వైకాపా ఎంపీపీ సవాల్ నిలబెట్టుకోవాలి
వైకాపా ఎంపీపీ యువరాజ్ ఎన్నికల ముందు విసిరిన సవాల్ ప్రకారం పదవికి రాజీనామా చేసి, రూ. 20 కోట్ల ఆస్తి ఇచ్చేసి మాటనిలబెట్టుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు.
నిరసన వ్యక్తం చేసిన తెదేపా నాయకులు
బిల్లులు స్వాహా చేశాడని వైకాపా సర్పంచి ఆరోపణ
ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న తెదేపా నాయకులు
వి.కోట, న్యూస్టుడే: వైకాపా ఎంపీపీ యువరాజ్ ఎన్నికల ముందు విసిరిన సవాల్ ప్రకారం పదవికి రాజీనామా చేసి, రూ. 20 కోట్ల ఆస్తి ఇచ్చేసి మాటనిలబెట్టుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. తెదేపా అధికారం చేపట్టిన తర్వాత స్థానిక ఎంపీపీ ఎంపీడీవో కార్యాలయానికి రాలేదు. బుధవారం వస్తున్నారన్న సమాచారంతో తెదేపా మండలాధ్యకుడు రంగనాథ్ నేతృత్వంలో శ్రేణులు అక్కడికి తరలి వచ్చారు. ఎంత సేపటికి అతను రాకపోవడంతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. మండల పార్టీ అధ్యకుడు, మాజీ ఎంపీపీ స్వగ్రామం కుంభార్లపల్లె పంచాయతీలో తెదేపాకు వైకాపా కంటే ఒక్క ఓటు ఆధిక్యం వచ్చినా పదవికి రాజీనామా చేసి.. తన ఆస్తినంతా ఇచ్చేస్తానని వైకాపా ఎంపీపీ యువరాజ్ విసిరిన సవాల్ను గుర్తు చేశారు. తర్వాత కార్యాలయంలో సీఎం చంద్రబాబు చిత్రపటాన్ని ఏర్పాటు చేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యల వినతిపత్రాన్ని ఎంపీˆడీవోకు అందించారు. రాంబాబు, ధీరజ్, ఈశ్వర్గౌడు, విశ్వనాథ్, నాగరాజు పాల్గొన్నారు.
నిధులు మళ్లించారని ఆరోపణ
ఎంపీపీ యువరాజ్ తాను పనిచేసిన బిల్లులను ఆయన ఖాతాల్లోకి మళ్లించుకున్నారని ముదరందొడ్డి వైకాపా సర్పంచి దామోదర్ ఆరోపించారు. గ్రామంలో మండల పరిషత్ నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించానని ఇందుకు సంబంధించిన రూ.13 లక్షల నిధులు రావాల్సి ఉందని ఎంపీడీవోను ఫిర్యాదు చేశారు. తర్వాత ఈ విషయమై తనకు మద్దతు ఇవ్వాలని తెదేపా నాయకులను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెస్కో.. అందినంత దోచుకో
[ 06-07-2024]
వడ్డించేవారు మనవారయితే చాలన్నట్లు.. కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (రెస్కో) పరిస్థితి తయారైంది. -
దొంగ ఓట్లకు అండదండలు
[ 06-07-2024]
విద్యాశాఖలో పలువురు అధికారులు వైకాపాకు అంటకాగుతూ ఐదేళ్లూ అక్రమాలు కొనసాగించారు. -
సర్వదర్శనానికి 16 గంటలు
[ 06-07-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని 29 కంపార్ట్మెంట్లలో వేచిఉన్నారు. -
పెంపుడు జంతువులకు.. ఆధునిక వైద్యం
[ 06-07-2024]
మూగజీవాలు మన జీవన విధానంలో భాగమయ్యాయి. సమాజంలో ఆదరణ పెరుగుతోంది. -
అప్రమత్తమైతేనే..!
[ 06-07-2024]
ప్రస్తుత సమాజంలో ప్రతి ఇంట్లో పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయి.. వీటి ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు అవలంబించాలి.. లేనిపక్షంలో మన ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. -
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
[ 06-07-2024]
చిత్తూరు నగర సమగ్రాభివృద్ధికి రాజకీయ పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు పనిచేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. -
ఆరు ప్రాణాలు నిలిపిన అవయవదానం
[ 06-07-2024]
పుట్టెడు దుఃఖంలోనూ పలువురి ప్రాణాలు కాపాడేందుకు ఆ కుటుంబం ముందుకు వచ్చింది. -
చంద్రగిరిలో తుడా లెక్కలు తేల్చండి
[ 06-07-2024]
చంద్రగిరి నియోజకవర్గంలో తుడా చేపట్టిన అభివృద్ధి పనుల లెక్కలు తేల్చాలని ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులను కోరారు. -
‘తితిదే అక్రమాలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం’
[ 06-07-2024]
గత ప్రభుత్వంలో తితిదేలో జరిగిన అక్రమాలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తామని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్రెడ్డి తెలిపారు. -
గంజాయి, అక్రమ మద్యంపై ఉక్కుపాదం
[ 06-07-2024]
గంజాయి, అక్రమ మద్యం, మాదకద్రవ్యాలు, సారా వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని, నిఘా వ్యవస్థ పటిష్టం చేసి అక్రమార్కులను అరెస్టు చేసి న్యాయస్థానంలో శిక్ష పడేలా చూడాలని జిల్లా ప్రత్యేక ఎన్ఫోర్సుమెంట్ అధికారి (డీఎస్ఈవో) సుబ్బరాజు ఆదేశించారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
[ 06-07-2024]
జల్సాలకు అలవాటుపడి ద్విచక్రవాహనాలు అపహరించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను వి.కోట పోలీసులు పట్టుకున్నారు.