పెరగని సీట్లు..తరగని డిమాండు
తితిదే కళాశాలల్లో ప్రవేశాలు కష్టతరంగా మారాయి. వీటిలో నామమాత్రం రుసుముతో నాణ్యమైన విద్యనందించడంతోపాటు వసతి, భోజనం కల్పిస్తుండటంతో ప్రవేశాలకు ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది
తితిదే కళాశాలలో ప్రవేశాలకు అష్టకష్టాలు
పాలకులు స్పందించాలంటున్న తల్లిదండ్రులు
శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల
మహిళా వర్సిటీ (తిరుపతి): తితిదే కళాశాలల్లో ప్రవేశాలు కష్టతరంగా మారాయి. వీటిలో నామమాత్రం రుసుముతో నాణ్యమైన విద్యనందించడంతోపాటు వసతి, భోజనం కల్పిస్తుండటంతో ప్రవేశాలకు ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. పది పూర్తవగానే అధికశాతం శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాలను ఎంచుకుంటున్నారు. పదేళ్లుగా కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు ప్రైవేటు కళాశాలల్లో చదివే విద్యార్థినులతో సమానంగా, వారికంటే ఎక్కువగా మార్కులు సాధిస్తున్నారు. ఎంసెట్లో మంచి ర్యాంకులు పొందుతున్నారు.
విన్నవించినా ఫలితం శూన్యం
కళాశాలలో సీట్ల సంఖ్యను పెంచాలని వైకాపా ప్రభుత్వంలోని తితిదే అధికారులకు కళాశాల అధికారులు, విద్యార్థినుల తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాలు విన్నవించినా ఎలాంటి ఫలితం లభించలేదు. నూతన ఈవోగా నియమితులైన శ్యామలరావుకు విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు, పలువురు రాజకీయ నాయకులు ఇదే విషయమై విన్నవించారు.
నిరాశతో వెనుదిరిగి..
చిత్తూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలతోపాటు ఇతర జిల్లాల విద్యార్థులు ప్రవేశాలపై ఆసక్తి చూపుతున్నారు. మంగళవారంతో స్పాట్ ప్రవేశాలు ముగియగా పరిమిత సీట్లు ఉండటంతో మంచి మార్కులు సాధించినప్పటికీ సీటు లభించక ఎంతోమంది విద్యార్థినులు నిరాశతో వెనుదిరిగారు.
ఎనిమిదేళ్లుగా ఇంతే..
కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ, సీఈఎల్ కోర్సులను తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో రెండు సెక్షన్లుగా నిర్వహిస్తున్నారు. మొత్తం ప్రథమ సంవత్సరంలో 968 సీట్లు ఉండగా ఈ సంఖ్య ఎనిమిదేళ్లుగా పెంచకపోవడంపై ఆవేదన వ్యక్తమవుతోంది.]
వసతిగృహంలో ఇదే ఇబ్బంది
కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో మొత్తం 1936 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో ప్రథమ సంత్సరం నుంచి 450, ద్వితీయ సంవత్సరం నుంచి 450 మంది విద్యార్థినులు కలిపి మొత్తం 900 మంది విద్యార్థినులకు మాత్రమే వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నారు. మిగిలిన వారు బయట ప్రైవేటు వసతి గృహాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో భద్రత కొరవడి విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కనీసం రెండువేలమందికి వసతి కల్పిస్తే బాగుంటుందని కోరుతున్నారు.
ప్రభుత్వ కళాశాల ఏదీ?
విద్యాకేంద్రంగా భాసిల్లుతున్న తిరుపతిలో తితిదే ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలలు తప్పితే ఇప్పటివరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదు. ఈ కళాశాలల్లో పరిమిత సీట్లు ఉండటంతో అప్పులు చేసి ప్రైవేటు కళాశాలల్లో చేర్చుతున్నారు. పద్మావతి జూనియర్ కళాశాలలో సైన్స్ గ్రూపుకు రూ.4900, ఆర్ట్స్ గ్రూపుకు రూ.3970, హాస్టల్కు రూ.3025 చెల్లిస్తే చాలు. ప్రైవేటు కళాశాలల ఫీజులతో పోల్చితే ఈ ఫీజు చాలా తక్కువగా ఉండటంతో పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తితిదే కళాశాలలో సీటువస్తే బాగుంటుందని ఆశ పడుతున్నారు. ఉన్నతాధికారులు అధికారులు స్పందించి సీట్ల సంఖ్యను పెంచితే బాగుంటుందని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రన్న తోడు.. అభివృద్ధి జోడు
[ 08-07-2024]
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. వైకాపా పాలనలో ఐదేళ్లూ ఎక్కడవేసిన గొంగలి అక్కడేలా మారిన అభివృద్ధిని గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రే నేరుగా రంగంలోకి దిగారు. -
ఇసుక... ఇక చౌక
[ 08-07-2024]
వైకాపా ప్రభుత్వ ఇసుక విధానంతో ఐదేళ్లూ అల్లాడిపోయిన సామాన్య ప్రజలకు ఊరట లభించనుంది.. తెదేపా ప్రభుత్వం ఆమోదించిన నూతన విధానం నేటి నుంచే అమల్లోకి రానుంది.. కుదేలైన నిర్మాణ రంగం మళ్లీ ఊపందుకుని, కూలీలకూ చేతినిండా పని దొరకనుంది. -
ఎన్నేళ్లిలా..!
[ 08-07-2024]
శ్రీకాళహస్తీశ్వరాలయంలో బృహత్తర ప్రణాళిక అమలుకు గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. భూసేకరణలోనూ సింహభాగం అప్పుడే పూర్తయింది. -
తిరుమలలో.. దళారులపై నిఘా
[ 08-07-2024]
తిరుమలలో తిష్ఠవేసిన దళారులపై అధికారులు దృష్టిసారించారు. నూతన ఈవో జె.శ్యామలరావు ఆదేశాలతో దర్శన టికెట్లు, గదులను అధిక ధరలకు విక్రయించే వారిపై సీవీఎస్వో నరసింహకిశోర్, డీఎస్పీ శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. -
స్మార్ట్సిటీ పథకం.. కాలపరిమితి పొడిగింపు
[ 08-07-2024]
తిరుపతి స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ కాలపరిమితి మరో తొమ్మిది నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిని 2024 జూన్ 30లోగా పూర్తిచేయడం లక్ష్యం. రూ.500 కోట్ల విలువైన మరో 23 ప్రాజెక్టులు.. -
చేపల మార్కెట్ కలేనా..?
[ 08-07-2024]
నిధులున్నా చేపల మార్కెట్ నిర్మాణంలో కలగా మారుతోంది. గడిచిన ఏడేళ్లుగా అధికారులు మార్కెట్లు నిర్మాణానికి చొరవ చూపడంలేదు. జిల్లాలోని పుత్తూరు, -
నడుస్తూ.. నడిపిస్తూ
[ 08-07-2024]
నడిపించడం గొప్ప అన్నారు పెద్దలు. కుటుంబానికి వెన్నెముక వనితే.. అటు ఇంటి పనులు, మరోవైపు ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ.. -
దుగరాజపట్నం పోర్టుకు అడుగులు
[ 08-07-2024]
దుగరాజపట్నం పోర్టు పనుల్లో కదలిక రానుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కేంద్ర సాయాన్ని కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇదే విషయమై ఇటీవల చర్చించగా సానుకూలత వ్యక్తమైంది. -
పాలకుల పాపాలకు.. పరిహారమేదీ?
[ 08-07-2024]
జ్ఞానం నిర్మోచనం స్త్రీణాం- జ్ఞాన సముపార్జన ద్వారా స్త్రీకి విముక్తి.. అనే నినాదంతో 40 ఏళ్ల కిందట మహిళల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం తిరుపతిలో ఆవిర్భవించింది. -
ఇంకెన్ని అక్రమాలున్నాయో..?
[ 08-07-2024]
పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన నిధుల స్వాహా పర్వం జడ్పీ వర్గాల్లో దుమారం రేపుతోంది.. ఇలాంటి కుంభకోణాలను మాజీ సీఈవో ప్రభాకరరెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఇంకెన్ని మండలాల్లో దాచిపెట్టారనే విషయమై ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లా అభివృద్ధి.. అన్నదాతల అభ్యున్నతే లక్ష్యం
[ 08-07-2024]
జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయ ఆవరణలో ఆదివారం చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల తెదేపా ప్రజాప్రతినిధులు, -
జులి.. ఇక లేదు
[ 08-07-2024]
తిరుపతి ఎస్వీ జూ పార్కులో ఆదివారం జులి(5) అనే ఆడపులి అనారోగ్యంతో మృతి చెందిందని జూ క్యూరేటర్ సెల్వం తెలిపారు. -
తితిదేలో అవినీతి, అక్రమాలు నిగ్గు తేల్చండి
[ 08-07-2024]
ఐదేళ్లుగా తితిదేలో జరిగిన అక్రమాలు, అవినీతి కుంభకోణాలను నిగ్గు తేల్చాలని భాజపా నాయకులు నవీన్కుమార్ రెడ్డి కోరారు. -
సుపథం మార్గంలో ప్రమాదకరంగా గోడ
[ 08-07-2024]
శ్రీవారి ఆలయానికి దక్షిణం వైపున ఉన్న సుపథం ప్రవేశమార్గం సమీపంలోని హథీరాంజీ మఠం గోడ కూలిపోయే స్థితిలో ప్రమాదకరంగా ఉంది. -
ఇండోర్ స్టేడియం కూల్చివేత
[ 08-07-2024]
ముంబై- చెన్నై జాతీయ రహదారి పక్కన పుంగనూరు పట్టణం కొత్తఇండ్లు సరిహద్దులోని ఇండోర్ షటిల్ కోర్టు స్టేడియాన్ని శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యంత్రాలతో నేలమట్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గేటెడ్ కమ్యూనిటీలో దొంగల ముఠా హల్చల్
-
మెయిల్ హ్యాక్ చేసి రూ.11.4 కోట్లకు టోకరా
-
బలపడుతున్న బైడెన్పై వ్యతిరేకత.. కమలా హ్యారిస్కు పెరుగుతున్న మద్దతు
-
స్నాక్స్ అంటే లొట్టలేస్తాం.. లేబుల్ చదివాకే పొట్టలోకేస్తాం
-
అలాంటి వారు సమాజానికి ప్రమాదకరం.. ప్రభుత్వానికి మంచు మనోజ్ విజ్ఞప్తి
-
భాజపాలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందే: కేంద్ర మంత్రి బండి సంజయ్