సాహసమే శ్వాసగా
ఉరిమే ఉత్సాహంతో సాహసమే శ్వాసగా సాగుతున్నారు పలువురు యువత.. వ్యక్తిగత క్రమశిక్షణ తూచా తప్పక పాటిస్తూ జాతీయ సమైక్య భావనతో మెలుగుతూ నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకుని మెరుగైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు..
నిరంతర సాధనతో ముందుకు
జాతీయ స్థాయి గుర్తింపు కోసం సన్నద్ధత
ఎన్సీసీ శిక్షణలో కేడెట్లు
చిత్తూరు కలెక్టరేట్, న్యూస్టుడే: ఉరిమే ఉత్సాహంతో సాహసమే శ్వాసగా సాగుతున్నారు పలువురు యువత.. వ్యక్తిగత క్రమశిక్షణ తూచా తప్పక పాటిస్తూ జాతీయ సమైక్య భావనతో మెలుగుతూ నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకుని మెరుగైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.. చిత్తూరులోని పోలీసు శిక్షణ కేంద్రంలో 35వ ఆంధ్రా బెటాలియన్ నేతృత్వంలో జరిగిన వార్షిక శిబిరంలో ప్రతిభ కనబరచిన కేడెట్లు జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.. థలసైనిక్ క్యాంప్ ఎంపికకు తిరుపతిలో జరిగే యాన్యువల్ కంబైన్డ్ ట్రైనింగ్ శిబిరానికి అర్హత పొందారు. అక్కడా రాణించి.. జాతీయ స్థాయికి వెళ్తామని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సాధన ఇలా..
ఎన్సీసీ క్యాంప్లో డ్రిల్, రైఫిల్ షూటింగ్, మ్యాప్ రీడింగ్, టెంట్లు స్వతహాగా ఏర్పాటు చేయడం/తొలగించడం, విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలన్న అంశాలపై సాధన చేశారు. శారీరక దృఢత్వం కోసం వ్యాయామం.. ఆటలు, ఆరోగ్యం, సంస్కృతి, దేశభక్తి, దేశ రక్షణ, సాంస్కృతిక అంశాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇంకా టీం వర్క్ ద్వారా ఐకమత్యంతో పనిని కచ్ఛితత్వంతో పూర్తిచేయడంలో ప్రావీణ్యం కనబరిచారు.
ఆర్మీ అధికారినవుతా..
పలమనేరుకు చెందిన విష్ణు ఇంజినీరింగ్ కోర్సు చదువుతున్నాడు. ఆర్మీలో సేవ చేయాలన్నది అతడి లక్ష్యం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎన్సీసీలో చేరిన ఈ యువకుడు.. డ్రిల్, రైఫిల్ షూటింగ్, మ్యాప్ రీడింగ్, అబ్స్టాకిల్స్ అంశాల్లో నైపుణ్యం కనబరిచి ఎస్పీ మణికంఠ చేతుల మీదుగా ఇటీవల పతకాన్ని అందుకున్నాడు. థలసైనిక్ శిబిరానికి తప్పక ఎంపికవుతానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు.
సమయపాలన, కచ్చితత్వం అలవడింది..
పార్థసారథి కుప్పం ద్రావిడ వర్సిటీలో డిగ్రీ చదువుతున్నాడు. బాల్యం నుంచి ఎన్సీసీ శిక్షణకు క్రమం తప్పక వస్తున్నాడు. రెగ్యులర్ సాధనలో ప్రావీణ్యం కనబరిచి.. టీమ్ లీడర్గా ఎంపికయ్యాడు. సమయ పాలన పాటిస్తూ.. కచ్చితత్వంతో మంచి ఫలితాల్ని సాధిస్తూ సత్తా చాటాడు. శిక్షణ ద్వారా సమయపాలన అలవడిందని, సమాజ సేవ కోసం పనిచేస్తానని ఈ యువకుడు పేర్కొన్నాడు.
పోలీస్ అధికారిగా సేవలందిస్తా..
హేమ.. కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతోంది. ఎన్సీసీ శిక్షణ ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెంచుకుంది. డ్రిల్, ట్రెక్కింగ్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చక్కటి ప్రతిభ కనబరచింది. థలసైనిక్ శిబిరానికి ఎంపికవుతానని ధీమా వ్యక్తం చేసింది. పోలీస్ అధికారిగా సేవలందిస్తానని అంటోంది హేమ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రన్న తోడు.. అభివృద్ధి జోడు
[ 08-07-2024]
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. వైకాపా పాలనలో ఐదేళ్లూ ఎక్కడవేసిన గొంగలి అక్కడేలా మారిన అభివృద్ధిని గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రే నేరుగా రంగంలోకి దిగారు. -
ఇసుక... ఇక చౌక
[ 08-07-2024]
వైకాపా ప్రభుత్వ ఇసుక విధానంతో ఐదేళ్లూ అల్లాడిపోయిన సామాన్య ప్రజలకు ఊరట లభించనుంది.. తెదేపా ప్రభుత్వం ఆమోదించిన నూతన విధానం నేటి నుంచే అమల్లోకి రానుంది.. కుదేలైన నిర్మాణ రంగం మళ్లీ ఊపందుకుని, కూలీలకూ చేతినిండా పని దొరకనుంది. -
ఎన్నేళ్లిలా..!
[ 08-07-2024]
శ్రీకాళహస్తీశ్వరాలయంలో బృహత్తర ప్రణాళిక అమలుకు గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. భూసేకరణలోనూ సింహభాగం అప్పుడే పూర్తయింది. -
తిరుమలలో.. దళారులపై నిఘా
[ 08-07-2024]
తిరుమలలో తిష్ఠవేసిన దళారులపై అధికారులు దృష్టిసారించారు. నూతన ఈవో జె.శ్యామలరావు ఆదేశాలతో దర్శన టికెట్లు, గదులను అధిక ధరలకు విక్రయించే వారిపై సీవీఎస్వో నరసింహకిశోర్, డీఎస్పీ శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. -
స్మార్ట్సిటీ పథకం.. కాలపరిమితి పొడిగింపు
[ 08-07-2024]
తిరుపతి స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ కాలపరిమితి మరో తొమ్మిది నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిని 2024 జూన్ 30లోగా పూర్తిచేయడం లక్ష్యం. రూ.500 కోట్ల విలువైన మరో 23 ప్రాజెక్టులు.. -
చేపల మార్కెట్ కలేనా..?
[ 08-07-2024]
నిధులున్నా చేపల మార్కెట్ నిర్మాణంలో కలగా మారుతోంది. గడిచిన ఏడేళ్లుగా అధికారులు మార్కెట్లు నిర్మాణానికి చొరవ చూపడంలేదు. జిల్లాలోని పుత్తూరు, -
నడుస్తూ.. నడిపిస్తూ
[ 08-07-2024]
నడిపించడం గొప్ప అన్నారు పెద్దలు. కుటుంబానికి వెన్నెముక వనితే.. అటు ఇంటి పనులు, మరోవైపు ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ.. -
దుగరాజపట్నం పోర్టుకు అడుగులు
[ 08-07-2024]
దుగరాజపట్నం పోర్టు పనుల్లో కదలిక రానుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కేంద్ర సాయాన్ని కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇదే విషయమై ఇటీవల చర్చించగా సానుకూలత వ్యక్తమైంది. -
పాలకుల పాపాలకు.. పరిహారమేదీ?
[ 08-07-2024]
జ్ఞానం నిర్మోచనం స్త్రీణాం- జ్ఞాన సముపార్జన ద్వారా స్త్రీకి విముక్తి.. అనే నినాదంతో 40 ఏళ్ల కిందట మహిళల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం తిరుపతిలో ఆవిర్భవించింది. -
ఇంకెన్ని అక్రమాలున్నాయో..?
[ 08-07-2024]
పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన నిధుల స్వాహా పర్వం జడ్పీ వర్గాల్లో దుమారం రేపుతోంది.. ఇలాంటి కుంభకోణాలను మాజీ సీఈవో ప్రభాకరరెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఇంకెన్ని మండలాల్లో దాచిపెట్టారనే విషయమై ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లా అభివృద్ధి.. అన్నదాతల అభ్యున్నతే లక్ష్యం
[ 08-07-2024]
జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయ ఆవరణలో ఆదివారం చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల తెదేపా ప్రజాప్రతినిధులు, -
జులి.. ఇక లేదు
[ 08-07-2024]
తిరుపతి ఎస్వీ జూ పార్కులో ఆదివారం జులి(5) అనే ఆడపులి అనారోగ్యంతో మృతి చెందిందని జూ క్యూరేటర్ సెల్వం తెలిపారు. -
తితిదేలో అవినీతి, అక్రమాలు నిగ్గు తేల్చండి
[ 08-07-2024]
ఐదేళ్లుగా తితిదేలో జరిగిన అక్రమాలు, అవినీతి కుంభకోణాలను నిగ్గు తేల్చాలని భాజపా నాయకులు నవీన్కుమార్ రెడ్డి కోరారు. -
సుపథం మార్గంలో ప్రమాదకరంగా గోడ
[ 08-07-2024]
శ్రీవారి ఆలయానికి దక్షిణం వైపున ఉన్న సుపథం ప్రవేశమార్గం సమీపంలోని హథీరాంజీ మఠం గోడ కూలిపోయే స్థితిలో ప్రమాదకరంగా ఉంది. -
ఇండోర్ స్టేడియం కూల్చివేత
[ 08-07-2024]
ముంబై- చెన్నై జాతీయ రహదారి పక్కన పుంగనూరు పట్టణం కొత్తఇండ్లు సరిహద్దులోని ఇండోర్ షటిల్ కోర్టు స్టేడియాన్ని శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యంత్రాలతో నేలమట్టం చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో వివిధ కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్ల నియామకం
-
బంగారు గనిలో ప్రమాదం.. 11 మంది మృతి
-
మహిళపై కారుతో దూసుకెళ్లి.. గర్ల్ఫ్రెండ్ ఇంట్లో నక్కి: శివసేన యువనేతపై లుక్ఔట్ నోటీసు
-
ఓటీటీలోకి విజయ్ సేతుపతి యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
-
ఆ స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: రష్యా పర్యటనకు బయల్దేరిన మోదీ
-
దొంగను పట్టుకోకుండా ఇసుక పంచితే సాక్ష్యం తొలగించినట్లవుతుంది: అయ్యన్నపాత్రుడు