పథకమేసి.. దోపిడీ చేసి
పనిచేస్తున్న కంపెనీ సొమ్ముపైనే కన్నేశాడు.. స్నేహితులతో కలిసి కాజేసేందుకు పథకం వేశాడు.. రూ.80 లక్షల నగదు సంచులతో సహచర ఉద్యోగితో కలిసి బస్సులో బయలుదేరాడు.
రూ.80 లక్షల చోరీ కేసు ఛేదన
మాట్లాడుతున్న ఏఎస్పీ సౌజన్య. చిత్రంలో నగదు. వెనుకవైపు ముసుగులో నిందితులు
నెల్లూరు (నేర విభాగం), న్యూస్టుడే: పనిచేస్తున్న కంపెనీ సొమ్ముపైనే కన్నేశాడు.. స్నేహితులతో కలిసి కాజేసేందుకు పథకం వేశాడు.. రూ.80 లక్షల నగదు సంచులతో సహచర ఉద్యోగితో కలిసి బస్సులో బయలుదేరాడు. అనుకున్నట్టుగానే.. ముందుగా నియమించుకున్న వ్యక్తులు కారులో వెంబడించారు. మధ్యలో బస్సు దాబా వద్ద ఆగగా.. ఏమీ ఎరగనట్టు బస్సులో కూర్చున్నాడు. సహచరుడు కిందకు వెళ్లగానే పథకాన్ని పూర్తిగా అమలు చేశాడు. ఏమీ తెలియనట్లుగా సహచరుడితో కలిసి ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో.. కథ అడ్డం తిరిగింది. విషయం బయటపడింది. సంబంధిత వివరాలను ఏఎస్పీ సౌజన్య బుధవారం విలేకరులకు వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...చింతకుంట చెన్నకేశవరెడ్డి స్టోర్ అసిస్టెంట్గా, పెద్దపంజాణి మండలం చలమంగళం గ్రామానికి చెందిన హరినాథ్రెడ్డి అకౌంట్ అసిస్టెంట్గా చెన్నైలోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నారు. వీరు సోమవారం విజయవాడ నుంచి కంపెనీ తాలూకు రూ.80 లక్షల నగదు తీసుకుని ట్రావెల్స్ బస్సులో చెన్నైకు బయలుదేరారు. కావలి రుద్రకోట సమీపంలో దాబా వద్ద బస్సు ఆగగా.. చెన్నకేశవరెడ్డి కిందకు దిగారు. హరినాథ్రెడ్డి బస్సులోనే ఉన్నారు. వెనుకే కారులో వచ్చిన ఇద్దరు.. బస్సు ఎక్కి, హరినాథ్రెడ్డికి మత్తు మందు ఇచ్చి నగదు సంచులను ఎత్తుకెళ్లారు. ఇదే విషయాన్ని చెన్నకేశవరెడ్డికి చెప్పగా.. ఇద్దరూ అదే
రోజు రాత్రి కావలి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కావలి డీఎస్పీ ఎం.వి.వెంకటరమణ, సీసీఎస్ డీఎస్పీ పి.రామకృష్ణాచారి నేతృత్వంలో కావలి గ్రామీణ, ఒకటో పట్టణ ఇన్స్పెక్టర్లు కె.శ్రీనివాసరావు, రాజేష్ సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పరిశీలించగా.. నగదు సంచులతో ఇద్దరు బస్సు దిగి కారులో వెళ్లినట్లు గుర్తించారు. వారు విజయవాడ నుంచి బస్సును వెంబడిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఫిర్యాదు చేసిన ఇద్దరు ఉద్యోగులను వేర్వేరుగా విచారించగా.. హరినాథరెడ్డి స్నేహితులతో కలిసి నగదు దోపిడీ చేసినట్లు వెల్లడైంది.
అవసరాల కోసం..
అవసరాల కోసం కంపెనీ నగదు కాజేయాలని హరినాథ్రెడ్డి నిర్ణయించుకున్నాడు. అదే విషయాన్ని.. స్నేహితులైన అన్నమయ్య జిల్లా పెద్ద తిప్పసముద్రం మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన వినోద్కుమార్, రమేశ్కు చెప్పి పథక రచన చేశారు. అందుకు కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాకు చెందిన యాసిన్బాషా, దివాసన బనవార్ను నియమించుకున్నారు. వీరు కారులో బస్సును వెంబడించి.. నగదు దోచుకెళ్లేలా పథకమేశారు. ఈ నెల ఒకటో తేదీ కంపెనీ స్టోర్ అసిస్టెంట్తో కలిసి.. విజయవాడ నుంచి రూ.80 లక్షల నగదు ట్రావెల్స్ బస్సులో చెన్నైకు తీసుకెళ్తుండగా.. అమలు చేశారు. వినోద్కుమార్, రమేశ్ బస్సులో ఎక్కగా.. మరో ఇద్దరు కారులో వెంబడించారు. కావలి సమీపంలో దాబా వద్ద నిందితులు నగదు సంచులు తీసుకుని కారులో పరారయ్యారు. బుధవారం మదనపల్లె, బెంగళూరు సమీపంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.77.50 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. కావలి గ్రామీణ, ఒకటో పట్టణ ఇన్స్పెక్టర్లు, దుత్తలూరు ఎస్సై ఉమాశంకర్, సిబ్బందిని ఏఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెస్కో.. అందినంత దోచుకో
[ 06-07-2024]
వడ్డించేవారు మనవారయితే చాలన్నట్లు.. కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (రెస్కో) పరిస్థితి తయారైంది. -
దొంగ ఓట్లకు అండదండలు
[ 06-07-2024]
విద్యాశాఖలో పలువురు అధికారులు వైకాపాకు అంటకాగుతూ ఐదేళ్లూ అక్రమాలు కొనసాగించారు. -
సర్వదర్శనానికి 16 గంటలు
[ 06-07-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 29 కంపార్ట్మెంట్లలో వేచిఉన్నారు. -
పెంపుడు జంతువులకు.. ఆధునిక వైద్యం
[ 06-07-2024]
మూగజీవాలు మన జీవన విధానంలో భాగమయ్యాయి. సమాజంలో ఆదరణ పెరుగుతోంది. -
అప్రమత్తమైతేనే..!
[ 06-07-2024]
ప్రస్తుత సమాజంలో ప్రతి ఇంట్లో పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయి.. వీటి ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు అవలంబించాలి.. లేనిపక్షంలో మన ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. -
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
[ 06-07-2024]
చిత్తూరు నగర సమగ్రాభివృద్ధికి రాజకీయ పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు పనిచేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. -
ఆరు ప్రాణాలు నిలిపిన అవయవదానం
[ 06-07-2024]
పుట్టెడు దుఃఖంలోనూ పలువురి ప్రాణాలు కాపాడేందుకు ఆ కుటుంబం ముందుకు వచ్చింది. -
చంద్రగిరిలో తుడా లెక్కలు తేల్చండి
[ 06-07-2024]
చంద్రగిరి నియోజకవర్గంలో తుడా చేపట్టిన అభివృద్ధి పనుల లెక్కలు తేల్చాలని ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులను కోరారు. -
‘తితిదే అక్రమాలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం’
[ 06-07-2024]
గత ప్రభుత్వంలో తితిదేలో జరిగిన అక్రమాలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తామని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి తెలిపారు. -
గంజాయి, అక్రమ మద్యంపై ఉక్కుపాదం
[ 06-07-2024]
గంజాయి, అక్రమ మద్యం, మాదకద్రవ్యాలు, సారా వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని, నిఘా వ్యవస్థ పటిష్టం చేసి అక్రమార్కులను అరెస్టు చేసి న్యాయస్థానంలో శిక్ష పడేలా చూడాలని జిల్లా ప్రత్యేక ఎన్ఫోర్సుమెంట్ అధికారి (డీఎస్ఈవో) సుబ్బరాజు ఆదేశించారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
[ 06-07-2024]
జల్సాలకు అలవాటుపడి ద్విచక్రవాహనాలు అపహరించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను వి.కోట పోలీసులు పట్టుకున్నారు.