నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా : మంత్రి దుర్గేశ్
కడియం : గ్రామీణ నియోజకవర్గంతో తనకు 15 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉందని, ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని కడియపులంకలో మంత్రి పర్యటించారు.
కడియం : గ్రామీణ నియోజకవర్గంతో తనకు 15 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉందని, ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని కడియపులంకలో మంత్రి పర్యటించారు. ఈసందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను పర్యటక క్షేత్రాలుగా నిర్మించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా రాజమహేంద్రవరంలో రైల్వే బ్రిడ్జిని హేవ్ లాక్ బ్రిడ్జిగా మార్పు చేయడంతోపాటు కడియం నర్సరీలు, పిచ్చుకలంక అందాలను పర్యటక క్లస్టర్గా ఏర్పాటుచేసేందుకు నివేదికలు తయారుచేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉండేందుకు పర్యావరణ అనుమతులను తుంగలో తొక్కుతూ రూ.కోట్లు ఖర్చు చేసి రుషికొండలో ప్యాలెస్లు నిర్మించారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నీటి వరద
[ 21-07-2024]
ఉమ్మడి జిల్లాలో 24 వేల హెక్టార్లలో వరి, 300 హెక్టార్లలోని ఉద్యాన పంటలు ముంపులో ఉన్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 187 గ్రామాల్లో వర్షాల ప్రభావం ఉంది. 1.87 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు చేపట్టగా.. ఇప్పటివరకు 87,712 ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. -
స్వచ్ఛ సంకల్పం.. ఆరోగ్య భాగ్యం
[ 21-07-2024]
వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం, కాలుష్యం కట్టడి, పర్యావరణ పరిరక్షణ, కాలానుగుణ వ్యాధులు తదితర అంశాలపై విద్యాలయాలు, గ్రంథాలయాల్లో క్విజ్, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహించడం. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో ప్రధాన కూడళ్లలో అవగాహన ప్రదర్శనలు నిర్వహించడం. -
కాకినాడలో కారు బీభత్సం
[ 21-07-2024]
కాకినాడ కల్పన కూడలి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. -
రహదారుల ‘విశ్వరూపం’!
[ 21-07-2024]
జిల్లా కేంద్రం అమలాపురంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. దీంతో నిత్యం జిల్లా నలుమూలల నుంచి వివిధ అవసరాల నిమిత్తం అమలాపురం వచ్చివెళ్లే వాహనదారులు నానా పాట్లుపడుతున్నారు. -
ఏటిగట్టుకు రక్షణ కల్పించండి
[ 21-07-2024]
వృద్ధ గౌతమి గోదావరి నది కుడి ఏటిగట్టు రోడ్డు 50 మీటర్ల మేర కుండలేశ్వరం సమీపంలో కుంగింది. వరదలు పెరుగుతున్న తరుణంలో ఇక్కడి గట్టు బలహీనంగా ఉండటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కోనసీమ రైల్వేలైనుకు నిధులపై చర్చిస్తా..
[ 21-07-2024]
కోనసీమవాసుల చిరకాల కల.. తన తండ్రి దివంగత లోక్సభ స్పీకర్ బాలయోగి ఆశయమైన కోనసీమ రైల్వేలైనుకు నిధులు కేటాయించాలని కోరుతూ పార్లమెంటులో చర్చిస్తానని అమలాపురం ఎంపీ హరీష్మాథుర్ తెలిపారు. -
వేంకటేశం స్మరామి
[ 21-07-2024]
చందన స్వరూపుడు వేంకటేశ్వరస్వామి కొలువైన కోనసీమ తిరుమల వాడపల్లి పుణ్యక్షేత్రం శనివారం భక్తజనంతో కిటకిటలాడింది. వేకువజామున సుప్రభాత సేవ, తొలి హారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. -
రాజమహేంద్రవరం కమిషనర్గా కేతన్ గార్గ్
[ 21-07-2024]
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా కేతన్ గార్గ్ నియమితులయ్యారు. అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్గా ఉన్న ఆయనను కమిషనర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. -
సార్వత్రిక సమరాన్ని తలపించేలా పోలింగ్
[ 21-07-2024]
రాజమహేంద్రవరంలో ఆర్యాపురం అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు ఎన్నికలు శనివారం సార్వత్రిక ఎన్నికలను తలపించాయి. వర్షం పడుతున్నా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ హక్కు వినియోగించుకున్నారు. -
వైౖకాపా అవే అడ్డదారులు
[ 21-07-2024]
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో పలు అడ్డదారుల్లో గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నించిన వైకాపా నాయకులు.. స్థానిక సహకార బ్యాంకు ఎన్నికల్లోనూ అదే తరహా కుయుక్తులు పన్నారు. -
మనసుపెట్టి చేయండి... లేకపోతే వెళ్లిపోండి: ఎమ్మెల్యే బత్తుల
[ 21-07-2024]
నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. పాత చెత్త ఏమైనా బుర్రలో ఉంటే తీసేసి మనసు పెట్టి చేయండి. లేకపోతే వెళ్లిపోండి’ అంటూ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరోక్షంగా అధికారులను హెచ్చరించారు. -
గల్లంతయిన ఆస్ట్రేలియా ఆశలు
[ 21-07-2024]
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని ఆ యువకుడు కలలు కన్నాడు. వీసా కూడా వచ్చింది. ఇంకో నెలలో ఆ కల నెరవేరనుంది. ఇంతలో అతడు గోదావరిలో గల్లంతవ్వడం ఆ కుటుంబాన్ని కలచి వేస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ శక్తిని అనుమానిస్తే.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: నెతన్యాహు
-
గురుపౌర్ణమి మహోత్సవంలో సీఎం చంద్రబాబు
-
హూతీల బాలిస్టిక్ క్షిపణి దాడి: మధ్యలోనే కూల్చేసిన ఇజ్రాయెల్
-
భారీ వర్షాలు.. భద్రాద్రి జిల్లాలోని గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
-
ఇద్దరు హీరోయిన్స్తో డేట్ చేశా.. చీటర్ అన్నారు: రణ్బీర్ కపూర్
-
ప్రజాస్వామ్యం కోసం బుల్లెట్ తీసుకున్నా: ట్రంప్