జగనన్న కాలనీల్లో కన్నీటి కష్టాలు!
‘ఇళ్లు కాదు.. ఊర్లు నిర్మిస్తున్నాం. పేదలకు వేల సంఖ్యలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. దశల వారీగా పక్కా గృహాలు మంజూరు చేస్తున్నాం.
బోర్లు వేసినా ట్యాంకులు, కుళాయి కనెక్షన్లు లేక అరకొర సరఫరా
కుప్పం పురపాలిక పరిధిలో నీటి సదుపాయం లేని లక్ష్మీపురం కాలనీ
బైరెడ్డిపల్లె, కుప్పం పట్టణం, పెద్దపంజాణి, న్యూస్టుడే: ‘ఇళ్లు కాదు.. ఊర్లు నిర్మిస్తున్నాం. పేదలకు వేల సంఖ్యలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. దశల వారీగా పక్కా గృహాలు మంజూరు చేస్తున్నాం. కాలనీల్లో లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం రాకుండా మౌలిక వసతులు కల్పిస్తాం’ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. అయితే చాలా కాలనీల్లో ఐదేళ్లలో కనీసం తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయలేకపోయారు. బోర్లు వేసి ట్యాంకుల నిర్మాణం, పైపులైన్లు వేసి వీధులకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం మరిచారు. బోరు నుంచి నేరుగా సరఫరా చేస్తుండటంతో విద్యుత్ కష్టాలతో ఇబ్బందులు తప్పడం లేదు.
పలుమార్లు వాయిదాలు
గతేడాది ఉగాది నాటికి తొలివిడత మంజూరు చేసిన 75,393 గృహాలు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ధేశించారు. సామూహిక గృహ ప్రవేశాలు చేస్తామని ప్రకటించారు. తర్వాత నాలుగుసార్లు దాన్ని వాయిదా వేశారు. ఇప్పటికీ తొలివిడత మంజూరు చేసిన పక్కా గృహాలే పూర్తికాలేని పరిస్థితి నెలకొంది. దూర ప్రాంతాల్లో కాలనీల ఏర్పాటు, వసతులు కల్పించడంలో విఫలం కావడంతో నిర్మాణాలు చేపట్టడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపలేకపోయారు. మూడేళ్లలో 45,837 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. రెండో విడత ఇల్లు కావాలని లబ్ధిదారులు అడిగినా ప్రభుత్వం విస్మరించింది.
మచ్చుకు కొన్ని చోట్ల..
బైరెడ్డిపల్లె ఆంజనేయస్వామి ఆలయం పక్కన జగనన్న కాలనీలో నీటి వసతి లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 84 మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. పెద్దపంజాణి మండలం బసవరాజుకండ్రిగ జగనన్న కాలనీలో లబ్ధిదారులకు నీటితొట్టే దిక్కు. ఇక్కడ 28 మంది లబ్ధిదారులకు పక్కా గృహాలు మంజూరయ్యాయి. వీటిలో 18 మందే పూర్తి చేశారు. కుప్పం పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం జగనన్న కాలనీలో అరకొర నీటి సరఫరాతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. కాలనీలో 446 మందికి ఇంటి స్థలాలు కేటాయించి 342 మందికి పక్కా గృహాలు మంజూరు చేశారు. ఇక్కడ తాగునీటికి బోరు ఏర్పాటు చేసి పైపులైన్లు అమర్చారు. ట్యాంకు నిర్మాణం, కుళాయిలు ఏర్పాటు మరిచారు.
నీటి సరఫరా అంతంతమాత్రమే
జగనన్న కాలనీల్లో అన్ని వసతులు కల్పించాం. ఇంటి నిర్మాణాలు పూర్తి చేయకుంటే పట్టా రద్దు చేస్తామని ఓ దశలో అధికారులు ఒత్తిడి తెచ్చారు. మౌలిక వసతులు కల్పించకుండా తాము ఇల్లు ఎలా కట్టుకోవాలని లబ్ధిదారులు ప్రశ్నించారు. చాలా చోట్ల ఓ మూలన చిన్న ట్యాంకు ఏర్పాటు చేసి వదిలేశారు. నిర్మాణ పనులకు లబ్ధిదారులు ట్యాంకర్లతో నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
ప్రతిపాదనలు పంపాం..
జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపాం. బోర్లు వేయించాం. కొన్నిచోట్ల ట్యాంకులు నిర్మాణదశలో ఉన్నాయి. పెండింగ్ పనులు పూర్తి చేయించి కుళాయిల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటాం.
రమేష్రెడ్డి, గృహనిర్మాణ శాఖ డీఈఈ, పలమనేరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెస్కో.. అందినంత దోచుకో
[ 06-07-2024]
వడ్డించేవారు మనవారయితే చాలన్నట్లు.. కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (రెస్కో) పరిస్థితి తయారైంది. -
దొంగ ఓట్లకు అండదండలు
[ 06-07-2024]
విద్యాశాఖలో పలువురు అధికారులు వైకాపాకు అంటకాగుతూ ఐదేళ్లూ అక్రమాలు కొనసాగించారు. -
సర్వదర్శనానికి 16 గంటలు
[ 06-07-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 29 కంపార్ట్మెంట్లలో వేచిఉన్నారు. -
పెంపుడు జంతువులకు.. ఆధునిక వైద్యం
[ 06-07-2024]
మూగజీవాలు మన జీవన విధానంలో భాగమయ్యాయి. సమాజంలో ఆదరణ పెరుగుతోంది. -
అప్రమత్తమైతేనే..!
[ 06-07-2024]
ప్రస్తుత సమాజంలో ప్రతి ఇంట్లో పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయి.. వీటి ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు అవలంబించాలి.. లేనిపక్షంలో మన ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. -
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
[ 06-07-2024]
చిత్తూరు నగర సమగ్రాభివృద్ధికి రాజకీయ పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు పనిచేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. -
ఆరు ప్రాణాలు నిలిపిన అవయవదానం
[ 06-07-2024]
పుట్టెడు దుఃఖంలోనూ పలువురి ప్రాణాలు కాపాడేందుకు ఆ కుటుంబం ముందుకు వచ్చింది. -
చంద్రగిరిలో తుడా లెక్కలు తేల్చండి
[ 06-07-2024]
చంద్రగిరి నియోజకవర్గంలో తుడా చేపట్టిన అభివృద్ధి పనుల లెక్కలు తేల్చాలని ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులను కోరారు. -
‘తితిదే అక్రమాలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం’
[ 06-07-2024]
గత ప్రభుత్వంలో తితిదేలో జరిగిన అక్రమాలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తామని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి తెలిపారు. -
గంజాయి, అక్రమ మద్యంపై ఉక్కుపాదం
[ 06-07-2024]
గంజాయి, అక్రమ మద్యం, మాదకద్రవ్యాలు, సారా వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని, నిఘా వ్యవస్థ పటిష్టం చేసి అక్రమార్కులను అరెస్టు చేసి న్యాయస్థానంలో శిక్ష పడేలా చూడాలని జిల్లా ప్రత్యేక ఎన్ఫోర్సుమెంట్ అధికారి (డీఎస్ఈవో) సుబ్బరాజు ఆదేశించారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
[ 06-07-2024]
జల్సాలకు అలవాటుపడి ద్విచక్రవాహనాలు అపహరించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను వి.కోట పోలీసులు పట్టుకున్నారు.