YSRCP: వైకాపా విధేయుల్లో వణుకు.. అంటకాగిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఆరా
వారంతా ప్రజల కష్టాన్ని జీతంగా తీసుకునే ఉద్యోగులు. కండువాలు కప్పుకోకపోయినా వైకాపాకు అంటకాగారు.
వారి తీరుపై నివేదికలు సిద్ధం
పోటీ చేయడానికి వస్తే కొట్టారు
గూడూరు, న్యూస్టుడే: వారంతా ప్రజల కష్టాన్ని జీతంగా తీసుకునే ఉద్యోగులు. కండువాలు కప్పుకోకపోయినా వైకాపాకు అంటకాగారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని విర్రవీగారు. ప్రజా ప్రయోజనాలు తోసిరాజని ఫక్తు రాజకీయ నాయకుల్లా చలామణి అయ్యారు. ప్రతిపక్షాలే లక్ష్యంగా చెలరేగారు. సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. అందినకాడికి దోచేశారు. ఇలా వారి కదలికలపై నిఘా కన్ను ఆరా తీస్తోంది. తెదేపా అధికారంలోకి రావడంతో ఆయా అధికారులు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు. వారి తీరుపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు.
పురపాలిక ఎన్నికల్లో మరో సీఐ బెదిరింపులు
నాయుడుపేటలో పనిచేసిన మరో సీఐ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలను బెదిరించి భయపెట్టారు. పురపాలక ఎన్నికల్లో తెదేపాకు చెందిన బీసీ నేతల మునిరాజాపై వైకాపా నేత కామిరెడ్డి రాజారెడ్డి దాడి చేసి భయపెట్టినా తిరిగి మునిరాజాను బెదిరించిన పరిస్థితి. వైకాపా నేతలు పట్టణంలో హల్చల్ చేసినా ప్రతిపక్ష పార్టీ నేతలను గృహనిర్బంధం చేశారు. పోటీ చేస్తే ‘ఖబడ్దార్.. మీపై గంజా కేసులే..’ అంటు భయపెట్టారు. ఇసుక, మట్టి, మాఫియా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. వసూళ్లలో కొంత భాగం నియోజకవర్గ ప్రతినిధి గన్మెన్లు, డ్రైవర్లకు మామూళ్ల ఏర్పాటు చేయించారు.
పసుపు చొక్కా విప్పకుంటే జైలుకే..
వైకాపా నేతలకు అంటకాగిన నాయుడుపేటలో పనిచేసిన ఓ ఎస్సై పురపాలిక ఎన్నికల్లో ఇష్టారీతిన వ్యవహరించారు. ఏకంగా ఎస్సీ నేత దార్ల రాజేంద్రను చొక్కా విప్పించే వరకు వదలిపెట్టలేదు. లేకుంటే జైలుకెళ్తారని బెదిరించారు. స్థానిక ర.భ అతిథిగృహం వద్ద అడ్డుకుని అక్కడి నుంచి ఏకంగా స్టేషన్కు తీసుకెళ్లారు.
‘ఎమ్మెల్యేపైనే పోస్టు పెడతావా’అంటూఎస్సై..
ఓజిలిలో పనిచేసిన ఓ ఎస్సై సూళ్లూరుపేటలో పనిచేసిన సమయంలో హల్చల్ చేశారు. ఆయనకు ఎదురు తిరిగితే కేసులే అన్నట్లు వ్యవహరించారు. ఆయన అక్రమాలు బయట పెట్టిన వైకాపా నేత సునీల్రెడ్డి, బాబురెడ్డిలను బెదిరించి స్టేషన్కు పిలిచి కేసులు పెట్టారు. వారు మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసే వరకు వ్యవహారం నడిచింది. బాబురెడ్డి ఎమ్మెల్యేపై సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టినందుకు బెదిరించి కొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాహనాల అద్దెబకాయిలు చెల్లించాలని డిమాండ్
[ 08-07-2024]
ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ వాహనాలకు సంబంధించి అద్దెబకాయిలను చెల్లించాలని నవ యువ కార్ డ్రైవర్, ఓనర్స్ సంక్షేమ సంఘం సహకార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. -
చంద్రన్న తోడు.. అభివృద్ధి జోడు
[ 08-07-2024]
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. వైకాపా పాలనలో ఐదేళ్లూ ఎక్కడవేసిన గొంగలి అక్కడేలా మారిన అభివృద్ధిని గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రే నేరుగా రంగంలోకి దిగారు. -
ఇసుక... ఇక చౌక
[ 08-07-2024]
వైకాపా ప్రభుత్వ ఇసుక విధానంతో ఐదేళ్లూ అల్లాడిపోయిన సామాన్య ప్రజలకు ఊరట లభించనుంది.. తెదేపా ప్రభుత్వం ఆమోదించిన నూతన విధానం నేటి నుంచే అమల్లోకి రానుంది.. కుదేలైన నిర్మాణ రంగం మళ్లీ ఊపందుకుని, కూలీలకూ చేతినిండా పని దొరకనుంది. -
ఎన్నేళ్లిలా..!
[ 08-07-2024]
శ్రీకాళహస్తీశ్వరాలయంలో బృహత్తర ప్రణాళిక అమలుకు గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. భూసేకరణలోనూ సింహభాగం అప్పుడే పూర్తయింది. -
తిరుమలలో.. దళారులపై నిఘా
[ 08-07-2024]
తిరుమలలో తిష్ఠవేసిన దళారులపై అధికారులు దృష్టిసారించారు. నూతన ఈవో జె.శ్యామలరావు ఆదేశాలతో దర్శన టికెట్లు, గదులను అధిక ధరలకు విక్రయించే వారిపై సీవీఎస్వో నరసింహకిశోర్, డీఎస్పీ శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. -
స్మార్ట్సిటీ పథకం.. కాలపరిమితి పొడిగింపు
[ 08-07-2024]
తిరుపతి స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ కాలపరిమితి మరో తొమ్మిది నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిని 2024 జూన్ 30లోగా పూర్తిచేయడం లక్ష్యం. రూ.500 కోట్ల విలువైన మరో 23 ప్రాజెక్టులు.. -
చేపల మార్కెట్ కలేనా..?
[ 08-07-2024]
నిధులున్నా చేపల మార్కెట్ నిర్మాణంలో కలగా మారుతోంది. గడిచిన ఏడేళ్లుగా అధికారులు మార్కెట్లు నిర్మాణానికి చొరవ చూపడంలేదు. జిల్లాలోని పుత్తూరు, -
నడుస్తూ.. నడిపిస్తూ
[ 08-07-2024]
నడిపించడం గొప్ప అన్నారు పెద్దలు. కుటుంబానికి వెన్నెముక వనితే.. అటు ఇంటి పనులు, మరోవైపు ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ.. -
దుగరాజపట్నం పోర్టుకు అడుగులు
[ 08-07-2024]
దుగరాజపట్నం పోర్టు పనుల్లో కదలిక రానుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కేంద్ర సాయాన్ని కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇదే విషయమై ఇటీవల చర్చించగా సానుకూలత వ్యక్తమైంది. -
పాలకుల పాపాలకు.. పరిహారమేదీ?
[ 08-07-2024]
జ్ఞానం నిర్మోచనం స్త్రీణాం- జ్ఞాన సముపార్జన ద్వారా స్త్రీకి విముక్తి.. అనే నినాదంతో 40 ఏళ్ల కిందట మహిళల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం తిరుపతిలో ఆవిర్భవించింది. -
ఇంకెన్ని అక్రమాలున్నాయో..?
[ 08-07-2024]
పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన నిధుల స్వాహా పర్వం జడ్పీ వర్గాల్లో దుమారం రేపుతోంది.. ఇలాంటి కుంభకోణాలను మాజీ సీఈవో ప్రభాకరరెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఇంకెన్ని మండలాల్లో దాచిపెట్టారనే విషయమై ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లా అభివృద్ధి.. అన్నదాతల అభ్యున్నతే లక్ష్యం
[ 08-07-2024]
జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయ ఆవరణలో ఆదివారం చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల తెదేపా ప్రజాప్రతినిధులు, -
జులి.. ఇక లేదు
[ 08-07-2024]
తిరుపతి ఎస్వీ జూ పార్కులో ఆదివారం జులి(5) అనే ఆడపులి అనారోగ్యంతో మృతి చెందిందని జూ క్యూరేటర్ సెల్వం తెలిపారు. -
తితిదేలో అవినీతి, అక్రమాలు నిగ్గు తేల్చండి
[ 08-07-2024]
ఐదేళ్లుగా తితిదేలో జరిగిన అక్రమాలు, అవినీతి కుంభకోణాలను నిగ్గు తేల్చాలని భాజపా నాయకులు నవీన్కుమార్ రెడ్డి కోరారు. -
సుపథం మార్గంలో ప్రమాదకరంగా గోడ
[ 08-07-2024]
శ్రీవారి ఆలయానికి దక్షిణం వైపున ఉన్న సుపథం ప్రవేశమార్గం సమీపంలోని హథీరాంజీ మఠం గోడ కూలిపోయే స్థితిలో ప్రమాదకరంగా ఉంది. -
ఇండోర్ స్టేడియం కూల్చివేత
[ 08-07-2024]
ముంబై- చెన్నై జాతీయ రహదారి పక్కన పుంగనూరు పట్టణం కొత్తఇండ్లు సరిహద్దులోని ఇండోర్ షటిల్ కోర్టు స్టేడియాన్ని శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యంత్రాలతో నేలమట్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కజిరంగ పార్క్ను ముంచెత్తిన వరదలు.. వన్యప్రాణులు మృత్యువాత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
టీమ్ఇండియాతో టీ20, వన్డే సిరీస్.. శ్రీలంక హెడ్ కోచ్గా జయసూర్య
-
మంచు విష్ణుని కలిసిన హేమ.. నిర్దోషినంటూ లేఖ
-
భారీ వర్షాల ఎఫెక్ట్.. 27 విమానాల దారి మళ్లింపు..!
-
కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తాం: సీఎం రేవంత్రెడ్డి