కార్యాలయం దాటితే ఒట్టు..!
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య పటిష్టతలో కీలక పాత్ర పోషించే సెక్టోరియల్ అధికారులు జిల్లా కార్యాలయానికే పరిమితమై పర్యవేక్షణ గాలికొదిలేశారు.
పాఠశాలల్లో కొరవడిన పర్యవేక్షణ
పట్టించుకోని సెక్టోరియల్ అధికారులు
చిత్తూరు విద్య, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య పటిష్టతలో కీలక పాత్ర పోషించే సెక్టోరియల్ అధికారులు జిల్లా కార్యాలయానికే పరిమితమై పర్యవేక్షణ గాలికొదిలేశారు.. విద్యా సంవత్సరం ప్రారంభమై 18 రోజులు దాటినా పాఠశాలల తనిఖీకి ఇప్పటివరకు అడుగు బయట పెట్టలేదు.. ఎప్పుడు చూసినా జిల్లా కార్యాలయమైన సమగ్ర శిక్షలోనే వీరు ఉంటున్నారు.. ఇదేమని ఆడిగితే కార్యాలయంలో ముఖ్యమైన దస్త్రాలు ఉన్నాయి వాటిని క్లియర్ చేయాలని చెబుతున్నారు.. ఓవైపు ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల ప్రవేశాలను పోటాపోటీగా చేపట్టగా వాటిని దీటుగా ఎదుర్కొని పిల్లలను తమ పాఠశాలల్లో చేర్పించుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు.. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలు ఆశించిన స్థాయిలో జరగలేదని రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రశ్నించారని సమాచారం.
మొక్కుబడిగా ‘బడికి పోతాం’
విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో బడికి పోతాం కార్యక్రమం ద్వారా బడిఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మరో రెండు వారాల్లో ముగియనుంది. ఈలోగా నిర్దేశించిన విద్యార్థులందరూ పాఠశాలల్లో ప్రవేశం పొందాలి. ఐదేళ్లు నిండిన పిల్లలు ఎంతమంది ఉన్నారు..? వారిలో ఎంతమంది పాఠశాలలో చేరారు..? మిగిలిన వారు ఎంతమంది ఉంటారనే కచ్చితమైన సమాచారం విద్యాశాఖ, సమగ్ర శిక్ష వద్ద నేటికీ లేకపోవడం గమనార్హం. యూడైస్, చైల్డ్ఇన్ఫో యాప్లలోని డేటా ఆధారంగా లెక్కలు వేస్తున్నారు గానీ.. క్షేత్ర స్థాయిలో లెక్కలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో ఒకటో తరగతిలో ప్రవేశించేందుకు అర్హులైన పిల్లలందరూ ఇంకా పూర్తి స్థాయిలో పాఠశాలల్లో చేరలేదు జిల్లాలో విద్యాశాఖ, సమగ్ర శిక్ష గణాంకాల ప్రకారం 21,899మంది విద్యార్థులు ఒకటో తరగతిలో ప్రవేశం పొందాల్సి ఉండగా ఇప్పటివరకు 14,729 మంది చేరారు. పాఠశాలలు ప్రారంభమై 18 రోజులు గడిచినా ఇంకా అధికారుల లెక్కల ప్రకారం ఇంకా రెండింట ఒక వంతు మాత్రమే ప్రవేశం పొందారు. ఇంకా పలు పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలు శూన్యమని సంబంధిత యాప్లో కనిపిస్తున్నాయి. వీటిపై దృష్టి సారించాల్సిన అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా లక్ష్యం నీరుగారిపోతోంది.
కార్యాలయాలకే పరిమితం
విద్యా సంవత్సరం పునః ప్రారంభం కాగానే విద్యాశాఖ, సమగ్ర శిక్ష శాఖల అధికారులు, సెక్టోరియల్ అధికారులు పిల్లల నమోదుపై దృష్టి సారించాలి. అయితే వీటిని పక్కనపెట్టి జిల్లా కార్యాలయంలోనే ఉంటున్నారు. కార్యాలయంలో రోజువారీ దస్త్రాలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు చెబుతుండటంతో వారు అక్కడే పరిమితమయ్యారు. ప్రవేశాలు పర్యవేక్షించాల్సిన అధికారులు మిన్నకుండటంతో ఆ ప్రభావం ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపనుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా విధేయుల్లో వణుకు!
[ 05-07-2024]
వారంతా ప్రజల కష్టాన్ని జీతంగా తీసుకునే ఉద్యోగులు. కండువాలు కప్పుకోకపోయినా వైకాపాకు అంటకాగారు. -
రుచీపచి లేని బడి భోజనం
[ 05-07-2024]
మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడింది. ఐదేళ్లుగా గొప్పలు పోయిన జగన్ బడుల్లో తినేవారి సంఖ్య తగ్గిపోతోంది. -
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
[ 05-07-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి టీబీసీ వరకు క్యూలైన్లో వేచిఉన్నారు. -
వసతిగృహ సమస్యలు పరిష్కరించాలి
[ 05-07-2024]
ఎస్వీయూలోని వసతిగృహాల్లో తమకు వడ్డించే భోజనాల్లో నాణ్యత లేదని, వసతిగృహంలో సౌకర్యాలు సరిగా లేవంటూ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం వద్ద విద్యార్థినులు గురువారం ధర్నా నిర్వహించారు. -
9న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
[ 05-07-2024]
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. -
పెరగని సీట్లు..తరగని డిమాండు
[ 05-07-2024]
తితిదే కళాశాలల్లో ప్రవేశాలు కష్టతరంగా మారాయి. వీటిలో నామమాత్రం రుసుముతో నాణ్యమైన విద్యనందించడంతోపాటు వసతి, భోజనం కల్పిస్తుండటంతో ప్రవేశాలకు ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది -
సాహసమే శ్వాసగా
[ 05-07-2024]
ఉరిమే ఉత్సాహంతో సాహసమే శ్వాసగా సాగుతున్నారు పలువురు యువత.. వ్యక్తిగత క్రమశిక్షణ తూచా తప్పక పాటిస్తూ జాతీయ సమైక్య భావనతో మెలుగుతూ నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకుని మెరుగైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.. -
సీఎం ఫ్లెక్సీపై పేడ కొట్టిన దుండగులు
[ 05-07-2024]
పింఛన్ సాయం పెంచి, నెల మొదటి రోజే అందించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సీఎం నారా చంద్రబాబు ఫ్లెక్సీలోని ఆయన ముఖంపై గుర్తుతెలియని వ్యక్తులు పేడ కొట్టారు. -
స్తంభం ఎక్కితేనే కొలువు నిలిచేది
[ 05-07-2024]
వైకాపా హయాంలో అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన రెస్కో మారింది. ఛైర్మన్, అతని అనుచరులు, పార్టీ కార్యకర్తలే అర్హతలుగా భావించి అక్రమంగా చాలా మందికి కొలువులు ఇచ్చేశారు -
‘పెద్దిరెడ్డి’పై అవ్యాజ్య ప్రేమ
[ 05-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తమ స్వామి(జిల్లా పెద్దాయన) గెలవడమే లక్ష్యం.. అందుకు ఎన్ని అడ్డంకులొచ్చినా.. ఎవరెదురొచ్చినా ఉపేక్షించేది లేదని పట్టుపట్టి మరీ ఆ కుంభకోణాన్ని తొక్కిపట్టాడు.. -
కమీషన్ల కక్కుర్తి
[ 05-07-2024]
యంత్రాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. ఇందులో రూ.3 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు సమాచారం. గతంలో తితిదేలో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి ఇందులో ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది. -
కుప్పంలో వినతుల వెల్లువ
[ 05-07-2024]
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అన్యూహ్య స్పందన వచ్చింది. -
ఆశలన్నీ నీలంపైనే
[ 05-07-2024]
నీలం మామిడి కాయల ధరలు బహిరంగ మార్కెట్లో ఆశాజనకంగా ఉన్నాయి. టన్ను కాయలు నాణ్యతను బట్టి రూ.25 వేల నుంచి రూ.35 వేలకు అమ్ముడవుతున్నాయి. -
డీకేటీ ముసుగులో గుట్టక్కు
[ 05-07-2024]
మండలంలోని సామిరెడ్డిపల్లె రెవెన్యూ పరిధిలోని గుట్టను ఓ వ్యక్తి యంత్రాల సాయంతో ఆక్రమించేందుకు యత్నించాడు.