వర్సిటీలు.. వైకాపా రాజకీయ నిలయాలు
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ...వారి బంగారు భవితకు బాటలు వేయాల్సిన విశ్వవిద్యాలయాల్లో వైకాపా అయిదేళ్ల పాలనలో రాజకీయ జోక్యం మితిమీరింది..వారి అడుగులకు మడుగులొత్తినవారికి ఇక్కడ ఉన్నత హోదాలు దక్కాయి.
గత అయిదేళ్లలో నేతల పెత్తనం
ఇష్టారీతిన పార్టీ సదస్సులు
జేఎన్టీయూకే
గాంధీనగర్, న్యూస్టుడే: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ...వారి బంగారు భవితకు బాటలు వేయాల్సిన విశ్వవిద్యాలయాల్లో వైకాపా అయిదేళ్ల పాలనలో రాజకీయ జోక్యం మితిమీరింది..వారి అడుగులకు మడుగులొత్తినవారికి ఇక్కడ ఉన్నత హోదాలు దక్కాయి. వైకాపా నాయకులకు బోర్డులో కమిటీ సభ్యులుగా పదవులు లభించాయి. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను మూసేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారు. చదువుకున్నా ఉద్యోగాలు లభించక యువత నిరుద్యోగులుగా కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. తాము అధికారంలోకి రాగానే విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేస్తామని, విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు నేర్పిస్తామంటూ హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం...తాజాగా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
కాకినాడలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూకే), రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం(అక్నూ) ఉన్నాయి. వీసీలుగా జీవీఆర్ ప్రసాదరాజు, కె.పద్మరాజు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వంలో 1946లో కాకినాడలో ఇంజినీరింగ్ కళాశాలగా ప్రారంభమై, ఏయూ అనుబంధంగా 2008లో జేఎన్టీయూకేగా మారింది. ఇక్కడ ఇంజినీరింగ్ చదువుకున్నవారిలో అత్యధిక శాతం విదేశాల్లోనూ, ప్రముఖ కంపెనీల్లో ఉన్నతశ్రేణి ఉద్యోగులుగా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వర్సిటీని వైకాపా నాయకులు భ్రష్టుపట్టించారు.
జేఎన్టీయూ : జగనన్న కాలేజ్ కెప్టెన్స్ కార్యక్రమంలో విద్యార్థులు (పాతచిత్రం)
ప్రక్షాళన దిశగా.....
వైకాపా హయాంలో రాజకీయ అండదండలతో ఉపకులపతులుగా నియమితులైన పలువురు ఇప్పటికే రాజీనామా చేశారు. జేఎన్టీయూకే, అక్నూ వీసీలనూ మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఉన్నత విద్యాశాఖాధికారులు చర్యలు ఆరంభించారు.యూనివర్సిటీలను స్కిల్ హబ్లుగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. గతంలో మాదిరి పూర్వ వైభవం వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
జగన్కు జై కొట్టించి...
తెదేపా అధికారంలో ఉన్న 2014-19 కాలంలో జేఎన్టీయూకే విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు నేర్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుచేశారు. వైకాపా వచ్చాక శీతకన్ను వేసింది. తమ అనుయాయులను వివిధ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా, పాలకవర్గంలో సభ్యులుగా నియమించారు.
- కాకినాడ వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన చలమలశెట్టి సునీల్ పుట్టినరోజు వేడుకలు ఈ ఏడాది మార్చి 4న జేఎన్టీయూ ఎదురుగా నిర్వహించారు. అక్కడే వేదిక ఏర్పాటుచేసి హోర్డింగ్లతో హంగామా చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలోనే వాహనాల పార్కింగ్, మైకుల హడావుడితో విద్యార్థులకు అసౌకర్యం కలిగించారు.
- జేఎన్టీయూ సెనేట్ హాలులో ఈ ఏడాది జనవరి 30న వైకాపా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ‘జగనన్న కాలేజ్ కెప్టెన్స్’ పేరిట రాజకీయ కార్యక్రమం నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ చిత్రంతో ఉన్న టీషర్టులను విద్యార్థులతో ధరింపజేసి జైకొట్టించారు. వైకాపా ప్రచారం కోసం ముద్రించిన పుస్తకాలు, కరపత్రాలు పంచిపెట్టారు. రాజకీయ ప్రసంగాలు చేసి ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. అప్పటి గ్రామీణ ఎమ్మెల్యే కన్నబాబు ఫోన్ చేసి సదస్సుకోసం హాలు కావాలని అడగడంతో ఇవ్వాల్సి వచ్చిందని.. వైకాపా విద్యార్థి విభాగ సదస్సు నిర్వహించారని తనకు తెలియదని వీసీ చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్లె మురవాలి.. ప్రగతి విరియాలి
[ 01-07-2024]
పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ విజయాన్ని అందుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ- పర్యావరణం, శాస్త్ర-సాంకేతిక శాఖల మంత్రి హోదాలో జిల్లాకు వస్తున్నారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం్ర కూటమి అభయం
[ 01-07-2024]
పింఛను డబ్బుల కోసం లబ్ధిదారులు ఇకపై ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. కూటమి ప్రభుత్వం ఈ నెల నుంచి నేరుగా ఇంటివద్దే అందించేందుకు చర్యలు చేపట్టింది. -
అడుగులు పడేనా?
[ 01-07-2024]
టీ-20 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ విజయపతాకం ఎగురవేసింది. 2007 సుదీర్ఘ పోరాటం అనంతరం మళ్లీ 2024లో సత్తాచాటింది. యువ, సీనియర్ల కలయికతో ప్రపంచ కప్ పోటీల్లో అడుగుపెట్టిన భారత్ సెమీఫైనల్ (ఇంగ్లాండ్), ఫైనల్స్ (దక్షిణాఫ్రికా)లో చిరకాల ప్రత్యర్థులను మట్టి కరిపించింది. -
అమృత హస్తాలు
[ 01-07-2024]
అమ్మ జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. అందుకే వాళ్లను వైద్యో నారాయణోహరి అంటారు. రోగుల ప్రాణాలు కాపాడేందుకు రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందిస్తూ, కుటుంబ జీవితానికి దూరమవుతూ వారు చేసే త్యాగాలు ఎన్నెన్నో. -
ఏడీబీ రోడ్డు పనులు ముమ్మరం
[ 01-07-2024]
ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు ఇక పూర్తిస్థాయిలో కొనసాగనున్నాయి. రాజానగరం, రంగంపేట మధ్య అత్యంత దయనీయంగా తయారైన ఈ రోడ్డు మరమ్మతుకు బీఎస్ఆర్ సంస్థ ఆదివారం చర్యలను చేపట్టింది. -
జీఎస్ఎల్కు ప్రముఖ వైద్యులు దత్తాత్రేయుడు రాక నేడు
[ 01-07-2024]
జీఎస్ఎల్ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రి 20వ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లాకు చెందిన, న్యూయార్క్ నివాసి, సుప్రసిద్ధ రేడియేషన్ అంకాలజిస్ట్ డా.నోరి దత్తాత్రేయుడు ప్రత్యేక అతిథిగా వస్తున్నారని వైద్య విద్యా సంస్థల చైర్మన్ డా.గన్ని భాస్కరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
మహిళా సాధికారతకు.. శేషకుమారి జీవితం నిదర్శనం
[ 01-07-2024]
మహిళా సాధికారతకు లక్కరాజు శేషకుమారి జీవితమే నిదర్శనమని, అమె గొప్ప వారసత్వ సంపద, స్ఫూర్తి పంచి వెళ్లారని ప్రముఖ వక్త, ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈవో, డైరక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక
[ 01-07-2024]
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను తొలి దశలో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. -
ఆనందంగా గడపాలని.. అంతలోనే అనంతలోకాలకు
[ 01-07-2024]
సెలవురోజు కావడంతో మనుమడితో ఆనందంగా గడపాలని ఆ తాతయ్య అనుకున్నారు. ఇంకొన్ని నిమిషాల్లో ఇంటికి వెళ్లిపోతామనగా ఊహించని ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం కూటమి అభయం
[ 01-07-2024]
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పండగకు వేళయ్యింది. ఉదయం 6 గంటల నుంచే గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో వీటిని లబ్ధిదారుల చెంతకు చేర్చనున్నారు. -
పవన్ రాకకు భారీ ఏర్పాట్లు
[ 01-07-2024]
పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ జిల్లాలో మూడు రోజులు పర్యటించానున్నారు. ఇందులో భాగంగా సోమవారం పిఠాపురం రానున్నారు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
[ 01-07-2024]
జిల్లాలో ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని, నమోదైన కేసును వెంటనే పరిష్కరించాలని ఎస్పీ సుసారపు శ్రీధర్ ఆదేశించారు. -
ఊరూరికీ.. అయిదేళ్ల మురికి..
[ 01-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో స్థానిక సంస్థలను పూర్తిగా అచేతనం చేసేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించారు. గ్రామాల్లో కుళాయి వేయాలన్నా, బ్లీచింగ్ చల్లించాలన్నా.. నిధుల కొరతతో ఇబ్బందిపడే దుస్థితి.