logo

Chittoor: తెదేపా ఫ్లెక్సీలు చించివేత

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుప్పంలో పర్యటించిన నేపథ్యంలో తెదేపా శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Published : 02 Jul 2024 16:24 IST

కుప్పం పట్టణం: ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుప్పంలో పర్యటించిన నేపథ్యంలో తెదేపా శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెదేపా ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఫ్లెక్సీలు చించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేస్తున్నారు. కుప్పం పట్టణంలోని తెదేపా కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కాగా ఫ్లెక్సీలు చించివేసిన వారి పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని