భక్తులకేదీ ఉపశమనం
శ్రీవారి భక్తుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. తక్కువ ధరకు అన్నప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఏపీ టూరిజంకు హోటళ్లు, జనతా క్యాంటీన్ను కేటాయించగా వాటిలో భారీగా ధరలు వసూలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తిరుమలలో తీరుమారని ఏపీ టూరిజం సంస్థ
తితిదే ఆస్తులు అప్పగించినా అధిక ధరలు
నిర్దేశిత ధరల అమలుపై ఆశలు
శ్రీవారి భక్తుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. తక్కువ ధరకు అన్నప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఏపీ టూరిజంకు హోటళ్లు, జనతా క్యాంటీన్ను కేటాయించగా వాటిలో భారీగా ధరలు వసూలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తితిదే తన ఆదాయం సైతం వదులుకుని ఆస్తులు అప్పగిస్తే టూరిజం సంస్థ చేసే నిర్వాకం ఇదా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
న్యూస్టుడే, తిరుమల
రూ.3.80 కోట్ల సంతర్పణ: నారాయణగిరి హోటల్ను ఏపీ టూరిజంకు ఇవ్వడంతోపాటు ఆ భవనం ఆధునికీకరణ, మూడో అంతస్తు గదుల నిర్మాణం కోసం తితిదే రూ.3.80 కోట్లు విడుదల చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిధులతో ఏపీ టూరిజానికి ఇచ్చే భవనాన్ని ఆధునికీకరించి అదనపు గదులు నిర్మిస్తున్నారు. తితిదే నిధులతో ఏపీ టూరిజం హోటల్ను ఆధునికీకరించడంతోపాటు రూ.5 లక్షల నామమాత్రపు అద్దెకు ఇస్తే వారు మాత్రం దోపిడీ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. తితిదే ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ఉన్న సమయంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ఏపీ టూరిజంకు ఇస్తే వారు ఆధునికీకరించుకోవాలిగానీ తితిదే నిధులు ఖర్చుపెట్టి నిర్మాణం చేసి ఇవ్వడం ఎంతవరకు సబబనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే హోటల్కు గతంలో నెలకు రూ.60 లక్షల అద్దె చెల్లించేందుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకొచ్చారు. కరోనా నేపథ్యంలో 2021లో మూతపడిన ఈ హోటల్ను త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
తితిదే ఇలా చేస్తే మేలు..
- రూ.కోట్ల ఆదాయాన్ని తితిదే వదులుకుని టూరిజం సంస్థకు అప్పగించిన నేపథ్యంలో వీటి ప్రాంగణాల పరిధిలో సేవాభావం కనిపించేలా చూడాలి.
- భక్తులపై ధరాభారం మోపకుండా నిర్దేశిత ధరలు, మెనూ నాణ్యంగా అమలు చేసేలా తితిదేతోపాటు టూరిజం సంస్థ ఉన్నతాధికారులు కలిసి నిర్ణయం తీసుకోవాలి.
- ఫలహారం, చిరుతిళ్లు వంటి వాటికి క్షేత్ర పరిధిలో అధిక మొత్తం వసూలు చేస్తున్న నేపథ్యంలో వాటిపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
- స్పెషల్ పేరుతో భక్తుల జేబుకు చిల్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెస్కో.. అందినంత దోచుకో
[ 06-07-2024]
వడ్డించేవారు మనవారయితే చాలన్నట్లు.. కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (రెస్కో) పరిస్థితి తయారైంది. -
దొంగ ఓట్లకు అండదండలు
[ 06-07-2024]
విద్యాశాఖలో పలువురు అధికారులు వైకాపాకు అంటకాగుతూ ఐదేళ్లూ అక్రమాలు కొనసాగించారు. -
సర్వదర్శనానికి 16 గంటలు
[ 06-07-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 29 కంపార్ట్మెంట్లలో వేచిఉన్నారు. -
పెంపుడు జంతువులకు.. ఆధునిక వైద్యం
[ 06-07-2024]
మూగజీవాలు మన జీవన విధానంలో భాగమయ్యాయి. సమాజంలో ఆదరణ పెరుగుతోంది. -
అప్రమత్తమైతేనే..!
[ 06-07-2024]
ప్రస్తుత సమాజంలో ప్రతి ఇంట్లో పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయి.. వీటి ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు అవలంబించాలి.. లేనిపక్షంలో మన ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. -
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
[ 06-07-2024]
చిత్తూరు నగర సమగ్రాభివృద్ధికి రాజకీయ పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు పనిచేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. -
ఆరు ప్రాణాలు నిలిపిన అవయవదానం
[ 06-07-2024]
పుట్టెడు దుఃఖంలోనూ పలువురి ప్రాణాలు కాపాడేందుకు ఆ కుటుంబం ముందుకు వచ్చింది. -
చంద్రగిరిలో తుడా లెక్కలు తేల్చండి
[ 06-07-2024]
చంద్రగిరి నియోజకవర్గంలో తుడా చేపట్టిన అభివృద్ధి పనుల లెక్కలు తేల్చాలని ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులను కోరారు. -
‘తితిదే అక్రమాలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం’
[ 06-07-2024]
గత ప్రభుత్వంలో తితిదేలో జరిగిన అక్రమాలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తామని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి తెలిపారు. -
గంజాయి, అక్రమ మద్యంపై ఉక్కుపాదం
[ 06-07-2024]
గంజాయి, అక్రమ మద్యం, మాదకద్రవ్యాలు, సారా వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని, నిఘా వ్యవస్థ పటిష్టం చేసి అక్రమార్కులను అరెస్టు చేసి న్యాయస్థానంలో శిక్ష పడేలా చూడాలని జిల్లా ప్రత్యేక ఎన్ఫోర్సుమెంట్ అధికారి (డీఎస్ఈవో) సుబ్బరాజు ఆదేశించారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
[ 06-07-2024]
జల్సాలకు అలవాటుపడి ద్విచక్రవాహనాలు అపహరించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను వి.కోట పోలీసులు పట్టుకున్నారు.