బియ్యం బొక్కినోళ్లకు వణుకు
గోదాములు, మిల్లుల్లో టన్నులకొద్దీ అక్రమ బియ్యం నిల్వలు.. ఎక్కడికక్కడ చౌక బియ్యం గోనె సంచులు.. పరిసరాల్లో పడేసిన ట్యాగులు..పేదలకు అందాల్సిన సరకును వైకాపా నేతలు తమ అక్రమ ఆర్జనకు ఏరీతిన వాడుకుంటున్నారో శుక్రవారం తేటతెల్లమైంది.
మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలతో అప్రమత్తం
తమవారికి ఉప్పందించిన వైకాపా వీర విధేయులు
అంటకాగుతున్న అధికారులపై మనోహర్ ఆగ్రహం
అక్రమ నిల్వలున్న గోదాములు సీజ్ చేయాలని ఆదేశం
సమీక్షిస్తున్న మంత్రి నాదెండ్ల.. వేదికపై ఎమ్మెల్యేలు సత్యప్రభ, నానాజీ,
వనమాడి, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, కలెక్టర్ షాన్ మోహన్
గోదాములు, మిల్లుల్లో టన్నులకొద్దీ అక్రమ బియ్యం నిల్వలు.. ఎక్కడికక్కడ చౌక బియ్యం గోనె సంచులు.. పరిసరాల్లో పడేసిన ట్యాగులు..పేదలకు అందాల్సిన సరకును వైకాపా నేతలు తమ అక్రమ ఆర్జనకు ఏరీతిన వాడుకుంటున్నారో శుక్రవారం తేటతెల్లమైంది. ఈ వ్యవస్థీకృత మాఫియాను చూసి సాక్షాత్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విస్మయం చెందారు.
ఈనాడు, కాకినాడ
క్షేత్రస్థాయి రేషన్ అక్రమాల నిగ్గుతేల్చమని శుక్రవారం ఉదయాన్నే కీలక శాఖలతో కూడిన పది బృందాలను మంత్రి నాదెండ్ల రంగంలోకి దింపారు. లోపాలేమీ లేవని నమ్మించడానికి కొందరు అధికారులు ఆపసోపాలు పడ్డారు. వైకాపాతో అంటకాగుతున్న వీరి తీరు చూసి .. పద్ధతి మార్చుకోకపోతే ఉపేక్షించనని మంత్రి హెచ్చరికలు జారీచేశారు. ద్వారంపూడి అక్రమాల సామ్రాజ్యాన్ని కూల్చకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదంటూ జనసేన అధినేత పవన్కల్యాణ్ గతంలో సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. జనసేన ప్రతినిధి పౌరసరఫరాల మంత్రి హోదాలో రేషన్ మాఫియా దందాపై దృష్టిసారించడంతో అక్రమార్కుల్లో వణుకు మొదలయ్యింది. తనిఖీల్లో అక్రమాలు వెలుగుచూసిన గోదాములు ద్వారంపూడి అనుచరులవేనని చెప్పడం.. పెద్దల పేర్లు త్వరలో వెల్లడిస్తాననడంతో గుబులు రేగింది.
కాకినాడ యాంకరేజ్ పోర్టులోని గోదాములో తనిఖీలు
‘చౌక’గా కొట్టేస్తున్న తీరు
తొలుత కాకినాడ యాంకరేజి పోర్టు పరిధిలోని విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్, బీచ్రోడ్డులోని సార్టెక్స్ ఇండియా, మానస ఎక్స్పోర్ట్స్, డీఎన్ఎస్లలో మంత్రి మనోహర్ తనిఖీలు చేశారు. విశ్వప్రియ, సార్టెక్స్, లవన్, సరళ ఫుడ్స్ తదితర చోట్ల చౌక బియ్యం అక్రమ వ్యవహార ఆనవాళ్లు గుర్తించారు సరళ ఫుడ్స్ వద్ద అక్రమాలు లేవని అధికారులు కప్పిపుచ్చినా.. గోదాము వెనక చౌక బియ్యం ట్యాగులు పడి ఉండడాన్ని మంత్రి గుర్తించి ఆగ్రహం వ్యక్తంచేశారు. బియ్యం తమిళనాడు, ఇతర ప్రాంతాలకు వెళ్తాయని చెప్పినా..వేబిల్లులు, దస్త్రాలు చూపలేకపోయారు. వైకాపా నేతలు అధికారులకు భోజన ఏర్పాట్లు చేసేందుకు యత్నించడం చర్చకు దారితీసింది.
కౌలు రైతులకు అన్యాయం చేస్తారా..?
కలెక్టరేట్లో కీలకశాఖలతో నిర్వహించిన సమీక్షలో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో కౌలు రైతులు గణనీయంగా తగ్గినట్లు చూపారని..వైకాపా చేసిన అవినీతిలో అదొకటని వ్యాఖ్యానించారు.వీరు ఒకప్పుడు 79 శాతం మంది ఉంటే.. ఈరోజు చూపించే లెక్క 13 నుంచి 16 శాతం ఉందన్నారు. పథకాల ద్వారా అందాల్సిన లబ్ధిని అన్యాయంగా వారికి దూరంచేశారన్నారు.
కోత పెడితే కేసులే
ధాన్యం గత సీజన్లో 1.50 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని అధికారులు వెల్లడించగా.. ఇప్పుడూ అదే లక్ష్యం నిర్దేశించుకోవాలని..ఆర్బీకేలపై పర్యవేక్షణ పెంచాలని మనోహర్ అన్నారు. తేమశాతం పేరుతో రూ.100, రూ. 200 కోత పెడితే కేసులు పెడతామని హెచ్చరించారు.
సమన్వయ లోపంపై ఆగ్రహం..
అంగన్వాడీలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు నాణ్యమైన సరకు వెళ్తున్నాయో లేదో తనిఖీ చేస్తున్నారా అని డీటీలను ప్రశ్నిస్తే లేదని చెప్పారు. గోధుమ పిండికి కార్డుదారుల నుంచి డిమాండ్ ఉన్నా ఏప్రిల్ నుంచి అవసరమైన సరకు కోసం ఎందుకు ఇండెంట్ పెట్టలేదని జేసీని ప్రశ్నించారు. చౌక బియ్యం భారీగా తరలిపోతుంటే ఏం చర్యలు తీసుకున్నారని రవాణాశాఖ అధికారిని అడిగారు.
రైతులకు మేలు చేద్దాం..
పౌరసరఫరాలు, అనుబంధ శాఖలతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పౌర సరఫరాల సంస్థ ఎండీ వీర పాండ్యన్, జేసీ హేమసుందర్రెడ్డి, జిల్లా సహకార అధికారి వెంకట కృష్ణ పాల్గొన్నారు.
- తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ (కాకినాడ ఎంపీ): ధాన్యం కొనుగోళ్లలో రైతులను దోచుకుంటున్న ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేలపై నిఘా పెంచాలి.
- వనమాడి కొండబాబు(కాకినాడ నగర ఎమ్మెల్యే): గడచిన అయిదేళ్లలో పౌరసరఫరాల అంశంపై ఒక్క సమీక్ష, తనిఖీ లేదు. రేషన్ బియ్యంలో అక్రమాలు, రైతు సమస్యలు ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదు.
- పంతం నానాజీ(కాకినాడ గ్రామీణం): కాలువలు పూడికపోయి నీరు దిగకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్లె మురవాలి.. ప్రగతి విరియాలి
[ 01-07-2024]
పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ విజయాన్ని అందుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ- పర్యావరణం, శాస్త్ర-సాంకేతిక శాఖల మంత్రి హోదాలో జిల్లాకు వస్తున్నారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం్ర కూటమి అభయం
[ 01-07-2024]
పింఛను డబ్బుల కోసం లబ్ధిదారులు ఇకపై ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. కూటమి ప్రభుత్వం ఈ నెల నుంచి నేరుగా ఇంటివద్దే అందించేందుకు చర్యలు చేపట్టింది. -
అడుగులు పడేనా?
[ 01-07-2024]
టీ-20 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ విజయపతాకం ఎగురవేసింది. 2007 సుదీర్ఘ పోరాటం అనంతరం మళ్లీ 2024లో సత్తాచాటింది. యువ, సీనియర్ల కలయికతో ప్రపంచ కప్ పోటీల్లో అడుగుపెట్టిన భారత్ సెమీఫైనల్ (ఇంగ్లాండ్), ఫైనల్స్ (దక్షిణాఫ్రికా)లో చిరకాల ప్రత్యర్థులను మట్టి కరిపించింది. -
అమృత హస్తాలు
[ 01-07-2024]
అమ్మ జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. అందుకే వాళ్లను వైద్యో నారాయణోహరి అంటారు. రోగుల ప్రాణాలు కాపాడేందుకు రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందిస్తూ, కుటుంబ జీవితానికి దూరమవుతూ వారు చేసే త్యాగాలు ఎన్నెన్నో. -
ఏడీబీ రోడ్డు పనులు ముమ్మరం
[ 01-07-2024]
ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు ఇక పూర్తిస్థాయిలో కొనసాగనున్నాయి. రాజానగరం, రంగంపేట మధ్య అత్యంత దయనీయంగా తయారైన ఈ రోడ్డు మరమ్మతుకు బీఎస్ఆర్ సంస్థ ఆదివారం చర్యలను చేపట్టింది. -
జీఎస్ఎల్కు ప్రముఖ వైద్యులు దత్తాత్రేయుడు రాక నేడు
[ 01-07-2024]
జీఎస్ఎల్ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రి 20వ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లాకు చెందిన, న్యూయార్క్ నివాసి, సుప్రసిద్ధ రేడియేషన్ అంకాలజిస్ట్ డా.నోరి దత్తాత్రేయుడు ప్రత్యేక అతిథిగా వస్తున్నారని వైద్య విద్యా సంస్థల చైర్మన్ డా.గన్ని భాస్కరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
మహిళా సాధికారతకు.. శేషకుమారి జీవితం నిదర్శనం
[ 01-07-2024]
మహిళా సాధికారతకు లక్కరాజు శేషకుమారి జీవితమే నిదర్శనమని, అమె గొప్ప వారసత్వ సంపద, స్ఫూర్తి పంచి వెళ్లారని ప్రముఖ వక్త, ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈవో, డైరక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక
[ 01-07-2024]
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను తొలి దశలో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. -
ఆనందంగా గడపాలని.. అంతలోనే అనంతలోకాలకు
[ 01-07-2024]
సెలవురోజు కావడంతో మనుమడితో ఆనందంగా గడపాలని ఆ తాతయ్య అనుకున్నారు. ఇంకొన్ని నిమిషాల్లో ఇంటికి వెళ్లిపోతామనగా ఊహించని ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం కూటమి అభయం
[ 01-07-2024]
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పండగకు వేళయ్యింది. ఉదయం 6 గంటల నుంచే గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో వీటిని లబ్ధిదారుల చెంతకు చేర్చనున్నారు. -
పవన్ రాకకు భారీ ఏర్పాట్లు
[ 01-07-2024]
పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ జిల్లాలో మూడు రోజులు పర్యటించానున్నారు. ఇందులో భాగంగా సోమవారం పిఠాపురం రానున్నారు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
[ 01-07-2024]
జిల్లాలో ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని, నమోదైన కేసును వెంటనే పరిష్కరించాలని ఎస్పీ సుసారపు శ్రీధర్ ఆదేశించారు. -
ఊరూరికీ.. అయిదేళ్ల మురికి..
[ 01-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో స్థానిక సంస్థలను పూర్తిగా అచేతనం చేసేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించారు. గ్రామాల్లో కుళాయి వేయాలన్నా, బ్లీచింగ్ చల్లించాలన్నా.. నిధుల కొరతతో ఇబ్బందిపడే దుస్థితి.