట జరగకుండా సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె.రమణి, ర.భ.శాఖ ఎస్ఈ క్రాంత్, జిల్లా మత్స్యశాఖ అధికారి కరుణాకర్, ఆర్డీవో ఇట్ల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదేం వి‘చిత్రం’.. నవ్విపోరా జనం..!
[ 03-07-2024]
రాష్ట్రంలో ఎన్టీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. నేటికీ గత వైకాపా ప్రభుత్వ లోగోలు, చిత్రాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. అమలాపురంలోని ప్రాంతీయ ఆసుపత్రి భవనానికి గతంలో వేసిన మాజీ సీఎంలు వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డి చిత్రాలతో ఉండే నవరత్నాలు లోగోలు మంగళవారం దర్శనమిచ్చాయి. -
ద్వారంపూడి మార్కు అరాచకం
[ 03-07-2024]
వైకాపా పాలనలో గత అయిదేళ్ల కాలంలో కాకినాడ నగరంలో ప్రభుత్వానివే కాదు ప్రైవేట్ ఆస్తులకూ రక్షణ లేకుండా పోయింది. నేతల అండ చూసుకొని కబ్జాదారులు రెచ్చిపోయారు. తమ పూర్వీకుల సొత్తు మాదిరి మున్సిపల్ స్థలాలను అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అన్నివేళలా ఈ పప్పులు ఉడకవు. ప్రభుత్వం మారింది. -
పల్లె గడపకు స్వచ్ఛ జలాలు
[ 03-07-2024]
కాకినాడ కలెక్టరేట్లో మంగళవారం నాలుగు గంటలపాటు కీలక శాఖలతో ఉపముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ, శాస్త్ర- సాంకేతిక, జిల్లా పరిషత్తు తదితర అంశాలపై సమీక్షించి బడ్జెట్ కేటాయింపులు.. చేపట్టిన, చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. -
మెట్ట రైతుకు గోదావరి జలాలు
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో వదిలేసిన ఎత్తిపోతల పథకాల పనులను కూటమి ప్రభుత్వం రాగానే యుద్ధప్రాతిపదికన చేయించి జులై మొదటి వారంలోనే సాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. -
భూహక్కు పత్రాల ఉపసంహరణకు రంగం సిద్ధం
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం కింద చేపట్టిన భూ రీసర్వేపై జిల్లాలో అనేక ఆందోళనలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. సర్వేలో లోపాలున్నాయని, రీ సర్వేతో తమ భూమి తగ్గిపోయిందని అనేకమంది రైతులు, భూ యాజమానులు గగ్గోలు పెట్టినా వైకాపా పాలకులు పట్టించుకోలేదు. -
సహకార సంఘాల ప్రక్షాళన షురూ..!
[ 03-07-2024]
సహకార సంఘాల్లో ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా మొదటి దశ కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటివరకు వైకాపా ప్రభుత్వ హయాంలో పాలన సాగించిన త్రిసభ్య కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో పర్సన్ ఇన్ఛార్జి వ్యవస్థను కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. -
నిధులు రావాల.. బాగుపడాల
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని విస్మరించడంతో అవి ఏటేటా క్షీణదశకు చేరుకుని అత్యంత దారుణంగా తయారయ్యాయి. గుంతలుపడి వర్షపునీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అలాంటి రహదారులకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలంటే సుమారు రూ.400 కోట్ల నిధులు కావాలి. -
వైకాపాకు కోటలు.. విద్యార్థుల ఆశలకు బీటలు..
[ 03-07-2024]
గడిచిన అయిదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవ, విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసి.. సొంత కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టింది. -
వీడని కోత.. తప్పని వెత..!
[ 03-07-2024]
కాకినాడ జిల్లాలోనే యు.కొత్తపల్లికి ప్రత్యేక స్థానం ఉంది.. ఇక్కడి ఉప్పాడ చీరలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండటమే కారణం. అలాంటి ఈ మండలంలో రెండు కీలక సమస్యలు మత్స్యకారులను వేధిస్తున్నాయి.. అందులో సముద్ర కోత తీరని వ్యథగా మారగా, ఫిషింగ్ హార్బర్ పనుల అసంపూర్తి గంగపుత్రులను మరింత ఇబ్బంది పెడుతోంది. -
నాణ్యతకు తిలోదకాలు
[ 03-07-2024]
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది జేఎన్టీయూకేలో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరు. నాణ్యత పాటిస్తూ దాని గురించి కాబోయే ఇంజినీర్లకు వివరించాల్సిన అధికారులే నాణ్యతకు తిలోదకాలిస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారు. -
టీచ్ టూల్తో బోధనలో నైపుణ్యం
[ 03-07-2024]
ఉపాధ్యాయుల బోధన పద్ధతిని ఒక నమూనాలో మదింపు చేసేందుకు టీచ్ టూల్ని ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు చెప్పారు. -
భవనం ఖాళీ చేయించారు.. న్యాయం చేయండి
[ 03-07-2024]
కాకినాడ నగరంలోని సత్యప్రసన్ననగర్ భాస్కర్ ఎస్టేట్స్ బాధితులు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. తామెంతో కష్టపడి బిల్డర్ ద్వారా బహుళ అంతస్తు భవనాన్ని నిర్మించుకున్నామని, అది కుంగిపోయిందనే నెపంతో అయిదేళ్ల కింద ఖాళీ చేయించారని వాపోయారు. -
అయిదేళ్లు నిద్రపోయారు.. గుంతల రోడ్లు మిగిల్చారు..
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయాలు నిర్మించుకొనేందుకు పెట్టిన శ్రద్ధ రహదారుల మరమ్మతులకు పెట్టకపోవడంతో ప్రస్తుతం రహదారులు రూపురేఖలు కోల్పాయాయి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు
-
మరోసారి కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
-
ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
-
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి