నాడు-నేడు నిర్లక్ష్యం గడ్డ కట్టేసింది..
నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులకు పంపిన సిమెంట్ బస్తాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి.
హెచ్ఎం ఉద్యోగ విరమణ అనంతరం వెలుగులోకి
వైర్లతో వేలాడుతున్న ఫ్యాను కింద విద్యార్థులు
పాలసముద్రం, న్యూస్టుడే: నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులకు పంపిన సిమెంట్ బస్తాలు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. మండలంలోని తిరుమలరాజుపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు అసంపూర్తిగా నిలిచిపోవడం, సిమెంట్ బస్తాలు గడ్డ కట్టిపోవడం, విద్యార్ధులు భయాందోళన మధ్య చదువులు కొనసాగడం.. ఇవన్నీ హెచ్ఎం ఉద్యోగ విరమణ అనంతరం వెలుగు చూశాయి.
తిరుమలరాజుపురం జడ్పీ ఉన్నత పాఠశాలకు 2022లో అదనపు గదులు, ప్రహరీ, సీలింగ్ లీకేజీ, మరుగుదొడ్లు, విద్యుత్తు పనులు, రూఫ్ లీకేజీ, ట్యాంకు మరమ్మతులకు నాడు-నేడు కింద రూ.82 లక్షలు కేటాయించారు. ఆయా పనులు కొన్ని చేపట్టినా అసంపూర్తిగా నిలిచాయి. తూతూమంత్రంగా పనులు చేపట్టి గదులు వదిలేశారు. విద్యార్ధులు వెలుతురు, గాలి లేక ఊపిరాడక ఇబ్బందికరంగా చదువులు కొనసాగిస్తున్నారు. వాటి బాధ్యతను హెచ్ఎం, ఏఈలకు అప్పగించారు. ఇద్దరి నిర్లక్ష్యంతో పాఠశాలలో పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో విద్యార్ధులకు కష్టాలు తప్పడం లేదు.
మరోవైపున ఆయా పనులకు తెచ్చిన సిమెంట్ వినియోగించకపోవడంతో సుమారు 500కు పైగా బస్తాలు గడ్డ కట్టేసినట్లు బుధవారం గుర్తించారు. హెచ్ఎం, విద్యాశాఖ, ఏఈ, సమగ్ర శిక్ష అధికారుల నిర్లక్ష్యంతో ఇలా జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడ్డ కట్టేసిన సిమెంట్తో నిర్మాణాలు చేపడితే నాణ్యత సమస్య వస్తుందని తెలిసినా గుట్టుగా పనులు చేపట్టినట్లు సమాచారం. ఇప్పటివరకు జరిగిన పనులకు రూ.32.64 లక్షలు మంజూరైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో హెచ్ఎం ఉద్యోగ విరమణ అనంతరం ఆయా పనులు చేపట్టేందుకు ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన వారు ముందుకు రావడం లేదు.
గడ్డకట్టిన సిమెంట్ బస్తాలు
ఈ విషయమై సమగ్ర శిక్షా ఏఈ మునిరత్నంను వివరణ కోరగా.. నాడు-నేడు పనులకు సంబంధించి నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ఆగాయని, వెంటనే సిమెంట్ బస్తాల విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. బిల్లులు పరిశీలిస్తామని
తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెస్కో.. అందినంత దోచుకో
[ 06-07-2024]
వడ్డించేవారు మనవారయితే చాలన్నట్లు.. కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (రెస్కో) పరిస్థితి తయారైంది. -
దొంగ ఓట్లకు అండదండలు
[ 06-07-2024]
విద్యాశాఖలో పలువురు అధికారులు వైకాపాకు అంటకాగుతూ ఐదేళ్లూ అక్రమాలు కొనసాగించారు. -
సర్వదర్శనానికి 16 గంటలు
[ 06-07-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 29 కంపార్ట్మెంట్లలో వేచిఉన్నారు. -
పెంపుడు జంతువులకు.. ఆధునిక వైద్యం
[ 06-07-2024]
మూగజీవాలు మన జీవన విధానంలో భాగమయ్యాయి. సమాజంలో ఆదరణ పెరుగుతోంది. -
అప్రమత్తమైతేనే..!
[ 06-07-2024]
ప్రస్తుత సమాజంలో ప్రతి ఇంట్లో పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయి.. వీటి ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు అవలంబించాలి.. లేనిపక్షంలో మన ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. -
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
[ 06-07-2024]
చిత్తూరు నగర సమగ్రాభివృద్ధికి రాజకీయ పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు పనిచేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. -
ఆరు ప్రాణాలు నిలిపిన అవయవదానం
[ 06-07-2024]
పుట్టెడు దుఃఖంలోనూ పలువురి ప్రాణాలు కాపాడేందుకు ఆ కుటుంబం ముందుకు వచ్చింది. -
చంద్రగిరిలో తుడా లెక్కలు తేల్చండి
[ 06-07-2024]
చంద్రగిరి నియోజకవర్గంలో తుడా చేపట్టిన అభివృద్ధి పనుల లెక్కలు తేల్చాలని ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులను కోరారు. -
‘తితిదే అక్రమాలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం’
[ 06-07-2024]
గత ప్రభుత్వంలో తితిదేలో జరిగిన అక్రమాలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తామని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి తెలిపారు. -
గంజాయి, అక్రమ మద్యంపై ఉక్కుపాదం
[ 06-07-2024]
గంజాయి, అక్రమ మద్యం, మాదకద్రవ్యాలు, సారా వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని, నిఘా వ్యవస్థ పటిష్టం చేసి అక్రమార్కులను అరెస్టు చేసి న్యాయస్థానంలో శిక్ష పడేలా చూడాలని జిల్లా ప్రత్యేక ఎన్ఫోర్సుమెంట్ అధికారి (డీఎస్ఈవో) సుబ్బరాజు ఆదేశించారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
[ 06-07-2024]
జల్సాలకు అలవాటుపడి ద్విచక్రవాహనాలు అపహరించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను వి.కోట పోలీసులు పట్టుకున్నారు.