జీజీహెచ్కు విద్యుత్తు బిల్లుల షాక్
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రికి విద్యుత్తు షాక్ తగిలింది. ఆసుపత్రిలో ఎంఆర్ఐ, డయాలసిస్ సేవలందిస్తున్న ప్రైవేటు సంస్థలు మూడేళ్ల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో రూ.4 కోట్ల వరకు బకాయిలున్నట్లు తాజాగా వెలుగుచూసింది.
కొన్నేళ్లుగా చెల్లించని ప్రైవేటు సంస్థలు
రూ.4 కోట్ల వరకు సర్వజన ఆసుపత్రిపై భారం
న్యూస్టుడే, రాజమహేంద్రవరం వైద్యం
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రి
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రికి విద్యుత్తు షాక్ తగిలింది. ఆసుపత్రిలో ఎంఆర్ఐ, డయాలసిస్ సేవలందిస్తున్న ప్రైవేటు సంస్థలు మూడేళ్ల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో రూ.4 కోట్ల వరకు బకాయిలున్నట్లు తాజాగా వెలుగుచూసింది. దీంతో జీజీహెచ్పై బకాయి బండ పడింది. దీనిపై ఆసుపత్రి అధికారులు ఆయా సంస్థల ప్రతినిధులకు నోటీసులు జారీ చేశారు.
రాజమహేంద్రవరం వైద్యశాలలో పీపీపీ పద్ధతిలో డయాలసిస్ కేంద్రాన్ని 2016లో ఓ సంస్థ ద్వారా ఏర్పాటు చేశారు. కొన్నాళ్లు వీరు బిల్లులు చెల్లించినా తరువాత ఆపేశారు. వీటికి ప్రతి నెలా సుమారు రూ.80-90 వేలు విద్యుత్తు బిల్లు వస్తుంది. మూడు, నాలుగేళ్ల నుంచి విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో రూ.కోట్లలో పేరుకుపోయిందని ఆసుపత్రి వర్గాల అంచనా. మూడేళ్ల కిందట ఓ ప్రైవేటు సంస్థతో జీజీహెచ్లో ఎంఆర్ఐ సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. అప్పటి ఆసుపత్రి అధికారులు కనీసం దానికి విద్యుత్తు మీటరు సైతం ఏర్పాటు చేయకపోగా.. సంస్థ ప్రతినిధులు సైతం బిల్లు చర్చ లేకుండానే ఇప్పటివరకు విద్యుత్తు వినియోగించుకున్నారు. కొద్ది రోజుల క్రితం సూపరింటెండెంట్ సమీక్షలో ఈ రెండు సంస్థలు బిల్లులు చెల్లించడం లేదని గుర్తించారు. వెంటనే వారికి నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం జీజీహెచ్ నుంచి ఏపీఈపీడీసీఎల్కు సుమారు రూ.4 కోట్ల వరకు బకాయిలున్నట్లు సమాచారం. ఈ రెండు సంస్థలు బిల్లులు చెల్లిస్తేనే జీజీహెచ్పై భారం తప్పుతుంది.
బకాయిలు చెల్లించేలా చర్యలు
గతంలో జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు డయాలసిస్, ఎంఆర్ఐ చేసే సంస్థలతో ఒప్పందాలు ఉన్నాయి. సమీక్ష చేసి బిల్లుల బకాయిలు ఉన్నట్లు గుర్తించా. వెంటనే వారికి నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించాం. వారితోనే బిల్లుల బకాయిలు చెల్లించేలా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే ఒక సంస్థ చెల్లించేందుకు అంగీకరించింది. మరో సంస్థ ప్రతినిధులతో చర్చించి వారు వినియోగించిన బిల్లుల బకాయి మొత్తం చెల్లించేలా చర్యలు తీసుకుంటాం.
డాక్టర్ ఎం.లక్ష్మీ సూర్యప్రభ, సూపరింటెండెంట్, రాజమహేంద్రవరం జీజీహెచ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్లె మురవాలి.. ప్రగతి విరియాలి
[ 01-07-2024]
పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ విజయాన్ని అందుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ- పర్యావరణం, శాస్త్ర-సాంకేతిక శాఖల మంత్రి హోదాలో జిల్లాకు వస్తున్నారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం్ర కూటమి అభయం
[ 01-07-2024]
పింఛను డబ్బుల కోసం లబ్ధిదారులు ఇకపై ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. కూటమి ప్రభుత్వం ఈ నెల నుంచి నేరుగా ఇంటివద్దే అందించేందుకు చర్యలు చేపట్టింది. -
అడుగులు పడేనా?
[ 01-07-2024]
టీ-20 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ విజయపతాకం ఎగురవేసింది. 2007 సుదీర్ఘ పోరాటం అనంతరం మళ్లీ 2024లో సత్తాచాటింది. యువ, సీనియర్ల కలయికతో ప్రపంచ కప్ పోటీల్లో అడుగుపెట్టిన భారత్ సెమీఫైనల్ (ఇంగ్లాండ్), ఫైనల్స్ (దక్షిణాఫ్రికా)లో చిరకాల ప్రత్యర్థులను మట్టి కరిపించింది. -
అమృత హస్తాలు
[ 01-07-2024]
అమ్మ జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. అందుకే వాళ్లను వైద్యో నారాయణోహరి అంటారు. రోగుల ప్రాణాలు కాపాడేందుకు రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందిస్తూ, కుటుంబ జీవితానికి దూరమవుతూ వారు చేసే త్యాగాలు ఎన్నెన్నో. -
ఏడీబీ రోడ్డు పనులు ముమ్మరం
[ 01-07-2024]
ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు ఇక పూర్తిస్థాయిలో కొనసాగనున్నాయి. రాజానగరం, రంగంపేట మధ్య అత్యంత దయనీయంగా తయారైన ఈ రోడ్డు మరమ్మతుకు బీఎస్ఆర్ సంస్థ ఆదివారం చర్యలను చేపట్టింది. -
జీఎస్ఎల్కు ప్రముఖ వైద్యులు దత్తాత్రేయుడు రాక నేడు
[ 01-07-2024]
జీఎస్ఎల్ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రి 20వ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లాకు చెందిన, న్యూయార్క్ నివాసి, సుప్రసిద్ధ రేడియేషన్ అంకాలజిస్ట్ డా.నోరి దత్తాత్రేయుడు ప్రత్యేక అతిథిగా వస్తున్నారని వైద్య విద్యా సంస్థల చైర్మన్ డా.గన్ని భాస్కరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
మహిళా సాధికారతకు.. శేషకుమారి జీవితం నిదర్శనం
[ 01-07-2024]
మహిళా సాధికారతకు లక్కరాజు శేషకుమారి జీవితమే నిదర్శనమని, అమె గొప్ప వారసత్వ సంపద, స్ఫూర్తి పంచి వెళ్లారని ప్రముఖ వక్త, ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈవో, డైరక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక
[ 01-07-2024]
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను తొలి దశలో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. -
ఆనందంగా గడపాలని.. అంతలోనే అనంతలోకాలకు
[ 01-07-2024]
సెలవురోజు కావడంతో మనుమడితో ఆనందంగా గడపాలని ఆ తాతయ్య అనుకున్నారు. ఇంకొన్ని నిమిషాల్లో ఇంటికి వెళ్లిపోతామనగా ఊహించని ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం కూటమి అభయం
[ 01-07-2024]
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పండగకు వేళయ్యింది. ఉదయం 6 గంటల నుంచే గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో వీటిని లబ్ధిదారుల చెంతకు చేర్చనున్నారు. -
పవన్ రాకకు భారీ ఏర్పాట్లు
[ 01-07-2024]
పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ జిల్లాలో మూడు రోజులు పర్యటించానున్నారు. ఇందులో భాగంగా సోమవారం పిఠాపురం రానున్నారు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
[ 01-07-2024]
జిల్లాలో ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని, నమోదైన కేసును వెంటనే పరిష్కరించాలని ఎస్పీ సుసారపు శ్రీధర్ ఆదేశించారు. -
ఊరూరికీ.. అయిదేళ్ల మురికి..
[ 01-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో స్థానిక సంస్థలను పూర్తిగా అచేతనం చేసేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించారు. గ్రామాల్లో కుళాయి వేయాలన్నా, బ్లీచింగ్ చల్లించాలన్నా.. నిధుల కొరతతో ఇబ్బందిపడే దుస్థితి.