అభినయా.. రోడ్లు
తిరునగరి మాస్టర్ ప్లాన్ రోడ్ల నాణ్యత తేటతెల్లమైంది. వాహనాల రాకపోకలతో వాటి బండారం ఇప్పటికే బట్టబయలైంది.
తారు లేచిపోవడంపై టిప్పర్ డ్రైవర్ను ప్రశ్నిస్తున్న అభినయ్రెడ్డి (పాతచిత్రం)
తిరుపతి (నగరపాలిక), న్యూస్టుడే: తిరునగరి మాస్టర్ ప్లాన్ రోడ్ల నాణ్యత తేటతెల్లమైంది. వాహనాల రాకపోకలతో వాటి బండారం ఇప్పటికే బట్టబయలైంది. ఆయా మార్గాల ప్రారంభోత్సవం సందర్భంగా భూమన కుటుంబ సభ్యుల వ్యాఖ్యలు ఇప్పుడు నగరప్రజల ప్రస్తావనకు వస్తున్నాయి. ఆయా రోడ్లకు పెట్టిన పేర్లను గుర్తుచేస్తూ మురిసిపోయిన అప్పటి నేతలు కనీసం వాటిని పలకాలన్నా ప్రజలకు, అప్పటి ప్రతిపక్ష నేతలకు కష్టమేనంటూ బీరాలుపోయారు. ఓ రోడ్డులో వెళ్లిన టిప్పర్ బ్రేక్లు వేయగానే తారు మొత్తం లేచిపోగా అదే సమయంలో అటుగా వెళ్లిన అప్పటి ఉప మేయర్ అభినయ్రెడ్డి వాహన డ్రైవర్ను చెడామడా తిట్టిపోశారు. ఎంతో సుందరంగా నిర్మించిన మా రోడ్డుపైనే టిప్పర్ నడుపుతావా, రోడ్డంతా పాడు చేస్తావా అన్నట్లుగా ఆయన రెచ్చిపోయారు. అనంతరం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా వైరలైంది. మీరు నాణ్యంగా నిర్మించి ఉంటే ఎందుకు తారు లేచిపోతుందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఒక్క లారీ వెళ్తేనే రోడ్డు ఇలాగైతే భవిష్యత్తులో రోడ్డు మొత్తం ఊడిపోతుందేమో’.. ‘రోడ్డు పోతే డ్రైవర్ను అడుగుతావేంది.. రోడ్డేసిన గుత్తేదారును అడుగు స్వామీ’ అంటూ పలు విమర్శలు గుప్పించారు. తాజాగా కుళశేఖర్ ఆళ్వార్ మార్గం ఎక్కడికక్కడ కుంగిపోవడం, తారు లేచిపోవడం చూసిన ప్రతిపక్షాలు, నగరవాసులు ‘ఆహా.. ఇవేనా మీరు నిర్మించిన బృహత్తర రోడ్లు’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. నాణ్యత ఏదీ అభినయ్ సారూ.. అంటూ నిలదీస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెస్కో.. అందినంత దోచుకో
[ 06-07-2024]
వడ్డించేవారు మనవారయితే చాలన్నట్లు.. కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (రెస్కో) పరిస్థితి తయారైంది. -
దొంగ ఓట్లకు అండదండలు
[ 06-07-2024]
విద్యాశాఖలో పలువురు అధికారులు వైకాపాకు అంటకాగుతూ ఐదేళ్లూ అక్రమాలు కొనసాగించారు. -
సర్వదర్శనానికి 16 గంటలు
[ 06-07-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 29 కంపార్ట్మెంట్లలో వేచిఉన్నారు. -
పెంపుడు జంతువులకు.. ఆధునిక వైద్యం
[ 06-07-2024]
మూగజీవాలు మన జీవన విధానంలో భాగమయ్యాయి. సమాజంలో ఆదరణ పెరుగుతోంది. -
అప్రమత్తమైతేనే..!
[ 06-07-2024]
ప్రస్తుత సమాజంలో ప్రతి ఇంట్లో పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయి.. వీటి ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు అవలంబించాలి.. లేనిపక్షంలో మన ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. -
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
[ 06-07-2024]
చిత్తూరు నగర సమగ్రాభివృద్ధికి రాజకీయ పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు పనిచేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. -
ఆరు ప్రాణాలు నిలిపిన అవయవదానం
[ 06-07-2024]
పుట్టెడు దుఃఖంలోనూ పలువురి ప్రాణాలు కాపాడేందుకు ఆ కుటుంబం ముందుకు వచ్చింది. -
చంద్రగిరిలో తుడా లెక్కలు తేల్చండి
[ 06-07-2024]
చంద్రగిరి నియోజకవర్గంలో తుడా చేపట్టిన అభివృద్ధి పనుల లెక్కలు తేల్చాలని ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులను కోరారు. -
‘తితిదే అక్రమాలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం’
[ 06-07-2024]
గత ప్రభుత్వంలో తితిదేలో జరిగిన అక్రమాలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తామని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి తెలిపారు. -
గంజాయి, అక్రమ మద్యంపై ఉక్కుపాదం
[ 06-07-2024]
గంజాయి, అక్రమ మద్యం, మాదకద్రవ్యాలు, సారా వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని, నిఘా వ్యవస్థ పటిష్టం చేసి అక్రమార్కులను అరెస్టు చేసి న్యాయస్థానంలో శిక్ష పడేలా చూడాలని జిల్లా ప్రత్యేక ఎన్ఫోర్సుమెంట్ అధికారి (డీఎస్ఈవో) సుబ్బరాజు ఆదేశించారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
[ 06-07-2024]
జల్సాలకు అలవాటుపడి ద్విచక్రవాహనాలు అపహరించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను వి.కోట పోలీసులు పట్టుకున్నారు.