యాప్ ఊడ్చేసింది
ఎన్ని ఆన్లైన్ మోసాలు వెలుగుచూస్తున్నా ఇంకా కొన్ని యాప్లలో పెట్టుబడి పెట్టి పలువురు నిండా మునిగిపోతున్నారు.
ద్రాక్షారామ పోలీసులను ఆశ్రయించిన బాధితులు
పోలీస్ స్టేషన్ ఎదుట జీఎంఆర్ యాప్ బాధితులు
ద్రాక్షారామ, న్యూస్టుడే : ఎన్ని ఆన్లైన్ మోసాలు వెలుగుచూస్తున్నా ఇంకా కొన్ని యాప్లలో పెట్టుబడి పెట్టి పలువురు నిండా మునిగిపోతున్నారు. తాజాగా జీఎంఆర్ అనే ఆన్లైన్ యాప్ను నమ్మి రూ.లక్షల్లో పోగొట్టుకున్నామంటూ బాధితులు శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ పోలీసులను ఆశ్రయించారు. వీరిలో ద్రాక్షారామ పరిసరాలతోపాటు అంబాజీపేట, అమలాపురం, తణుకు తదితర ప్రాంతాలవారు ఉన్నారు. తమలాంటి బాధితులు వెయ్యి మంది వరకు ఉన్నారని పేర్కొన్నారు. తామందరికీ యాప్లను పరిచయం చేసిన బుక్కూరి ఆనంద్, మద్దాల వినయ్కుమార్, మోటుపల్లి కిరణ్కుమార్లను వారు పోలీసులకు అప్పగించారు.
ఎలా మోసపోయారంటే..
జీఎంఆర్ పథకంలో తొలుత చేరిన వ్యక్తి ఇద్దరిని చేర్చాలని, ఆ వ్యక్తి యాప్ లింక్ను మిగతా ఇద్దరికి పంపిస్తాడని చెప్పేవారు. అలా చరవాణికి వచ్చిన లింకును తెరచి దాని ద్వారా రూ.4,500, 15,800, 30వేలు, 60వేలు, 1.20లక్షలు ఇలా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చని, రోజూ ఆదాయం వస్తుందని నమ్మించేవారు. ఉదాహరణకు రూ.15,800 పెడితే రోజుకు రూ.500 చొప్పున మన ఐడీకి జమ అవుతాయని చెప్పేవారు. అలా జమ అయిన సొమ్ము రూ.5 వేలు పూర్తయ్యాక కేవలం వారానికి ఒకసారి శుక్రవారం రోజున విత్డ్రా చేసుకోవచ్చని సూచించారు.లక్షల్లో పెడితే వేలల్లో ఆదాయం వస్తుంది. ఇలా కట్టిన వారికి మొదట్లో డబ్బులు వచ్చేవి. ప్రస్తుతం బాధితులందరికీ సొమ్ము యాప్లో జమ అవుతుంది గాని నాలుగు వారాల నుంచి విత్డ్రా కావడం లేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించారు. ఇటీవలే డబ్బులు రావడానికి జీఎస్టీ చెల్లించాలంటే అది కూడా కట్టామని వీరు తెలిపారు. బాధితులు పూర్తి వివరంగా ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఎస్సై సురేంద్ర తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్లె మురవాలి.. ప్రగతి విరియాలి
[ 01-07-2024]
పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ విజయాన్ని అందుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ- పర్యావరణం, శాస్త్ర-సాంకేతిక శాఖల మంత్రి హోదాలో జిల్లాకు వస్తున్నారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం్ర కూటమి అభయం
[ 01-07-2024]
పింఛను డబ్బుల కోసం లబ్ధిదారులు ఇకపై ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. కూటమి ప్రభుత్వం ఈ నెల నుంచి నేరుగా ఇంటివద్దే అందించేందుకు చర్యలు చేపట్టింది. -
అడుగులు పడేనా?
[ 01-07-2024]
టీ-20 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ విజయపతాకం ఎగురవేసింది. 2007 సుదీర్ఘ పోరాటం అనంతరం మళ్లీ 2024లో సత్తాచాటింది. యువ, సీనియర్ల కలయికతో ప్రపంచ కప్ పోటీల్లో అడుగుపెట్టిన భారత్ సెమీఫైనల్ (ఇంగ్లాండ్), ఫైనల్స్ (దక్షిణాఫ్రికా)లో చిరకాల ప్రత్యర్థులను మట్టి కరిపించింది. -
అమృత హస్తాలు
[ 01-07-2024]
అమ్మ జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. అందుకే వాళ్లను వైద్యో నారాయణోహరి అంటారు. రోగుల ప్రాణాలు కాపాడేందుకు రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందిస్తూ, కుటుంబ జీవితానికి దూరమవుతూ వారు చేసే త్యాగాలు ఎన్నెన్నో. -
ఏడీబీ రోడ్డు పనులు ముమ్మరం
[ 01-07-2024]
ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు ఇక పూర్తిస్థాయిలో కొనసాగనున్నాయి. రాజానగరం, రంగంపేట మధ్య అత్యంత దయనీయంగా తయారైన ఈ రోడ్డు మరమ్మతుకు బీఎస్ఆర్ సంస్థ ఆదివారం చర్యలను చేపట్టింది. -
జీఎస్ఎల్కు ప్రముఖ వైద్యులు దత్తాత్రేయుడు రాక నేడు
[ 01-07-2024]
జీఎస్ఎల్ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రి 20వ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లాకు చెందిన, న్యూయార్క్ నివాసి, సుప్రసిద్ధ రేడియేషన్ అంకాలజిస్ట్ డా.నోరి దత్తాత్రేయుడు ప్రత్యేక అతిథిగా వస్తున్నారని వైద్య విద్యా సంస్థల చైర్మన్ డా.గన్ని భాస్కరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
మహిళా సాధికారతకు.. శేషకుమారి జీవితం నిదర్శనం
[ 01-07-2024]
మహిళా సాధికారతకు లక్కరాజు శేషకుమారి జీవితమే నిదర్శనమని, అమె గొప్ప వారసత్వ సంపద, స్ఫూర్తి పంచి వెళ్లారని ప్రముఖ వక్త, ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈవో, డైరక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక
[ 01-07-2024]
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను తొలి దశలో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. -
ఆనందంగా గడపాలని.. అంతలోనే అనంతలోకాలకు
[ 01-07-2024]
సెలవురోజు కావడంతో మనుమడితో ఆనందంగా గడపాలని ఆ తాతయ్య అనుకున్నారు. ఇంకొన్ని నిమిషాల్లో ఇంటికి వెళ్లిపోతామనగా ఊహించని ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం కూటమి అభయం
[ 01-07-2024]
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పండగకు వేళయ్యింది. ఉదయం 6 గంటల నుంచే గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో వీటిని లబ్ధిదారుల చెంతకు చేర్చనున్నారు. -
పవన్ రాకకు భారీ ఏర్పాట్లు
[ 01-07-2024]
పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ జిల్లాలో మూడు రోజులు పర్యటించానున్నారు. ఇందులో భాగంగా సోమవారం పిఠాపురం రానున్నారు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
[ 01-07-2024]
జిల్లాలో ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని, నమోదైన కేసును వెంటనే పరిష్కరించాలని ఎస్పీ సుసారపు శ్రీధర్ ఆదేశించారు. -
ఊరూరికీ.. అయిదేళ్ల మురికి..
[ 01-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో స్థానిక సంస్థలను పూర్తిగా అచేతనం చేసేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించారు. గ్రామాల్లో కుళాయి వేయాలన్నా, బ్లీచింగ్ చల్లించాలన్నా.. నిధుల కొరతతో ఇబ్బందిపడే దుస్థితి.