కుప్పంలో వినతుల వెల్లువ
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అన్యూహ్య స్పందన వచ్చింది.
ఓపిగ్గా స్వీకరించిన కలెక్టర్, అధికారులు
రీసర్వే తప్పిదాలపై అధిక ఫిర్యాదులు
శీవినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ సుమిత్కుమార్, చిత్రంలో ఎమ్మెల్సీ కంచర్ల, జేసీ
కుప్పం పట్టణం, న్యూస్టుడే: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అన్యూహ్య స్పందన వచ్చింది. వినతులు అందించేందుకు ప్రజలు ఉదయం నుంచే బారులుదీరారు. మొత్తం 600కిపైగా అర్జీలు రాగా.. అందులో 436 రెవెన్యూ సమస్యలపై వచ్చినట్లు అధికారులు తెలిపారు. తమ సమస్యలను ముందుగా నమోదు చేసుకునేందుకు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అధికారుల వద్ద గంటల తరబడి నిలబడాల్సివచ్చింది. సమావేశ మందిరంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, జేసీ శ్రీనివాసులు ఇతర జిల్లా అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. వినతులను ఆయా శాఖాధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని కలెక్టర్ అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేయాలని సూచించారు. రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులను తహశీల్దార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి, పరిష్కరించి పురోగతి తెలియజేయాలన్నారు.
నాలుగేళ్లుగా ప్రదక్షిణ
మాది శాంతిపురం మండలం గొల్లపల్లె గ్రామం. నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై నడుము, కాళ్లు చచ్చుబడిపోయి నడవలేని స్థితిలో ఉన్నా. రెక్కాడితేనే గానీ డొక్కాడని పరిస్థితి. గత ప్రభుత్వంలో వంద శాతం అంగవైకల్యం ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు. దీంతో పింఛన్ మంజూరు కాలేదని అధికారులు చెబుతున్నారు. పేద బతుకులు కావడంతో పనికి పోలేక పస్తులుండాల్సి దుస్థితి. పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి.
- ఉదయ్కుమార్, దివ్యాంగుడు
రీ-సర్వేలో భూమి మాయమైంది
వైకాపా ప్రభుత్వం తెచ్చిన రీ సర్వే చాలా మంది రైతులకు నష్టం చేసింది. నా పేరిట కుప్పం మండలం సజ్జలపల్లె రెవెన్యూ దాఖలాలో సర్వే సంఖ్య 33/1ఎ, 33/5లో 1.84 ఎకరాల భూమి ఉంది. ఇది కొనుగోలు చేసినది. అందుకు సంబంధించిన పాసు పుస్తకం సైతం ఉంది. అయితే గతేడాది చేపట్టిన రీ సర్వే తర్వాత 1.37 ఎకరాలే ఉన్నట్లు రికార్డుల్లో చూపుతోంది. 0.47 సెంట్ల భూమి ఆన్లైన్ రికార్డుల్లో మాయమైంది. ఏమైందో ఏమోనని అధికారుల చుట్టూ తిరుగుతున్నా, ప్రయోజనం లేక పోయింది. అధికారులు సర్వే చేయించి సమస్యను పరిష్కరించాలి. - సుబ్రహ్మణ్యం, కమతమూరు
ఇతరుల పేరిట నమోదు చేశారు
మాకు రామకుప్పం మండలం కెంచనబల్ల పంచాయతీ రెడ్డివారిపాడు రెవెన్యూ లెక్క దాఖలాలో వారసత్వంగా వచ్చిన 5.70 ఎకరాల భూమి ఉంది. అందుకు సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలు, ఆన్లైన్ రికార్డులు, వన్బీ ఉన్నాయి. అయితే రీ సర్వేలో ఆ భూమి వేరే వ్యక్తి పేరిట ఆన్లైన్లో నమోదు చేశారు. సర్వే చేసిన రెవెన్యూ సిబ్బంది తప్పిదంతో ఇలా జరిగింది. ఈ రికార్డులపై అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. ఆన్లైన్లో పేరు మార్చుకున్న వ్యక్తి నేడు జమీను తనదంటూ ఆక్రమించుకున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి. - నారాయణాచారి, కెంచనబల్ల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుమలలో.. దళారులపై నిఘా
[ 08-07-2024]
తిరుమలలో తిష్ఠవేసిన దళారులపై అధికారులు దృష్టిసారించారు. నూతన ఈవో జె.శ్యామలరావు ఆదేశాలతో దర్శన టికెట్లు, గదులను అధిక ధరలకు విక్రయించే వారిపై సీవీఎస్వో నరసింహకిశోర్, డీఎస్పీ శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. -
స్మార్ట్సిటీ పథకం.. కాలపరిమితి పొడిగింపు
[ 08-07-2024]
తిరుపతి స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ కాలపరిమితి మరో తొమ్మిది నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిని 2024 జూన్ 30లోగా పూర్తిచేయడం లక్ష్యం. రూ.500 కోట్ల విలువైన మరో 23 ప్రాజెక్టులు.. -
చేపల మార్కెట్ కలేనా..?
[ 08-07-2024]
నిధులున్నా చేపల మార్కెట్ నిర్మాణంలో కలగా మారుతోంది. గడిచిన ఏడేళ్లుగా అధికారులు మార్కెట్లు నిర్మాణానికి చొరవ చూపడంలేదు. జిల్లాలోని పుత్తూరు, -
నడుస్తూ.. నడిపిస్తూ
[ 08-07-2024]
నడిపించడం గొప్ప అన్నారు పెద్దలు. కుటుంబానికి వెన్నెముక వనితే.. అటు ఇంటి పనులు, మరోవైపు ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ.. -
దుగరాజపట్నం పోర్టుకు అడుగులు
[ 08-07-2024]
దుగరాజపట్నం పోర్టు పనుల్లో కదలిక రానుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కేంద్ర సాయాన్ని కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇదే విషయమై ఇటీవల చర్చించగా సానుకూలత వ్యక్తమైంది. -
పాలకుల పాపాలకు.. పరిహారమేదీ?
[ 08-07-2024]
జ్ఞానం నిర్మోచనం స్త్రీణాం- జ్ఞాన సముపార్జన ద్వారా స్త్రీకి విముక్తి.. అనే నినాదంతో 40 ఏళ్ల కిందట మహిళల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం తిరుపతిలో ఆవిర్భవించింది. -
ఇంకెన్ని అక్రమాలున్నాయో..?
[ 08-07-2024]
పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన నిధుల స్వాహా పర్వం జడ్పీ వర్గాల్లో దుమారం రేపుతోంది.. ఇలాంటి కుంభకోణాలను మాజీ సీఈవో ప్రభాకరరెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఇంకెన్ని మండలాల్లో దాచిపెట్టారనే విషయమై ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లా అభివృద్ధి.. అన్నదాతల అభ్యున్నతే లక్ష్యం
[ 08-07-2024]
జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయ ఆవరణలో ఆదివారం చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల తెదేపా ప్రజాప్రతినిధులు, -
జులి.. ఇక లేదు
[ 08-07-2024]
తిరుపతి ఎస్వీ జూ పార్కులో ఆదివారం జులి(5) అనే ఆడపులి అనారోగ్యంతో మృతి చెందిందని జూ క్యూరేటర్ సెల్వం తెలిపారు. -
తితిదేలో అవినీతి, అక్రమాలు నిగ్గు తేల్చండి
[ 08-07-2024]
ఐదేళ్లుగా తితిదేలో జరిగిన అక్రమాలు, అవినీతి కుంభకోణాలను నిగ్గు తేల్చాలని భాజపా నాయకులు నవీన్కుమార్ రెడ్డి కోరారు. -
సుపథం మార్గంలో ప్రమాదకరంగా గోడ
[ 08-07-2024]
శ్రీవారి ఆలయానికి దక్షిణం వైపున ఉన్న సుపథం ప్రవేశమార్గం సమీపంలోని హథీరాంజీ మఠం గోడ కూలిపోయే స్థితిలో ప్రమాదకరంగా ఉంది. -
ఇండోర్ స్టేడియం కూల్చివేత
[ 08-07-2024]
ముంబై- చెన్నై జాతీయ రహదారి పక్కన పుంగనూరు పట్టణం కొత్తఇండ్లు సరిహద్దులోని ఇండోర్ షటిల్ కోర్టు స్టేడియాన్ని శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యంత్రాలతో నేలమట్టం చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/07/24)
-
స్టన్నింగ్ కియారా.. చీరలో పూజ.. స్టైలిష్ శ్రీముఖి
-
‘పిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు’ - ఉద్ధవ్పై మండిపడ్డ శిందే!
-
ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష - ఎన్టీఏ
-
పేపర్ లీక్లతో యువత కలల్ని నాశనం చేసినోళ్లను వదిలేది లేదు.. సీఎం భజన్లాల్ శర్మ
-
ఆ ఆపరేషన్ కారణంగానే సినిమాలకు విరామం: నభా నటేశ్