రైతు సంక్షేమానికి అడుగులు
రైతులు ఒక సంఘంగా ఏర్పడి తమ అవసరాలు తీర్చుకునేందుకు సహకార సంఘాల వ్యవస్థ దోహదపడేది. రైతులకు అండగా ఉన్న ఈ సంఘాలు వైకాపా పాలనలో ఉనికి కోల్పోయాయి.
సహకార సంఘాల కమిటీల రద్దు
ప్రత్యేక అధికారుల నియామకం
తడుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం
పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని చెర్లోపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం నిరుపయోగంగా మారడంతో ప్రస్తుతం ఆరేటమ్మ కాలనీ వద్ద అద్దె భవనంలో నడుస్తోంది. ఈ భవన నిర్మాణానికి స్థలం కేటాయించినా నిధుల్లేమి కారణంగా నిర్మాణం చేపట్టలేదు. ప్రస్తుత ప్రభుత్వం సహకార సంఘాలకు ప్రత్యేక అధికారులను నియమించునున్నట్లు సమాచారం. డీసీసీబీ, సహకార శాఖ ఉద్యోగులను ఇన్ఛార్జిలుగా నియమించే అవకాశం ఉంది.
న్యూస్టుడే, పుత్తూరు, చిత్తూరు నగరం: రైతులు ఒక సంఘంగా ఏర్పడి తమ అవసరాలు తీర్చుకునేందుకు సహకార సంఘాల వ్యవస్థ దోహదపడేది. రైతులకు అండగా ఉన్న ఈ సంఘాలు వైకాపా పాలనలో ఉనికి కోల్పోయాయి. సహకార సంఘాల పదవీ కాలం 2019లో ముగిసినా ఆ ఏడాదే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా స్థానిక నాయకత్వం కనుసన్నల్లో పనిచేసే కమిటీలు ఏర్పాటు చేసి వారికి అధికారం కట్టబెట్టింది. ఎన్నికలు లేకుండా నామినేటెడ్ పద్ధతిలో నియమితులైన డైరెక్టర్లు ఉత్సవ విగ్రహాల్లా మారారు. రైతులకు ఉపయోగపడే పనులు ఏవీ చేయలేదు. సహకార సంఘాల్లో నియమితులైన ముగ్గురు సభ్యుల కమిటీని కొత్తగా వచ్చిన ప్రభుత్వం రద్దు చేయడంతో అన్నదాతలకు అంతా మేలు జరిగే అవకాశం ఉంది.
- జిల్లాలో ఇలా..: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 74 సహకార సంఘాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2013లో అధికారికంగా ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా ఎన్నికైనవారు 2018 వరకు బాధ్యతలు నిర్వహించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వం ఈ సంఘాల పదవీ కాలాన్ని ఏడాది పెంచి తర్వాత ఎన్నికలు నిర్వహించాలని భావించింది. అయితే 2019లో వైకాపా అధికారంలోకి రావడంతో సహకార సంఘాలను స్థానిక నాయకుల కనుసన్నల్లో పనిచేసే వారికి అప్పగించింది. గతంలో సహకార సంఘాలే రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండేవి. సంఘంలోని రైతులూ తమ ఓటుహక్కుతో అధ్యక్షుడిని, 13 మంది సభ్యులను ఎన్నుకునేవారు. సహకార సంఘాలు రైతులకు పంట సాగుకు పెట్టుబడి సాయం మొదలు ఎరువులు, పురుగు మందులు రాయితీపై అందించడంలో కీలక పాత్ర పోషించేవి. రైతులు తాము పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ ఉంచుకునేందుకు గోదాములు, తమ బ్యాంకుల ద్వారా రైతులకు వడ్డీ లేకుండా రుణాలు అందించేవి. నేడు ఈ సంఘాలతో అరకొర రుణాలు ఇప్పించడం మినహా ఏ రకమైన ఉపయోగం ఒనగూరలేదు.
- గోదాముల నిర్మాణాలేవీ..?: జిల్లాలో గోదాములు నిర్మించాలని, ఒక్కో గోదాముకు రూ.50 లక్షలు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదించారు. ఐసీడీపీ కింద నిధులు విడుదల అయితే 50 శాతం రీపేమెంట్, 20 శాతం రాయితీ, మరో 30 శాతం ప్రభుత్వం చెల్లించేలా విధివిధానాలు ఖరారు చేశారు. ఆ దస్త్రం గత ప్రభుత్వ హయాంలో మరుగున పడింది. బహుళ ప్రయోజనకర గోదాము అందుబాటులోకి వస్తే పంటలో తేమ శాతాన్ని కొలిచే పరికరం, ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు టార్పాలిన్ పట్టలు, పంట నాణ్యత కొలిచే పరికరాలు రైతుల సేవలకు సిద్ధంగా ఉంటాయి. అయితే నిర్మాణాలే చేపట్టకపోవడంతో ఇవన్నీ కోల్పోయినట్లే.
- ఒక్క నగరి నియోజకవర్గంలో 9 సొసైటీలు..: ఒక్క నగరినియోజకవర్గంలోనే 9 పీఏసీఎస్లు ఉన్నాయి. ఒక్క నగరిలో మినహా మిగిలిన చోట్ల అంతటా సేవలు అంతంతమాత్రమే. చెర్లోపల్లి, కాయం సంఘాలకు సొంత భవనాలు కరవే. అయితే గత ప్రభుత్వం సహకార సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. దీంతో రైతులకు అందిన సేవలు అంతంతమాత్రమే.
- కొందరు రాజీనామా చేశారు..: జిల్లాలో ఇప్పటికే సహకార సంఘాల్లోని కమిటీ సభ్యులు రాజీనామా చేశారు. ఇంకా కొందరు చేయాల్సి ఉందని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. వారి స్థానంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధ్యతలు అప్పగిస్తాం. అందుకు వేచి చూస్తున్నామని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుచీపచి లేని బడి భోజనం
[ 05-07-2024]
మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడింది. ఐదేళ్లుగా గొప్పలు పోయిన జగన్ బడుల్లో తినేవారి సంఖ్య తగ్గిపోతోంది. -
వైకాపా విధేయుల్లో వణుకు!
[ 05-07-2024]
వారంతా ప్రజల కష్టాన్ని జీతంగా తీసుకునే ఉద్యోగులు. కండువాలు కప్పుకోకపోయినా వైకాపాకు అంటకాగారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
[ 05-07-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి టీబీసీ వరకు క్యూలైన్లో వేచిఉన్నారు. -
వసతిగృహ సమస్యలు పరిష్కరించాలి
[ 05-07-2024]
ఎస్వీయూలోని వసతిగృహాల్లో తమకు వడ్డించే భోజనాల్లో నాణ్యత లేదని, వసతిగృహంలో సౌకర్యాలు సరిగా లేవంటూ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం వద్ద విద్యార్థినులు గురువారం ధర్నా నిర్వహించారు. -
9న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
[ 05-07-2024]
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. -
పెరగని సీట్లు..తరగని డిమాండు
[ 05-07-2024]
తితిదే కళాశాలల్లో ప్రవేశాలు కష్టతరంగా మారాయి. వీటిలో నామమాత్రం రుసుముతో నాణ్యమైన విద్యనందించడంతోపాటు వసతి, భోజనం కల్పిస్తుండటంతో ప్రవేశాలకు ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది -
సాహసమే శ్వాసగా
[ 05-07-2024]
ఉరిమే ఉత్సాహంతో సాహసమే శ్వాసగా సాగుతున్నారు పలువురు యువత.. వ్యక్తిగత క్రమశిక్షణ తూచా తప్పక పాటిస్తూ జాతీయ సమైక్య భావనతో మెలుగుతూ నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకుని మెరుగైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.. -
సీఎం ఫ్లెక్సీపై పేడ కొట్టిన దుండగులు
[ 05-07-2024]
పింఛన్ సాయం పెంచి, నెల మొదటి రోజే అందించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సీఎం నారా చంద్రబాబు ఫ్లెక్సీలోని ఆయన ముఖంపై గుర్తుతెలియని వ్యక్తులు పేడ కొట్టారు. -
స్తంభం ఎక్కితేనే కొలువు నిలిచేది
[ 05-07-2024]
వైకాపా హయాంలో అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన రెస్కో మారింది. ఛైర్మన్, అతని అనుచరులు, పార్టీ కార్యకర్తలే అర్హతలుగా భావించి అక్రమంగా చాలా మందికి కొలువులు ఇచ్చేశారు -
‘పెద్దిరెడ్డి’పై అవ్యాజ్య ప్రేమ
[ 05-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తమ స్వామి(జిల్లా పెద్దాయన) గెలవడమే లక్ష్యం.. అందుకు ఎన్ని అడ్డంకులొచ్చినా.. ఎవరెదురొచ్చినా ఉపేక్షించేది లేదని పట్టుపట్టి మరీ ఆ కుంభకోణాన్ని తొక్కిపట్టాడు.. -
కమీషన్ల కక్కుర్తి
[ 05-07-2024]
యంత్రాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. ఇందులో రూ.3 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు సమాచారం. గతంలో తితిదేలో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి ఇందులో ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది. -
కుప్పంలో వినతుల వెల్లువ
[ 05-07-2024]
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అన్యూహ్య స్పందన వచ్చింది. -
ఆశలన్నీ నీలంపైనే
[ 05-07-2024]
నీలం మామిడి కాయల ధరలు బహిరంగ మార్కెట్లో ఆశాజనకంగా ఉన్నాయి. టన్ను కాయలు నాణ్యతను బట్టి రూ.25 వేల నుంచి రూ.35 వేలకు అమ్ముడవుతున్నాయి. -
డీకేటీ ముసుగులో గుట్టక్కు
[ 05-07-2024]
మండలంలోని సామిరెడ్డిపల్లె రెవెన్యూ పరిధిలోని గుట్టను ఓ వ్యక్తి యంత్రాల సాయంతో ఆక్రమించేందుకు యత్నించాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
-
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!
-
17 రోజుల్లో కూలిన 12 వంతెనలు.. తప్పెవరిది?