త్వరలో విద్యుత్తు బస్సులు..
కాకినాడ జిల్లాలో త్వరలో ఆర్టీసీ విద్యుత్తు బస్సులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
జిల్లాకు 50 కావాలని ప్రతిపాదనలు
ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు
డీపీటీవో ఎం.శ్రీనివాసరావు
సాంబమూర్తినగర్ (కాకినాడ), న్యూస్టుడే: కాకినాడ జిల్లాలో త్వరలో ఆర్టీసీ విద్యుత్తు బస్సులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాలుష్య రహిత బస్సులతో ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. స్మార్ట్సిటీలో స్మార్ట్ బస్సులు రోడ్డెక్కుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే తిరుపతిలో వీటిని విజయవంతంగా తిప్పుతున్నారు. జిల్లాకు 50 ఎలక్ట్రికల్ బస్సులు కావాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రజా రవాణాకు సంబంధించిన పలు అంశాలపై ఆయన ‘న్యూస్టుడే’తో మాట్లాడారు.
కాకినాడ ఆర్టీసీ బస్టాండు
హైదరాబాద్కు నాన్ ఏసీ స్లీపర్..
ఎన్నికలకు ముందు ప్రభుత్వం జిల్లాకు 23 కొత్త బస్సులు కేటాయించింది. ఇప్పటికే 8 సూపర్ లగ్జరీ బస్సులు డిపోకు చేరుకున్నాయి. వీటిని కాకినాడ-విజయవాడ మార్గంలో నడుపుతున్నాం. త్వరలో మిగిలిన బస్సులు అందుబాటులోకి వస్తాయి. మరో నాలుగు స్టార్లైనర్ (నాన్ ఏసీ స్లీపర్) బస్సులు రానున్నాయి. వీటిని తుని-హైదరాబాద్ రూటులో 2, కాకినాడ-హైదరాబాద్ మార్గంలో 2 చొప్పున తిప్పనున్నాం. పాత సూపర్లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు పల్లెవెలుగు బాడీ కట్టి 2025 మార్చిలోగా అందుబాటులో తెస్తాం.
అధునాతన బస్షెల్టర్లు..
స్మార్ట్సిటీలో భాగంగా నగరంలో పద్మప్రియ, జడ్పీ కూడలి, జగన్నాథపురం బ్రిడ్జి, అన్నమ్మ ఘాటీ ప్రాంతాల్లో అధునాతన బస్షెలర్ల ఏర్పాటుకు నగరపాలక సంస్థ అధికారులకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే అధికారులతో కలిసి ఈ విషయమై చర్చిస్తాం. బస్టాండ్లలో పోలీసు శాఖ సహకారంతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. రాత్రిపూట గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. బస్సులు, బస్టాండ్లలో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, ఇతర కార్యకలాపాలపై పటిష్ఠ నిఘా కొనసాగుతోంది.
డ్రైవర్లకు అవగాహన..
డిపోల్లో ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించి సూచనలు చేస్తున్నాం. వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. గ్యారేజీల్లో బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే రోడ్డెక్కిస్తున్నాం. డ్రైవర్ల నియామకంపై ప్రభుత్వానికి నివేదికలు పంపించాం.
జిల్లా పరిధిలో తుని, ఏలేశ్వరం, కాకినాడ ఆర్టీసీ డిపోల నుంచి పల్లెవెలుగు, విద్యార్థులకు బడిబస్సులు తిప్పుతున్నాం. రోజూ 288 బస్సులు 1.12 లక్షల కి.మీ. తిరుగుతూ 82 వేల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. రోజూ దాదాపు రూ.50 లక్షల మేర ఆదాయం వస్తోంది. కాకినాడ డిపో నుంచి ఇంద్ర, గరుడ, వెన్నెల, అమరావతి, నైట్రైడర్స్ తదితర ఏసీ బస్సుల ద్వారా మెరుగైన సేవలందిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్లె మురవాలి.. ప్రగతి విరియాలి
[ 01-07-2024]
పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ విజయాన్ని అందుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ- పర్యావరణం, శాస్త్ర-సాంకేతిక శాఖల మంత్రి హోదాలో జిల్లాకు వస్తున్నారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం్ర కూటమి అభయం
[ 01-07-2024]
పింఛను డబ్బుల కోసం లబ్ధిదారులు ఇకపై ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. కూటమి ప్రభుత్వం ఈ నెల నుంచి నేరుగా ఇంటివద్దే అందించేందుకు చర్యలు చేపట్టింది. -
అడుగులు పడేనా?
[ 01-07-2024]
టీ-20 ప్రపంచ కప్ పోటీల్లో భారత్ విజయపతాకం ఎగురవేసింది. 2007 సుదీర్ఘ పోరాటం అనంతరం మళ్లీ 2024లో సత్తాచాటింది. యువ, సీనియర్ల కలయికతో ప్రపంచ కప్ పోటీల్లో అడుగుపెట్టిన భారత్ సెమీఫైనల్ (ఇంగ్లాండ్), ఫైనల్స్ (దక్షిణాఫ్రికా)లో చిరకాల ప్రత్యర్థులను మట్టి కరిపించింది. -
అమృత హస్తాలు
[ 01-07-2024]
అమ్మ జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. అందుకే వాళ్లను వైద్యో నారాయణోహరి అంటారు. రోగుల ప్రాణాలు కాపాడేందుకు రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందిస్తూ, కుటుంబ జీవితానికి దూరమవుతూ వారు చేసే త్యాగాలు ఎన్నెన్నో. -
ఏడీబీ రోడ్డు పనులు ముమ్మరం
[ 01-07-2024]
ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు ఇక పూర్తిస్థాయిలో కొనసాగనున్నాయి. రాజానగరం, రంగంపేట మధ్య అత్యంత దయనీయంగా తయారైన ఈ రోడ్డు మరమ్మతుకు బీఎస్ఆర్ సంస్థ ఆదివారం చర్యలను చేపట్టింది. -
సత్యదేవుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
[ 01-07-2024]
అన్నవరం సత్యనారాయణ స్వామిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ.వి.రవీంద్రబాబు ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. -
జీఎస్ఎల్కు ప్రముఖ వైద్యులు దత్తాత్రేయుడు రాక నేడు
[ 01-07-2024]
జీఎస్ఎల్ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రి 20వ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణాజిల్లాకు చెందిన, న్యూయార్క్ నివాసి, సుప్రసిద్ధ రేడియేషన్ అంకాలజిస్ట్ డా.నోరి దత్తాత్రేయుడు ప్రత్యేక అతిథిగా వస్తున్నారని వైద్య విద్యా సంస్థల చైర్మన్ డా.గన్ని భాస్కరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
మహిళా సాధికారతకు.. శేషకుమారి జీవితం నిదర్శనం
[ 01-07-2024]
మహిళా సాధికారతకు లక్కరాజు శేషకుమారి జీవితమే నిదర్శనమని, అమె గొప్ప వారసత్వ సంపద, స్ఫూర్తి పంచి వెళ్లారని ప్రముఖ వక్త, ఎడెల్గివ్ ఫౌండేషన్ సీఈవో, డైరక్టర్ నగ్మా ముల్లా అన్నారు. -
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక
[ 01-07-2024]
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను తొలి దశలో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. -
ఆనందంగా గడపాలని.. అంతలోనే అనంతలోకాలకు
[ 01-07-2024]
సెలవురోజు కావడంతో మనుమడితో ఆనందంగా గడపాలని ఆ తాతయ్య అనుకున్నారు. ఇంకొన్ని నిమిషాల్లో ఇంటికి వెళ్లిపోతామనగా ఊహించని ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం కూటమి అభయం
[ 01-07-2024]
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పండగకు వేళయ్యింది. ఉదయం 6 గంటల నుంచే గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో వీటిని లబ్ధిదారుల చెంతకు చేర్చనున్నారు. -
పవన్ రాకకు భారీ ఏర్పాట్లు
[ 01-07-2024]
పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ జిల్లాలో మూడు రోజులు పర్యటించానున్నారు. ఇందులో భాగంగా సోమవారం పిఠాపురం రానున్నారు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
[ 01-07-2024]
జిల్లాలో ప్రతి పోలీసు అధికారి అప్రమత్తంగా ఉండాలని, నమోదైన కేసును వెంటనే పరిష్కరించాలని ఎస్పీ సుసారపు శ్రీధర్ ఆదేశించారు. -
ఊరూరికీ.. అయిదేళ్ల మురికి..
[ 01-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో స్థానిక సంస్థలను పూర్తిగా అచేతనం చేసేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించారు. గ్రామాల్లో కుళాయి వేయాలన్నా, బ్లీచింగ్ చల్లించాలన్నా.. నిధుల కొరతతో ఇబ్బందిపడే దుస్థితి.