ఎస్వీయూలో ‘దూర’మైన ‘విద్య’
ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వర్సిటీలోని ఈ విభాగం ఐదేళ్లలో అనేక ఆరోపణలు, విమర్శలు మూటగట్టుకుంది.
మార్చి పరీక్షలు ఇంకెప్పుడు ఆచార్యా?
ఆందోళనలో 33 వేల మంది విద్యార్థులు
ఎస్వీయూ దూరవిద్యా విభాగం గాడితప్పింది. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వర్సిటీలోని ఈ విభాగం ఐదేళ్లలో అనేక ఆరోపణలు, విమర్శలు మూటగట్టుకుంది. ఒకప్పుడు దూరవిద్యకు చిరునామాగా నిలిచిన వర్సిటీలో ప్రస్తుతం సకాలంలో తరగతులు, పరీక్షలు నిర్వహించలేని దుస్థితి నెలకొంది. డెబ్ అనుమతులు రద్దయిపోగా అప్పటికే ప్రవేశాలు కల్పించిన విద్యార్థులతో వర్సిటీ అధికారులు ఆటాడుకుంటున్నారని, ఈ సమయానికి డిగ్రీ, పీజీ పట్టాలు అందుకోవాల్సిన 13వేల మందికిపైగా విద్యార్థులు మార్చిలో జరగాల్సిన ఆఖరు పరీక్షలు ఇంకెప్పుడు నిర్వహిస్తారు సారూ.. అంటూ ఆవేదన వెళ్లగక్కుతున్నారు.
న్యూస్టుడే, తిరుపతి (బైరాగిపట్టెడ)
యూజీసీ నియమ నిబంధనలు పాటించకపోవడంతో డెబ్ అనుమతులు లేక 2022 నుంచి దూర విద్య విభాగంలో ప్రవేశాలు ఆగిపోయాయి. ప్రస్తుతం ద్వితీయ, తృతీయ సంవత్సరాల డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఈ ఏడాది మార్చిలో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ఇంతవరకు వాటి ఊసేలేదు. విద్యా సంవత్సరం కలిసి రాకపోవడంతో విద్యార్థులంతా అసంతృప్తితో ఉన్నారు. తరగతులు జరగడం లేదని, సమస్యలపై స్పందించేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోర్సులు ఘనం..
దూరవిద్యా విభాగంలో రెండు విభాగాల్లో డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఐదు విభాగాల్లో మూడేళ్ల డిగ్రీ కోర్సులు, 19 విభాగాల్లో పీజీ కోర్సులు ఉన్నాయి. పలు కారణాలతో చదువులు కొనసాగించలేకపోయిన వారికి, పార్ట్టైం ఉద్యోగులకు, వ్యాపారులకు వివిధ రంగాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి దూరవిద్య విభాగం కోర్సుల్లో చేరి పట్టా పొందేందుకు వర్సిటీ దూరవిద్య విభాగం ఎంతో అనువుగా ఉండేది. గతంలో ఎంతోమంది ఈ విభాగాల్లో ప్రవేశాలు పొంది ఉత్తీర్ణత సాధించి జీవితంలో స్థిరపడ్డారు.
33 వేలకుపైగా విద్యార్థులు..
2021 జులైలో చేరిన విద్యార్థులు ప్రస్తుతం మూడో ఏడాది చదువుతున్నారు. ఆయా కోర్సుల్లో మొత్తం 13,125 మంది విద్యార్థులు ఉన్నారు. 2022 జనవరిలో చేరిన రెండో సంవత్సరం విద్యార్థులు డిగ్రీలో 1300 మందికిపైగా, డిప్లొమా కోర్సుల్లో 38 మంది, పీజీ కోర్సులకు సంబంధించి మరో 1,549 మంది విద్యార్థులున్నారు. ఇదే ఏడాదికి సెప్టెంబరులో బీఏలో 2,424 మంది, బీకాం (కంప్యూటర్స్)లో 2,133 మంది, బీకాం (రెగ్యులర్) 1,432 మంది, బీఎల్ఐఎస్సీలో 1,176, బీఎస్సీ 4,161 మంది విద్యార్థులున్నారు. పీజీ కోర్సులకు సంబంధించి మొత్తం 6,479 మంది విద్యార్థులు చదువుతున్నారు.
ప్రక్షాళనకు ఎదురుచూపు..
ప్రవేశాలు లేక, ఉన్న కోర్సులు సకాలంలో ముగించలేక, సరైన సిబ్బంది లేక విభాగం అందరికీ అందనంత దూరంలో ఉండిపోయింది. నూతన ప్రభుత్వంలో ఈ విభాగాన్ని ప్రక్షాళన చేసి తిరిగి అన్ని కోర్సుల ప్రవేశాలు పునఃప్రారంభమయ్యేలా చూడాలని విద్యార్థులు, విద్యావేత్తలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెస్కో.. అందినంత దోచుకో
[ 06-07-2024]
వడ్డించేవారు మనవారయితే చాలన్నట్లు.. కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (రెస్కో) పరిస్థితి తయారైంది. -
దొంగ ఓట్లకు అండదండలు
[ 06-07-2024]
విద్యాశాఖలో పలువురు అధికారులు వైకాపాకు అంటకాగుతూ ఐదేళ్లూ అక్రమాలు కొనసాగించారు. -
సర్వదర్శనానికి 16 గంటలు
[ 06-07-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 29 కంపార్ట్మెంట్లలో వేచిఉన్నారు. -
పెంపుడు జంతువులకు.. ఆధునిక వైద్యం
[ 06-07-2024]
మూగజీవాలు మన జీవన విధానంలో భాగమయ్యాయి. సమాజంలో ఆదరణ పెరుగుతోంది. -
అప్రమత్తమైతేనే..!
[ 06-07-2024]
ప్రస్తుత సమాజంలో ప్రతి ఇంట్లో పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయి.. వీటి ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు అవలంబించాలి.. లేనిపక్షంలో మన ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. -
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
[ 06-07-2024]
చిత్తూరు నగర సమగ్రాభివృద్ధికి రాజకీయ పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు పనిచేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. -
ఆరు ప్రాణాలు నిలిపిన అవయవదానం
[ 06-07-2024]
పుట్టెడు దుఃఖంలోనూ పలువురి ప్రాణాలు కాపాడేందుకు ఆ కుటుంబం ముందుకు వచ్చింది. -
చంద్రగిరిలో తుడా లెక్కలు తేల్చండి
[ 06-07-2024]
చంద్రగిరి నియోజకవర్గంలో తుడా చేపట్టిన అభివృద్ధి పనుల లెక్కలు తేల్చాలని ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులను కోరారు. -
‘తితిదే అక్రమాలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం’
[ 06-07-2024]
గత ప్రభుత్వంలో తితిదేలో జరిగిన అక్రమాలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తామని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి తెలిపారు. -
గంజాయి, అక్రమ మద్యంపై ఉక్కుపాదం
[ 06-07-2024]
గంజాయి, అక్రమ మద్యం, మాదకద్రవ్యాలు, సారా వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని, నిఘా వ్యవస్థ పటిష్టం చేసి అక్రమార్కులను అరెస్టు చేసి న్యాయస్థానంలో శిక్ష పడేలా చూడాలని జిల్లా ప్రత్యేక ఎన్ఫోర్సుమెంట్ అధికారి (డీఎస్ఈవో) సుబ్బరాజు ఆదేశించారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
[ 06-07-2024]
జల్సాలకు అలవాటుపడి ద్విచక్రవాహనాలు అపహరించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను వి.కోట పోలీసులు పట్టుకున్నారు.