డీకేటీ ముసుగులో గుట్టక్కు
మండలంలోని సామిరెడ్డిపల్లె రెవెన్యూ పరిధిలోని గుట్టను ఓ వ్యక్తి యంత్రాల సాయంతో ఆక్రమించేందుకు యత్నించాడు.
ఆక్రమణ అడ్డుకున్న అయ్యప్ప సేవా సంఘం సభ్యులు
మోపిరెడ్డిపల్లె బస్టాపు వద్ద గుట్టను చదును చేసిన దృశ్యం
పెనుమూరు, న్యూస్టుడే: మండలంలోని సామిరెడ్డిపల్లె రెవెన్యూ పరిధిలోని గుట్టను ఓ వ్యక్తి యంత్రాల సాయంతో ఆక్రమించేందుకు యత్నించాడు. అతడికి గుట్ట దిగువన కొంత భూమికి డీకేటీ పట్టా ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుని గుట్టను ఆక్రమించి చదును చేసేందుకు ఉపక్రమించాడు. ఈ తంతు పెనుమూరు-చిత్తూరు రహదారికి పక్కనే జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
సామిరెడ్డిపల్లె రెవెన్యూ పరిధిలో మోపిరెడ్డిపల్లె బస్టాపు వద్ద సర్వే నంబరు 547లో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో గుట్ట ఉంది. అందులో కొంత భాగాన్ని గతంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి కేటాయించారు. పై భాగంలో ఆలయ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్న డీకేటీ పట్టా ఉన్న రైతు ఇటీవల గుట్టను ఆక్రమించుకునేందుకు యత్నించాడు. తనకు పట్టా ఉన్న స్థలానికి పక్కనే గుట్టను జేసీబీ సాయంతో కొంత భాగాన్ని చదును చేశాడు. విషయం అయ్యప్ప ఆలయ కమిటీకి తెలియడంతో వెంటనే సంఘం అధ్యక్షుడు, గురుస్వామి రవీంద్రనాయుడు, సభ్యులు అక్కడకు చేరుకుని పనులు అడ్డుకున్నారు. ఈ సమయంలో రైతుకు, కమిటీ సభ్యులకు నడుమ వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు రైతు సదరు పనులు నిలిపేశాడు. ఈ విషయమై తహసీల్దారు సుభద్రను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు. వీఆర్వో ద్వారా సమాచారాన్ని తెలుసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాహనాల అద్దెబకాయిలు చెల్లించాలని డిమాండ్
[ 08-07-2024]
ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ వాహనాలకు సంబంధించి అద్దెబకాయిలను చెల్లించాలని నవ యువ కార్ డ్రైవర్, ఓనర్స్ సంక్షేమ సంఘం సహకార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. -
చంద్రన్న తోడు.. అభివృద్ధి జోడు
[ 08-07-2024]
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. వైకాపా పాలనలో ఐదేళ్లూ ఎక్కడవేసిన గొంగలి అక్కడేలా మారిన అభివృద్ధిని గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రే నేరుగా రంగంలోకి దిగారు. -
ఇసుక... ఇక చౌక
[ 08-07-2024]
వైకాపా ప్రభుత్వ ఇసుక విధానంతో ఐదేళ్లూ అల్లాడిపోయిన సామాన్య ప్రజలకు ఊరట లభించనుంది.. తెదేపా ప్రభుత్వం ఆమోదించిన నూతన విధానం నేటి నుంచే అమల్లోకి రానుంది.. కుదేలైన నిర్మాణ రంగం మళ్లీ ఊపందుకుని, కూలీలకూ చేతినిండా పని దొరకనుంది. -
ఎన్నేళ్లిలా..!
[ 08-07-2024]
శ్రీకాళహస్తీశ్వరాలయంలో బృహత్తర ప్రణాళిక అమలుకు గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. భూసేకరణలోనూ సింహభాగం అప్పుడే పూర్తయింది. -
తిరుమలలో.. దళారులపై నిఘా
[ 08-07-2024]
తిరుమలలో తిష్ఠవేసిన దళారులపై అధికారులు దృష్టిసారించారు. నూతన ఈవో జె.శ్యామలరావు ఆదేశాలతో దర్శన టికెట్లు, గదులను అధిక ధరలకు విక్రయించే వారిపై సీవీఎస్వో నరసింహకిశోర్, డీఎస్పీ శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నారు. -
స్మార్ట్సిటీ పథకం.. కాలపరిమితి పొడిగింపు
[ 08-07-2024]
తిరుపతి స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ కాలపరిమితి మరో తొమ్మిది నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిని 2024 జూన్ 30లోగా పూర్తిచేయడం లక్ష్యం. రూ.500 కోట్ల విలువైన మరో 23 ప్రాజెక్టులు.. -
చేపల మార్కెట్ కలేనా..?
[ 08-07-2024]
నిధులున్నా చేపల మార్కెట్ నిర్మాణంలో కలగా మారుతోంది. గడిచిన ఏడేళ్లుగా అధికారులు మార్కెట్లు నిర్మాణానికి చొరవ చూపడంలేదు. జిల్లాలోని పుత్తూరు, -
నడుస్తూ.. నడిపిస్తూ
[ 08-07-2024]
నడిపించడం గొప్ప అన్నారు పెద్దలు. కుటుంబానికి వెన్నెముక వనితే.. అటు ఇంటి పనులు, మరోవైపు ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ.. -
దుగరాజపట్నం పోర్టుకు అడుగులు
[ 08-07-2024]
దుగరాజపట్నం పోర్టు పనుల్లో కదలిక రానుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కేంద్ర సాయాన్ని కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇదే విషయమై ఇటీవల చర్చించగా సానుకూలత వ్యక్తమైంది. -
పాలకుల పాపాలకు.. పరిహారమేదీ?
[ 08-07-2024]
జ్ఞానం నిర్మోచనం స్త్రీణాం- జ్ఞాన సముపార్జన ద్వారా స్త్రీకి విముక్తి.. అనే నినాదంతో 40 ఏళ్ల కిందట మహిళల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం తిరుపతిలో ఆవిర్భవించింది. -
ఇంకెన్ని అక్రమాలున్నాయో..?
[ 08-07-2024]
పుంగనూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన నిధుల స్వాహా పర్వం జడ్పీ వర్గాల్లో దుమారం రేపుతోంది.. ఇలాంటి కుంభకోణాలను మాజీ సీఈవో ప్రభాకరరెడ్డి ఉమ్మడి జిల్లాలోని ఇంకెన్ని మండలాల్లో దాచిపెట్టారనే విషయమై ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లా అభివృద్ధి.. అన్నదాతల అభ్యున్నతే లక్ష్యం
[ 08-07-2024]
జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. స్థానిక తెదేపా జిల్లా కార్యాలయ ఆవరణలో ఆదివారం చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల తెదేపా ప్రజాప్రతినిధులు, -
జులి.. ఇక లేదు
[ 08-07-2024]
తిరుపతి ఎస్వీ జూ పార్కులో ఆదివారం జులి(5) అనే ఆడపులి అనారోగ్యంతో మృతి చెందిందని జూ క్యూరేటర్ సెల్వం తెలిపారు. -
తితిదేలో అవినీతి, అక్రమాలు నిగ్గు తేల్చండి
[ 08-07-2024]
ఐదేళ్లుగా తితిదేలో జరిగిన అక్రమాలు, అవినీతి కుంభకోణాలను నిగ్గు తేల్చాలని భాజపా నాయకులు నవీన్కుమార్ రెడ్డి కోరారు. -
సుపథం మార్గంలో ప్రమాదకరంగా గోడ
[ 08-07-2024]
శ్రీవారి ఆలయానికి దక్షిణం వైపున ఉన్న సుపథం ప్రవేశమార్గం సమీపంలోని హథీరాంజీ మఠం గోడ కూలిపోయే స్థితిలో ప్రమాదకరంగా ఉంది. -
ఇండోర్ స్టేడియం కూల్చివేత
[ 08-07-2024]
ముంబై- చెన్నై జాతీయ రహదారి పక్కన పుంగనూరు పట్టణం కొత్తఇండ్లు సరిహద్దులోని ఇండోర్ షటిల్ కోర్టు స్టేడియాన్ని శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యంత్రాలతో నేలమట్టం చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
డీఎస్సీని వాయిదా వేయాలని ఆందోళన.. విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
కాలుష్యం పెరిగితే.. భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు: మంత్రి పొన్నం ప్రభాకర్
-
జెరోదాలో మళ్లీ సాంకేతిక సమస్య.. సోషల్ మీడియా వేదికగా యూజర్ల అసహనం!
-
బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్
-
స్కైడాన్స్ చేతికి హాలీవుడ్ ఐకాన్ పారామౌంట్ గ్లోబల్..!
-
ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేయొద్దు: ఈసీకి ఏపీ హైకోర్టు ఆదేశం