వైకాపా ప్రభుత్వ బా‘గోతులు’
నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎంత బాధ కలుగుతుందో.. వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో అంతకంటే దారుణంగా వ్యవహరించింది.
లీజు పూర్తయినా గడువు పొడిగింపు
రద్దు చేస్తేనే పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం
పారిశ్రామిక ప్రాంతంలో అడ్డగోలుగా గనుల తవ్వకాలు
ఈనాడు-తిరుపతి: నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎంత బాధ కలుగుతుందో.. వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో అంతకంటే దారుణంగా వ్యవహరించింది. పరిశ్రమలు స్థాపిస్తాం.. నిరుద్యోగులకు ఉపాధి చూపిస్తామంటూ గొప్పలు పోతూనే పారిశ్రామిక ప్రాంతాల్లో గోతులు తవ్వేందుకు అనుమతిచ్చింది. విశాఖ-చెన్నై పారిశ్రామికవాడలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గుర్తించిన స్టార్టప్ ప్రాంతాలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ చేసిన ప్రాంతాన్ని వైకాపా ప్రభుత్వం మైనింగ్కు కట్టబెట్టింది. ఆపై గనుల లీజు పొడిగింపునకు మొగ్గు చూపింది. ఫలితంగా ఇప్పుడది పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా లేని ప్రాంతంగా మారింది. కూటమి ప్రభుత్వం గనుల లీజు పొడిగింపు ఉత్తర్వులను నిలిపివేయకుంటే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
విశాఖ-చెన్నై పారిశ్రామికవాడను సుమారు 24 వేల ఎకరాల పరిధిలో ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా అప్పటి తెదేపా ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ ప్రారంభించింది. భూసేకరణ త్వరితగతంగా సాధ్యం కాదని గుర్తించి తొలుత స్టార్టప్ ఏరియా కింద కొంత సేకరణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొట్టంబేడు మండలం రౌతుసూరమాల, గౌడమాల ప్రాంతాల్లో భూసేకరణ ప్రారంభించారు. గతంలో మైనింగ్ కార్యకలాపాలు సాగినా స్టార్టప్ ఏరియాగా గుర్తించిన తర్వాత నిలిపివేయాల్సి ఉంది. వైకాపా హయాంలో గనుల లీజు గడువు పొడిగించారు. ఇప్పటికే తొట్టంబేడు, రౌతుసూరమాల ప్రాంతాల్లోని స్టార్టప్ ఏరియా పరిధిలో 30 అడుగుల మేరకు గోతులు ఏర్పడ్డాయి.
మైనింగ్ కారణంగా ఏర్పడిన గోతులు
లేఖ రాసినా..
శ్రీకాళహస్తి నోడ్లోని దక్షిణ బ్లాక్ను స్టార్టప్ ఏరియాలో గనుల లీజులు పొడిగించవద్దని అప్పటి ఏపీఐఐసీ అధికారులు.. ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. నాటి ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉండి చక్రం తిప్పిన మంత్రితో లీజు గడువు పొడిగించుకునేలా పైరవీలు చేశారు. ఇష్టానుసారం తవ్వుతుండటంతో పెద్ద ఎత్తున గోతులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశ్రమల స్థాపనపై ప్రత్యేక దృష్టిసారించిన నేపథ్యంలో గనుల లీజు రద్దు చేసి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తే పరిశ్రమల ఏర్పాటుకు ఆస్కారం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుచీపచి లేని బడి భోజనం
[ 05-07-2024]
మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడింది. ఐదేళ్లుగా గొప్పలు పోయిన జగన్ బడుల్లో తినేవారి సంఖ్య తగ్గిపోతోంది. -
వైకాపా విధేయుల్లో వణుకు!
[ 05-07-2024]
వారంతా ప్రజల కష్టాన్ని జీతంగా తీసుకునే ఉద్యోగులు. కండువాలు కప్పుకోకపోయినా వైకాపాకు అంటకాగారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
[ 05-07-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులు గురువారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి టీబీసీ వరకు క్యూలైన్లో వేచిఉన్నారు. -
వసతిగృహ సమస్యలు పరిష్కరించాలి
[ 05-07-2024]
ఎస్వీయూలోని వసతిగృహాల్లో తమకు వడ్డించే భోజనాల్లో నాణ్యత లేదని, వసతిగృహంలో సౌకర్యాలు సరిగా లేవంటూ విశ్వవిద్యాలయ పరిపాలన భవనం వద్ద విద్యార్థినులు గురువారం ధర్నా నిర్వహించారు. -
9న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
[ 05-07-2024]
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. -
పెరగని సీట్లు..తరగని డిమాండు
[ 05-07-2024]
తితిదే కళాశాలల్లో ప్రవేశాలు కష్టతరంగా మారాయి. వీటిలో నామమాత్రం రుసుముతో నాణ్యమైన విద్యనందించడంతోపాటు వసతి, భోజనం కల్పిస్తుండటంతో ప్రవేశాలకు ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది -
సాహసమే శ్వాసగా
[ 05-07-2024]
ఉరిమే ఉత్సాహంతో సాహసమే శ్వాసగా సాగుతున్నారు పలువురు యువత.. వ్యక్తిగత క్రమశిక్షణ తూచా తప్పక పాటిస్తూ జాతీయ సమైక్య భావనతో మెలుగుతూ నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకుని మెరుగైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.. -
సీఎం ఫ్లెక్సీపై పేడ కొట్టిన దుండగులు
[ 05-07-2024]
పింఛన్ సాయం పెంచి, నెల మొదటి రోజే అందించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సీఎం నారా చంద్రబాబు ఫ్లెక్సీలోని ఆయన ముఖంపై గుర్తుతెలియని వ్యక్తులు పేడ కొట్టారు. -
స్తంభం ఎక్కితేనే కొలువు నిలిచేది
[ 05-07-2024]
వైకాపా హయాంలో అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన రెస్కో మారింది. ఛైర్మన్, అతని అనుచరులు, పార్టీ కార్యకర్తలే అర్హతలుగా భావించి అక్రమంగా చాలా మందికి కొలువులు ఇచ్చేశారు -
‘పెద్దిరెడ్డి’పై అవ్యాజ్య ప్రేమ
[ 05-07-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తమ స్వామి(జిల్లా పెద్దాయన) గెలవడమే లక్ష్యం.. అందుకు ఎన్ని అడ్డంకులొచ్చినా.. ఎవరెదురొచ్చినా ఉపేక్షించేది లేదని పట్టుపట్టి మరీ ఆ కుంభకోణాన్ని తొక్కిపట్టాడు.. -
కమీషన్ల కక్కుర్తి
[ 05-07-2024]
యంత్రాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. ఇందులో రూ.3 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు సమాచారం. గతంలో తితిదేలో కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి ఇందులో ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది. -
కుప్పంలో వినతుల వెల్లువ
[ 05-07-2024]
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అన్యూహ్య స్పందన వచ్చింది. -
ఆశలన్నీ నీలంపైనే
[ 05-07-2024]
నీలం మామిడి కాయల ధరలు బహిరంగ మార్కెట్లో ఆశాజనకంగా ఉన్నాయి. టన్ను కాయలు నాణ్యతను బట్టి రూ.25 వేల నుంచి రూ.35 వేలకు అమ్ముడవుతున్నాయి. -
డీకేటీ ముసుగులో గుట్టక్కు
[ 05-07-2024]
మండలంలోని సామిరెడ్డిపల్లె రెవెన్యూ పరిధిలోని గుట్టను ఓ వ్యక్తి యంత్రాల సాయంతో ఆక్రమించేందుకు యత్నించాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
-
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!
-
17 రోజుల్లో కూలిన 12 వంతెనలు.. తప్పెవరిది?