చివరి లబ్ధిదారు వరకు ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను చివరి లబ్ధిదారుడి వరకు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కొత్త కలెక్టర్ పి.ప్రశాంతి చెప్పారు.
కొత్త కలెక్టర్ ప్రశాంతి
బాధ్యతలు స్వీకరిస్తూ..
రాజమహేంద్రవరం కలెక్టరేట్: ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను చివరి లబ్ధిదారుడి వరకు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కొత్త కలెక్టర్ పి.ప్రశాంతి చెప్పారు. ఆ దిశగా జిల్లాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు వేగవంతంగా ప్రజలకు చేరవేస్తామన్నారు. కలెక్టరేట్లోని ఛాంబర్లో శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ జిల్లాలో పనిచేయడం ఒక మంచి అవకాశమన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటానన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు వారి కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించేలా అందరినీ సమన్వయం చేస్తూ క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూస్తామన్నారు.
‘ఇ-ఆఫీస్’లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు
జిల్లాలో ఇకపై ప్రతి ప్రభుత్వ శాఖ కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు ‘ఇ-ఆఫీస్’ ద్వారా నిర్వహించాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. వివిధ శాఖల అధికారులను పరిచయం చేసుకుంటూ ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాధాన్యత కార్యక్రమాలు, వాటి పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలుకు అధికారులంతా సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వ్యక్తిగత బాధ్యత తీసుకుని జవాబుదారీతనం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్కు పలువురు అధికారులు కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జేసీ తేజ్భరత్, డీఆర్వో నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
కాలానుగుణ వ్యాధుల నివారణకు కార్యాచరణ
సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డివిజన్, మున్సిపల్, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డయేరియా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అధ్యయం చేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. తాగునీటిని సరఫరా చేసే ప్రదేశాల్లో నీటి నమూనా పరీక్షలు నిర్వహించి ఆ మేరకు ధ్రువపత్రాలు జారీ చేయాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో రక్షిత నీటి ట్యాంకుల నిర్వహణ వ్యవస్థపై స్వయంగా తనిఖీలు నిర్వహించి రెండు, మూడు రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా లోతట్టు, ముంపు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పింఛన్ల పంపిణీలో ఆటంకాలు లేకుండా చూడాలి
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయడంలో ఎక్కడా ఎటువంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. జిల్లాలో 9,552 క్లస్టర్ పరిధిలో 2,44,302 మంది లబ్ధిదారులకు రూ.163.13 కోట్ల మేర పంపిణీ చేయాల్సి ఉందని, ఆయా క్లస్టర్ల వారీగా సీఎఫ్ఎంఎస్ గుర్తింపు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులతో మ్యాపింగ్ ప్రక్రియ తక్షణం పూర్తి చేయాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్లె మురవాలి.. ప్రగతి విరియాలి
[ 01-07-2024]
పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ విజయాన్ని అందుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ- పర్యావరణం, శాస్త్ర-సాంకేతిక శాఖల మంత్రి హోదాలో జిల్లాకు వస్తున్నారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం్ర కూటమి అభయం
[ 01-07-2024]
పింఛను డబ్బుల కోసం లబ్ధిదారులు ఇకపై ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. కూటమి ప్రభుత్వం ఈ నెల నుంచి నేరుగా ఇంటివద్దే అందించేందుకు చర్యలు చేపట్టింది. -
అడుగులు పడేనా?
[ 01-07-2024]
టీ-20 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ విజయపతాకం ఎగురవేసింది. 2007 సుదీర్ఘ పోరాటం అనంతరం మళ్లీ 2024లో సత్తాచాటింది. యువ, సీనియర్ల కలయికతో ప్రపంచ కప్ పోటీల్లో అడుగుపెట్టిన భారత్ సెమీఫైనల్ (ఇంగ్లాండ్), ఫైనల్స్ (దక్షిణాఫ్రికా)లో చిరకాల ప్రత్యర్థులను మట్టి కరిపించింది. -
అమృత హస్తాలు
[ 01-07-2024]
అమ్మ జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. అందుకే వాళ్లను వైద్యో నారాయణోహరి అంటారు. రోగుల ప్రాణాలు కాపాడేందుకు రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందిస్తూ, కుటుంబ జీవితానికి దూరమవుతూ వారు చేసే త్యాగాలు ఎన్నెన్నో. -
ఏడీబీ రోడ్డు పనులు ముమ్మరం
[ 01-07-2024]
ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు ఇక పూర్తిస్థాయిలో కొనసాగనున్నాయి. రాజానగరం, రంగంపేట మధ్య అత్యంత దయనీయంగా తయారైన ఈ రోడ్డు మరమ్మతుకు బీఎస్ఆర్ సంస్థ ఆదివారం చర్యలను చేపట్టింది. -
జీఎస్ఎల్కు ప్రముఖ వైద్యులు దత్తాత్రేయుడు రాక నేడు
[ 01-07-2024]
జీఎస్ఎల్ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రి 20వ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లాకు చెందిన, న్యూయార్క్ నివాసి, సుప్రసిద్ధ రేడియేషన్ అంకాలజిస్ట్ డా.నోరి దత్తాత్రేయుడు ప్రత్యేక అతిథిగా వస్తున్నారని వైద్య విద్యా సంస్థల చైర్మన్ డా.గన్ని భాస్కరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
మహిళా సాధికారతకు.. శేషకుమారి జీవితం నిదర్శనం
[ 01-07-2024]
మహిళా సాధికారతకు లక్కరాజు శేషకుమారి జీవితమే నిదర్శనమని, అమె గొప్ప వారసత్వ సంపద, స్ఫూర్తి పంచి వెళ్లారని ప్రముఖ వక్త, ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈవో, డైరక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక
[ 01-07-2024]
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను తొలి దశలో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. -
ఆనందంగా గడపాలని.. అంతలోనే అనంతలోకాలకు
[ 01-07-2024]
సెలవురోజు కావడంతో మనుమడితో ఆనందంగా గడపాలని ఆ తాతయ్య అనుకున్నారు. ఇంకొన్ని నిమిషాల్లో ఇంటికి వెళ్లిపోతామనగా ఊహించని ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం కూటమి అభయం
[ 01-07-2024]
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పండగకు వేళయ్యింది. ఉదయం 6 గంటల నుంచే గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో వీటిని లబ్ధిదారుల చెంతకు చేర్చనున్నారు. -
పవన్ రాకకు భారీ ఏర్పాట్లు
[ 01-07-2024]
పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ జిల్లాలో మూడు రోజులు పర్యటించానున్నారు. ఇందులో భాగంగా సోమవారం పిఠాపురం రానున్నారు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
[ 01-07-2024]
జిల్లాలో ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని, నమోదైన కేసును వెంటనే పరిష్కరించాలని ఎస్పీ సుసారపు శ్రీధర్ ఆదేశించారు. -
ఊరూరికీ.. అయిదేళ్ల మురికి..
[ 01-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో స్థానిక సంస్థలను పూర్తిగా అచేతనం చేసేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించారు. గ్రామాల్లో కుళాయి వేయాలన్నా, బ్లీచింగ్ చల్లించాలన్నా.. నిధుల కొరతతో ఇబ్బందిపడే దుస్థితి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
-
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై ఘాటుగా స్పందించిన లోకేశ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కృష్ణా జలాల్లో కొత్త ద్వీపం.. అందం అదరహో..!
-
ఎంపీ లాడ్స్ ఆన్లైన్లో!