మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.. ఆరుద్ర కుమార్తె వైద్యానికి సాయం అందజేత
కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలేనికి చెందిన వైకాపా బాధితురాలు ఆరుద్రకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారు. మంచం పట్టిన ఆమె కుమార్తె సాయిలక్ష్మీచంద్రకు అవసరమైన చికిత్స అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.
ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు
ఆరుద్రకు చెక్కు అందిస్తున్న అధికారి, చిత్రంలో సాయిలక్ష్మి
ఈనాడు, కాకినాడ: కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలేనికి చెందిన వైకాపా బాధితురాలు ఆరుద్రకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారు. మంచం పట్టిన ఆమె కుమార్తె సాయిలక్ష్మీచంద్రకు అవసరమైన చికిత్స అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. రాష్ట్ర సచివాలయంలోని నాలుగో బ్లాకులో అధికారులు బుధవారం తనకు చెక్కు రూపంలో ఈ సాయం అందించారని ఆరుద్ర వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ ‘‘జగన్ ప్రభుత్వంలో ఇస్తాం ఇస్తామన్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ నెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినప్పుడు ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం రూ.5 లక్షల చెక్కు ఇచ్చారు. నా బిడ్డకు తొలిసారిగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ మమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞతలు. మీ అందరి దీవెనల వల్లే నా కుమార్తె ఈ రోజు ప్రాణాలతో ఉంది.’’ అని అన్నారు. అన్నవరం, అమలాపురం, కాకినాడలలో తమను ఇబ్బందిపెట్టినవారిపై కేసులు నమోదుచేయాలని.. పోలీసుల మీద ప్రత్యేక కమిషన్ వేసి తన బిడ్డకు న్యాయం చేయాలని ఆరుద్ర కోరారు. కోర్టు కేసులు కొట్టించి తమ ఆస్తి తమకు ఇప్పించాలని.. ఈ పరిస్థితి తీసుకొచ్చిన వారిపై, తాము అప్పులపాలవడానికి కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్తి చేతికి అందక, కుమార్తె వైద్యానికి ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈవీఎంలను తప్పుపట్టడం హాస్యాస్పదం: సోము వీర్రాజు
[ 29-06-2024]
ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏ మాత్రం మారలేదని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. -
ఆ పోలీసులు.. వైకాపా వీరభక్తులు
[ 29-06-2024]
వైకాపా పాలనలో కొంతమంది పోలీసు అధికారులు తమ స్వామి భక్తి చాటుకున్నారు. తమ బాధ్యతలను వదిలేసి, వైకాపా నాయకులు ఏం చెప్పినా చేసేందుకు వెనుకడుగు వేయలేదు. -
బియ్యం బొక్కినోళ్లకు వణుకు
[ 29-06-2024]
గోదాములు, మిల్లుల్లో టన్నులకొద్దీ అక్రమ బియ్యం నిల్వలు.. ఎక్కడికక్కడ చౌక బియ్యం గోనె సంచులు.. పరిసరాల్లో పడేసిన ట్యాగులు..పేదలకు అందాల్సిన సరకును వైకాపా నేతలు తమ అక్రమ ఆర్జనకు ఏరీతిన వాడుకుంటున్నారో శుక్రవారం తేటతెల్లమైంది. -
వర్సిటీలు.. వైకాపా రాజకీయ నిలయాలు
[ 29-06-2024]
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ...వారి బంగారు భవితకు బాటలు వేయాల్సిన విశ్వవిద్యాలయాల్లో వైకాపా అయిదేళ్ల పాలనలో రాజకీయ జోక్యం మితిమీరింది..వారి అడుగులకు మడుగులొత్తినవారికి ఇక్కడ ఉన్నత హోదాలు దక్కాయి. -
యాప్ ఊడ్చేసింది
[ 29-06-2024]
ఎన్ని ఆన్లైన్ మోసాలు వెలుగుచూస్తున్నా ఇంకా కొన్ని యాప్లలో పెట్టుబడి పెట్టి పలువురు నిండా మునిగిపోతున్నారు. -
చివరి లబ్ధిదారు వరకు ప్రభుత్వ పథకాలు
[ 29-06-2024]
ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను చివరి లబ్ధిదారుడి వరకు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కొత్త కలెక్టర్ పి.ప్రశాంతి చెప్పారు. -
జీజీహెచ్కు విద్యుత్తు బిల్లుల షాక్
[ 29-06-2024]
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రికి విద్యుత్తు షాక్ తగిలింది. ఆసుపత్రిలో ఎంఆర్ఐ, డయాలసిస్ సేవలందిస్తున్న ప్రైవేటు సంస్థలు మూడేళ్ల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో రూ.4 కోట్ల వరకు బకాయిలున్నట్లు తాజాగా వెలుగుచూసింది. -
విచారణ దశలో కేసులపై దృష్టి సారించాలి: ఎస్పీ
[ 29-06-2024]
పెండింగ్, విచారణ దశలో కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. -
రుణ ప్రణాళిక @ 14,258.51 కోట్లు
[ 29-06-2024]
జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) జిల్లాకు వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేసింది. -
త్వరలో విద్యుత్తు బస్సులు..
[ 29-06-2024]
కాకినాడ జిల్లాలో త్వరలో ఆర్టీసీ విద్యుత్తు బస్సులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
అప్రమత్తమై.. అతివను రక్షించారు..
[ 29-06-2024]
భర్తతో విభేదాల కారణంగా నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళను పోలీసులు, మత్స్యకారులు అప్రమత్తమై రక్షించిన ఘటన రాజమహేంద్రవరం రోడ్డు-రైలు వంతెనపై శుక్రవారం చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేయూ హాస్టల్ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం
-
రాజీనామాపై దోబూచులాట.. వైవీయూ వీసీ, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని ఆందోళన
-
‘మర్డర్ ఆఫ్ రేణుకాస్వామి’ పేరిట వికీపీడియాలో కొత్త పేజీ..!
-
ఈవీఎంలను తప్పుపట్టడం హాస్యాస్పదం: సోము వీర్రాజు
-
సర్కారు జాగా దర్జాగా కబ్జా.. ఇంటి నంబర్లతో వెయ్యి గజాలకు దరఖాస్తు
-
ఆ పోలీసులు.. వైకాపా వీరభక్తులు