రుణ ప్రణాళిక @ 14,258.51 కోట్లు
జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) జిల్లాకు వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేసింది.
రుణ ప్రణాళిక జీ 14,258.51 కోట్లు
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అన్నదాత
జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) జిల్లాకు వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేసింది. దీనిలో భాగంగా డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ప్రాధాన్య, అప్రాధాన్య, ఇతర రంగాలకు కలిపి మొత్తంగా రూ.14,258 కోట్లతో నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా ఉన్న సాగు విస్తీర్ణం ఆధారంగా బ్యాంకర్లు రుణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. వ్యవసాయ రంగానికి బ్యాంకుల వారీగా ఏ మేరకు పంట రుణాలివ్వాలనేది దీనిలో కేటాయిస్తారు. ఆ ప్రకారం బ్యాంకులు అన్నదాతలకు సాగుకు అవసరమైన పెట్టుబడి రుణాలు మంజూరు చేస్తాయి. ఎన్నికల నియమావళి కారణంగా ప్రస్తుత సీజన్కు ఈ ప్రక్రియ రెండు నెలలపాటు ఆలస్యమైంది.
రంగాల వారీగా ఖరారు..
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల ఆధారంగా వాటికి రుణాల మంజూరును నిర్ణయిస్తారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, విద్య, గృహ నిర్మాణం తదితర రంగాలకు రుణ పరిమితి నిర్ణయించారు. దీనిలో వ్యవసాయ రంగానికి రూ.9190.51 కోట్లతో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా రూ.600 కోట్లు కేటాయించారు. వీటితోపాటు విద్య, గృహ నిర్మాణాలు, ఇతర రుణాలు కూడా మంజూరు చేయాలని నిర్ణయించారు. వార్షిక రుణ ప్రణాళిక ఖరారైనా, జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించాల్సిఉంది.
లక్ష్య నిర్దేశం ఇలా..
ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు అవసరాలకు అనుగుణంగా రుణాలకోసం రైతులు బ్యాంకులను ఆశ్రయిస్తారు. ఏటా వీరితోపాటు మిగిలిన రంగాలకు రుణ పరిమితి ఎంత కేటాయించాలో నాబార్డు స్పష్టం చేస్తుంది. జిల్లాలో సాగు విస్తీర్ణం, రైతులు, బ్యాంకుల సంఖ్య, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని పంట రుణాలు కేటాయిస్తారు.
వ్యవసాయ రంగానికి పెద్దపీట..
రుణాల మంజూరులో వ్యవసాయ రంగానికి మొదట ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యాన పంటలు, పాడి పరిశ్రమ, ఆధునిక సాంకేతిక వ్యవసాయ పరికరాల కొనుగోలు, బోర్లు, మోటార్లకు రుణాలు మంజూరు చేస్తారు. పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణం, ఎరువుల తయారీ, విత్తనోత్పత్తి, ఆహార శుద్ధి పరిశ్రమలకు, నిరుద్యోగులకు, మహిళా సంఘాల సభ్యులు స్వయం ఉపాధి పొందేందుకు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు కూడా రుణ ప్రణాళికలో ప్రాధాన్యం ఉంటుంది.
ప్రైవేటు బ్యాంకులపై అసంతృప్తి
రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిచ్చినా అన్నదాతల అవసరాల మేరకు రుణాలు మంజూరు కాక అధిక శాతం మంది పెట్టుబడికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి రైతులకు కలుగుతోంది. ప్రకృతి విపత్తులు సంభవిస్తే ఆ రుణాలు తీర్చేందుకు తిప్పలు పడాల్సిందే. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయం. ప్రైవేటు రంగాలకు చెందిన బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో భాగంగా రుణాల మంజూరుకు ప్రైవేటు బ్యాంకులు సహకరించడం లేదని బ్యాంకర్ల సమావేశంలో పలుమార్లు కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. గడిచిన అయిదేళ్లుగా అనేక మంది రైతులకు రుణాల మంజూరులో మొండిచేయే ఎదురైంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుండడంతో ఈ సారి తమకు రుణ బాధలు ఉండవనే అభిప్రాయం అన్నదాతల నుంచి వ్యక్తం అవుతోంది.
ఇవీ ప్రాధాన్య రంగాలు
విద్యార్థుల ఉన్నత చదువులకు రూ.7.50 లక్షల్లోపు, వ్యవసాయ రంగంలో రూ.3 లక్షల్లోపు, చిరువ్యాపారులకు రూ.35 వేలలోపు ఇచ్చే రుణాలన్నీ ప్రాధాన్యరంగంలోకే వస్తాయి. ఈ మొత్తం దాటితే అప్రాధాన్య రంగానికి మంజూరుచేసిన రుణంగా పరిగణిస్తారు. వీటికి అనుగుణంగానే ఈ రెండు రంగాలకు అనువుగా రుణ ప్రణాళిక ఖరారు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్లె మురవాలి.. ప్రగతి విరియాలి
[ 01-07-2024]
పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ విజయాన్ని అందుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ- పర్యావరణం, శాస్త్ర-సాంకేతిక శాఖల మంత్రి హోదాలో జిల్లాకు వస్తున్నారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం్ర కూటమి అభయం
[ 01-07-2024]
పింఛను డబ్బుల కోసం లబ్ధిదారులు ఇకపై ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. కూటమి ప్రభుత్వం ఈ నెల నుంచి నేరుగా ఇంటివద్దే అందించేందుకు చర్యలు చేపట్టింది. -
అడుగులు పడేనా?
[ 01-07-2024]
టీ-20 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ విజయపతాకం ఎగురవేసింది. 2007 సుదీర్ఘ పోరాటం అనంతరం మళ్లీ 2024లో సత్తాచాటింది. యువ, సీనియర్ల కలయికతో ప్రపంచ కప్ పోటీల్లో అడుగుపెట్టిన భారత్ సెమీఫైనల్ (ఇంగ్లాండ్), ఫైనల్స్ (దక్షిణాఫ్రికా)లో చిరకాల ప్రత్యర్థులను మట్టి కరిపించింది. -
అమృత హస్తాలు
[ 01-07-2024]
అమ్మ జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. అందుకే వాళ్లను వైద్యో నారాయణోహరి అంటారు. రోగుల ప్రాణాలు కాపాడేందుకు రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందిస్తూ, కుటుంబ జీవితానికి దూరమవుతూ వారు చేసే త్యాగాలు ఎన్నెన్నో. -
ఏడీబీ రోడ్డు పనులు ముమ్మరం
[ 01-07-2024]
ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు ఇక పూర్తిస్థాయిలో కొనసాగనున్నాయి. రాజానగరం, రంగంపేట మధ్య అత్యంత దయనీయంగా తయారైన ఈ రోడ్డు మరమ్మతుకు బీఎస్ఆర్ సంస్థ ఆదివారం చర్యలను చేపట్టింది. -
జీఎస్ఎల్కు ప్రముఖ వైద్యులు దత్తాత్రేయుడు రాక నేడు
[ 01-07-2024]
జీఎస్ఎల్ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రి 20వ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లాకు చెందిన, న్యూయార్క్ నివాసి, సుప్రసిద్ధ రేడియేషన్ అంకాలజిస్ట్ డా.నోరి దత్తాత్రేయుడు ప్రత్యేక అతిథిగా వస్తున్నారని వైద్య విద్యా సంస్థల చైర్మన్ డా.గన్ని భాస్కరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
మహిళా సాధికారతకు.. శేషకుమారి జీవితం నిదర్శనం
[ 01-07-2024]
మహిళా సాధికారతకు లక్కరాజు శేషకుమారి జీవితమే నిదర్శనమని, అమె గొప్ప వారసత్వ సంపద, స్ఫూర్తి పంచి వెళ్లారని ప్రముఖ వక్త, ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈవో, డైరక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక
[ 01-07-2024]
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను తొలి దశలో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. -
ఆనందంగా గడపాలని.. అంతలోనే అనంతలోకాలకు
[ 01-07-2024]
సెలవురోజు కావడంతో మనుమడితో ఆనందంగా గడపాలని ఆ తాతయ్య అనుకున్నారు. ఇంకొన్ని నిమిషాల్లో ఇంటికి వెళ్లిపోతామనగా ఊహించని ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం కూటమి అభయం
[ 01-07-2024]
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పండగకు వేళయ్యింది. ఉదయం 6 గంటల నుంచే గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో వీటిని లబ్ధిదారుల చెంతకు చేర్చనున్నారు. -
పవన్ రాకకు భారీ ఏర్పాట్లు
[ 01-07-2024]
పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ జిల్లాలో మూడు రోజులు పర్యటించానున్నారు. ఇందులో భాగంగా సోమవారం పిఠాపురం రానున్నారు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
[ 01-07-2024]
జిల్లాలో ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని, నమోదైన కేసును వెంటనే పరిష్కరించాలని ఎస్పీ సుసారపు శ్రీధర్ ఆదేశించారు. -
ఊరూరికీ.. అయిదేళ్ల మురికి..
[ 01-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో స్థానిక సంస్థలను పూర్తిగా అచేతనం చేసేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించారు. గ్రామాల్లో కుళాయి వేయాలన్నా, బ్లీచింగ్ చల్లించాలన్నా.. నిధుల కొరతతో ఇబ్బందిపడే దుస్థితి.