logo

నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా : మంత్రి దుర్గేశ్‌

కడియం : గ్రామీణ నియోజకవర్గంతో తనకు 15 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉందని, ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని కడియపులంకలో మంత్రి పర్యటించారు.

Published : 26 Jun 2024 14:24 IST

కడియం : గ్రామీణ నియోజకవర్గంతో తనకు 15 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉందని, ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని కడియపులంకలో మంత్రి పర్యటించారు. ఈసందర్భంగా  రాష్ట్రంలోని పలు ప్రాంతాలను పర్యటక క్షేత్రాలుగా నిర్మించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా రాజమహేంద్రవరంలో  రైల్వే బ్రిడ్జిని హేవ్‌ లాక్‌ బ్రిడ్జిగా మార్పు చేయడంతోపాటు కడియం నర్సరీలు, పిచ్చుకలంక అందాలను  పర్యటక క్లస్టర్‌గా ఏర్పాటుచేసేందుకు నివేదికలు తయారుచేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉండేందుకు  పర్యావరణ అనుమతులను తుంగలో తొక్కుతూ రూ.కోట్లు ఖర్చు చేసి  రుషికొండలో ప్యాలెస్‌లు నిర్మించారన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు