Kakinada: జనానికి మండింది.. జగన్ పేరు ఊడింది
‘మా ఊరు పోలవరం.. మా గ్రామానికి వెళ్లే మార్గంలో భారీ ఆర్చి కట్టి ‘జగన్మోహనపురం’ అని పేరు రాశారు. ఇన్నాళ్లూ అభ్యంతరం చెబితే వైకాపా వారు బెదిరించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది.
జగన్మోహనపురం పేరు తొలగించి
జనసేన జెండా ఎగరేసిన యువత
జగన్ పేరుతో ఏర్పాటుచేసిన అక్షరాలను తొలగించి.. జనసేన జెండా ఎగరవేస్తున్న యువకులు
ఈనాడు, కాకినాడ: ‘మా ఊరు పోలవరం.. మా గ్రామానికి వెళ్లే మార్గంలో భారీ ఆర్చి కట్టి ‘జగన్మోహనపురం’ అని పేరు రాశారు. ఇన్నాళ్లూ అభ్యంతరం చెబితే వైకాపా వారు బెదిరించారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది.. నిగ్గదీసే ధైర్యం వచ్చింది’ అంటూ కొందరు యువత సంఘటితమై ఆర్చి ఎక్కి జగన్ చిత్రాలు తొలగించారు.. కాకినాడ గ్రామీణ మండలం పోలవరంలో ఇది చోటుచేసుకుంది. తమ్మవరం పంచాయతీలోని పోలవరం గ్రామానికి వెళ్లే మార్గంలో ఓ పక్కన నేమాం లేఅవుట్ (జగనన్న కాలనీ) ఉంది. వైకాపా ప్రభుత్వం నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా కాలనీల్లో ఆర్చిలు, పైలాన్లతో హడావుడి చేసిన విషయం తెలిసిందే. 2020 డిసెంబర్ 25న యు.కొత్తపల్లి మండలం కొమరగిరి లేఅవుట్లో రాష్ట్రవ్యాప్త ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్న అప్పటి సీఎం జగన్ను ఆకర్షించేందుకు మార్గమధ్యలోని ఈ పోలవరం గ్రామం వద్ద భారీ ఆర్చి నిర్మించారు. దానికి జగన్మోహనపురం పేరుపెట్టి రెండువైపులా జగన్ చిత్రాలు పెట్టారు. ఊరు పోలవరం అయితే జగన్ పేరు పెట్టారేంటని ప్రశ్నించినా వైకాపా నాయకులు లెక్కచేయలేదు. దీంతో ఆగ్రహంతో ఉన్న కొందరు యువత ఆర్చి ఎక్కి పేర్లు పీకేసి తమ నిరసన తెలిపారు. అక్కడ జనసేన జెండా ఎగరవేశారు. ఇన్నాళ్లూ ఓపిక పట్టాం.. ఇక తగ్గమని తేల్చిచెప్పేశారు. ప్రశ్నించినవారికి ..‘నేమాం కాలనీ దగ్గర ఆర్చి కట్టుకుని పేరు పెట్టుకోండి.. మా ఊరికి జగన్ పేరేంటి.’. అని సమాధానం ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈవీఎంలను తప్పుపట్టడం హాస్యాస్పదం: సోము వీర్రాజు
[ 29-06-2024]
ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏ మాత్రం మారలేదని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. -
ఆ పోలీసులు.. వైకాపా వీరభక్తులు
[ 29-06-2024]
వైకాపా పాలనలో కొంతమంది పోలీసు అధికారులు తమ స్వామి భక్తి చాటుకున్నారు. తమ బాధ్యతలను వదిలేసి, వైకాపా నాయకులు ఏం చెప్పినా చేసేందుకు వెనుకడుగు వేయలేదు. -
బియ్యం బొక్కినోళ్లకు వణుకు
[ 29-06-2024]
గోదాములు, మిల్లుల్లో టన్నులకొద్దీ అక్రమ బియ్యం నిల్వలు.. ఎక్కడికక్కడ చౌక బియ్యం గోనె సంచులు.. పరిసరాల్లో పడేసిన ట్యాగులు..పేదలకు అందాల్సిన సరకును వైకాపా నేతలు తమ అక్రమ ఆర్జనకు ఏరీతిన వాడుకుంటున్నారో శుక్రవారం తేటతెల్లమైంది. -
వర్సిటీలు.. వైకాపా రాజకీయ నిలయాలు
[ 29-06-2024]
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ...వారి బంగారు భవితకు బాటలు వేయాల్సిన విశ్వవిద్యాలయాల్లో వైకాపా అయిదేళ్ల పాలనలో రాజకీయ జోక్యం మితిమీరింది..వారి అడుగులకు మడుగులొత్తినవారికి ఇక్కడ ఉన్నత హోదాలు దక్కాయి. -
యాప్ ఊడ్చేసింది
[ 29-06-2024]
ఎన్ని ఆన్లైన్ మోసాలు వెలుగుచూస్తున్నా ఇంకా కొన్ని యాప్లలో పెట్టుబడి పెట్టి పలువురు నిండా మునిగిపోతున్నారు. -
చివరి లబ్ధిదారు వరకు ప్రభుత్వ పథకాలు
[ 29-06-2024]
ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను చివరి లబ్ధిదారుడి వరకు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కొత్త కలెక్టర్ పి.ప్రశాంతి చెప్పారు. -
జీజీహెచ్కు విద్యుత్తు బిల్లుల షాక్
[ 29-06-2024]
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రికి విద్యుత్తు షాక్ తగిలింది. ఆసుపత్రిలో ఎంఆర్ఐ, డయాలసిస్ సేవలందిస్తున్న ప్రైవేటు సంస్థలు మూడేళ్ల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో రూ.4 కోట్ల వరకు బకాయిలున్నట్లు తాజాగా వెలుగుచూసింది. -
విచారణ దశలో కేసులపై దృష్టి సారించాలి: ఎస్పీ
[ 29-06-2024]
పెండింగ్, విచారణ దశలో కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. -
రుణ ప్రణాళిక @ 14,258.51 కోట్లు
[ 29-06-2024]
జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) జిల్లాకు వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేసింది. -
త్వరలో విద్యుత్తు బస్సులు..
[ 29-06-2024]
కాకినాడ జిల్లాలో త్వరలో ఆర్టీసీ విద్యుత్తు బస్సులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
అప్రమత్తమై.. అతివను రక్షించారు..
[ 29-06-2024]
భర్తతో విభేదాల కారణంగా నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళను పోలీసులు, మత్స్యకారులు అప్రమత్తమై రక్షించిన ఘటన రాజమహేంద్రవరం రోడ్డు-రైలు వంతెనపై శుక్రవారం చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
డీఎస్ మృతిపట్ల సీఎం రేవంత్రెడ్డి సంతాపం
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
-
భార్యను నమ్మించి హతమార్చిన భర్త
-
ఊదమంటే.. బ్రీత్ ఎనలైజర్ లాక్కెళ్లాడు!
-
కాసుల మత్తులో ‘దందా’నతాన.. అనుచరుల బార్ల కోసం మద్యం దుకాణాల మార్పు