సర్వే చేస్తాం.. అయితే మాకేంటి?
సర్వే సిబ్బందితో పని అంటేనే గ్రామాల్లోని రైతులు వణికిపోతున్నారు. అర్జీ పెట్టుకున్న ఎన్ని రోజులకు పొలంపైకి వచ్చి కొలతలు తీస్తారో, ఎక్కడ తమకు చెందాల్సిన భూమి విస్తీర్ణం తగ్గించి ఇతరులకు మేలు జరిగేలా చేస్తారోనన్న భయం అన్నదాతలను వెంటాడుతోంది.
అక్రమార్కులపై చర్యలు తీసుకుంటేనే వ్యవస్థ గాడిలోకి
చ్రలానా కట్టినా ముడుపులు చెల్లించాలంటున్న కొందరు సర్వేయర్లు
ఈనాడు, చిత్తూరు: సర్వే సిబ్బందితో పని అంటేనే గ్రామాల్లోని రైతులు వణికిపోతున్నారు. అర్జీ పెట్టుకున్న ఎన్ని రోజులకు పొలంపైకి వచ్చి కొలతలు తీస్తారో, ఎక్కడ తమకు చెందాల్సిన భూమి విస్తీర్ణం తగ్గించి ఇతరులకు మేలు జరిగేలా చేస్తారోనన్న భయం అన్నదాతలను వెంటాడుతోంది. కార్యాలయం నుంచి అడుగు బయట పెట్టింది మొదలు భూమి వద్దకు చేరుకునేంత వరకూ కొందరు సర్వేయర్లు డబ్బులు వసూలు చేస్తూ కర్షకుల జేబులు ఖాళీ చేస్తున్నారు. పలుసార్లు ఈ వ్యవహారం ముదిరి పాకాన పడి సస్పెన్షన్లకూ దారి తీస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి ప్రతి మండలంలో ఎన్ని అర్జీలు పెండింగ్లో ఉన్నాయి? దరఖాస్తు చేసుకుని పరిష్కరించకపోయినా రైతాంగం నుంచి సంతకాలు తీసుకున్న ఘటనలు ఏమైనా ఉన్నాయా? అని విచారిస్తే బాధితులకు న్యాయం జరుగుతుంది. అన్నదాతలకు భూమే ఓ భరోసా. పిల్లల చదువులు, వివాహాలు, అనారోగ్య సమస్యలు తలెత్తినా మరొకరిపై ఆధారపడకుండా ధీమాగా ఉండేందుకు దోహదం చేస్తుంది. తమ తదనంతరం వారసులకు అప్పగించాలన్నది రైతుల ఆశ. అటువంటి స్థలంలో కొంతభాగాన్ని పక్క పొలం వ్యక్తి ఆక్రమించినా, ఎవరైనా వివాదాలు సృష్టించినా వెంటనే గుర్తుకు వచ్చేది సర్వేయర్లే. అక్కడ తమ సమస్య పరిష్కారమవుతుందని కొండంత ఆశతో వెళితే డబ్బులు పోగొట్టుకుని ఇంటికి చేరాల్సిన దుస్థితి ఎదురవుతోంది.
- శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి స్థలం సర్వే చేసి సబ్ డివిజన్ చేసేందుకు డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ తెలుగుదేశం నాయకుల నుంచి రూ.1.80 లక్షలు తీసుకున్నారు. భూ సర్వే కోసం మరో రైతును రూ.లక్ష డిమాండ్ చేయడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు.
- తన పొలం సర్వే చేయాలంటూ యాదమరి మండలానికి చెందిన ఓ రైతు అర్జీ పెట్టుకుని చలానా కట్టి ఆరు నెలలు దాటినా సర్వేయర్ స్పందించలేదు. కలెక్టరేట్లో దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో సమస్య పరిష్కరించాలని చెప్పగా అప్పుడు గ్రామ సర్వేయర్ రంగంలోకి దిగి రూ.20వేలు చెల్లించాలని స్పష్టం చేశారు. చివరకు సదరు రైతు నుంచి రూ.15వేలు తీసుకుని పనిచేశారు.
సంతకాలు చేయించుకుని.. చలానాలు కట్టించి
ఎవరైనా సర్వే చేసేందుకు లంచం ఇవ్వకుంటే ఏదో ఒక సాకు చెప్పి సిబ్బంది కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిప్పించడం రివాజుగా మారింది. వ్యవహారం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లినా అదే పరిస్థితి. గడువు ముగిసే సమయంలో చలానా కట్టిన వ్యక్తితో త్వరలోనే సర్వేకు వస్తామని చెప్పి సంతకాలు చేయించుకుంటున్నారు. తర్వాత బాధితులు మరోసారి చలానాలు కడుతున్నారు. ఇలా నెలల తరబడి సమస్యను పరిష్కరించడంలేదు. ప్రశ్నిస్తే భూ విస్తీర్ణం తగ్గించి ఎక్కడ కొత్త చిక్కులు తెస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారు. తరచూ ఫిర్యాదులు వస్తున్న మండలాల్లోని సర్వేయర్లపై ఓ కన్ను వేసి ఒకరిద్దరిపై వేటు వేస్తే మిగతావారూ గాడిలో పడతారు.
ఎకరాకు రూ.5-50 వేలు
రైతులు తమ భూమి సర్వే చేయాలంటే ముందుగా చలానా కట్టాలి. ప్రతి సర్వే నంబరుకు రూ.545 చెల్లిస్తే ఏ రోజు సర్వే శాఖ సిబ్బంది వచ్చి కొలతలు తీస్తారో ఫోన్ ద్వారా సిబ్బంది చెబుతారు. న్యాయ వివాదాలు లేకుంటే 15 రోజుల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వం గడువు విధించింది. చిత్తూరు, పూతలపట్టు, నగరి, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని కొందరు సర్వేయర్లు ఎకరా భూమిని కొలవాలంటే కనిష్ఠంగా రూ.5వేలు వసూలు చేస్తున్నారు. ధరలు ఎక్కువగా ఉన్నచోట రూ.50వేలు కూడా అడుగుతున్నారు. సర్వే పూర్తి చేసిన తర్వాత అధికారులు, సిబ్బందికి చేసే అతిథి మర్యాదలు అదనం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా విధేయుల్లో వణుకు.. అంటకాగిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఆరా
[ 05-07-2024]
వారంతా ప్రజల కష్టాన్ని జీతంగా తీసుకునే ఉద్యోగులు. కండువాలు కప్పుకోకపోయినా వైకాపాకు అంటకాగారు. -
రుచీపచి లేని బడి భోజనం
[ 05-07-2024]
మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడింది. ఐదేళ్లుగా గొప్పలు పోయిన జగన్ బడుల్లో తినేవారి సంఖ్య తగ్గిపోతోంది. -
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
[ 05-07-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి టీబీసీ వరకు క్యూలైన్లో వేచిఉన్నారు. -
వసతిగృహ సమస్యలు పరిష్కరించాలి
[ 05-07-2024]
ఎస్వీయూలోని వసతిగృహాల్లో తమకు వడ్డించే భోజనాల్లో నాణ్యత లేదని, వసతిగృహంలో సౌకర్యాలు సరిగా లేవంటూ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం వద్ద విద్యార్థినులు గురువారం ధర్నా నిర్వహించారు. -
9న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
[ 05-07-2024]
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. -
పెరగని సీట్లు..తరగని డిమాండు
[ 05-07-2024]
తితిదే కళాశాలల్లో ప్రవేశాలు కష్టతరంగా మారాయి. వీటిలో నామమాత్రం రుసుముతో నాణ్యమైన విద్యనందించడంతోపాటు వసతి, భోజనం కల్పిస్తుండటంతో ప్రవేశాలకు ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది -
సాహసమే శ్వాసగా
[ 05-07-2024]
ఉరిమే ఉత్సాహంతో సాహసమే శ్వాసగా సాగుతున్నారు పలువురు యువత.. వ్యక్తిగత క్రమశిక్షణ తూచా తప్పక పాటిస్తూ జాతీయ సమైక్య భావనతో మెలుగుతూ నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకుని మెరుగైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.. -
సీఎం ఫ్లెక్సీపై పేడ కొట్టిన దుండగులు
[ 05-07-2024]
పింఛన్ సాయం పెంచి, నెల మొదటి రోజే అందించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సీఎం నారా చంద్రబాబు ఫ్లెక్సీలోని ఆయన ముఖంపై గుర్తుతెలియని వ్యక్తులు పేడ కొట్టారు. -
స్తంభం ఎక్కితేనే కొలువు నిలిచేది
[ 05-07-2024]
వైకాపా హయాంలో అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన రెస్కో మారింది. ఛైర్మన్, అతని అనుచరులు, పార్టీ కార్యకర్తలే అర్హతలుగా భావించి అక్రమంగా చాలా మందికి కొలువులు ఇచ్చేశారు -
‘పెద్దిరెడ్డి’పై అవ్యాజ్య ప్రేమ
[ 05-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తమ స్వామి(జిల్లా పెద్దాయన) గెలవడమే లక్ష్యం.. అందుకు ఎన్ని అడ్డంకులొచ్చినా.. ఎవరెదురొచ్చినా ఉపేక్షించేది లేదని పట్టుపట్టి మరీ ఆ కుంభకోణాన్ని తొక్కిపట్టాడు.. -
కమీషన్ల కక్కుర్తి
[ 05-07-2024]
యంత్రాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. ఇందులో రూ.3 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు సమాచారం. గతంలో తితిదేలో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి ఇందులో ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది. -
కుప్పంలో వినతుల వెల్లువ
[ 05-07-2024]
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అన్యూహ్య స్పందన వచ్చింది. -
ఆశలన్నీ నీలంపైనే
[ 05-07-2024]
నీలం మామిడి కాయల ధరలు బహిరంగ మార్కెట్లో ఆశాజనకంగా ఉన్నాయి. టన్ను కాయలు నాణ్యతను బట్టి రూ.25 వేల నుంచి రూ.35 వేలకు అమ్ముడవుతున్నాయి. -
డీకేటీ ముసుగులో గుట్టక్కు
[ 05-07-2024]
మండలంలోని సామిరెడ్డిపల్లె రెవెన్యూ పరిధిలోని గుట్టను ఓ వ్యక్తి యంత్రాల సాయంతో ఆక్రమించేందుకు యత్నించాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమరావతి నిర్మాణానికి తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళం
-
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
-
పెద్ద అంబర్పేట సమీపంలో పోలీసుల కాల్పులు
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
-
క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,200