వైకాపాతో అంటకాగి... ప్రతిపక్షాలపై చెలరేగి..!
ప్రజలు చెల్లించిన పన్నులతో జీతాలు తీసుకునే అధికారులు, ఉద్యోగులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. సామాన్యులు మొదలుకుని ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్న ఏ పార్టీ నాయకుల విషయంలోనైనా ఒకేవిధంగా చట్టాన్ని అమలు చేయాలి.
ఐదేళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు అధికారులు
సామాన్యులు, తెదేపా నేతలకు అడుగడుగునా ఇబ్బందులు
ఈనాడు, చిత్తూరు: ప్రజలు చెల్లించిన పన్నులతో జీతాలు తీసుకునే అధికారులు, ఉద్యోగులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. సామాన్యులు మొదలుకుని ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్న ఏ పార్టీ నాయకుల విషయంలోనైనా ఒకేవిధంగా చట్టాన్ని అమలు చేయాలి. ఐదేళ్ల వైకాపా పాలనలో కొందరు వీటికి తిలోదకాలు ఇచ్చారు. ఫ్యాను పార్టీ నేతలు చెప్పిన ప్రతి దానికీ తలూపి నిబంధనలు తుంగలో తొక్కారు. అచ్చంగా వైకాపా కార్యకర్తల్లా వ్యవహరించి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నారు. వారు తీసుకున్న చర్యలతో అటు సామాన్యులు, ఇటు తెదేపా, జనసేన, భాజపా నాయకులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
రైతులను ఇబ్బంది పెట్టిన శ్యాంప్రసాద్రెడ్డి
సోమల మండలంలో డిప్యూటీ తహసీల్దారు (డీటీ)గా ఉన్న శ్యాంప్రసాద్రెడ్డి ఐదేళ్లపాటు పెత్తనం చెలాయించారు. తన అధికారాన్ని తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికే వినియోగించారు. ఆవులపల్లి రిజర్వాయర్లో భూములు కోల్పోయే రైతులకు కనీసం ఎంత పరిహారం చెల్లిస్తున్నారో కూడా ఆయన చెప్పలేదు. తెదేపా మద్దతుదారులకు పట్టాలు ఉన్నా అవి అటవీ భూములని చెప్పి కందకాలు తవ్వించి ఇక్కట్లకు గురి చేశారు. వైకాపా నేతలు ఆక్రమణలకు తెగబడితే చర్యలు తీసుకోకుండా వారికే సహకరించారు. ఎక్కడా లేనట్టుగా ఇక్కడే నాలుగేళ్లపాటు డీటీనే ఇన్ఛార్జి తహసీల్దారుగా వ్యవహరించారు. గతంలో షబ్బీర్ అనే వ్యక్తికి పోస్టింగ్ ఇచ్చినా ఆయన విధుల్లో చేరలేదంటే ఎంతటి అరాచక పరిస్థితులు ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది.
తెలుగు మహిళలపై కక్ష కట్టిన సీఐ శ్రీనివాసంతి
నగరి పట్టణ, రూరల్ సీఐగా పనిచేసిన సీఐ శ్రీనివాసంతి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై కక్ష కట్టారు. అప్పటి మంత్రి రోజా ఆదేశాలే శిరోధార్యమన్నట్లుగా ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు నమోదు చేశారు. గతేడాది ఫిబ్రవరిలో నగరి నియోజకవర్గంలో ‘యువగళం’ పాదయాత్ర సందర్భంగా తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. రోజా అవినీతిని ఎండగట్టారు. దీంతో ఆమె లోకేశ్ను దుయ్యబట్టారు. తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మీర, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అరుణ తదితరులు నగరిలోని రోజా ఇంటికి చీర, సారెతో వెళ్లగా పోలీసులు అడ్డగించి అరెస్టు చేశారు. పోలీస్స్టేషన్లో ఉన్న మహిళా నేతలతో మాట్లాడేందుకు వెళ్లిన తెదేపా నాయకులతో సీఐ అనుచితంగా ప్రవర్తించారు. తిరుపతి జనసేన నాయకుడు కిరణ్రాయల్.. రోజాపై విమర్శలు చేశారని ఓ కార్పొరేటర్ ఫిర్యాదు చేయడంతో 2022 నవంబరులో అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. చరవాణిలోని ఫొటోలు మార్ఫింగ్ చేసి అంతర్జాలంలో పెట్టి పరువు తీస్తామని ఆయన్ను బెదిరించారు. సీఐ శ్రీనివాసంతే ఈ ఘటనకు కారణమని కిరణ్ రాయల్ ఆరోపించారు.
వైకాపా నేతల దాడిని కప్పిపుచ్చిన ఎస్సై
కల్లూరు ఎస్సైగా విధులు నిర్వర్తించిన శ్రీనివాసు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నమ్మిన బంటు. వైకాపా నేతలు.. తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు చేస్తే తిరిగి బాధితులపై కేసులు పెట్టిన ఘనుడు ఈయన. పులిచెర్ల మండలం చల్లావారిపల్లెకు చెందిన తెదేపా కార్యకర్త శివకుమార్ వైకాపా శ్రేణుల ఇసుక అక్రమ రవాణాకు అభ్యంతరం చెప్పారని దాడి చేశారు. దీంతో పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన శివశక్తి డెయిరీకి తీసుకెళ్లి చేతులు విరగ్గొట్టి రోడ్డు పక్కన పడేశారు. దీనిపై అప్పట్లో ఎస్సైను ప్రశ్నిస్తే ట్రాక్టర్ నుంచి కిందపడ్డాడని సమాధానమిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షం తరఫున పోటీ చేయాలని చూసిన వ్యక్తుల ఇళ్ల వద్దకు వెళ్లి బెదిరించారు. కేసులు లేవని పత్రాలు ఇచ్చేందుకూ నిరాకరించారు.
ఉన్నతాధికారులనూ లెక్క చేయని పెద్దిరెడ్డి వెంకట రమణారెడ్డి
సహకార శాఖలో ఉద్యోగం చేస్తున్న పెద్దిరెడ్డి వెంకట రమణారెడ్డి వైకాపా అధికారంలోకి రాగానే డిప్యుటేషన్పై సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్గా వచ్చారు. పెద్దిరెడ్డి అండదండలతోనే ఆయన పోస్టింగ్ తెచ్చుకున్నారు. నాడు- నేడు పనుల్లో పుంగనూరు నియోజకవర్గానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. పలు పనుల్లో ఆయన పర్సంటేజీలూ తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. డిప్యుటేషన్ ముగిసిన తర్వాత కూడా ఆ శాఖలోనే ఉన్నారు. కొంతకాలం తర్వాత పొడిగింపు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. పెద్దిరెడ్డి బంధువునని చెప్పుకొంటూ ఉన్నతాధికారులనూ లెక్క చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా విధేయుల్లో వణుకు.. అంటకాగిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఆరా
[ 05-07-2024]
వారంతా ప్రజల కష్టాన్ని జీతంగా తీసుకునే ఉద్యోగులు. కండువాలు కప్పుకోకపోయినా వైకాపాకు అంటకాగారు. -
రుచీపచి లేని బడి భోజనం
[ 05-07-2024]
మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడింది. ఐదేళ్లుగా గొప్పలు పోయిన జగన్ బడుల్లో తినేవారి సంఖ్య తగ్గిపోతోంది. -
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
[ 05-07-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి టీబీసీ వరకు క్యూలైన్లో వేచిఉన్నారు. -
వసతిగృహ సమస్యలు పరిష్కరించాలి
[ 05-07-2024]
ఎస్వీయూలోని వసతిగృహాల్లో తమకు వడ్డించే భోజనాల్లో నాణ్యత లేదని, వసతిగృహంలో సౌకర్యాలు సరిగా లేవంటూ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం వద్ద విద్యార్థినులు గురువారం ధర్నా నిర్వహించారు. -
9న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
[ 05-07-2024]
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. -
పెరగని సీట్లు..తరగని డిమాండు
[ 05-07-2024]
తితిదే కళాశాలల్లో ప్రవేశాలు కష్టతరంగా మారాయి. వీటిలో నామమాత్రం రుసుముతో నాణ్యమైన విద్యనందించడంతోపాటు వసతి, భోజనం కల్పిస్తుండటంతో ప్రవేశాలకు ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది -
సాహసమే శ్వాసగా
[ 05-07-2024]
ఉరిమే ఉత్సాహంతో సాహసమే శ్వాసగా సాగుతున్నారు పలువురు యువత.. వ్యక్తిగత క్రమశిక్షణ తూచా తప్పక పాటిస్తూ జాతీయ సమైక్య భావనతో మెలుగుతూ నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకుని మెరుగైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.. -
సీఎం ఫ్లెక్సీపై పేడ కొట్టిన దుండగులు
[ 05-07-2024]
పింఛన్ సాయం పెంచి, నెల మొదటి రోజే అందించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సీఎం నారా చంద్రబాబు ఫ్లెక్సీలోని ఆయన ముఖంపై గుర్తుతెలియని వ్యక్తులు పేడ కొట్టారు. -
స్తంభం ఎక్కితేనే కొలువు నిలిచేది
[ 05-07-2024]
వైకాపా హయాంలో అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన రెస్కో మారింది. ఛైర్మన్, అతని అనుచరులు, పార్టీ కార్యకర్తలే అర్హతలుగా భావించి అక్రమంగా చాలా మందికి కొలువులు ఇచ్చేశారు -
‘పెద్దిరెడ్డి’పై అవ్యాజ్య ప్రేమ
[ 05-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తమ స్వామి(జిల్లా పెద్దాయన) గెలవడమే లక్ష్యం.. అందుకు ఎన్ని అడ్డంకులొచ్చినా.. ఎవరెదురొచ్చినా ఉపేక్షించేది లేదని పట్టుపట్టి మరీ ఆ కుంభకోణాన్ని తొక్కిపట్టాడు.. -
కమీషన్ల కక్కుర్తి
[ 05-07-2024]
యంత్రాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. ఇందులో రూ.3 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు సమాచారం. గతంలో తితిదేలో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి ఇందులో ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది. -
కుప్పంలో వినతుల వెల్లువ
[ 05-07-2024]
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అన్యూహ్య స్పందన వచ్చింది. -
ఆశలన్నీ నీలంపైనే
[ 05-07-2024]
నీలం మామిడి కాయల ధరలు బహిరంగ మార్కెట్లో ఆశాజనకంగా ఉన్నాయి. టన్ను కాయలు నాణ్యతను బట్టి రూ.25 వేల నుంచి రూ.35 వేలకు అమ్ముడవుతున్నాయి. -
డీకేటీ ముసుగులో గుట్టక్కు
[ 05-07-2024]
మండలంలోని సామిరెడ్డిపల్లె రెవెన్యూ పరిధిలోని గుట్టను ఓ వ్యక్తి యంత్రాల సాయంతో ఆక్రమించేందుకు యత్నించాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలి: డిప్యూటీ సీఎం పవన్
-
ఆ ప్రశ్నాపత్రాలు ఇస్తామంటే నమ్మొద్దు - ఎన్బీఈ హెచ్చరిక
-
యూకే నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్.. కింగ్ ఛార్లెస్-3 ఆమోదం
-
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
-
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
-
ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక