దారి మార్చిన దుంగల దొంగలు
ఎర్రచందనం స్మగర్లు బరితెగిస్తున్నారు. రూటు మార్చి అక్రమ రవాణా నిరాటకంగా కొనసాగిస్తున్నారు.
సదాశివకోన అడవి నుంచి కేవీబీపురం మీదుగా అక్రమ రవాణా
పుత్తూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలో స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు (పాతచిత్రం)
పుత్తూరు, న్యూస్టుడే: ఎర్రచందనం స్మగర్లు బరితెగిస్తున్నారు. రూటు మార్చి అక్రమ రవాణా నిరాటకంగా కొనసాగిస్తున్నారు. నాలుగు మాసాల క్రితం ఏర్పేడు సమీపంలోని అటవీశాఖ చెక్పోస్టు వద్ద ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని ఆపే ప్రయత్నం చేసిన టాస్క్ఫోర్సు కానిస్టేబుల్ను ఢీకొని వెళ్లిపోయారు. ఎన్నికలు వచ్చాక స్మగర్లు కాస్త నెమ్మదించారు. కోడ్ ముగియడం, చెక్పోస్టులు తీసివేయడంతో స్మగర్లు రూటు మార్చి.. ఏమార్చి అక్రమ రవాణాకు తెగబడుతున్నారు. తిరుమలలో తనిఖీలు ఎక్కువ కావడంతో సదాశివకోన ప్రాంతంలో అయితే జనసంచారం ఉండదు కాబట్టి అటు వైపు స్మగర్లు రూటు మార్చారు.
శేషాచల అడవుల కేంద్రంగా సాగిన అక్రమ రవాణా కొన్నేళ్లుగా సదాశివకోన కేంద్రంగా సాగుతోంది. పుత్తూరు, వడమాలపేట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, కేవీబీపురం, నారాయణవనం ప్రాంతాల పరిధిలో 35 వేల హెక్టార్లలో ఈ అడవి విస్తరించి ఉంది. పుత్తూరు మండలం నుంచి నాగిలేరు మీదుగా, వడమాలపేట మండలంలో పాదిరేడు గొల్లపలి, రామసముద్రం, ఏర్పేడు మండలం చెల్లూరు, కేవీబీపురంలో ఓళ్లూరు, ఆదరం, నారాయణవనంలో సింగిర కోన తదితర ప్రాంతాల మీదుగా ఈ కోనలోకి దారులున్నాయి. ఇక్కడ జనసంచారం ఉండదు. దీంతో అక్రమ రవాణా నిరాటకంగా సాగిపోతోంది.
అడపాదడపా దాడులు
సదాశివ కోన కేంద్రంలో ఎర్రచందనం ఉండటంతో స్మగర్లు అటువైపు దృష్టి సారించారు. జనసంచారం కూడా లేకపోవడంతో ఇక్కడే కూలీలు ఉండడానికి గుడిసెలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. గడిచిన రెండు మాసాల్లో చిత్తూరు టాస్క్ఫోర్సు సిబ్బందితో కలిసి పుత్తూరు అటవీశాఖ అధికారులు, సిబ్బంది మూడు దఫాలు కూంబింగ్ నిర్వహించడంతో ఎర్రచందనం కంటపడింది. కూలీలు మాత్రం పారిపోయారు.
పరిధి ఎక్కువ.. సిబ్బంది లేరు
పుత్తూరు అటవీశాఖ రేంజ్ పరిధి ఎక్కువైనా సరిపడా సిబ్బంది లేరు. అనువైన వాహనాల్లేవు. ఉన్న సిబ్బంది చెక్పోస్టుల్లో ఉన్నారు. దీంతో అక్రమార్కుల పని సులభమవుతోంది. గతంలో టాస్క్ఫోర్సు సిబ్బందిని నియమించేవారు. వైకాపా ఐదేళ్ల పాలనలో ఎవరినీ నియమించలేదు. దీంతో విచ్చిలవిడిగా నరికి తరలించారు. స్థానికుల సహకారంతోనే ఇదంతా జరుగుతున్నా అధికారులు మాత్రం దృష్టిసారించడం లేదన్న విమర్శలున్నాయి. సదాశివకోనలో అక్రమ రవాణాకు స్థానిక సహకారం పుష్కలంగా ఉంది. లేదంటే తిరువణ్నామలై ప్రాంత వాసులకు తెలిసే పరిస్థితి లేదు.
నగరి, పిచ్చాటూరు ప్రాంతాలపై కన్ను
పిచ్చాటూరు, నాగలాపురం, నగరి పరిధిలో 22 వేల హెక్టార్లలో దట్టమైన అడవులున్నాయి. ఇక్కడ 3 వేల హెక్టార్లలో ఎర్రచందనం విస్తరించింది. దీనిపై అక్రమార్కుల కన్ను పడింది. ఇక్కడి ఎర్రచందనం నరికి పలుమార్గాల్లో నిఘా కళ్లు గప్పి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్నారు. తాజాగా కేవీబీపురం నుంచి నిండ్ర మండలం శ్రీరామాపురం మీదుగా ఎర్రచందనంతో తమిళనాడు వెళ్తున్న కారు అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లింది. చేసేది లేక వాహనాన్ని వదిలేసి స్మగర్లు పారిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుచీపచి లేని బడి భోజనం
[ 05-07-2024]
మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడింది. ఐదేళ్లుగా గొప్పలు పోయిన జగన్ బడుల్లో తినేవారి సంఖ్య తగ్గిపోతోంది. -
వైకాపా విధేయుల్లో వణుకు!
[ 05-07-2024]
వారంతా ప్రజల కష్టాన్ని జీతంగా తీసుకునే ఉద్యోగులు. కండువాలు కప్పుకోకపోయినా వైకాపాకు అంటకాగారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
[ 05-07-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి టీబీసీ వరకు క్యూలైన్లో వేచిఉన్నారు. -
వసతిగృహ సమస్యలు పరిష్కరించాలి
[ 05-07-2024]
ఎస్వీయూలోని వసతిగృహాల్లో తమకు వడ్డించే భోజనాల్లో నాణ్యత లేదని, వసతిగృహంలో సౌకర్యాలు సరిగా లేవంటూ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం వద్ద విద్యార్థినులు గురువారం ధర్నా నిర్వహించారు. -
9న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
[ 05-07-2024]
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. -
పెరగని సీట్లు..తరగని డిమాండు
[ 05-07-2024]
తితిదే కళాశాలల్లో ప్రవేశాలు కష్టతరంగా మారాయి. వీటిలో నామమాత్రం రుసుముతో నాణ్యమైన విద్యనందించడంతోపాటు వసతి, భోజనం కల్పిస్తుండటంతో ప్రవేశాలకు ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది -
సాహసమే శ్వాసగా
[ 05-07-2024]
ఉరిమే ఉత్సాహంతో సాహసమే శ్వాసగా సాగుతున్నారు పలువురు యువత.. వ్యక్తిగత క్రమశిక్షణ తూచా తప్పక పాటిస్తూ జాతీయ సమైక్య భావనతో మెలుగుతూ నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకుని మెరుగైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.. -
సీఎం ఫ్లెక్సీపై పేడ కొట్టిన దుండగులు
[ 05-07-2024]
పింఛన్ సాయం పెంచి, నెల మొదటి రోజే అందించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సీఎం నారా చంద్రబాబు ఫ్లెక్సీలోని ఆయన ముఖంపై గుర్తుతెలియని వ్యక్తులు పేడ కొట్టారు. -
స్తంభం ఎక్కితేనే కొలువు నిలిచేది
[ 05-07-2024]
వైకాపా హయాంలో అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన రెస్కో మారింది. ఛైర్మన్, అతని అనుచరులు, పార్టీ కార్యకర్తలే అర్హతలుగా భావించి అక్రమంగా చాలా మందికి కొలువులు ఇచ్చేశారు -
‘పెద్దిరెడ్డి’పై అవ్యాజ్య ప్రేమ
[ 05-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తమ స్వామి(జిల్లా పెద్దాయన) గెలవడమే లక్ష్యం.. అందుకు ఎన్ని అడ్డంకులొచ్చినా.. ఎవరెదురొచ్చినా ఉపేక్షించేది లేదని పట్టుపట్టి మరీ ఆ కుంభకోణాన్ని తొక్కిపట్టాడు.. -
కమీషన్ల కక్కుర్తి
[ 05-07-2024]
యంత్రాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. ఇందులో రూ.3 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు సమాచారం. గతంలో తితిదేలో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి ఇందులో ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది. -
కుప్పంలో వినతుల వెల్లువ
[ 05-07-2024]
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అన్యూహ్య స్పందన వచ్చింది. -
ఆశలన్నీ నీలంపైనే
[ 05-07-2024]
నీలం మామిడి కాయల ధరలు బహిరంగ మార్కెట్లో ఆశాజనకంగా ఉన్నాయి. టన్ను కాయలు నాణ్యతను బట్టి రూ.25 వేల నుంచి రూ.35 వేలకు అమ్ముడవుతున్నాయి. -
డీకేటీ ముసుగులో గుట్టక్కు
[ 05-07-2024]
మండలంలోని సామిరెడ్డిపల్లె రెవెన్యూ పరిధిలోని గుట్టను ఓ వ్యక్తి యంత్రాల సాయంతో ఆక్రమించేందుకు యత్నించాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ట్యాపింగ్ కేసులో... మరో మలుపు!
-
రేషన్ వాహనాలతో రూ. 1,500 కోట్ల నష్టం: మంత్రి నాదెండ్ల మనోహర్
-
‘అంతా మీరే చేశారు’.. కాదు మీ వల్లే జిల్లాలో పార్టీ నాశనమైంది
-
చంద్రబాబుకు థాంక్స్ చెప్పడానికి బైక్ యాత్ర
-
కృష్ణాపై అందాల వారధి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చే దారిది!
-
అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ