ఊరూరికీ.. అయిదేళ్ల మురికి..
అయిదేళ్ల వైకాపా పాలనలో స్థానిక సంస్థలను పూర్తిగా అచేతనం చేసేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించారు. గ్రామాల్లో కుళాయి వేయాలన్నా, బ్లీచింగ్ చల్లించాలన్నా.. నిధుల కొరతతో ఇబ్బందిపడే దుస్థితి.
ముమ్మిడివరం: పళ్లవారిపాలెంలో చెత్త సంపద కేంద్రం ఇలా..
అయిదేళ్ల వైకాపా పాలనలో స్థానిక సంస్థలను పూర్తిగా అచేతనం చేసేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించారు. గ్రామాల్లో కుళాయి వేయాలన్నా, బ్లీచింగ్ చల్లించాలన్నా.. నిధుల కొరతతో ఇబ్బందిపడే దుస్థితి. ఆ ప్రభావం ఇప్పుడు ఊరూరా స్పష్టంగా కనిపిస్తోంది.
న్యూస్టుడే, ముమ్మిడివరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక.. ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకే అందించాల్సిన ఆవశ్యకత ఉందని ఇటీవల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ నిధులు ఎంత దారి మళ్లాయనే లెక్కలనుసైతం బయటపెట్టారు. ఇకపై కూటమి పాలనలో గ్రామ పంచాయతీలకు మంచి రోజులు రానున్నాయనేది ఆయన మాటల సారాంశమని నిపుణులు పేర్కొంటున్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో..
జిల్లాలో 385 గ్రామ పంచాయతీలున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులను పెద్దఎత్తున దారి మళ్లించారు. ఆర్థిక సంఘం నిధుల వ్యయానికి తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిఉన్నా.. అవేమీ పట్టించుకోకుండా నిధులన్నీ విద్యుత్తు ఛార్జీలకు లాగేసుకోవడంతో కనీసం బ్లీచింగ్ కొనడానికి సొమ్ములేని పరిస్థితులను గ్రామ పంచాయతీలు ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో గ్రామాల్లో అధ్వానంగా మారిన పరిస్థితులను చక్కదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
సాకారం కాని స్వచ్ఛ సంకల్పం..
గతంలో చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ.కోట్లు వెచ్చించి ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు నిర్మించారు. వీటికి గ్రామాల్లో సేకరించిన చెత్తను తరలించి అక్కడ వర్మీకంపోస్టు ఎరువు తయారు చేసేవారు. ముమ్మిడివరం మండలం అనాతవరంలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ద్వారా టన్నుల మేర వర్మీకంపోస్టును తయారుచేసిన పరిస్థితులున్నాయి. అప్పట్లో గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, రిక్షాలు, ఫాగింగ్ యంత్రాలు తదితర సామగ్రిని అందించారు. వైకాపా ప్రభుత్వంలో అవన్నీ మూలకుచేరాయి.
కూటమి ప్రభుత్వ ఆదేశాలతో..
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లావ్యాప్తంగా 385 గ్రామ పంచాయతీల్లో 840 తాగునీటి ట్యాంకులు(ఓహెచ్బీఆర్)ల ద్వారా ఆయా ప్రాజెక్టుల నుంచి ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకుల క్లోరినేషన్, ప్రాజెక్టుల వద్ద నీటిశుద్ధి వంటి వాటిని అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయడం ప్రారంభించారు.
నిధుల సమస్య లేదు..
గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడానికి నిధుల సమస్య లేదు. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం చివరి విడత నిధులు గ్రామ పంచాయతీ ప్రత్యేక ఖాతాల్లో జమయ్యాయి. గ్రామ పంచాయతీ సాధారణ నిధులను కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలకు వినియోగించాలని సూచించాం. తాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి క్లోరినేషన్ చేయిస్తున్నాం. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో పర్యటిస్తున్నాం.
డి.రాంబాబు, జిల్లా పంచాయతీ అధికారి
జిల్లా సమాచారం ఇలా..
మొత్తం గ్రామ పంచాయతీలు: 385
3 వేలలోపు జనాభా ఉన్నవి: 190
3 వేలకుపైగా జనాభా ఉన్నవి: 195
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదేం వి‘చిత్రం’.. నవ్విపోరా జనం..!
[ 03-07-2024]
రాష్ట్రంలో ఎన్టీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. నేటికీ గత వైకాపా ప్రభుత్వ లోగోలు, చిత్రాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. అమలాపురంలోని ప్రాంతీయ ఆసుపత్రి భవనానికి గతంలో వేసిన మాజీ సీఎంలు వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డి చిత్రాలతో ఉండే నవరత్నాలు లోగోలు మంగళవారం దర్శనమిచ్చాయి. -
ద్వారంపూడి మార్కు అరాచకం
[ 03-07-2024]
వైకాపా పాలనలో గత అయిదేళ్ల కాలంలో కాకినాడ నగరంలో ప్రభుత్వానివే కాదు ప్రైవేట్ ఆస్తులకూ రక్షణ లేకుండా పోయింది. నేతల అండ చూసుకొని కబ్జాదారులు రెచ్చిపోయారు. తమ పూర్వీకుల సొత్తు మాదిరి మున్సిపల్ స్థలాలను అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అన్నివేళలా ఈ పప్పులు ఉడకవు. ప్రభుత్వం మారింది. -
పల్లె గడపకు స్వచ్ఛ జలాలు
[ 03-07-2024]
కాకినాడ కలెక్టరేట్లో మంగళవారం నాలుగు గంటలపాటు కీలక శాఖలతో ఉపముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ, శాస్త్ర- సాంకేతిక, జిల్లా పరిషత్తు తదితర అంశాలపై సమీక్షించి బడ్జెట్ కేటాయింపులు.. చేపట్టిన, చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. -
మెట్ట రైతుకు గోదావరి జలాలు
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వంలో వదిలేసిన ఎత్తిపోతల పథకాల పనులను కూటమి ప్రభుత్వం రాగానే యుద్ధప్రాతిపదికన చేయించి జులై మొదటి వారంలోనే సాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. -
భూహక్కు పత్రాల ఉపసంహరణకు రంగం సిద్ధం
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం కింద చేపట్టిన భూ రీసర్వేపై జిల్లాలో అనేక ఆందోళనలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. సర్వేలో లోపాలున్నాయని, రీ సర్వేతో తమ భూమి తగ్గిపోయిందని అనేకమంది రైతులు, భూ యాజమానులు గగ్గోలు పెట్టినా వైకాపా పాలకులు పట్టించుకోలేదు. -
సహకార సంఘాల ప్రక్షాళన షురూ..!
[ 03-07-2024]
సహకార సంఘాల్లో ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా మొదటి దశ కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటివరకు వైకాపా ప్రభుత్వ హయాంలో పాలన సాగించిన త్రిసభ్య కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో పర్సన్ ఇన్ఛార్జి వ్యవస్థను కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. -
నిధులు రావాల.. బాగుపడాల
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని విస్మరించడంతో అవి ఏటేటా క్షీణదశకు చేరుకుని అత్యంత దారుణంగా తయారయ్యాయి. గుంతలుపడి వర్షపునీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అలాంటి రహదారులకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలంటే సుమారు రూ.400 కోట్ల నిధులు కావాలి. -
వైకాపాకు కోటలు.. విద్యార్థుల ఆశలకు బీటలు..
[ 03-07-2024]
గడిచిన అయిదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజాసేవ, విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసి.. సొంత కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టింది. -
వీడని కోత.. తప్పని వెత..!
[ 03-07-2024]
కాకినాడ జిల్లాలోనే యు.కొత్తపల్లికి ప్రత్యేక స్థానం ఉంది.. ఇక్కడి ఉప్పాడ చీరలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండటమే కారణం. అలాంటి ఈ మండలంలో రెండు కీలక సమస్యలు మత్స్యకారులను వేధిస్తున్నాయి.. అందులో సముద్ర కోత తీరని వ్యథగా మారగా, ఫిషింగ్ హార్బర్ పనుల అసంపూర్తి గంగపుత్రులను మరింత ఇబ్బంది పెడుతోంది. -
నాణ్యతకు తిలోదకాలు
[ 03-07-2024]
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది జేఎన్టీయూకేలో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరు. నాణ్యత పాటిస్తూ దాని గురించి కాబోయే ఇంజినీర్లకు వివరించాల్సిన అధికారులే నాణ్యతకు తిలోదకాలిస్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారు. -
టీచ్ టూల్తో బోధనలో నైపుణ్యం
[ 03-07-2024]
ఉపాధ్యాయుల బోధన పద్ధతిని ఒక నమూనాలో మదింపు చేసేందుకు టీచ్ టూల్ని ప్రభుత్వం అభివృద్ధి చేసినట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు చెప్పారు. -
భవనం ఖాళీ చేయించారు.. న్యాయం చేయండి
[ 03-07-2024]
కాకినాడ నగరంలోని సత్యప్రసన్ననగర్ భాస్కర్ ఎస్టేట్స్ బాధితులు మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. తామెంతో కష్టపడి బిల్డర్ ద్వారా బహుళ అంతస్తు భవనాన్ని నిర్మించుకున్నామని, అది కుంగిపోయిందనే నెపంతో అయిదేళ్ల కింద ఖాళీ చేయించారని వాపోయారు. -
అయిదేళ్లు నిద్రపోయారు.. గుంతల రోడ్లు మిగిల్చారు..
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వం తమ పార్టీ కార్యాలయాలు నిర్మించుకొనేందుకు పెట్టిన శ్రద్ధ రహదారుల మరమ్మతులకు పెట్టకపోవడంతో ప్రస్తుతం రహదారులు రూపురేఖలు కోల్పాయాయి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇదేం వి‘చిత్రం’.. నవ్విపోరా జనం..!
-
వందేళ్ల తాతా.. వహ్వా నీ ఘనత: మాజీ ఎంపీపీని ఎత్తుకున్న జిల్లా కలెక్టర్
-
నిత్యావసరాల ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
-
యూనిఫామ్ తీసి.. రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య
-
అందుకే తడబడ్డాను.. ట్రంప్తో సంవాదంపై బైడెన్
-
టీషర్ట్, చిరిగిన జీన్స్తో కళాశాలకు రావొద్దు